breaking news
chetah
-
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
గాంధీనగర్: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025 -
TG: చిరుత దాడితో మహిళకు గాయాలు.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. -
తిరుమలలో చిరుత కలకలం
తిరుమల: తిరుమల కాలిబాట లగేజ్ కౌంటర్ వద్ద ఆదివారం చిరుతపులి ప్రత్యక్షం కావటంతో భక్తులు భయాందోళనకు లోనయ్యారు. రెండు రోజుల క్రితం హంపీ మఠం వద్ద చిరుతపులి సంచరిస్తూ సీసీ టీవీ ఫొటేజీకి చిక్కిన విషయం తెలిసిందే. చిరుత పులి సంచారంపై భక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు టీటీడీ అధికారులు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే.. మరోసారి భక్తులకు చిరుత కనిపించడం కలకలం రేపుతోంది.