breaking news
iran
-
పశుబలం తప్ప ఏం మిగిలింది?
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం. ఆ విధంగా ప్రపంచానికి ప్రజాస్వామిక ఆదర్శంగా నిలవాలి. కానీ అమెరికా వీటన్నిటినీ బాహాటంగా ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నది. అందుకు కారణం తన ఏకధృవ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతుండటం. ఈ చర్చను ప్రస్తుతానికి ఇరాన్ అంశంతోనే మొదలుపెట్టి చూద్దాము. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగటమే కాదు, అసలు యుద్ధమే ముగిసిపోయిందన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించిన తర్వాత, జూన్ 28న అన్న మాటలను గమనించండి – ‘యుద్ధంలో నాశనమైన ఇరాన్ అధినేత ఖొమైనీ, యుద్ధంలో తామే గెలిచామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారు. మూడు అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో దాక్కున్న ఆయన అమెరికా, ఇజ్రాయెల్ సేనల చేతిలో నీచమైన చావు చావకుండా నేనే కాపాడాను. టెహ్రాన్ దిశగా భారీ సంఖ్యలో వెళుతుండిన ఇజ్రాయిల్ విమానాలను తిప్పించాను. ఆ దాడి జరిగితే అక్కడ వేలాదిమంది చనిపోయేవారు. అయినప్పటికీ ఇరాన్ అధినేత నాకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా తామే గెలిచామంటున్నారు. ఇరాన్ అణు పరిశోధనలు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ బాంబులు వేయిస్తా. ఇరాన్పై ఆంక్షలను సడలించాలనుకున్నాను గాని ఇక ఆ పని చేయను.’కేవలం ఈ మాటలను విశ్లేషిస్తే చాలు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఏ విధంగా గౌరవిస్తున్నదో తెలిసేందుకు. ప్రజాస్వామికంగా పెద్దమనిషి తరహాలో వ్యవహరించేందుకు ట్రంప్కు ఏమీ లేదు. బాంబులు తప్ప, పశుబలం తప్ప. విషయాన్ని సూటిగా మరొకమారు చెప్పుకోవాలంటే కళ్లెదుట కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో స్వచ్ఛందంగా భాగస్వామి అయిన ఇరాన్కు ఆ సంస్థ నిబంధనల ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన శుద్ధికి పూర్తి హక్కు ఉంది. వారు ఆ ప్రకారం కట్టుబడటమే కాక, మారణాయుధాల తయారీ ఇస్లాం బోధనలకు విరుద్ధం కనుక ఆ పని చేయబోమంటూ ఫత్వా సైతం జారీ చేసుకున్నారు. వారు నిబంధనలను ఉల్లంఘించలేదని అణుశక్తి పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) స్వయంగా చెప్తున్నది. కాదు, కొద్ది వారాలలోనే బాంబులు తయారు చేయనున్నారు అంటూ ఇజ్రాయిల్ అనే శత్రుదేశం పాతికేళ్లుగా ఆరోపిస్తూ వస్తున్నది. అమెరికా దానికి వత్తాసు పలుకుతోంది.ఇజ్రాయిల్ కుప్పలుగా తయారు చేసుకున్న అణ్వస్త్రాలను గురించి అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఎన్నడూ పొరపాటున అయినా పల్లెత్తు మాట అనడంలేదు. ఒక యూఎన్ఓ సభ్య దేశం మరొక యూఎన్ఓ సభ్య దేశంపై అసత్యపు ఆరోపణలతో, సైనిక దాడి జరుపుతున్నా వ్యతిరేకించకపోవడం ప్రజాస్వామ్యమా? చివరికి తానే రంగంలోకి దిగి బాంబుదాడులు జరపడం ఏమిటి? కొన్ని యూరోపియన్ ప్రజాస్వామిక రాజ్యాలు అందుకు సహకరించటమేమిటి? ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నది అంటున్న వారు, ఇరాన్ వల్ల ఏర్పడిన ముప్పు ఏమిటో, ఇరాన్ అణ్వాయుధాల తయారీ స్థాయికి వెళ్లిందన్న ఆరోపణలకు ఆధారాలేమిటో, తామందరూ సభ్యులైన యూఎన్ఓ అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా చర్చించారా?వారు ఆ పని చేయలేదు, చేయరు కూడా. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎల్లప్పుడూ నమ్ముకున్నది అంతిమంగా బల ప్రయోగాన్నే. ప్రస్తుత సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలతోనూ నిమిత్తం లేకుండా, కేవలం అసత్య ఆరోపణలతో ఈ చర్యలకు పాల్పడే అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందసలు? కనిపిస్తున్నదే, పశుబలం నుంచి వచ్చింది. ఆ బలానికి మూలాధారం సామ్రాజ్యవాద ప్రయోజనాలు. ఎటునుంచి, ఎటువంటి ఎదురు లేకుండా, ఏ అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలతో నిమిత్తం లేకుండా, మంచైనా, చెడైనా ఏకఛత్రాధిపత్యంగా సాగాలనే దురహంకారం. ప్రస్తుత యుద్ధ సందర్భంలో మొదటి నుంచి చివరి వరకు, పైన పేర్కొన్న ట్రంప్ మాటలతో సహా కనిపించేది అదే.యుద్ధంతో తక్షణ సంబంధం గల విషయాలు ఇవి కాగా, మౌలిక స్థాయి సంబంధాలు కలవాటిని చూద్దాం. మూలం ఎక్కడుంది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఇజ్రాయిల్, అమెరికాలు మొదటి నుంచి అడ్డుకుంటుండడంలో ఉంది. అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థలకు అమెరికా చేస్తున్న హాని గురించి పలు దృష్టాంతాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పారిస్ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల నుంచి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకోవటాలు, అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్పై దాడి, పనామా కాలువను, గ్రీన్ల్యాండ్ను, కెనడాను ఆక్రమించుకోగలమని బెదిరింపులు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్)తో పాటు డాలర్ శక్తిని ఆధారం చేసుకుంటూ తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు, వందల కోట్ల డాలర్లను తమ బ్యాంకులలో స్తంభింప చేయటం, తమ నియంత్రణలోకి తీసుకొని మరెవరికో ఇవ్వటం వంటివన్నీ ప్రజాస్వామ్యమా? మొదట చెప్పుకున్నట్లు వీటికి ఆధారం అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థల నియమ నిబంధనలు కాదు. వారికి మిగిలిన ఆధారం పశుబలం మాత్రమే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు
టెహ్రాన్: ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల దరిమిలా ఆ దేశాలపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతోల్లా నాసర్ మకరెం షిరాజీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీచేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలదోయాలని మకరెం షిరాజీ ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. BREAKING: Iranian Grand Ayatollah Issues FATWA Against President Trump, Seen as Call for Global TerrorIran’s top Shiite cleric, Grand Ayatollah Naser Makarem Shirazi, has just issued a religious fatwa against President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu,… pic.twitter.com/Ud6BWKvL9a— Simon Ateba (@simonateba) June 30, 2025ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా యుద్ధ నేతగా పరిగణిస్తారని మకరెం తన తీర్పులో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్గా గుర్తించినవారికి ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్లో ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించింది. 12 రోజులపాటు సాగిన ఈ యుద్ధం అనంతరం ఈ మతపరమైన ఆదేశం వెలువడింది. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా.. ఇజ్రాయెల్ దళాలతో చేరిన దరిమిలా ఈ యుద్ధం ముగిసింది.ఇది కూడా చదవండి: ‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్.. -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
అణుహత్యలు!
ఇరాన్ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ’ అధిపతి అయిన మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్ డెస్క్యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు. ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్ అణు సూత్రధారి మొహ్సేన్ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.ఇప్పటి వరకు 100 హత్యలుఅణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.నాలుగు ‘హంతక’ దేశాలుచరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్ యూనియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా ఇజ్రాయెల్ దాడులకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మోసాద్’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. ఏఐతో చంపేశారుశాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుపటి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారాయి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్ లో మరణించిన ఫెరేడౌన్ అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటపడిన వారే. ఇరాన్ కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ 2019 నుంచీ నిఘా వేసింది. 2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్ కంట్రోల్డ్ మెషీన్ గన్ ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్ విడి భాగాలను ఇరాన్ లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. మొత్తం 15 బుల్లెట్లను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కనున్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్ గన్ ఉంచిన వాహనం కూడా పేలిపోయి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ వెలుపల ఒక కమాండ్ సెంటర్ నుంచి నిర్వహించడం విశేషం.చెప్పి చేయటం మొదలైంది!సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. ఎంత ప్రభావం ఉంటుంది?శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు లభించవచ్చు కూడా. -
వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త -
ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ అనంతరం పలు వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ మరోమారు హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ నిజంగా తమతో ఒక ఒప్పందానికి రావాలనుకుంటే, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నేత ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను అబ్బాస్ అరఘ్చి ఖండించారు. ట్రంప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిజాయితీ వ్యవహరించాలనుకుంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదన్నారు. ట్రంప్ తన అనుచిత వ్యాఖ్యలతో ఖమేనీ అభిమానులు, మద్దతుదారులను బాధపెడుతున్నారని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు.ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకుమించి ఆ దేశానికి మరో మార్గం లేదని అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఇరానియన్ ప్రజలు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనిని హత్య నుండి రక్షించానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్న దరమిలా అబ్బాస్ అరఘ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో చర్చలకు తిరిగి రావాలని ట్రంప్ కోరారు. అయితే అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని ఇరాన్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్ -
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్లో 10 వేల మంది, ఇజ్రాయెల్లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్తోపాటు తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. -
అమెరికాతో అణు చర్చలు జరపబోమని ఇరాన్ ప్రకటన
-
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్పై జూన్ 14వ తేదీన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు. -
12 రోజుల యుద్ధంలో గెలిచిందెవరు? ఓడిందెవరు?
-
అమెరికా దాడుల ఎఫెక్ట్.. ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory. File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. -
అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. -
ఇరాన్ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. -
ముగ్గురు ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఇరాన్.. ముగ్గురు ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసింది. గూఢచర్యం అనుమానం, గూఢచారులకు ఆవాసం కల్పిస్తున్న ఆరోపణలతో 700 మందిని అరెస్టు చేసింది. 12 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్కు సహకరించారని, ఒక వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని మొసాద్కు అందించారని ఇరాన్ ఆరోపించింది. ‘హత్యలు చేయడానికి దేశంలోకి పరికరాలను దిగుమతి చేయడానికి ప్రయత్నించిన ఇద్రిస్ అలీ, ఆజాద్ షోజై, రసూల్ అహ్మద్ రసూల్లను అరెస్టు చేసి... ఇజ్రాయెల్కు సహకరించినందుకు ఈ ఉదయం శిక్ష అమలు చేశారు. వారిని ఉరితీశారు’అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వెబ్సైట్ పేర్కొంది. తుర్కియే సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయవ్య నగరమైన ఉరి్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి. నీలిరంగు జైలు యూనిఫాంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోటోను కూడా కోర్టు పంచుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరాన్లో ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్తో సహా విదేశీ నిఘా సేవలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏజెంట్లను అరెస్టు చేయడం, ఉరితీయడం తరచుగా జరుగుతుంది. జూన్ 13న ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆ దేశంతో సంబంధాలున్న వ్యక్తులపై త్వరిత చర్యలు తీసుకుంటామని టెహ్రాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే దోషులుగా తేలిన అనేక మంది వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. -
మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాడు సద్దాం నేడు ఖమేనీ అమెరికా పాన్ అదేనా?
-
అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ట్రంప్
ఇరాన్ (Iran)లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా (USA) ఆదివారం(జూన్ 22న) ప్రత్యక్షంగా దాడులు చేసిందన్నది తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఓ నివేదిక తయారుచేసింది. ఈ నివేదికల్లోని విషయాలు పలు మీడియాల్లో కథనాలుగా వెలువడగా.. ఇప్పుడవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అవి నకిలీ వార్తలని పేర్కొన్న ఆయన.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇదన్నారు. ‘నకిలీ వార్తలు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యూఎస్ దాడుల్లో ఇరాన్కు పరిమితంగా నష్టం వాటిల్లిందని అందులో తెలపడం గమనార్హం. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్డో, నతాంజ్లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. దాడులకు ముందే భారీగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించినట్లు అందులో పేర్కొంది. అయితే ఈ సందర్భంగా ఫోర్డో కేంద్రం గురింంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది దాదాపు 150–300 అడుగుల గట్టిగా ఉన్న పర్వతాల కింద నిర్మించబడిన సురక్షితమైన సైట్. అందుకే, US సైన్యం ఉపయోగించిన ‘బంకర్ బస్టర్’ పేలుడు బాంబులు కూడా దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినట్టు Pentagon నివేదిక పేర్కొంది. US బాంబర్లు 12 గుబు-57 బాంబులు ఫోర్డోపై, మరికొన్ని నతాంజ్పై వేయగా, US నేవీ సబ్మరిన్ ఇస్ఫహాన్పై దాదాపు 30 టోమాహాక్ క్షిపణులు ప్రయోగించింది.ఇక, బయటకు వచ్చిన ఈ నివేదికలను వైట్హౌస్ (White House) ధ్రువీకరించినప్పటికీ.. అందులోని అంశాలను కొట్టిపారేసింది. ‘ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ను కించపరచడమే. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధపైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం ఇది. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అవన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయి’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఎక్స్లో పేర్కొన్నారు.“Everyone knows what happens when you drop fourteen 30,000 pound bombs perfectly on their targets: total obliteration.” - LEAVITT https://t.co/a6zCgFnheq— Aishah Hasnie (@aishahhasnie) June 24, 2025మరోవైపు.. సైనిక చర్యతో ఇరాన్ నుంచి అణు ముప్పు తొలగించినట్లు కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా బాంబర్ల దాడుల్లోనూ ఇరాన్ అణు కేంద్రాలకు పరిమిత నష్టం వాటిల్లిందన్న నిఘా నివేదికలపై మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!. -
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
12 రోజుల యుద్ధానికి బ్రేక్.. ఇజ్రాయెల్ ను పూర్తిగా నమ్మలేం..
-
ఆగిన దాడులు!. యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్
-
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
యురేనియంను దాచేసింది!
గుట్టుచప్పుడుకాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనంచేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంతశుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.ఎంతో కష్టపడి శుద్ధిచేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసేంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియం నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలంచేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేం తెలీకుండానే యురేనియంలేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు.పక్కా ప్రణాళికతో..చిన్నని స్థూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారుచేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ మారియానో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతిచర్చలకు సిద్ధమైతే, తమ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది.‘‘ చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ల యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనంచేశాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం’’ అని ఏబీసీ వార్తాసంస్థతో జేడీ వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ మారియానో సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ‘‘ఇందులో దాచాల్సిందేమీ లేదు. అంతా బహిరంగ రహస్యమే.తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకు ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారుచేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60 శాతమే. 90 శాతం శుద్ధత ఉంటేనే అణుబాంబుకు అక్కరకొస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫహాన్ అణుకేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారు’’ అని రఫేల్ వెల్లడించారు. ఆ 16 ట్రక్కులు ఎక్కడ?ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వారి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కుల నిండా ఏవో బ్యారెళ్లను నింపి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే ట్రక్కులపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేశాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాటిపై దాడులుచేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాతో మరో కథనం వెలువడింది. -
ఆగిన దాడులు!
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/జెరూసలేం: యుద్ధజ్వాలలతో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్ శాంతించాయి. ఇజ్రాయెల్కు దన్నుగా ఇరాన్పై బంకర్ బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఆ తర్వాత తీరిగ్గా శాంతిమంత్రం జపించింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలూ అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. కానీ అప్పటినుంచి రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి.ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. దాంతో ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ఒక దశలో ఇజ్రాయెల్పై కన్నెర్రజేశారు. తర్వాత ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న పోరుకు ప్రస్తుతానికి తెర పడింది. ఈ పరిణామాన్ని భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే కాల్పుల విరమణ షరతులేమిటి, ఇరు దేశాలు వాటిలో ఎన్నింటికి, ఏ మేరకు అంగీకరించాయి వంటివన్నీ ప్రస్తుతానికైతే జవాబుల్లేని ప్రశ్నలే! ట్రంప్ తిట్ల వర్షం సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయంటూ మంగళవారం తెల్లవారుజామున ట్రంప్ తన సామాజిక మాధ్యమం‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణ మరో ఆరు గంటల తర్వాత నెమ్మదిగా అమల్లోకి వస్తుంది. ఇరు దేశాలూ సైనిక చర్యల నుంచి వెనుదిరుగుతాయి. రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ యుద్ధం కొనసాగితే పశ్చిమాసియా భస్మీపటలం అవుతుంది. అంతదాకా పోనివ్వను. కాల్పుల విరమణతో ప్రపంచం, పశ్చిమాసియా శాంతిని గెల్చుకున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. విరమణ వెనుక ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహీమ్ అల్ థానీ కృషి కూడా ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు కొనసాగాయి.తమకు ఎలాంటి విరమణ ప్రతిపాదనా రాలేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తొలుత ప్రకటించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్లోని బీర్òÙబా సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాము దాడులు చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, తొలుత దాడులు చేసింది ఇజ్రాయెలేనని గుర్తు చేశారు. వాళ్లే ముందుగా దాడులు ఆపితే తామూ ఆపుతామని ప్రకటించారు. తర్వాత దక్షిణ, ఉత్తర ఇరాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు చనిపోయారు. టెహ్రాన్ సమీపంలోని రాడార్ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది.మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. అయినా ఇరాన్ దాడులను ఉధృతం చేయడంతో మరోసారి ప్రతిదాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్ మండిపడ్డారు. రెండు దేశాలూ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వాటినుద్దేశించి పలు బూతు మాటలు కూడా ప్రయోగించారు. ‘‘బాంబులేయడం ఆపండి. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలిపించండి’’ అంటూ ఇజ్రాయెల్కు అలి్టమేటమిచ్చారు. యుద్దం మొదలయ్యాక ఇజ్రాయెల్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం ఇదే తొలిసారి. ‘‘ఇరాన్ ఇక ఎప్పటికీ అణ్వస్త్రదేశంగా అవతరించబోదు. అణుబాంబును తయారు చేయబోదు’’ అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాత్రం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. దాంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మోతలు విని్పంచినట్టు తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఇరాన్లో 974 మంది చనిపోయారని, 3,458 మందికిపైగా గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హ్యూమ్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ ప్రకటించింది. తమ దేశంలో 28 మంది చనిపోయారని, 1,000 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రయెల్ పేర్కొంది. కొద్దిరోజులుగా మూసేసిన తన గగనతలాన్ని మంగళవారం సాయంత్రం తిరిగి తెరిచింది. పశ్చిమాసియా దేశాలకు విమాన సరీ్వసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.పరిష్కారానికి తోడ్పడతాంఇరాన్–ఇజ్రాయెల్ నడుమ ఘర్షణలను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. ‘‘యుద్ధం ఏ సమస్యలకూ పరిష్కారం కాదు. చర్చలే ఏకైక మార్గం. ముందనుంచీ ఇదే భారత్ వైఖరి’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొందిమరో శాస్త్రవేత్త మృతిఅణు కార్యక్రమంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన శాస్త్రవేత్త మొహమ్మద్ రెజా సెదీఘీ సాబర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్లోని ఆస్తనీయే అష్రాఫీయేలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేసింది. జూన్ 13న జరిగిన దాడి నుంచి రెజా తప్పించుకున్నా ఆయన 17 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. రెజాపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. ఆయన మృతితో తాజా పోరులో భాగంగా ఇజ్రాయెల్ హతమార్చిన ఇరాన్ అణుశాస్త్రవేత్తల సంఖ్య ఏకంగా 14కు పెరిగింది. -
విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. -
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అంత ఎత్తున లేచారు. తన మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ అని ఇరు దేశాలు ప్రకటించిన కాసేపటికే మళ్లీ క్షిపణులతో యుద్ధానికి దిగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ‘నాకు చెప్పిందేమిటి?.. మీరు చేస్తున్నదేంటి? అని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సహనాన్ని కోల్పోయి అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు. ఇక వారి ఇస్టం.. వారికిష్టమొచ్చింది చేస్కుంటారు అంటూ ట్రంప్ మీడియా సాక్షిగా అసహనం ప్రదర్శంచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ః మీడియాలో వైరల్గా మారింది. Trump is absolutely FUMING that Israel & Iran have broke the ceasefire:“We basically have two countries that have been fighting so long and so hard that they don't know what the f*ck they're doing.”He also warned Israel directly on Truth Social: “DO NOT DROP THOSE BOMBS.” pic.twitter.com/yHQeUybgUK— J Stewart (@triffic_stuff_) June 24, 2025 అయితే ఆటు తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోరంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తిరిగి సొంత గడ్డపైకి వచ్చేస్తాయని, అదే సమయంలో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగిందన్నారు. ఇక తక్షణమే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. -
Israel Iran War: యుద్ధం ముగిసింది
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
జెరూసలేం: పశ్చిమాశియాలో యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్పై ప్రతిదాడులకు దిగింది. దీంతో గంటల వ్యవధిలో ఇరు దేశాల మధ్య యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ దాడులకు దిగిందని హెచ్చరించింది. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇరాన్ స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తరువాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదని . అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది. ⭕️"In light of the severe violation of the ceasefire carried out by the Iranian regime, we will respond with force."-The Chief of the General Staff, LTG Eyal Zamir in a situational assessment now— Israel Defense Forces (@IDF) June 24, 2025 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఇరు దేశాలు తన మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది.ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పశ్చిమాశియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్పై భీకరదాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం అదే తరహాలో ఇరాన్ దాడుల్ని ప్రతిఘటించింది. ఇరాన్ దాడుల్ని జ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)మంగళవారం ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. -
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్!
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు మూడవ ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న అస్థిర వాతావరణం.. ఒకవేళ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, మిత్రదేశాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజలకు ఆశ్రయం కల్పించేలా కొన్ని దేశాలున్నాయి. ఆయా దేశాల్లోని భౌగోళిక, రాజకీయ స్థితిగతులు, సైనిక తటస్థత , స్థిరమైన పరిస్థితుల కారణంగా సురక్షితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ‘ది మెట్రో’ తెలిపిన వివరాల ప్రకారం ఆ దేశాలు ఇవే..అంటార్కిటికాఅణు యుద్ధం జరిగిన పక్షంలో అంటార్కిటికా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. అణు శక్తులకు ఈ ప్రాంతం చాలా దూరంలో ఉంది. దేశంలోని 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడి మంచుతో కూడిన వాతావరణం మనుగడకు సవాలుగా నిలుస్తుంది.ఐస్లాండ్అత్యంత శాంతియుత దేశాలలో ఒకటిగా, స్థిరమైన ర్యాంక్తో ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఐస్లాండ్ పూర్తి స్థాయి యుద్ధంలో ఎప్పుడూ పాల్గొనలేదు. దేశ భౌగోళిక స్థానం యుద్ధాలకు తక్కువ అవకాశమిస్తుంది. అయితే అణుయుద్ధం నుంచి రక్షణ కల్పించడంలో అంత అనువైన దేశం కాదు.న్యూజిలాండ్తటస్థ వైఖరితో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. ఇక్కడ పర్వత భూభాగాల కారణంగా రక్షణను అందిస్తుంది. ఈ దేశం ఉక్రెయిన్కు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది.స్విట్జర్లాండ్రెండవ ప్రపంచ యుద్ధంలో స్విట్జర్లాండ్ తటస్థతంగా వ్యవహరించింది. ఇక్కడి పర్వత ప్రాంతాలు యుద్ధాల నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతుంటారు. దేశ రాజకీయ తటస్థ వైఖరి కారణంగా దాడులకు అవకాశం తక్కువ.గ్రీన్లాండ్ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ పేరొందింది. దేశ రాజకీయ తటస్థత.. యుద్ధ భయాలను దూరం చేసేదిగా ఉంది. 56 వేల మంది జనాభా మాత్రమే కలిగిన ఈ దేశంలో సంఘర్షణలకు ఆస్కారం చాలా తక్కువని చెబుతుంటారు.ఇండోనేషియాఇండోనేషియా నిరంతరం ప్రపంచ శాంతికి ప్రాధాన్యతనిస్తూ, తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ స్వతంత్ర వైఖరి, భౌగోళిక రాజకీయ స్థానం మొదలైనవి ఈ దేశాన్ని ప్రపంచ సంఘర్షణలవైపు చూసేలా చేయనివ్వవు.తువాలుకేవలం 11 వేల మంది జనాభా కలిగిన చిన్న ద్వీప దేశమిది.ఇక్కడి పరిమిత మౌలిక సదుపాయాలు, వనరులు యుద్ధ పరిస్థితులకు తావులేనివిధంగా ఉన్నాయి. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఈ దేశం అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.అర్జెంటీనాఅర్జెంటీనాకు సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ, ఇక్కడి వ్యవసాయ వనరుల కారణంగా ఇది సాపేక్షంగా సురక్షితమైన దేశంగా పేరొందింది.భూటాన్1971లో తటస్థతను ప్రకటించినప్పటి నుండి భూటాన్ సురక్షితంగా ఉంటోంది. దేశంలోని పర్వత భూభాగం యుద్దాల నుంచి రక్షణను అందిస్తుంది. దేశ భౌగోళిక స్వరూపం బాహ్య ముప్పుల సులభంగా తప్పించుకునే విధంగా ఉంది.చిలీనాలుగు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న చిలీ.. విస్తారమైన తీరప్రాంతాన్ని, సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగివుంది. ఇది ప్రజలకు భద్రతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో చిలీ ఒకటిగా నిలిచింది.ఫిజీఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఫిజీ ఉంది. దట్టమైన అడవులు ఈ దేశాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫిజీ తన ర్యాంక్ను కాపాడుకుంటూ వస్తోంది.దక్షిణాఫ్రికాదేశంలోని సారవంతమైన భూమి, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రజల మనుగడకు తగిన అవకాశాలను అందిస్తున్నాయి. దేశంలోని వైవిధ్యమైన వనరులు, వ్యవసాయ సామర్థ్యం.. సంక్షోభాల సమయంలో దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయి. ఇది కూడా చదవండి: 24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్ -
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందులో భాగంగా.. ఇరాన్ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్, నారాయణలు తెలిపారు. ఆపరేషన్ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్ 13వ తేదీన ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది. -
భారత విమాన సర్వీసులపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్
-
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం.ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈలోపు ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది.ఆపై కొన్ని గంటల్లోనే టెల్అవీవ్పై టెహ్రాన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్ ఇస్తూ ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. -
నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. -
ట్రంప్ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన కారణంగానే కుదిరిందంటూ.. ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ‘ఇజ్రాయెల్ - ఇరాన్ ఒకేసారి తన దగ్గరకు వచ్చి, శాంతి నెలకొల్పాలని కోరాయని పేర్కొన్నారు. ఆ క్షణంలో ఆ దేశాల ఆవశ్యకతను తాను గుర్తించానని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని గ్రహించానని పేర్కొన్నారు. ఈ విధమైన నిర్ణయం ఆ రెండు దేశాలకే కాకుండా, ప్రాంతీయంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.ప్రపంచ వేదికపై తనను తాను డీల్ మేకర్గా చెప్పుకుంటున్న ట్రంప్ ఈ రెండు శత్రుదేశాల మధ్య కొత్త అధ్యాయానికి గల అవకాశాలను వివరించారు. ఈ దేశాలు భవిష్యత్తులో అపారమైన పరస్పర ప్రేమ, శాంతి శ్రేయస్సును చవిచూస్తాయన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్లకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. దేవుడు ఆ దేశాలను దీవించాలని కోరుకుంటూ ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు మరింతగా పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ నేతలతో దౌత్య మంతనాలు నిర్వహించారన్నారు. ఇరు దేశల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం ఒక కీలక షరతుపై ఆధారపడి ఉందని సమాచారం. ఇరాన్ ఇకపై దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తుందనేదే ఆ షరతు అని తెలుస్తోంది. ఇరాన్ తన దాడులను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చిందని, తక్షణ దాడులకు ప్రణాళికలు లేవని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమన్వయ సాధనలో ట్రంప్ ప్రత్యక్ష ప్రమేయంతో ఈ పురోగతి సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు -
‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన -
సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొద్దిపేపటికే టెహ్రాన్ దానిని ఖండించింది. దీనిపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. అయితే తమ సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ సంధి దిశగా మొగ్గుచూపుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయిని విశ్లేషకులు అంటున్నారు.ఇరాన్ మంత్రి అరఘ్చి ఒక ప్రత్యేక పోస్ట్లో ఇజ్రాయెల్పై టెహ్రాన్ తన సైనిక కార్యకలాపాలను ముగించిందని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఢీకొడుతూ తమ శక్తివంతమైన సాయుధ దళాల సైనిక కార్యకలాపాలు చివరి నిమిషం వరకు, అంటే ఉదయం 4 గంటల వరకు కొనసాగాయన్నారు. ఇరానియన్లందరితో కలిసి, దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం చివరి వరకూ పోరాడిందని, శత్రువుల దాడిని చివరి నిమిషం వరకు తిప్పికొట్టిన దళాలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ తాజాగా 12 రోజుల ఘర్షణల అనంతరం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ ఉదయం 9:30 (ఐఎస్టీ) నుండి ప్రారంభమై 24 గంటల పాటు దశల వారీ ప్రక్రియగా ఉంటుందని, ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే బాటలో నడుస్తుందని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఈ కాల్పుల విరమణ వాదనలపై స్పందించలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో జతకట్టిన అమెరికా.. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలను ధ్వంసం చేసిన దరిమిలా ఈ యుద్ధంలో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యూఎస్ ఎయిర్ బేస్లపైనా దాడి జరిపినట్లు వార్తలు
-
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.అయితే ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం నాలుగు గంటలలోపు ఆపితే, ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని మిస్టర్ అరఘ్చి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
యుద్ధం ముగిసింది.. ఇరాన్-ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ కీలక ప్రకటన
కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. -
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఇరాన్పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దోహా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్కు వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డ్యాన్ కెయిన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష జరుపుతున్నట్ల తెలుస్తోంది. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. అల్ ఉదేయిద్ ఎయిర్బేస్ నుంచి జూన్ 19వ తేదీలోపే కీలక యుద్ధ, ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదేయిద్ బేస్లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. గత పాతికేళ్లుగా దీనిని అమెరికా వాడుతోంది. ఈ బేస్పై దాడులు చేయబోతున్నట్లు ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ కొన్నినిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్ల శబ్దాలు దోహా సిటీదాకా వినిపించాయి. దీంతో ఎవరూ బయటకు రావొద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీస్లకు ప్రభుత్వం వెంటనే సందేశాలు పంపింది. ఆరుబయటకు రావొద్దని ఖతార్లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీచేశాయి. ఖతార్ గగనతలాన్ని మూసేయడంతో దోహాసిటీకి వెళాల్సిన రెండు ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు మార్గమధ్యంలో వెనుతిరిగాయి. కొచ్చి నుంచి మస్కట్కు అక్కడి నుంచి కన్నూర్కు తిరిగి వచ్చినట్లు ఎయిర్ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఖతార్లో తమ విమానమేదీ లేదని పేర్కొంది.అమెరికా అండతో చెలరేగిన ఇజ్రాయెల్అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబుదాడులు చేసి, అండగా ఉన్నానని అభయ హస్తమివ్వడంతో సోమవారం ఇజ్రాయెల్ ఇరాన్పై చెలరేగిపోయింది. కారాగారం, మిలటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం, అణుకేంద్రం, ప్రభుత్వ ఆఫీస్... ఇలా ఇరాన్లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్డో పర్వతగర్భ యురేనియం శుద్ధి కర్మాగారంపై తన వంతుగా క్షిపణి దాడులు చేసి మరింత వినాశనానికి పాల్పడింది. వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటిరోజే ఇజ్రాయెల్ ఇదే న్యూక్లియర్ సెంటర్పై దాడులకు దిగింది. టెహ్రాన్లోని మిలటరీ కేంద్రాలపై ఏకంగా 50 యుద్దవిమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆరు ఇరాన్ ఆర్మీ ఎయిర్పోర్ట్లలో నిలిపి ఉంచిన ఎఫ్–15, ఎఫ్–5, ఏహెచ్–1 విమానం సహా 15 యుద్దవిమానాలు, హెలికాప్లర్లను ధ్వంసంచేసింది. రన్వేలపై బాంబులేసింది. టెహ్రాన్లోని పాలస్తీన్ స్క్వేర్, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయంపై, బసీజ్ వాలంటీర్ కోర్ భవనంపై దాడులు చేసింది. ఉత్తర టెహ్రాన్లోని ప్రముఖ మానవతా సంస్థ ‘ఇరానియన్ రెడ్ క్రిసెంట్’ భవనంపైనా ఇజ్రాయెల్ నిర్దయగా బాంబులేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్3’ పేరిట హైఫా, టెల్ అవీవ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ఉధృతం చేసింది. వ్యూహాత్మకంగా కారాగారంపై..యుద్ధంలో సాయుధ బలగాలతోపాటు నిరాయుధ ఖైదీలుండే ఎవిన్ జైలు పైనా ఇజ్రాయెల్ గురిపెట్టింది. అయితే ఖైదీల గదులపై కాకుండా కారాగారం ప్రధాన ద్వారాన్ని బద్దలకొడుతూ డ్రోన్ దాడులుచేసింది. దీంతో గేటు తునాతునకలైంది. ఇరాన్ పాలకుల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుపాలైన ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను విడిపించేందుకే ఇలా డ్రోన్తో గేటును ధ్వంసంచేశారని తెలుస్తోంది.ప్రభుత్వాన్ని పడగొట్టడంపై ట్రంప్ దృష్టిఇరాన్ను ఏలుతున్న సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ రాజకీయవర్గాన్ని గద్దె దింపాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరాన్ను ప్రస్తుత ప్రభుత్వం గొప్ప దేశంగా అవతరింపజేయడంలో ఘోరంగా విఫలమైంది. ఇలాంటి విఫల ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది?’ అని ట్రంప్వ్యాఖ్యానించారు. ఇరాన్ను ప్రభుత్వాన్ని కూల్చేఉద్దేశం తమకు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి హెగ్సెత్ మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్ ఇలా తన మనసులో మాట బయటపెట్టారు.ఘర్షణ తగ్గేందుకు కృషిచేస్తానన్న పుతిన్అమెరికా జోక్యం చేసుకోవడంతో రష్యా మద్దతు కూడగట్టేందుకు మాస్కోకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రయత్నం కొంతమేర ఫలించింది. పశ్చిమాసియాను రణరంగం నుంచి శాంతిపథంలోకి పయనింపజేసేందుకు తన వంతు కృషిచేస్తానని, ఈ విషయంలో ఇరాన్కు సాయపడతానని పుతిన్ సోమవారం ప్రకటించారు. ‘‘ ఇరాన్పై దుస్సాహసంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులుచేశాయి. అణుబాంబు తయారీకి ఎలాంటి ఆధారాలు లేకున్నా, సరైన కారణాలు లేకుండా పశ్చిమాసియాను కదనరంగంగా మార్చేసి ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ ఒడంబడికల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డాయి’’ అని పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ట్రంప్ ఏకధ్రువ ప్రపంచ కలలు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష జోక్యానికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తూ పోతే అంతిమంగా తోస్తున్నది ఒకటే. అది – క్రమంగా బలహీనపడుతున్న ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థిరపరచుకోవా లన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం. ఇరాన్ అణ్వస్త్రాల ఉత్పత్తికి సమీపంలో ఉందా దూరంగానా, శాంతి చర్చలకు సిద్ధమా కాదా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అస్తిత్వ ప్రమాదం ఏర్పడిందా లేదా అనేవన్నీ పైకి కనిపించే మిథ్యా సంవాదాలు. ఇంతవరకు దౌత్య చర్చల తెర వెనుక దాగి తన యుద్ధ మంత్రాంగాన్ని సాగించిన ట్రంప్, ఇరాన్ను ఇజ్రాయెల్ ఓడించటం తేలిక కాదని అర్థమవుతుండటంతో, నిజ స్వరూపంతో తెర ముందుకు వచ్చారు. తాము, ఇజ్రాయెల్ ‘ఒక టీమ్గా పని చేస్తూ వస్తున్నా’మని ఎటువంటి దాపరికం లేకుండా, జూన్ 21 నాటి దాడుల తర్వాత 22న ప్రకటించారు. బిట్వీన్ ద లైన్స్ఎదుటిపక్షంతో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబు దాడులు జరిపిన ఉదంతాలను ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎపుడైనా విన్నామా? ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి, అమె రికాకు అయిదు విడతల చర్చలు జరిగి ఆరవది ఈ నెల 15న జరగనుండగా రెండు రోజుల ముందు 13న ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది. ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది. తమ దాడికి సరిగా ఒకరోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ, చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్కు 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. అయినా మరునాడే దాడి చేశారు. ఇదే ఒక ద్వంద్వ నీతి కాదా? ఇంతకూ గత అమెరికన్ ప్రభుత్వాలు సాగించిన యుద్ధాలను తీవ్రంగా ఖండించి, తన హయాంలో ఆ పని జరగబోదని తన ఎన్నికల ప్రచార సమయం నుంచే పదేపదే హామీ ఇస్తూ వచ్చిన ట్రంప్, ఇపుడీ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్య వాదపు ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అవసరం ఎటువంటిదనే చర్చలు తరచూ జరిగేవే గనుక ఇపుడు తిరిగి చెప్పుకోనక్కర లేదు. కానీ అంతకుమించిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అవి స్వయంగా ట్రంప్ మాటలు, చేతల ద్వారా రూపుదిద్దుకుంటున్నవే. తన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదానికి, అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాధిపత్య స్థాయిని కోల్పోతుండటానికి, ప్రస్తుతం ఇరాన్తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, అణు పరిశోధనలు, పశ్చిమాసియా, చమురు నిల్వలు, ఆ ప్రాంతపు భౌగోళికతలకు పరిమితమైనది కాదు. 21 నాటి తమ సైనిక శక్తి ప్రద ర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంప దలచింది. తన ఏకధ్రువ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకో గలమని చెప్పటమే ఆ సందేశం.ఈ మాటపై సందేహం గలవారు 21 నాటి దాడుల తర్వాత మొదట ట్రంప్ చేసిన ప్రసంగాన్ని, తర్వాత అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కురిల్లాతో కలిసి రక్షణమంత్రి పీట్ హెగ్సెట్ మీడియా సమావేశంలో అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లిష్లో ‘రీడింగ్ బిట్వీన్ ద లైన్స్’ అనే మాట ఉంది. పైకి చెప్పే మాటల అర్థాన్నే గాక వాటి అంతరార్థాన్ని కూడా చూడటమన్నమాట. వారు ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం, శాంతి చర్చల రూపంలో ఇరాన్ తమకు బేషరతుగా లొంగటం, కాదని దాడులు జరిపితే సర్వనాశనానికి ఇరాన్ సిద్ధపడటం అని చెప్పేందుకే పరిమితం కాలేదు. ఆ తరహా దాడులు ఎంత ఘనమైనవో, తమ వంటి సైనిక శక్తి యావత్ ప్రపంచంలో మరే దేశానికి ఎట్లా లేదో, అటువంటి దాడులు మరెవరు ఎట్లా చేయలేరో ఒకటికి నాలుగుసార్లు కఠిన స్వరంతో, తీక్షణమైన ముఖ కవళికలతో చెప్తూ పోయారు. గత యుద్ధాల చరిత్రను గమనిస్తే సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలచిన ప్రతిసారీ, లేదా అటువంటి ఆధిపత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ, అంతర్జాతీయ చట్టాలూ రూల్ ఆఫ్ లా అని తామే సృష్టించి జపించేవాటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ, కేవలం సైనిక బలంతో ఆధిపత్యం కోసం సరిగా ఇటువంటి మాటలే చెప్తూ వచ్చారు. గత 10–15 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతూ మథనపడుతున్న అమెరికాకు, ఆ స్థాయిని తిరిగి చతురోపాయాలతో నిలబెట్టుకోవటం అన్నింటికీ మించిన పరమ లక్ష్యంగా మారింది.సామ్రాజ్యవాద డైనమిక్స్ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది. తాను యుద్ధాలు ఆపానని, ఇంకా ఆపుతానని, శాంతి దూతనని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు. కానీ అర్థం చేసుకోని విషయాలు రెండున్నాయి. ఒకటి–తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపా దించినదే. రెండు – అట్లా కోల్పోవటం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించి అందుకు అనుగుణంగా సర్దు బాట్లు చేసుకోవటానికి బదులు, పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటే అందుకు చివరి ఆధారం తిరిగి సైనిక శక్తే అవుతుంది. అంతర్జాతీయ చట్టాలకు, నాగరికమైన ప్రజాస్వామ్య వ్యవహరణకు కట్టుబడే డైనమిక్స్ ఒక విధంగా ఉంటే, అన్నింటినీ ఒకవైపు వల్లిస్తూనే యథేచ్చగా ఉల్లంఘించే సామ్రాజ్యవాదపు డైనమిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్న విధంగానే ఉంటాయి. అది ‘సామ్రాజ్య వాదం’ అనే వ్యవస్థలోనే అంతర్నిహితమై భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటా దర్శనమిస్తుంది.ప్రపంచంలోకెల్లా అతిగొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా, బ్రిటన్లు, పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని చాటుకునే ఇజ్రాయెల్ల అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథ మవుతుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సీఐఏ, ఎంఐ–6ల ద్వారా కూలదోసి నియంతలను అధికారానికి తెచ్చాయి. అందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ. అక్కడ ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాది చమురు బావులను జాతీయం చేయగా, తనపై 1953లో సైనిక కుట్ర జరిపించి షా పెహ్లవీ నియంతృత్వాన్ని తెచ్చారు. ఇపుడు ‘రెజీమ్ ఛేంజ్’ (ప్రభుత్వ మార్పిడి) పేరిట మరొక పెహ్లవీ వంశ వారసుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.నిజానికి ట్రంప్ ‘మాగా’ నినాదంలోనే, పదవీ బాధ్యతలు స్వీకరించి తొలినాళ్ల నుంచి తీసుకుంటున్న చర్యలలోనే ఇదంతా తార్కికంగా కనిపిస్తుంది. వలసదారుల నిరోధానికి, పంపివేతకు సైన్యాన్ని నియోగించటం వరకు వెళ్లారు. ట్యారిఫ్ల యుద్ధంతో యావత్ ప్రపంచం ఒకేసారి తమకు పాదాక్రాంతం కావాలనుకున్నారు. రష్యా, చైనాల వద్ద అణ్వస్త్రాలతో కూడిన సైనిక బలం లేనట్లయితే గత కాలపు సామ్రాజ్యవాద పద్ధతులలోనే వనరులు, మార్కెట్ల కోసం దాడులు జరిపే వారే! టారిఫ్లకు సంబంధించి కాకున్నా, వనరులూ, మార్కెట్ల విషయమై ఆ రెండు దేశాలతో కాకున్నా, ఇతరత్రా సైనిక బలాన్ని ట్రంప్ మార్కు సామ్రాజ్యవాదం వినియోగిస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మొత్తం దేశాన్నే రాతియుగపు పరిస్థితికి నిర్ధూమధామం చేస్తాం అనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా? ఆఫ్రికాలోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ను కొనసాగిస్తామనటం అక్కడి అపారమైన వనరుల కోసం కాదా? బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్, డీ–డాల రైజేషన్లను బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదా? అందువల్ల ట్రంప్ ‘మాగా’ నినాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం. ఈ జూన్ 21 నాటి బంకర్ బస్టర్ల సైనిక బల సందేశం, క్రమంగా బలపడు తున్న బహుళ ధ్రువ ప్రపంచానికి సామ్రాజ్యవాదపు ‘బిట్వీన్ ద లైన్స్’ సందేశం!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాన్కు సాయం చేస్తాంఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు. -
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు. -
భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్.. దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్ అవీవ్ మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 🚨#UltimoMinuto | 🇮🇷 #Tehran pic.twitter.com/BWz8bA5NDW— INTERACTIVA NEWS (@interactivanew) June 23, 2025ఇరాన్ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్జీసీ, పోలీస్ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కథనాలు ఇస్తోంది. ఇవెన్ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.👇జూన్ 13, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.ఇరాన్లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.👇జూన్ 14, 2025ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి.టెల్ అవీవ్, జెరూసలెం, రమత్గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.ఇజ్రాయెల్ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.👇జూన్ 15, 2025ఇరాన్ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.ఇరాన్ సైనిక జనరల్స్ బ్రిగేడియర్ మెహ్రబి, రబ్బాని మరణించారు.👇జూన్ 16, 2025ఇజ్రాయెల్ టెహ్రాన్పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.👇జూన్ 17, 2025ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.టెహ్రాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.👇జూన్ 18, 2025ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.టెల్ అవీవ్, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.👇జూన్ 19, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.ఇరాన్ కమ్యూనికేషన్ హబ్లు, రాడార్ కేంద్రాలపై దాడులు.ఇరాన్ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.👇జూన్ 20, 2025ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరాలపై దాడి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.👇జూన్ 21–22, 2025పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఇరాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.✈️ దాడి వివరాలు:7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.👇జూన్ 23, 2025టెహ్రాన్లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.ఇరాన్ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్రెజా జోల్ఫాఘరీ, అమీర్హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక.. ఇజ్రాయెల్ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్ అవీవ్ సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా. -
అమెరికా దాడి చేస్తుందని ముందే జాగ్రత్తపడిన ఇరాన్
-
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వంటింట్లో గ్యాస్ బాంబ్
-
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
ఇరాన్కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం
మాస్కో: ఇరాన్- రష్యాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యంతో ఇరాన్ మరిన్ని చిక్కుల్లో పడింది. ఇదే సమయంలో ఇరాన్కు ఎందుకు సహాయం అందించడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ను విలేకరులు అడిగినప్పుడు ఆయన ఘాటైన సమాధానం ఇచ్చారు.ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్న తర్వాత కూడా, టెహ్రాన్ను రక్షించేందుకు మాస్కో(రష్యా) ఎందుకు ముందుకు రాలేదో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాకు వివరించారు. రష్యా- ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ.. పూర్వ సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్లకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ఇది నేడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగా ఉంది. రష్యా సమకాలీన చరిత్రలో భాగంగా ఆ దేశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రష్యా తన మిత్రదేశాల విషయంలో ప్రదర్శిస్తున్న విధేయతను ప్రశ్నించేవారి విమర్శకులను కూడా పుతిన్ తిప్పికొట్టారు. అటువంటి వారిని రెచ్చగొట్టేవారుగా పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలతో రష్యా సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని, రష్యా జనాభాలో 15 శాతం మంది ముస్లింలున్నారని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిపుణులకు షాకిచ్చిన అమెరికా దాడుల వ్యూహం -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
-
ఇరాన్ జెండాలతో వైట్హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
ట్రంప్కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.#همین_حالا مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025రష్యా, చైనా వైఖరేంటి?ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఆందోళనలో భారత్?భారత్కు ఇజ్రాయెల్, ఇరాన్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. -
అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తూ, అక్కడ ‘అసాధారణ కార్యాచరణ’ సాగినట్లు వెల్లడించాయి. అమెరికా దాడి జరపకముందు, దాడి జరిపిన తరువాతకు సంబంధించిన చిత్రాలు అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నాయి.ఈ వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రం యూఎస్ దాడితో తీవ్రంగా దెబ్బతినడాన్ని చూపిస్తున్నాయి. బంకర్-బంకింగ్ బాంబులు పర్వతంలోకి చొచ్చుకుపోయినట్లున్న ఆరు రంధ్రాలు ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. అలాగే దుమ్ముతో మూసుకుపోయిన భూమిని కూడా చూపిస్తున్నాయి. అమెరికా ఎంఓపీలతో దాడి చేసిందని ఇన్స్టిట్యూట్ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి నాయకత్వం వహిస్తున్న యూఎన్ మాజీ అణు తనిఖీదారు డేవిడ్ ఆల్బ్రైట్ తెలిపారు. ఉపగ్రహ చిత్రాలలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు డెక్కర్ ఎవెలెత్ మాట్లాడుతూ ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అక్కడ జరిగిన నష్టం స్థాయిని అంచనా వేయడానికి తాము మరింతగా అధ్యయనం చేయాలన్నారు.ఇప్పటికైనా టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందని తాము భావిస్తున్నామని యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్లు పేర్కొన్నాయి. అయితే ఈ దాడికి ముందే ఇరాన్.. ఫోర్డో నుండి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్, అమెరికా, ఐక్యరాజ్యసమితి అణు తనిఖీదారులు అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహ చిత్రాలు మాక్సర్ టెక్నాలజీస్ నుండి వచ్చాయి. కాగా ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని గత కొంతకాలంగా చెబుతూవస్తోంది.ఇది కూడా చదవండి: Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’? -
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా మెరుపుదాడి... ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్లు ధ్వంసం... హోర్ముజ్ జలసంధిని మూసేసేందుకు సిద్ధమైన ఇరాన్
-
ఇరాన్లో అధికార మార్పు? ట్రంప్ పరోక్ష హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ, అమెరికా వారాంతంలో ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్లో పాలనా మార్పు జరిగే అవకాశంపై సూటిగా ప్రశ్నించారు.‘పాలనా మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు. కానీ ప్రస్తుతమున్న ఇరానియన్ పాలన.. ఇరాన్ దేశాన్ని గొప్పగా మార్చలేని పక్షంలో పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు?’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రశ్నించారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 30 వేల పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ప్రయోగించిన అనంతరం టెహ్రాన్(ఇరాన్) తమను తాము రక్షించుకోగలమని స్పష్టం చేసింది.ఇదిలావుండగా ఇరాన్- ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులను కొనసాగించాయి. పశ్చిమ ఇరాన్లో జరిగిన పేలుళ్లలో 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో పలువురు గాయపడ్డారు. టెల్ అవీవ్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్థానికులను లెబనాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.ఈ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల పౌరులు ప్రయాణాలను పరిమిత చేసుకోవాలని సూచించింది. యునైటెడ్ స్టేట్స్ తమ దేశానికి పొంచివున్న ముప్పు కారణంగా ప్రధాన నగరాల్లో చట్ట అమలు గస్తీని ముమ్మరం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఇది కూడా చదవండి: క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు -
ఆ 3 అణు కేంద్రాలు
ఇరాన్లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా...1.ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ టెహ్రాన్కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో పర్వతం అంతర్భాగంలో 90 మీటర్ల లోతున ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. నతాంజ్ కంటే ఇది పరిమాణంలో చిన్నదే. వైమానిక దాడుల నుంచి రక్షణతోపాటు అణుపరీక్షల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో కొండ దిగువన దుర్భేద్యంగా నిర్మించారు. ఫోర్డోను ఇజ్రాయెల్తోపాటు పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఇది పటిష్ట స్థితిలో ఉండడంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో అత్యాధునిక సెంట్రీఫ్యూజ్లను బిగించే సామర్థ్యం కలిగి ఉండడం. ఫోర్డోలో సైతం 60 శాతం శుద్ధి చేసిన యురేనిజం నిల్వలున్నాయి. ఈ అణుకేంద్రంపై అమెరికా సైన్యం బి–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ద్వారా 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ (జీబీయూ–57) బాంబును ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి వల్ల ఫోర్డోకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వత ప్రాంతం భారీగా దెబ్బతినడంతోపాటు రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అమెరికా దాడి చేయడం తథ్యమన్న ముందస్తు అంచనాతో ఫోర్డో నుంచి యురేనియం, సెంట్రీఫ్యూచ్లు, కీలక పరికరాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 135 మైళ్ల దూరంలో నతాంజ్ అణుకేంద్రం ఉంది. ఇరాన్కు ఇదే అత్యంత ముఖ్యమైన యురేనియం శుద్ధి, నిల్వ కేంద్రం. అణు కార్యక్రమంలో నతాంజ్దే కీలక పాత్ర. అమెరికా దాడుల కంటే ముందు ఇక్కడ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వచేశారు. అణు బాంబు తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం. అంటే అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా సమీపంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా దాడుల కంటే ముందే ఇజ్రాయెల్ సైన్యం నతాంజ్పై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో భూఉపరితలంపై ఉన్న మౌలిక సదుపాయాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. భూఅంతర్భాగంలో ఉన్న పటిష్ట స్థితిలో సదుపాయాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, అమెరికా దాడుల్లో నతాంజ్లోని సెంట్రీఫ్యూజ్లు, ఇతర పరికరాలు చాలావరకు నామారూపాల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. నతాంజ్పై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. అవి సఫలం కాలేదు. నతాంజ్కు సమీపంలోని పికాక్స్ అనే పర్వతం కింద మరో భారీ అణుకేంద్రాన్ని నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు గతంలో వార్తలొచ్చాయి.3. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 215 మైళ్ల దూరంలోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్లో యురేనియం కన్వర్షన్ సదుపాయాలు, ల్యాబ్లు, చైనా తయారీ రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది అణు శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడికి దిగడంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ, అమెరికా దాడిలో భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్లో రేడియేషన్ లీకేజీ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ప్రకటించింది.ఇరాన్లోని మరికొన్ని అణు కేంద్రాలు (ఇక్కడ దాడులు జరగలేదు) బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరాన్లో ఇదొక్కటే కమర్షియల్ అటామిక్ రియాక్టర్. పర్షియన్ గల్ఫ్లో ఏర్పాటు చేశారు. రష్యా సరఫరా చేస్తున్న యురేనియంతో ఇక్కడ అణ్వస్త్ర తయారీ పరిశోధనలు జరుగుతుంటాయి.అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పెవన్స్–గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నెలకొల్పారు. 2015లో ఈ కేంద్రాన్ని పాక్షికంగా ఆధునీకరించారు.టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్‘శాంతి కోసం అణుశక్తి’ అనే కార్యక్రమంలో భాగంగా 1967లో అమెరికా సరఫరా చేసిన టెక్నాలజీ, పరికరాలతో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తక్కువ శుద్ధి చేసిన యురేనియంతో అణు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి కూడా...→ కరాజ్ (అణు పరిశోధన కేంద్రం) → దార్కోవిన్(నిర్మాణంలో ఉన్న అణుకేంద్రం) → అనారక్(అణు పరిశోధన కేంద్రం) → అర్దాకన్(అణు పరిశోధన కేంద్రం) → సఘాంద్(యురేనియం మైన్) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
25నిమిషాల్లో ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సైన్యానికి ఇరాన్లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామ ర్లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు ‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు. కొద్దిమందికే తెలుసు ఇరాన్పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్ ఇరాన్పై ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్వాషింగ్టన్: ఇరాన్లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్హౌస్లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్కు తేల్చిచెప్పారు.ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూజెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.బాధ్యతారాహిత్యంఅమెరికాపై రష్యా ధ్వజంమాస్కో/బీజింగ్: ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది. -
బాహుబలి బాంబు
ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్ బస్టర్ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్ బస్టర్ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. బాంబు బరువు 13,600 కిలోలుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుతారు. మెరుపువేగంతో దూసుకొచ్చి..ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్హెడ్లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్సోనిక్ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. బాంబుకు తగ్గ విమానంఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్రోప్ గ్రూమ్మన్ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డేనియల్ కెయిన్ వెల్లడించారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్హ్యాన్ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్ పాటుపడుతుంది’’అని అబ్బాస్ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్పైనా ఇరాన్ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్షహర్–4 క్షిపణిను సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్ ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఇరాన్పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్హెడ్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించారు. -
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.భారత్పై చమురు దిగుమతుల ప్రభావంహార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ. -
అమెరికా దాడులు.. ఇరాన్కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
‘నోబెల్ శాంతి’కి నామినేట్ చేద్దామనుకుంటే.. ఇలా చేశారేంటి?
కరాచీ: ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన తర్వాతే రోజే ఇరాన్పై అగ్రరాజ్యం దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. నోబెల్ శాంతి పురస్కరానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ‘ఎక్స్’ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 🔊PR No.1️⃣8️⃣2️⃣/2️⃣0️⃣2️⃣5️⃣Pakistan Condemns the US Attacks on the Nuclear Facilities of the Islamic Republic of Iran.🔗⬇️https://t.co/2qpo27WzVQ pic.twitter.com/ugtFomQ5HO— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) June 22, 2025 డొనాల్డ్ ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాల్సిందే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21వ తేదీ) వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. అయితే నాలుగురోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని తెలిపింది. మరి ఇప్పుడు అదే ట్రంప్.. ఇరాన్పై దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. కొన్ని దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమయ్యారని నిన్న, మొన్నటి దాకా భావించిన పాక్.. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ఖండించింది. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడని అనుకున్న వేళ.. ఆయన ఇరాన్పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగేందటనే భావనలో పడింది పాక్. తమకేదో సాయం చేశాడని నోబెల్కు సిఫార్సు చేద్దామనుకుంటే.. ట్రంప్ ఇలా చేశారేంటని అనుకోవడం ఇప్పుడు పాక్ వంతైంది. తాము ఓ అధికార ప్రకటన చేసిన రోజు వ్యవధిలోనే ట్రంప్ ‘ఎంత పని చేశారు’ అని తలలు పట్టుకోవడే తప్పితే ఏమీ చేసేది లేకుండా పోయినట్లైంది పాక్ పరిస్థితి. ఇదీ చదవండి:‘మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా’.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్! -
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో నేను మాట్లాడాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్తో పాటు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
ఇరాన్ ఎటాక్ తో ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్
-
క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యంతో జతకట్టిన అమెరికా ఆర్మీ ఇస్లామిక్ దేశంలోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేసిన కొన్ని గంటలకే ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ▶️ Huge smoke rises into the sky following Iran's missile strike in Tel AvivFollow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/HqPJaPUzFz— Press TV 🔻 (@PressTV) June 22, 2025ఈ వీడియోలలో టెల్ అవీవ్లో దట్టమైన పొగ ఆవరించినట్లు కనిపిస్తోంది. వీధులు నిర్మానుష్యంగా ఉండటం, క్షిపణి వర్షం నుంచి తప్పించుకునేందుకు స్థానికులు పరుగెత్తడం మొదలైనవి కనిపిస్తున్నాయి.▶️ Huge smoke rises into the sky following Iran's missile strike in Tel AvivFollow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/HqPJaPUzFz— Press TV 🔻 (@PressTV) June 22, 2025ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం మధ్య ఇజ్రాయెల్లోని ఒక భవనం ఇరాన్ దాడికి గురైంది. బెన్ గురియన్ విమానాశ్రయంతో పాటు ఇతర ఇజ్రాయెల్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపింది.ఇస్లామిక్ రిపబ్లిక్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదంలో అమెరికా జోక్యం దరిమిలా మిడిల్ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరాన్ తన అణుకార్యక్రమాన్ని ముగించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.حيفا وتل أبيب بعد الهجوم الإيراني pic.twitter.com/OthqlKEivw— Al Jadeed News (@ALJADEEDNEWS) June 22, 2025మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ తాము ఒక జట్టుగా పనిచేశామని, బహుశా ఇంతకు ముందు ఎవరూ చేయనట్టుగా పనిచేశామన్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్? -
అమెరికా దాడులు, ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయని ఇరాన్
-
ఇక ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించిన భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోవాలనుకునే భారతీయ పౌరులను భారత్ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి ముందుగా భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పించనున్నామని ఎంఈఏ తెలిపింది. విదేశాలలో ఉన్న భారత పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంది.భారత్ చేరుకోవాలనుకునేవారు టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని ఎంఈఏ తెలిపింది. ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ఇరాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధును ప్రారంభించింది. దీనిలో భాగంగా 800 మందికి పైగా భారతీయులను మూడు చార్టర్ విమానాలలో భారత్ తరలివచ్చారు. ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్? -
అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్?
టెహ్రాన్: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణుకేంద్రాలపై భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యింది. ఇరాన్లోని అణు కేంద్రాలపై వైమానికదాడులు జరిగిన దరిమిలా రేడియేషన్ ముప్పుపై సర్వత్రా ఆందోళన నెలకొంది.ఈ దాడుల అనంతరం ఈ అణుకేంద్రాల సమీపంలోని వారికి ఎటువంటి హాని జరగలేదని ఇరాన్ అణు నియంత్రణ అధికారులు తెలిపారు. అమెరికా దాడి చేసిన అణు కేంద్రాలలో రేడియేషన్ కలిగించే పదార్థాలు లేవని ఇరానియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దాడుల అనంతరం కాలుష్య కారక సంకేతాలు నమోదు కాలేదని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ కేంద్రం తెలిపింది. ఈ దాడుల నేపధ్యంలో రేడియేషన్ స్థాయిలలో పెరుగుదల కనిపించలేదని యూఎన్ అణు వాచ్డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ధృవీకరించింది.యూఎస్ దాడులకు ముందు కూడా ఇరానియన్ సైట్లపై ఇజ్రాయెల్ దాడులకు దిగినప్పుడు కూడా రేడియేషన్ భయాలు రేకెత్తాయి. అణు సౌకర్యాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏనాడో హెచ్చరించింది. కాగా ఈ అణుకేంద్రాలపై దాడుల తరువాత సమీప ప్రాంత ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. దేశంలోని యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుండి బదిలీ చేశారని, రేడియేషన్కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ డిప్యూటీ హెడ్ హసన్ అబేది తెలిపారు.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్ -
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెలీ అవీవ్, ఇతర ప్రాంతాలను టార్గెట్గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.There are close to 50 large oil tankers scrambling to leave the Strait of Hormuz right now. Looks like the oil industry is expecting the Strait to be blockaded in the coming days. pic.twitter.com/ymaJRcax3x— Spencer Hakimian (@SpencerHakimian) June 22, 2025'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్పై ఎఫెక్ట్.. ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది. -
అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
వాషింగ్టన్: అమెరికా తాజాగా ఇరాన్లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా, ఇజ్రాయెల్ హై అలర్ట్లో ఉన్నాయి. మూడు ఇరానియన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దరిమాలా న్యూయార్క్, వాషింగ్టన్తో సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక్కడి మతపరమైన, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాలకు అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. అలాగే కొలంబియాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు, నిఘాను పర్యవేక్షించడానికి, సమాఖ్య చట్ట అమలు భాగస్వాములతో సమన్వయ చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్లోని అణు సౌకర్యాలపై అమెరికన్ సైన్యం విజయవంతమైన దాడి నిర్వహించిందని,ఇది ప్రపంచానికి చారిత్రక క్షణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్ ఈ దాడులపై స్పందిస్తూ, అమెరికా వైమానిక దాడులో స్థానికులెవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొంది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా మరింత అప్రమత్తం అయ్యింది. దేశంలోని వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణ సమన్వయంతో ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.ఇది కూడా చదవండి: ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే.. -
ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా అటాక్
-
అమెరికా ఎఫెక్ట్.. ఇజ్రాయెల్కు చుక్కలు చూపించిన ఇరాన్
Iran-Israel Conflict Updates..ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడి..బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి ఇరాన్ దాడి..ఇజ్రాయెల్ అంతటా జరిగిన దాడుల్లో 11 మందికి గాయాలువిమానాశ్రయంలో సహాయక చర్యలు ప్రారంభం.బాధిత ప్రాంతాలలో అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ దాడులుఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వంఇజ్రాయెల్లోని జెరూసలెంలో భారీ పేలుడుఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలుమధ్య ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసంఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం.ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసంకొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళంప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనున్న ఇరాన్ నిర్ణయంఅమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు పిలుపునిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడుఇరాన్ భీకర దాడులు..ఇరాన్పై అమెరికా దాడులు చేసిన వేళ.. ఇజ్రాయెల్పై ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ జెరూసలేం, టెలీ అవీవ్ టార్గెట్గా ఇరాన్ మరోసారి భారీ దాడులు చేసింది. భారీ క్షిపణుల కారణంగా పేలుళ్లు జరిగాయి. ముప్పెట దాడితో ఇజ్రాయెల్కు చుక్కలు చూపించింది. ఇరాన్ దాడుల సందర్భంగా టెలీ అవీవ్ సహ పలు ప్రాంతాల్లో సెరన్లు మోగాయి. దాదాపు 400 ప్రాంతాల్లో సెరన్లు మోగినట్టు తెలుస్తోంది. దీంతో, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరికఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. పౌరులందరూ షెల్టర్ హోమ్స్లోనే ఉండాలని.. హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని సూచించింది. క్షిపణి దాడుల కారణంగా అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.🚀🇮🇱 BOOM BOOM TEL AVIV pic.twitter.com/1SkPBhqFDW— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) June 22, 2025 ఇజ్రాయెల్ గగనతలం మూసివేత..ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఈజిప్ట్, జోర్డాన్తో భూ సరిహద్దు క్రాసింగ్లు తదుపరి నోటీసు వచ్చే వరకు తెరిచే ఉంటాయని తెలిపింది.İran füzelerinin bu sabah Hayfa'ya düşmesinden kısa bir süre sonra çekilen görüntüler.pic.twitter.com/q8FG2BCvAJ— Brez Kantonyan (@barikatzaferi) June 22, 2025 🇮🇱🇮🇷 | Así se encuentra la ciudad de Tel Aviv tras el bombardeo Iraní de la última hora. pic.twitter.com/6CSsgyxWYX— Vibe News (@vibe_news_) June 22, 2025అమెరికాలో హైఅలర్ట్.. ఇరాన్లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. Kuzeydeki Hayfa'dan Tel Aviv, Kudüs ve Ölü Deniz'e kadar 400 şehirde sirenler çalıyor. pic.twitter.com/vFJ52z0BQ2— Brez Kantonyan (@barikatzaferi) June 22, 2025#SONDAKİKA | İran, Tel Aviv ve Hayfa'yı vurdu.Fatih Altaylı İsrail İran tel aviv Nihal candan yks 2025 pic.twitter.com/q3k1kXKDpM— Efbhaber (@efbhaber) June 22, 2025 -
ఇరాన్ పై యుద్ధంలో ఇజ్రాయెల్ తో జతకట్టిన అమెరికా
-
ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు
టెల్ అవీవ్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ద యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా దళాలు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసించారు. ట్రంప్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ వ్యాఖ్యానించారు.అధ్యక్షుడు ట్రంప్, తాను తరచూ బలప్రయోగం ద్వారా శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటామని, మొదట బలప్రయోగం జరిగితే, తరువాత శాంతి ఉద్భవిస్తుందన్నారు. డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ తమ శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించాయని నెతన్యాహు అన్నారు. కాగా ఫోర్డోపై ఆరు బంకర్-బస్టర్ బాంబులను వేశామని, ఇతర అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించామని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’కు తెలిపారు. యుద్ధంలో ట్రంప్ సహకారంపై స్పందిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.ఆపరేషన్ రైజింగ్ లైన్లో ఇజ్రాయెల్ తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా ఏ ఇతర దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, ప్రమాదకరమైన ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించే విధంగా వ్యవహరించారని చరిత్రలో నమోదవుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. దేముడు అమెరికాను, ఇజ్రాయెల్ను దీవించాలని, మన బలిష్టమైన కూటమిని, అచంచలమైన విశ్వాసాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని నెతన్యాహు అన్నారు.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు? -
శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఇరాన్పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే. ఇరాన్ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | US strikes Iran's three nuclear facilitiesUS President Donald Trump says, "Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's number one state sponsor of terror. Tonight, I can report to the… pic.twitter.com/KQdMgczaJo— ANI (@ANI) June 22, 2025యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చింది. ఇక, యుద్ధం కొనసాగకూడదు. గత 40 ఏళ్లుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా అక్కడ ఉంటున్న అమెరికన్లు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇరాన్ దాడులను ఆపాలి. ఇప్పటికి శాంపిల్ మాత్రమే చూపించారు. ఇరాన్ తన తీరు మార్చుకోకపోతే మరిన్ని దాడులు జరుగుతున్నాయి. మా టార్గెట్స్ మాకు ఉన్నాయి. మేము తలుచుకుంటే అన్నింటినీ నాశనం చేయగలం. మా లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | US strikes Iran's three nuclear facilities President Donald Trump says, "This cannot continue. There will be either peace or there will be tragedy for Iran, far greater than we have witnessed over the last eight days. Remember, there are many targets left. Tonight's… pic.twitter.com/koWkXYjXBA— ANI (@ANI) June 22, 2025 -
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఒకవేళ తాను హత్యకు గురైతే తన స్థానంలో ‘ఈ ముగ్గురు’ సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.ఇప్పటికే రహస్య బంకర్లో తలదాచుకున్న ఖమేనీ, తనను కనుక్కోవడం మరింత కష్టతరం చేయడానికి తన చుట్టూ ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను మూసివేయాలని అధికారులను ఆదేశించాడని ఆ వార్తాపత్రిక నివేదించింది. అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా.. ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు సన్నిహితుడైన మతాధికారి. ఈయన సుప్రీం చీఫ్ రేసులో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఖమేనీ పేర్కొన్న అభ్యర్థుల జాబితాలో లేడని, ఆయన పేర్కొన్న పేర్లలో మరో ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు.శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇకపై ఉనికిలో ఉంచే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని పట్టణంలోని ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన అనంతరం కాట్జ్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇరానియన్ నియంత రహస్య బంకర్లో కూర్చుని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. ఇది తీవ్రమైన యుద్ధ నేరం. వీటికి ఖమేనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాట్జ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరానియన్ సుప్రీంను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్కు ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు, ఖమేనీ పాలనను అంతం చేసేందుకు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను పెంచాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మద్దతు పలకాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు -
ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా.. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఆకస్మిక దాడులు
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇరాన్పై ముప్పెట దాడి మొదలైంది. అంతా అనుకున్నట్టుగానే ఇరాన్పై తాజాగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా భారీ దాడులు చేసింది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా విజయవంతంగా దాడులు చేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఇక, ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడుల అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్ ట్విట్టర్ వేదికగా.. ‘ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా అమెరికాకు తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని చెప్పుకొచ్చారు.pic.twitter.com/wu9mMkxtUg— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025మరో పోస్టులో ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ దాడి నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని బీ-2 స్పిరిట్లు, ఎనిమిది కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయల్దేరి వెళ్లాయి. ఇవి మైటీ11, మైటీ21 అనే కాల్సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా బీ-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయల్దేరిన సమయంలో ‘మైటీ’ కాల్సైన్లను వాడాయి. ఈ దాడితో అమెరికా కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్లైంది. అగ్రరాజ్య ప్లానింగ్కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఫోర్డో అణుకేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణుకేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీనిని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయెల్ ఎఫ్15, ఎఫ్16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్తగా దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7శాతం శుద్ధిచేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన అణుబాంబుల్లో వాడే 90శాతం శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గర్లో ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.బీ-2 బాంబర్లు..ఒక చిన్న పక్షికి సమానంగా బీ-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఒక్కో బీ-2 బాంబర్ రెండు ఆయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. 15 టన్నుల బరువున్న రెండు బంకర్ బ్లాస్టర్లను మోసుకెల్లే సామర్థ్యం వీటికి ఉంది. తాజాగా ఆరు బీ-2 బాంబర్లు ఇరాన్పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇవి ఒక్కసారిగా 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. B-2 Spirit Stealth Bomber🇺🇸 U.S. Air Force heavy strategic bomberDesigned for stealth, it can penetrate dense enemy air defenses undetectedCarries conventional and nuclear weaponsRange: ~11,000 km (6,800 miles) without refuelingCost: ~$2 billion per unitOnly 21 were… pic.twitter.com/IcF5FsYxED— Israel MyChannel (@IsraelMychannel) June 21, 2025అంతకుముందే ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని, ఇప్పుడు ఆ దేశాన్ని యుద్ధం ఆపమని తాను చెప్పలేనని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ అద్భుతంగా రాణిస్తోంది. ఇరాన్ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం కష్టమే అని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్అవీవ్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు.Visuals: Huge US airstrikes on Fordow, Natanz, and Esfahan Iranian nuclear facilities. pic.twitter.com/fSIcAHu3X3— Black Cobra ⚡ (@Blackcobra00007) June 22, 2025అలాగే, ఐరోపా నేతలు జరుపుతున్న చర్చలు కూడా ఫలవంతం కావని అన్నారు. వారు ఇరాన్కు ఎలాంటి సాయం చేయలేరని తెలిపారు. ఇదే సమయంలో ‘ఐరోపాతో ఇరాన్ మాట్లాడాలని అనుకోవడం లేదు. మాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఐరోపా ఏ రకంగానూ సాయం చేయలేదు. నేను శాంతి దూతను. కొన్ని పరిస్థితుల్లో శాంతిదూత కూడా కఠినంగా ఉండాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. -
వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమైతే మనదేశ వాణిజ్యంపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ కీలక సమావేశం నిర్వహించింది. షిప్పింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, కంటెయినర్ కంపెనీలు, ఇతర శాఖలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ దీనికి నేతృత్వం వహించారు. హర్ముజ్ జలసంధిలో ప్రస్తుతానికి తటస్థ పరిస్థితులే నెలకొన్నట్టు, ఓడల రవాణాలకు ఎలాంటి ఆటంకాల్లేనట్టు ప్రతినిధులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్యంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రత్నామ్నాయాలను గుర్తించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. యుద్ధం తీవ్రతరమైతే అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. హర్ముజ్ జలసంధి, రెడ్సీ ద్వారా ఓడల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో సముద్ర, వాయు రవాణా చార్జీలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. కేవలం 21 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలో 20 శాతం మేర ముడి చమురు రవాణా అవుతోంది. అంతేకాదు మన చమురు దిగుమతుల్లో మూడింట రెండొంతులు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం మేర హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. వీటికి ఆటంకాలు ఏర్పడితే చమురు ధరలు, రవాణా, బీమా చార్జీల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావం మన దేశ వాణిజ్యంపై గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే వాణిజ్య శాఖ ఈ సమావేశం నిర్వహించింది. -
ఇస్ఫహాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ భీకర దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇరాన్ అణుబాంబు తయారీ క్రతువును కట్టడిచేసేందుకు కంకణం కట్టుకునిమరీ కదనరంగంలోకి దూకిన ఇజ్రాయెల్ అదే పనిలో బిజీగా మారింది. ఇరాన్లోని ప్రముఖ ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శనివారం తెల్లవారుజామున ముప్పేట దాడికి తెగించింది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్ పాడైపోయింది. అయితే అణుకేంద్రం నుంచి రేడియోధారి్మకత, విష వాయువులు వెలువడలేదని వార్తలొచ్చాయి. వారం క్రితం సైతం యుద్ధం మొదలైన వెంటనే ఇదే ప్లాంట్పై ఇజ్రాయెల్ స్వల్పస్థాయిలో దాడిచేసింది. ప్లాంట్లో ఇంకా కొన్ని అణుబాంబు తయారీకి పనికొచ్చే కీలక పరికరాలు భద్రంగా ఉన్నాయనే అనుమానంతో శనివారం ఇలా మరోసారి దాడిచేసింది. ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ సృష్టించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)లో విదేశీ విభాగమైన ఖుద్స్ ఫోర్స్లో సీనియర్ కమాండర్లను దాడుల్లో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. వీరిలో కమాండర్ సయీద్ ఇజాదీ సైతం ఉన్నారు. ఖ్వామ్ సిటీలో జరిగిన దాడిలో ఇజాదీ మరణించారని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. 2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసిన హమాస్కు అన్నిరకాలుగా సాయంచేసిన కమాండర్ సయీదేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఖుద్స్ ఫోర్స్లో ఆయుధాల తరలింపు యూనిట్ కమాండర్ అయిన బెహా్నమ్ షాహ్రియారీని పశి్చమ ఇరాన్లో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేసి హతమార్చారు. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన దాడిలో ఇరాన్ డ్రోన్ విభాగ కమాండర్ను సైతం ఇజ్రాయెల్ చంపేసింది. ఖుద్స్ ఫోర్స్ అనేది విదేశాల్లో సైనిక, నిఘా కార్యకలాపాల బాధ్యతలు చూసుకుంటుంది. మహ్వజ్లోని క్షిపణి లాంఛర్ల స్టోరేజీ, సైనికస్థావరాలపైనా తమ యుద్దవిమానాలు 50 సార్లు దాడిచేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది. దాడుల్లో మరణించిన తమ అణుశాస్త్రవేత్తల సంఖ్య 10కి పెరిగిందని ఇరాన్ ఒప్పుకుంది. గతవారం జరిగిన దాడిలో న్యూక్లియర్ సైంటిస్ట్ ఇసార్ తబాతబీ ఘోమ్శే చనిపోయారని పేర్కొంది. ఖుజెస్తాన్ ప్రావిన్సులో చాలా చోట్ల బాంబుపేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హొవేజే సిటీలోని ఎమర్జెన్సీ సెంటర్, అహ్వజ్ వైద్య విశ్వవిద్యాలయం పైనా క్షిపణి దాడి చేశారు. దాడుల్లో పశి్చమ ఇరాన్లోని సుమార్లో ఐదుగురు ఇరాన్ సైనికులు చనిపోయారు. ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోవడంతో అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలీక ఇరానీలు మరింత భయపడిపోతున్నారు. దేశం నుంచి పారిపోతున్న వారి సంఖ్య పెరిగింది. సరిహద్దులకు దారితీసే రహదారులపై జనం పెద్దసంఖ్యలోకనిపిస్తున్నారు. ప్రతిదాడులు చేసిన ఇరాన్ ఏకబిగిన క్షిపణులను ఎక్కుపెడుతున్న ఇజ్రాయెల్పైకి ఇరాన్ సైతం బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా నిఘా సంస్థ మొస్సాద్కు చెంది కార్యాలయాలపై దాడులను తీవ్రతరంచేసింది. పెద్దసంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. కొన్నింటిని నేలకూల్చామని ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణవ్యవస్థలను చేధించిమరీ డ్రోన్లు లక్ష్యాలను ఢీకొట్టాయి. ఇజ్రాయెల్ నగరాలైన బాట్ యామ్, టెల్ అవీవ్లలో దాడుల భయంతో జనం వీధుల్లోకి రావడం మానేశారు. దీంతో చాలా వరకు వీధులు నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడితో మేక్రాన్ ఫోన్ మంతనాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో యూరప్ దేశాల విదేశాంగ మంత్రులతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బాఘ్చీ శుక్రవారం జరిపిన మధ్యవర్తిత్వ చర్చలు ఎటూ తేలకపోవడంతో ఈసారి వేదికను తుర్కియేకు మార్చారు. ఇస్తాంబుల్లో చర్చలు శనివారం రాత్రే మొదలవుతాయని తొలుత వార్తలొచ్చాయి. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంచేసుకుంటే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా జోక్యంచేసుకుంటే ఎర్రసముద్రంలో అమెరికా రవాణా నౌకలపై దాడులుచేస్తామని యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు శనివారం ప్రకటించారు. ‘అణు’చర్చలు జరగకూడదనే దురుద్దేశంతోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్లో మంతనాలు జరిపారు. ఇస్తాంబుల్లో మధ్యవర్తిత్వ చర్చలు సఫలీకృతం అయ్యేలా కృషిచేస్తానని మసూద్కు మాటిచ్చానని మేక్రాన్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన మాజీ సలహాదారు జూన్ 13నాటి దాడుల నుంచి ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ సలహాదారు, మాజీ సెక్యూరిటీ చీఫ్ అలీ షామ్ఖానీ గాయాలతో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.మాటమార్చిన ట్రంప్ మరికొద్దివారాల్లో అణుబాంబును ఇరాన్ తయారుచేసే ప్రమాదం ముంచుకురావడంతోనే ఇజ్రాయెల్ దాడులను మొదలెట్టిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్కు అంతటి సామర్థ్యంలేదని మీ నిఘా విభాగమే తేల్చిచెప్పిందని మీడియా ఆయనను ప్రశ్నించగా ట్రంప్ కోపగించుకున్నారు. ‘‘ఆ మాట ఎవరన్నారు?’అని ఎదురు ప్రశ్నించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ మహిళా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మార్చినెలలో కాంగ్రెస్ ఎదుట ఇదే విషయం చెప్పారని మీడియా గుర్తుచేసింది. దీంతో ట్రంప్ వెంటనే ‘‘ఆమె అబద్ధం చెప్పారు. నేను చెప్పిందే నిజం. త్వరలో ఇరాన్ అణుబాంబు సిద్ధమవుతోంది. అందుకే అప్రమత్తమయ్యాం’’అని దాడులను సమరి్థంచారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత శుక్రవారం తులసీ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ట్వీట్చేశారు. ‘‘వారాల్లో లేదా నెలల్లో ఇరాన్ అణుబాంబు తయారుచేయబోతోందని మాకు సమాచారం అందింది. బాంబుగనక బిగిస్తే ఇక అంతే. అయితే పరిస్థితి అంతదాకా రాకుండా ట్రంప్ అడ్డుకుంటారని నాకు తెలుసు’’అని ఆమె ట్వీట్చేశారు. అంతకుముందు ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ మాట్లాడారు. ‘‘ఇరాన్కు రెండు వారాల గడువు ఇచ్చా. ఆలోపు ఒప్పందం కుదుర్చుకోకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు’’అని అన్నారు. ఈయన మాటలకు తగ్గట్లు వేల కేజీల బంకర్ బస్టర్ బాంబును జారవిడిచే బీ2 స్టెల్త్ విమానాలు గ్వామ్ దీవి దిశగా బయల్దేరినట్లు వార్తాలొచ్చాయి. ఫోర్డో భూగర్భ అణుశుద్ధికర్మాగారాన్ని భూస్థాపితం చేయాలంటే ఈ విమానం నుంచి మాత్రమే జీబీయూ–57 మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ బాంబును పడేయడం సాధ్యమవుతుంది. -
జంట భూకంపాలా? అణుపరీక్షలా?
ఇజ్రాయెల్ విశ్రాంతి లేకుండా విరుచుకుపడుతుంటే ఇరాన్ ఓవైపు ప్రతిదాడి చేస్తూనే మరోవైపు అణుపరీక్షలు జరిపిందన్న వార్తలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అనే ప్రశ్న వెంటనే తలెత్తింది. ఈ వార్తల్లో వాస్తవముందని వాదించే వాళ్లు రెండు అంశాలను తెరమీదకు తెచ్చారు. ఈ వారం మొదట్లో ఇరాన్లో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది. తాజాగా శుక్రవారం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. భీకరపోరు చేస్తున్న దేశంలో వెంటవెంటనే భూకంపాలు రావడం, అదికూడా అంతరిక్ష కేంద్రం, క్షిపణి ఉత్పత్తి కర్మాగారాలు ఉన్న సెమ్నాన్ ప్రావిన్సులోనే సంభవించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఓవైపు అణుబాంబును తయారుచేసే స్థాయికి యురేనియంను ఇరాన్ ఇంకా శుద్ధిచేయలేదన్న వార్తలొస్తుండగా అణుపరీక్షల వేళ అణుబాంబు పేల్చడం వల్లే భూమి కంపించి అది రిక్టర్ స్కేల్పై నమోదైందని మరికొందరు వాదిస్తున్నారు. వీటిల్లో నిజమెంత అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవి భూకంపనాలు కాదు, అణుబాంబు పేలుళ్లేనని నిర్దారణ అయితేగనక ప్రపంచంలో పదో అణ్వస్త్రదేశంగా ఇరాన్ అవతరించిందని భావించాల్సి ఉంటుంది. అప్పుడు అణ్వస్త్రదేశంపై దాడులను కొనసాగించడంపై ఇజ్రాయెల్, దానికి మద్దతు పలకడంపై అమెరికా పునరాలోచన చేయడం ఖాయం. తొలుత ఫోర్డోలో.. తర్వాత సెమ్నాన్లో.. ఇజ్రాయెల్ క్షిపణిదాడుల తర్వాతే ఫోర్డోలో 2.5 తీవ్రతతో అదే రోజు భూకంపం సంభవించింది. ఇది జరిగిన ఐదు రోజులకు అంటే జూన్ 20వ తేదీ రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సెమ్నాన్కు ఆగ్నేయంగా 36 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీప ప్రాంతాల్లో భూమి బాగా కంపించింది. ఇదే సమయంలో నటాంజ్, ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దీంతో ఈ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే అణుకేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందిగానీ వినాశనానికి కారణం బాంబు దాడులా, అణుబాంబు పేలుళ్ల అనేది ఎవరికీ తెలీడం లేదు. అవి నిజమైన భూకంపాలంటూ మరో వాదన తాజా భూప్రకంపనలు కేవలం భూకంపాల కారణంగా సంభవించాయని, అణుపరీక్షలు జరగలేదని కొందరు వాదిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇరాన్ భౌగోళికంగా భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతంలో ఉంది. ఆలై్ఫన్–హిమాలయన్ భూకంప పట్టీలో ఇరాన్ ఉంది. ఇక్కడ ఏటా సూక్ష్మస్తాయిలో ఏకంగా 2,000 భూకంపాలు వస్తాయి. రిక్టర్ స్కేల్పై 5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో డజనుకుపైగా భూకంపాలు నమోదవుతాయి. 2006 నుంచి 2015 ఏడాదిదాకా గణాంకాలను పరిశీలిస్తే ఇరాన్లో 96,000 సార్లు భూకంపాలు వచ్చాయి. సాధారణంగా భూగర్భంలో అణుపరీక్షలు జరిపితే భూమి పైపై పొరలపై ఒత్తిడి కల్గి స్వల్పస్థాయిలో భూమి కంపిస్తుందని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అణుబాంబు పేలిన కారణంగా మొదలయ్యే భూకంపం తీవ్రత కొంతదూరానికే పరిమితమవుతుంది. అణుబాంబు పేలితే కేవలం పీ–బ్యాండ్ తరంగాలే ఉద్భవిస్థాయి. నిజంగా భూకంపం వస్తే పీ–బ్యాండ్తోపాటు ఎస్–బ్యాండ్ తరంగాలు కూడా వస్తాయి. ఎస్–బ్యాండ్ తరంగాలు తమ కేంద్రస్థానం నుంచి వెదజల్లబడి సూక్ష్మస్థాయిలో తిరిగి కేంద్రాన్ని చేరతాయి. పలు రకాల పరికరాల ద్వారా భూకంప శాస్త్రవేత్తలు దీనిని గుర్తించగలరు. ఈ లెక్కన 2.5 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు సహజ భూకంపమే కారణమని నిపుణులు నిర్ధారించారు. అయితే భూకంపం వచ్చిన అదే సమయానికి అదే ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హంఆపరేషన్ సిందూర్ వేళ.. మే నెలలో నాలుగురోజులపాటు పాకిస్తాన్పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’భీకర దాడుల వేళ సైతం పాకిస్తాన్లో భూకంపాలు సంభవించాయి. దీంతో పాకిస్తాన్లో అణుపరీక్షలు జరిగాయనే వాదన వినిపించింది. అయితే ఆ వాదన తప్పు అని తర్వాత తేలింది. సమగ్ర అణ్వస్ర వ్యాప్తినిరోధక ఒప్పదం(సీటీబీటీఓ), యూఎస్జీఎస్, స్వతంత్య్ర భూగోళశాస్త్ర అధ్యయనకారుల వాదన ప్రకారం ఒకవేళ భూప్రకంపనలు నమోదైతే, వాటి కేంద్రాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తిస్తే అది ఖచ్చితంగా సహజ భూకంపమే. ఎందుకంటే పది కిలోమీటర్ల లోతుకు భూమిని తవ్వి అక్కడ అణుబాంబును పేల్చడం అసాధ్యం. శుక్రవారం నమోదైన భూకంపం సంబంధ నాభి స్థానాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తించారు. ఈ లెక్కన ఇరాన్లో అణుపరీక్షలు జరగలేదనే వాదన తాజాగా బలపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి. -
అణు పరీక్షలతోనే ఇరాన్లో భూకంపమా?
తీవ్రత తక్కువే అయినా కూడా శక్తివంతమైన భూకంపం శుక్రవారం ఇరాన్ను వణికించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని.. స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభించిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ భూమి కంపించిందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. జూన్ 20 శుక్రవారం ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్కు 27 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం 9వ రోజుకి చేరింది. అణు ఒప్పందాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని ఇరాన్ తాజాగా ప్రకటించింది కూడా. అయితే ఆ దేశ సైన్యం నడిపించే మిస్సైల్ కాంప్లెక్స్తో పాటు సీక్రెట్ స్పేస్ సెంటర్ కూడా సెమ్నాన్ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఈ అనుమానం తెర మీదకు వచ్చింది. సాధారణంగా అణు పరీక్షలు నిర్వహించే క్రమంలో భూమి కంపించడం సహజమే. పేలుళ్ల ధాటికి టెక్టానిక్ ప్లేట్లు ఒత్తిడికి గురికావడం వల్ల భూకంపానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భూకంప శాస్త్రవేత్తలు (Seismologists).. సహజ భూకంపాలకు, అణు కార్యక్రమాల వల్ల ఏర్పడే ప్రకంపనలకు తేడాను గుర్తించగలుగుతారు. ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇరాన్ తాజా భూకంపానికి, అణు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వేతో పాటు కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్(CTBTO) ధృవీకరించారు. మరికొందరు సిస్మాలజిస్టులు కూడా ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. కేవలం పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు జరపడం అసాధ్యమని తేల్చేశారు.ఇరాన్ భూకంపాల జోన్లోనే ఉంది. సాధారణంగా ఏడాదిలో అక్కడ 2,100 సార్లు భూమి కంపిస్తుంటుంది. ఇందులో 15 నుంచి 16 సార్లు.. రిక్టర్ స్కేల్పై 5 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూమి కంపిస్తుంది. 2006-2015 మధ్య ఇరాన్ 96,000 భూకంపాలను చవిచూసింది. -
ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర యుద్ధం
-
‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్ణణల విషయంలో భారత్ మౌనం వహించడం అనేది దౌత్యపరమైన లోపాన్ని ఎత్తిచూపుతున్నదని, ఇది దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నిష్క్రమణను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘ది హిందూ’లో ఆమె జూన్ 13న ఇరాన్ భూభాగంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిని చట్టవిరుద్ధమైనదిగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.రెండు ప్రాంతీయ శక్తుల మధ్య జరుగుతున్న ప్రతీకార డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. దీనిపై స్పందించిన భారత జాతీయ కాంగ్రెస్ ఈ బాంబు దాడులను, ఇరాన్ గడ్డపై చోటుచేసుకున్న హత్యలను ఖండించింది. ఇవి ప్రాంతీయంగానూ ప్రపంచస్థాయిలోనూ పొంచివున్న ముప్పు తీవ్రతను సూచిస్తాయని పేర్కొంది. ఇటువంటి చర్యలు అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయని, మరిన్ని సంఘర్షణకు బీజం వేస్తాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు.సోనియా గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ, అందుకు అనుకూలంగా తన సొంత నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ట్రంప్ గతంలో పలు యుద్ధాలు, సైనిక-పారిశ్రామిక సముదాయ శక్తుల గురించి హెచ్చరించారని, అయితే ఇప్పుడు ఇరాక్ యుద్ధానికి దారితీసిన తప్పులను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోనియా పేర్కొన్నారు. ఈ వ్యాసంలో సోనియా భారతదేశానికున్న ప్రత్యేకమైన దౌత్య స్థానానికి ప్రాధాన్యతనిచ్చారు.ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్తో సహా కీలక సమయాల్లో ఇరాన్ మద్దతు ఉన్నదన్నారు. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తన దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్దంలో భారత్ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు -
ఇరాన్ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ వెల్లడి
జెరూసలేం: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం ఇరుదేశాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరింది. మరోవైపు అణు చర్చలను పునరుద్ధరించేందుకు, ఘర్షణలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు యూరోపియన్ దౌత్యవేత్తలు జెనీవాలో సమావేశమైన తరుణంలోనూ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాన్లోని క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్ హైఫా, బీర్షెబా వద్ద భీకరంగా క్షిపణుల దాడి జరిగిందని, దీనిలో ఇరానియన్ కీలక డ్రోన్ కమాండర్ హతమయ్యాడని పేర్కొంది. మరోవైపు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ.. ఇరాన్లో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 657 మంది మృతిచెందగా, రెండువేల మందికి పైగా జనం గాయపడ్డారని తెలిపింది. కాగా జెనీవాలో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈయూ విదేశాంగ విధాన చీఫ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ మంత్రులతో చర్చలు జరిపారు.యూరోపియన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ‘ఇరాన్.. యూరప్తో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, వారు తమతో మాట్లాడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ తీవ్రతను తగ్గించడానికి లేదా అమెరికా జోక్యాన్ని అనుమతించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఉందని ట్రంప్.. టెహ్రాన్(ఇరాన్)ను హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ సుదీర్ఘ ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం -
మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం
టెహ్రాన్: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత వివాదాస్పద పోస్టులు మరోమారు వైరల్గా మారాయి. మహిళల గురించి, ఉదారవాదంపై ఆయన చేసిన చేసిన పోస్టులు తిరిగి ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్లలో ఖమేనీ మహిళల హక్కులపై స్పందించడమే కాకుండా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013ఈ పోస్టులలో కొన్ని దశాబ్దకాలం క్రితం నాటివి. ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్ ఈ పోస్ట్లను చూసి కంగుతింటున్నారు. మహిళలను ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్లలో కొన్ని లైంగిక వాంఛల పరమైనవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమను పెంపొందించే సలహాలతో కూడినవై ఉన్నాయి.‘పురుషుడు.. స్త్రీ అవసరాలను, భావాలను అర్థం చేసుకునే బాధ్యతను కలిగి ఉండాలి. ఆమె భావోద్వేగ స్థితి విషయంలో పురుషుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు.Women are stronger than men. Women can completely control and influence men with their wisdom and delicacy. May 11, 2013— Khamenei.ir (@khamenei_ir) March 7, 20182013 నాటి ఒక పోస్ట్లో ఖమేనీ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను మొదటి రోజున ప్రత్యేకమైన దుస్తులతో పాఠశాలకు వెళ్లాను. అయితే వాటిని ఇతర పిల్లల ముందు ధరించడం అసౌకర్యంగా అనిపించింది. కానీ సరదాగా ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించాను’ అని ఆయన రాశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం తాను చదవడంపై కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని అధ్యయనం చేయముందు నాకు భారతదేశం గురించి తెలియదు.ఈ వలసరాజ్యం పలు ఎత్తుపల్లాలను చూసింది’ అని రాశారు.I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్ స్పందించారు. ఒక యూజర్..‘క్షమించండి, అయతుల్లా ఖమేనీ.. మీ గేమ్ల గురించి నాకు తెలియదు’ అని అన్నారు. మరొక యూజర్ ‘ప్రేమికునిగా పుట్టి, సుప్రీం నేతగా ఉండవలసి వచ్చింది’ అని అన్నారు. Before studying "Glimpses of World History" by Mr. #Nehru I didn't know #India before colonization had undergone so many important #advances— Khamenei.ir (@khamenei_ir) August 6, 2013 ఇంకొకరు ‘పాత ట్వీట్లు మళ్లీ తెరపైకి వచ్చినా, వాటిని తొలగించని మొదటి వ్యక్తి అయతుల్లా ఖమేనీ’ అని అన్నారు. ఇజ్రాయెల్, యూఎస్లు ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, తాను లొంగిపోయేది లేదని ఖమేనీ స్పష్టం చేసిన తరుణంలో ఈ పోస్టులు వైరల్గా మారాయి.ఇది కూడా చదవండి: ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు -
తెరుచుకున్న ఇరాన్ గగనతలం.. ఢిల్లీకి మరో 290 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ‘ఆపరేషన్ సింధు’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత, 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్ తాజాగా వెయ్యిమంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్ మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తరువాత భారతీయులను రక్షణకోసం టెహ్రాన్(ఇరాన్) నుండి మషద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్ మహాన్ నడుపుతుండగా, న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది.‘సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనం అని జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిని అర్మేనియా, దోహాల మీదుగా భారత్ తరలించారు.ఇది కూడా చదవండి: ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న 110 మంది విద్యార్థులు -
Magazine Story: ఎన్నాళ్లీ యుద్ధకాండ
-
విధ్వంసకర క్లస్టర్ బాంబు
యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి విధ్వంసం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎన్నో దేశాలు నిషేధం విధించిన క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా భారీ పౌరనష్టం జరగాలని తమపై ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమరంలో ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో డజన్లకొద్దీ దేశాల నుంచి నిషేధాన్ని ఎదు ర్కొంటున్న క్లస్టర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రత్యేకతలేంటి?ఏదైనా బాంబును జారవిడిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది. మొత్తం మందుగుండు అయిపోతుంది. కానీ క్లస్టర్ బాంబు అలా కాదు. అందులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులుంటాయి. వాటిని మోస్తున్న కస్టర్ బాంబు వార్హెడ్ను ప్రయో గించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంతదూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపా టి బాంబులన్నీ చెల్లాచెదురు గా నలుదిక్కులా పడి పేలిపో తాయి. దీంతో వినాశనం విస్తృతస్థాయిలో ఉంటుంది. జన సమూహంపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లు అన్ని వైపులకు దూసుకెళ్లడంతో నలుచెరుగులా ఉన్న వారంతా తీవ్రస్థాయిలో లేదా మధ్యస్థాయిలో గాయపడటం ఖాయం. ఇంతటి ప్రమాదకర బాంబు కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్ బాంబు వినియోగానికి దూరంగా ఉండిపోయాయి. ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజుముక్కను నేలపై పడేస్తే అది ముక్కలుచెక్కలై ఎలాగైతే గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్ బాంబులోని పేలని ముక్కలు పరిసరాల్లోకి దూసు కెళ్లి దారుణ నష్టానికి కారణమవుతాయి. శుక్రవారం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన ఒక క్లస్టర్ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి పెద్దసంఖ్యలో చిన్నబాంబులుగా మారి 8 కిలో మీటర్ల పరిధిలో వేర్వేరుచోట్ల బద్ధలయ్యాయి. బా లిస్టిక్ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువ గా ఉంటుందని ఇజ్రాయెల్ సైనికాధికారిది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ వార్తాసంస్థతో చెప్పారు.పొంచి ఉన్న మరో ప్రమాదంక్లస్టర్ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న బాంబులు అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు. పేలని ఆ కొన్నింటిని నిర్వీర్యమైనట్లు భావించకూడదు. అవి కొంతకాలం తర్వాత పేలుతాయి. అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాతకూడా అక్కడికి జవాన్లు వెళ్లాలంటే జంకాల్సిందే. ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో వందకుపైగా దేశాలు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ బాంబు వినియోగంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. 111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలుచేశాయి. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒడంబడికకు కట్టుబడతామని ప్రకటించలేదు. ఈ లెక్కన అమెరికా సైతం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్కు సరఫరా చేసే అవకాశముంది. చాన్నాళ్ల క్రితం సిరియాను ఏలిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం సైతం తాము అంటే గిట్టనివారిపై వీటిని విపరీతంగా వాడిందని ఆరోపణలున్నాయి. అఫ్గాన్లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియా గతంలో ఆరోపించింది.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోనూ...ఆనాడు ఒప్పందంలో భాగస్వామిగా లేని రష్యా నెలలతరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో దానిపై విచ్చలవిడిగా వాడుతోందని తెలుస్తోంది. దీంతో రష్యాతో పోరాటంచేస్తున్న ఉక్రెయిన్కు తమ వద్ద పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్ బాంబులను సరఫరాచేయాలని అమెరికా భావిస్తోంది. సమరసమయంలో పేలితే అది యుద్ధనీతిగా భావించవచ్చు. కానీ యుద్ధం ముగిశాక కూడా పేలుతూ ఇవి ఒకరకంగా పౌరహక్కులను కాలరాస్తున్నా యని మానవహక్కుల సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. -
పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
అణు ఉపద్రవం
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్–ఇరాక్ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది. ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్లో విశిష్ఠ సభ్యుడు -
క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023 -
అమెరికాతో మాకేంటి.. ఇరాన్ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు
టెలీ అవీవ్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్లో ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్తో యుద్ధం కారణంగా వాయిదా పడింది. -
టార్గెట్ ‘ఫోర్డో’
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే. ఏమిటీ అణుకేంద్రం? అణు బాంబు తయారీపై ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్లు ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్–గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్ వల్ల సాధ్యమేనా? ప్రత్యామ్నాయ మార్గం ఇదే.. ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్ బాంబుఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్ఫోర్స్ మాజీ కల్నల్ సెడ్రిక్ లైటన్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హర్మూజ్ను మూసేస్తాం
టెహ్రాన్: ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఖ్యాతికెక్కిన హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సముద్రం ద్వారా రవాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం చమురు ఈ జలమార్గం నుంచే రవాణా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చము రు ధరలు పెరుగుతాయి. దీంతో పెట్రో ల్, డీజిల్ ధరలు సైతం పైకెగసి ప్రపంచ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూప నుంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూ జ్ జలసంధినిన మూసివేయాలనే ఒక ఆప్షన్ కూడా తమ వద్ద ఉందని గురువారం ఇరాన్ సైన్యాధికారి సర్దార్ ఇస్మాయిల్ కోసారీ ప్రకటించారు. ఏమిటీ హర్మూజ్ జలసంధి? పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే జలమార్గమిది. ఇరాన్, ఒమన్ల మధ్య నుంచి 33 కి.మీ.ల వెడల్పుతో ఈ మార్గం వెళ్తోంది. చమురు సరఫరా దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సహజవాయువు, ముడి చమురు నౌకలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. భారత్కు వచ్చే చమురులో ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ ఈ రూట్ గుండానే వస్తోంది. -
డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ రెడీ!
వాషింగ్టన్: అత్యంత అరుదైన సందర్భాల్లో వాడే శత్రు దుర్భేద్య ఈ–4బీ రకం విమానం హఠాత్తుగా అగ్రరాజ్య గగనతలంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో భూమిపై ఎక్కడా దిగకుండా గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రిసహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోతోందన్న వార్తల నడుమ ఈ అధునాతన లోహవిహంగం ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ విమానాన్ని బోయింగ్ 747–200బీ మోడల్లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధంవస్తే అంటే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ అనే పేరుంది. దీనిని ‘నైట్వాచ్’, ‘ఫ్లయింగ్ పెంటగాన్’ అని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోస్సియర్ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకుంది. ఎన్నెన్నో ప్రత్యేకతలు.. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటలపాటు ఎగిరింది. శత్రుదాడులను తట్టుకునేలా అంటే సైబర్ దాడులు, అణుబాంబుపేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోనుకాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలల ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీచేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధవిమానంగానూ.. అత్యవసర సందర్భాల్లో యుద్ధవిమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్ చేయాల్సిన పనిలేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటుచేశారు. ఈ విమానం మొత్తంగా మూడు అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్ ఓపెల్ ఘటన సమయంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి నాలుగు విమానాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్థతను పరీక్షించేందుకే ఈ విమానాన్ని వాషింగ్టన్కు తీసుకొచ్చారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. -
మధ్యవర్తిత్వానికి సిద్ధం: పుతిన్
మాస్కో: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఆయన గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే రష్యా ఎలా స్పందిస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దానిపై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఖమేనీ హత్య జరుగుతుందని అనుకోవడం లేదని పుతిన్ ఉద్ఘాటించారు. మరోవైపు పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘‘ముందు మీ సంగతి చూసుకోండి. ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి. నా కోసం ఈ సాయం చేయండి. మీ సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్–ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పుతిన్కు చురక అంటించారు.ఆధునిక హిట్లర్ అంతం కావాల్సిందే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వ్యాఖ్య ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలోన్ సిటీలో మీడియాతో మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’మాట్లాడారు. ‘‘మాకు పైనుంచి ఆదేశాలు అందాయి. పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. అసలు ఈపాటికే మేం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)ను పంపి ఆయనను అంతంచేయా ల్సింది. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్లా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారు. అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం’ అని కట్జ్ అన్నారు. -
ఆస్పత్రిపై క్షిపణుల దాడి
బీర్షెబా/టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/వాషింగ్టన్: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్ అవీవ్, రమాత్ గాన్, రెహోవోత్ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. సిటీలోని గవ్యమ్ నెగెవ్ ఇజ్రాయెల్ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ప్లుటోనియం చిక్కకుండా దాడులు ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్లోని ఖోŠన్దాబ్ పట్టణ సమీపంలోని అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్ హెవీవాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్లోని దోహాలో ఉన్న అల్ ఉదేయిద్ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి. -
ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. -
ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా పగ్గాలుసుప్రీం లీడర్గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. -
ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెరుగుతున్న పెట్టుబడులు
-
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
-
ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. -
ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా
-
‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇరాన్లో ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్న వేళ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న విద్యార్థులను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలి దఫాలో ఈరోజు(గురువారం) ఉదయం 110 మంది విద్యార్తులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి తమ ప్రాంతానికి వెళ్లేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అందించిన బస్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. The Chief Minister has taken note of the request of the students evacuated from Iran regarding the quality of buses arranged to transport them from Delhi to J&K. The Resident Commissioner has been tasked with coordinating with the JKRTC to ensure proper deluxe buses are arranged.— Office of Chief Minister, J&K (@CM_JnK) June 19, 2025Operation Sindhu brings people home.110 Indian students evacuated from Iran under #OperationSindhu have safely arrived in New Delhi on a special flight from Yerevan, Armenia. MoS @KVSinghMPGonda received them at the airport. Government of 🇮🇳 remains committed to the safety of… pic.twitter.com/GwhI5R26DE— Randhir Jaiswal (@MEAIndia) June 19, 2025దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం స్పందించింది. విద్యార్థులకు డీలక్స్ బస్సులు పంపేలా జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన 110 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్బంగా ఆ విద్యార్థులలో ఒకరైన అలీ మీడియాతో మాట్లాడుతూ ఇది తమకు ఎంతో కష్టమైన ప్రయాణమని, టెహ్రాన్లో అధికంగా దాడులు జరిగాయన్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు తాము తొలుత అర్మేనియా సరిహద్దును దాటడానికి సహాయం చేశారని, అక్కడ తాము ఒక రోజు బస చేసిన తరువాత ఢిల్లీకి వచ్చామని తెలిపారు. కశ్మీర్ నివాసి షేక్ అఫ్సా మాట్లాడుతూ, తాము ఎంతగానో అలసిపోయామని, ఈ డొక్కు బస్సుల్లో తమ ఇళ్లకు వెళ్లడం ఎంతో కష్టమన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సమసిపోవాలని కోరుకుంటున్నామని, ఇవి తమ చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమకు త్వరలో ప్రాక్టికల్ తరగతులు ఉన్నాయని, తాము ఇరాన్ తిరిగి వెళ్లవలసి ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ కితాబు -
ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న 110 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నుంచి అర్మేనియాకుతరలించిన 110 విద్యార్థులు గురువారం తెల్లవారుజామున భారత్కు చేరుకున్నారు. అర్మేనియా నుంచి ప్రత్యేక విమానంలో వారిని భారత్కు తీసుకొచ్చారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ కావడంతో వారికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ విద్యార్థుల్లో జమ్మూకశీ్మర్ నుంచే 90 మంది విద్యార్థులున్నారు. ‘నా కుటుంబాన్ని కలవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యుద్ధం మంచిది కాదు. మానవత్వాన్ని చంపుతుంది’అని ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థి అమాన్ అజార్ అన్నారు. కాగా, ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ‘నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. నా కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం వారి కృషికి ధన్యవాదాలు’అని రాజస్థాన్లోని కోట నుంచి వచ్చిన ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులకు భద్రత కల్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్ అభ్యర్థన మేరకు ఇరాన్ భూ సరిహద్దుల గుండా విద్యార్థులు సురక్షితంగా అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల గుండా బయటకు వెళ్లాలని సూచించింది. కాగా, ప్రస్తుతం ఇరాన్లో 4వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది కూడా చదవండి: ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్? -
ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్ణణలు నేటికి (గురువారం) ఏడవ రోజుకు చేరాయి. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి విషయంలో అమెరికా ప్రమేయం ఉంటుందా లేదా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాటవేత సమాధానమిచ్చారు. వైట్ హౌస్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా? వద్దా అనే దానిపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ‘నేను అలా చేయవచ్చు. అలా చేయకపోవచ్చు... నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు’ అని ఆయన అన్నారు. ఇరాన్ అధికారులు తమతో సమావేశం అయ్యేందుకు వాషింగ్టన్కు రావాలని అనుకుంటున్నారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నారని జర్మన్ దౌత్య వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ విధమైన దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)కు చెందిన కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుండి రక్షణ కోరుతూ నగరం వెలుపల రహదారులను దిగ్బంధించారు.ఇరాన్పై దాడి ప్రణాళికలను తాను ఆమోదించానని ట్రంప్ తన సీనియర్ సహాయకులకు చెప్పారని, కానీ టెహ్రాన్ (ఇరాన్) తన అణు కార్యక్రమాన్ని విరమించుకుంటుందో లేదో వేచిచూసే నేపధ్యంలో తుది ఆదేశం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? అని ట్రంప్ను అడిగినప్పుడు ఖచ్చితంగా జరగవచ్చని అన్నారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, తాము అటువంటి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నామని, అయితే తాము ఆ పని చేయబోతున్నామనే అర్థం దీనిలో లేదన్నారు.ఇదిలావుండగా, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ టెలివిజన్లో ప్రసారమైన రికార్డెడ్ ప్రసంగంలో.. ఈ ఘర్షణల్లో యూఎస్ సైనిక జోక్యం.. నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలని, ఇరాన్ దేనికీ తలొగ్గదని స్పష్టం చేశారు. కాగా ఇజ్రాయెల్ తమ వైమానిక దళం జరిపిన తాజా దాడులలో ఇరాన్ పోలీసు ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్లు తెలిపింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
యుద్ధానికైన సిద్ధమే.. లొంగిపోయే ప్రసక్తే లేదు
-
నిండుకుంటున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు
టెల్ అవీవ్: ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన సాధన సంపత్తి రోజురోజుకీ తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది. ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. గత ఆరు రోజులుగా ఇరుదేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాదాపు 400 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలావరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చిచెబు తున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. -
క్షిపణుల కుంభవృష్టి
దుబాయ్/టెహ్రాన్/టెల్ అవీవ్: ఇరాన్ సైనికసామర్థ్యం అణ్వస్త్రస్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది. ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులుచేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ పతాకస్థాయిలకు చేరుకుంటోంది. తమ ఆయుధ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తన పశి్చమాసియా మిత్రదేశాల గడ్డపై వేలాది మంది సైనికులను మోహరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ బాఘై ఆరోపించారు. టెహ్రాన్ సమీపంలోని హకీమియా ప్రాంతంలోని ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్కు చెందిన అకాడమీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి నిల్వ కేంద్రాలపై, క్షిపణి లాంచర్లపై దాడులు చేసింది. టెహ్రాన్ నగరంపై తెల్లవారుజామునే తెగబడింది. ఐదు గంటలకే భారీ పేలుడు శబ్దం వినిపించింది. కెర్మాన్షా ప్రాంతంలోని బెల్ ఏహెచ్–1 సూపర్కోబ్రాస్ రకం దాడి హెలికాప్టర్లను కుప్పకూల్చామని ఇజ్రాయెల్ తెలిపింది. దాడుల కారణంగా మౌలికసదుపాయాలు దెబ్బతిని ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 585 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,300 మంది గాయపడ్డారని ‘ఇరాన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’ సంస్థ తెలిపింది. దీటుగా స్పందిస్తున్న ఇరాన్ ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది. దాడుల నేపథ్యంలో ఇరాన్ కేబినెట్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సారథ్యంలో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా తదితరులు తాజా పరిస్థితిని అధ్యక్షునికి వివరించారు. ఇరాన్పై దాడుల ఉధృతి కొనసాగినాసరే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపబోమని, అణుశాస్త్రవేత్తలు నిరాటంకంగా పనిచేస్తున్నారని స్విట్జర్లాండ్లోని ఇరాన్ రాయబారి అలీ బహ్రెయినీ ప్రకటించారు. ‘‘ ఇన్నిరోజులూ కేవలం హెచ్చరికగా దాడులు చేశాం. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకే క్షిపణుల్ని ప్రయోగించాం. ఇకపై ఇజ్రాయెల్కు బుద్ధి్దచెప్పేలా దాడులను తీవ్రతరం చేస్తాం’’ అని ఇరాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అబ్దుల్ రహీమ్ మౌసావీ ప్రకటించారు.మా జోక్యం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: ట్రంప్ ఇజ్రాయెల్కు తోడుగా కయ్యానికి కాలు దువ్వితే అమెరికా అంతుచూస్తామని ఖమేనీ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇరాన్ యుద్ధంలో నేను జోక్యం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. నేనేం చేస్తానో ఎవరికీ తెలీదు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ కార్యక్రమానికి స్వస్తిపలికేందుకు ఇప్పుడు కూడా సమయమేం మించిపోలేదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ను కొనసాగిస్తూ ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది. మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇరాన్ను అడ్డుకునేదాకా దేన్నీ ఆపబోం’’ అని ట్రంప్ అన్నారు. లొంగిపోబోమని ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ లొంగిపోయే ఉద్దేశ్యం లేదా?. అయితే సరే. గుడ్ లక్(శుభాశీస్సులు)’’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.భారతీయుల తరలింపు కోసం ఆపరేషన్ సిందూ ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను ‘ఆపరేషన్ సిందూ’ పేరిట తీసుకొస్తామని భారతసర్కార్ బుధవారం ప్రకటించింది. టెహ్రాన్లోని కెషవార్జ్ వీధిలోని వసతిగృహంపై ఇజ్రాయెల్ దాడిలో కొందరు భారతీయ వైద్య విద్యార్థులు గాయపడ్డారన్న వార్తల నడుమ కేంద్రం ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇరాన్లో దాదాపు 4,000 మంది భారతీయులు ఉంటున్నారు. వీరిలో సగం మంది వైద్యవిద్యార్థులే. ఇప్పటికే 110 మందిని ఉత్తర ఇరాన్ గుండా ఆర్మేనియా దేశంలోకి సురక్షితంగా తరలించారు. వీళ్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొస్తున్నారు. గురువారం ఉదయంకల్లా ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుంది. -
జీ7 మేల్కొనదా?!
నానాటికీ మసకబారుతున్న ప్రతిష్ఠను కాస్తయినా పునరుద్ధరించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఎప్పటిలా జీ7 రెండు రోజుల సమావేశాలు కెనడాలోని ఆల్బెర్టాలో పేలవంగా ముగిశాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతుండగా, తాజాగా ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ దండెత్తింది. కానీ రెండు విషయాల్లోనూ తన వైఖరి ఎలావుండాలో, ఏం చేయాలో జీ7 తేల్చుకోలేకపోయింది. సమావేశాల ముగింపులో లాంఛనంగా విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన కరవైంది. ఏకపక్షంగా ఇరాన్పై దాడులకు దిగి పశ్చిమాసియాలో మరో మహాసంగ్రామానికి తెరలేపిన ఇజ్రాయెల్ను పల్లెత్తు మాట అనకుండా తప్పంతా ఇరాన్దేనని ఈ దేశాలు తేల్చాయి. ఆ యుద్ధం పర్యవసానాలు తమను సైతం చుట్టుముడతాయనీ, అమెరికా ఆ ఊబిలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్నదనీ తెలిసినా కిక్కురుమనలేదు. ఇరాన్ను ఏదో ఒకటి అనకపోయినా... రష్యాను నిందించే ప్రయత్నం చేసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆగ్రహం కలుగుతుందన్న భయం జీ7 దేశాలను వెన్నాడింది. సమావేశాలకు ముందు బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని ఆర్భాటంగా ప్రకటించాయి. కానీ ట్రంప్ తీరు చూశాక వాటికి నోరుపెగల్లేదు. గాజా విషయంలో ఇజ్రాయెల్ను తప్పుబట్టినట్టు కనబడుతూనే, ఇరాన్పై దండయాత్ర విషయంలో ఒక్క మాట అనలేకపోయాయి. అసలే జీ7 ‘నిన్నటి క్లబ్’ అని పేరుబడింది. ఆ అపకీర్తిని మరింత పెంచుకోవటానికే సభ్యదేశాలు పాటుపడుతున్నట్టు కనబడుతోంది!ఒకప్పుడు జీ7 మహా శక్తిమంతమైనది. 1980వ దశకంలో ప్రపంచ జీడీపీలో దాని వాటా ఏకంగా 70 శాతం. నిరుడు ఆ వాటా 30 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. ఆర్థిక కార్యకలా పాలు పశ్చిమం నుంచి తూర్పు దిశకు వలసవచ్చి చాన్నాళ్లవుతోంది. ఈ పారిశ్రామిక దేశాలకు చైనా సవాలుగా నిలిచింది. ఆర్థికంగా బలపడుతోంది. ఆ దేశానికి జీ7లో చోటు లేదు. అటు రష్యాకు మధ్యలో కొన్నాళ్లు సభ్యత్వం ఇచ్చినా 2014లో క్రిమియాను దురాక్రమించటంతో వెళ్లగొట్టారు. మన దేశం సైతం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అయినా పరిశీలక హోదాయే తప్ప సభ్యత్వం లేదు. ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక ప్రపంచ సంస్థలను అమెరికా చిన్నచూపు చూడటం మొదలైంది. భద్రతామండలికి విలువే లేకుండా పోయింది. తానే నిర్మించిన డబ్ల్యూటీవోను అమెరికా బేఖాతరు చేస్తోంది. ప్యారిస్ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేయొచ్చన్న ఆలోచనగానీ, అందుకు తగిన ప్రణాళికలుగానీ జీ7 దగ్గర లేవు. ఎంతసేపూ అమెరికా తోకపట్టుకు పోవాలన్న ధోరణే. ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనకు ప్రధాన ఎజెండా అయిన వాణిజ్యంపై ధ్యాసలేదన్న సంగతి తెలుస్తుంది. సదస్సులో ఎక్కువసేపుంటే ఉక్రెయిన్ విషయంలో ఒత్తిడి తప్పదన్న భయం వల్లనో, ఇరాన్ సంగతి తేల్చాలన్న ఆవేశంతోనో ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. వెళ్లేముందు రష్యా దురాక్రమణకు మీరే కారణమంటూ నిందించారు. తమ మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్లు 2014లో రష్యాను జీ7నుంచి బయటకు నెట్టకపోతే ఇవాళ ఆయన సమావేశాల్లో ఉండేవారని, యుద్ధం ఆపటానికి ఒత్తిడి తెచ్చేవారమని నిష్ఠూరమాడారు. అసలు యుద్ధమే వచ్చి వుండేది కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, ఇక్కడ న్యాయానికి చోటులేదని గ్రహించారో ఏమో... ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం సమావేశాలకు మధ్యలోనే గుడ్బై చెప్పారు. నిరుడు జూన్లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్కు 5,000 కోట్ల డాలర్ల రుణమిస్తామని తీర్మానించారు. దాని ప్రకారం నెలకు వంద కోట్లు ఉక్రెయిన్కు అందించాలి. కానీ ట్రంప్ రాకముందే డిసెంబర్లోనే అప్పటి అధ్యక్షుడు బైడెన్ దానికి కోత పెట్టారు. ఆయనొచ్చాక ఇక చెప్పేదేముంది? ఈ భారాన్ని ఇతర సభ్య దేశాలు మోస్తున్నాయి. నిజానికి, గత వైభవం మళ్లీ దక్కాలంటే జీ7 పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తమ వంతు కృషి అవసరం. కృత్రిమ మేధ, క్వాంటమ్లకు కావాల్సిన అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలి. పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనకూ, యువతకు భారీయెత్తున ఉద్యోగావకాశాలు వచ్చిపడే రంగాలపై దృష్టి సారించాలి. కానీ ఇవన్నీ సాకారం కావాలంటే యుద్ధాలు లేని ప్రపంచం ఉండాలి. మరి దానికోసం జీ7 చేసిందేమిటి? ఈ దేశాలన్నీ అమెరికా సాగించిన యుద్ధాల్లో భాగస్వాములుగా మారి చేజేతులా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ను పూర్వంలా యూరప్ దేశాల్లో జనం వెనకేసుకు రావటం లేదు. ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయటం అనర్థమన్న అభిప్రాయం ఉన్నా ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని ఒప్పించాలని మెజారిటీ జనం భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అయినా జీ7 దేశాలకు పట్టదు. మనవరకూ చూస్తే ఈ సదస్సు ఎంతో కొంత తోడ్పడిందని చెప్పాలి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత నేరుగా పారిశ్రామిక దేశాధినేతలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి, దానిపై చర్య తీసుకోక తప్పని పరిస్థితి గురించి వివరించగలిగారు. ఏదేమైనా ఇలాంటి సదస్సులు మొక్కుబడిగా, బాతాఖానీ క్లబ్లుగా మారితే ఫలితం ఉండదు. కనీసం వచ్చే సమావేశాల నాటికైనా జీ7 దేశాలు ఈ సంగతి గ్రహించాలి. -
భారత్లో మధ్యప్రాచ్యపు సెగలు
2025 జూన్ 12, 13 వేకువజాముల్లో ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యకు తెరతీసింది. ఇరాన్ అణుశక్తి సదుపాయాల మీద దాడులు చేసింది. రెండు దేశాల నడుమ నెలల తరబడిగా సాగుతున్న ఉద్రిక్తత, ఈ ఘటనతో పెను యుద్ధంగా మారింది.దశాబ్దాల నుంచీ అపరిష్కృతంగా కొన సాగుతున్న భౌగోళిక రాజకీయ వైరాలు ఎంత దారుణంగా పరిణమిస్తాయో అంద రికీ అవగతమైంది. ఈ యుద్ధాలను ప్రజలు ప్రారంభించారా? లేదు! ఎవరెవరి అధికార దాహానికో వారు బలవుతున్నారు. ఇజ్రాయెల్ దాడి ఫలితంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్ప దన్న అంచనాలతో బ్రెంట్ క్రూడ్ ధర భగ్గుమని బ్యారెల్ 116 డాలర్లకు చేరింది. కోవిడ్, ఉక్రెయిన్, ఎర్ర సముద్రం సంక్షోభాలతో విచ్ఛిన్నమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచ సరఫరా వ్యవస్థలు మరోసారి ఖంగుతిన్నాయి. ఇరాన్లోని హోర్మూజ్ జల సంధి హై–రిస్క్ యుద్ధక్షేత్రంలో ఉండటంతో, అంతర్జాతీయ చమురు సరఫరాలు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నౌకారవాణాపై బీమా చార్జీలు ఒక్కఉదుటున నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన బంగారం మార్కెట్లోకి తరలించడంతో, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు (31.1 గ్రాములు) 2,450 డాలర్ల రికార్డు ధర పలికింది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి.ఇండియా తప్పించుకోగలదా?అనేక వర్ధమాన దేశాలతో పాటు ఇండియా సైతం ఈ పరిణా మాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఇంధన, ఆహార ధరలు పెరుగుతాయి. ఉపాధి దెబ్బతింటుంది. కోట్ల మంది జీవితాలు మధ్య ప్రాచ్య ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఇండియా తన అవసరాల్లో రమారమి 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ధరల్లో కొద్ది పాటి తేడా వచ్చినా రూపాయి విలువ ఆటుపోట్లకు గురవుతుంది. గల్ఫ్ దేశాల్లో ఇంజి నీర్లు, నర్సులు, కార్మికులు, ప్రొఫెషనల్స్గా 90 లక్షల మంది భారతీ యులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు అపాయంలో పడింది. వారు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నిధులు స్వదే శానికి పంపిస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలు ఈ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాయి. ఇక, మధ్య ఆసియాను ఇండియాతో అనుసంధానం చేసే ఇరాన్ చాబహార్ పోర్టు కూడా యుద్ధ ప్రాంతంలోనే ఉంది. ఇండియాకు ఎంతో ముఖ్యమైన ఈ వాణిజ్య పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సిందిగా ఇప్పుడు అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. రెడ్ సీ, హోర్మూజ్ల ముట్టడి ముప్పు కూడా పొంచి ఉంది. 60 శాతం పైగా ఇండియా వర్తకం ఈ కారిడార్ల ద్వారానే జరుగుతోంది. దాడి, ప్రతిదాడుల దృష్ట్యా సరుకు రవాణాలో జాప్యం జరుగుతుంది. బీమా వ్యయాలు చకచకా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ వాణిజ్యం దెబ్బ తింటుంది. కరెన్సీ మార్కెట్ లోనూ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. డాలరుకు రూపాయి విలువ ఇప్పటికే 86 దాటింది. దీంతో మార్కెట్లో సరఫరా పెంచేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. ఈ అంకెలకు అందని నష్టం మరొకటి ఉంది. అది లెక్కించడానికి అలవి కానిది. పెరిగే చమురు ధరల వెనుక, నౌకా రవాణాలో జాప్యం వెనుక ఎందరో సామాన్యుల ఇక్కట్లు దాగి ఉంటాయి. పూర్తిస్థాయి యుద్ధం కొనసాగితే అది ఒక ప్రాంతానికి పరి మితం కాదు. ప్రపంచ వ్యాప్త అస్థిరతకు నాంది పలుకుతుంది. మధ్యప్రాచ్యపు అగ్నిజ్వాలలు ఖండాంతర కార్పొరేట్ బోర్డు రూము ల్లోకి, కుటుంబాల డైనింగ్ టేబుల్స్ మీదకు, పాఠశాలల క్లాస్ రూముల్లోకి నాలుకలు జాపుతూ విస్తరిస్తాయి.నష్ట నివారణ చర్యలువాటి బారిన పడకుండా ఇండియా లోగడ రూపొందించుకున్న వ్యూహాలు, యంత్రాంగాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్నది కీలకం. వీటిలో ముందుగా ప్రస్తావించాల్సింది ఇంధన కవచం. దేశంలోని 39 మిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక రిజర్వుల నుంచి అవసరమైనప్పు డల్లా కొంత కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్వల్పకాలిక ధరల ఒడుదొడుకులను ఈ విధానంతో అధిగమించవచ్చు. గల్ఫ్ చమురు సరఫరా లోటు భర్తీ చేసేందుకు రష్యా, వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల నుంచి దిగు మతులను పెంచుతోంది. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమై ఇంధన దిగుమతులకు డాలర్లకు కొరత ఏర్పడేట్లయితే, దాన్ని తట్టుకు నేందుకు వీలుగా ద్వైపాక్షిక చెల్లింపు(రూపాయిల్లో పేమెంటు) ఏర్పాట్లను పునః ప్రారంభిస్తోంది.ప్రవాసుల భద్రత మరో అంశం. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం నిరంతరాయంగా పనిచేసే సహాయక కేంద్రాలను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రణాళికలు రూపొందించి గల్ఫ్ ప్రభుత్వాల సహకారంతో వాటికి రిహార్సల్స్ చేస్తోంది. స్వదేశాలకు డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు ఏర్పాట్లు జరిగాయి.దౌత్యపరంగా సున్నితమైన సమతుల్యతను ఇండియా పాటిస్తోంది. ఒమన్, యూఏఈ, సౌదీలతో తెరవెనుక దౌత్యం నెరపుతోంది. తక్షణం వైరాలకు స్వస్తి పలకాలని, ఉద్రిక్తతలను నివారించాలని, బేషరతు చర్చలు జరపాలని యూఎన్ సమావేశంలో పిలుపు నిచ్చింది. మరోవంక, ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో 16 యుద్ధనౌకలను సన్నద్ధం చేసింది. గల్ఫ్ గస్తీలను పెంచింది. ప్రస్తుత ఘర్షణలు ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా సైబర్ ఇంటెలిజన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ద్రవ్యరంగంలో కరెన్సీ ఆటుపోట్లను నివారించేందుకు ఆర్బీఐ చేతిలో 643 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం జడలు విప్పకుండా కేంద్రం అదనపు ఆహార నిల్వలను విడుదల చేస్తోంది. ఎంఎస్ఎమ్ఈ ఎగుమతిదారు లకు ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహకాలు, రుణహామీలు రెడ్ సీ బాధిత సంస్థలకూ వర్తింప చేస్తోంది. మన వ్యూహం ప్రస్తుత సైనిక ఘర్షణల సమయంలో ఇండియా ‘పవర్ ప్లేయర్’గా ఉండాలనుకోవడం లేదు. ఇంధన భద్రత, ప్రవాసుల క్షేమం, వర్తక మార్గాల రక్షణ... ఈ మూడు అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. దీనికోసం అనివార్యంగా ‘సంరక్షణాత్మక తటస్థత’ అనే సంక్లిష్ట వ్యూహం అనుసరించాల్సి వస్తోంది. జూన్ 2025 ఒక సంక్షుభిత దశాబ్దాన్ని వినాశకరమైన మలుపు తిప్పింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయలపై జరిగిన దాడి, ఇరాన్ ప్రతీకార దాడుల ఫలితంగా మధ్యప్రాచ్యం అంతటా దీర్ఘకాలిక అస్థి రత నెలకొంటుంది. ఇండియా విషయానికి వస్తే, ఈ పరిణామాన్ని విదేశాంగ విధానానికి సవాలుగా మాత్రమే పరిగణించలేము. వ్యూహా త్మక పరిపక్వతకు, ఆర్థిక పటుత్వానికి, నైతిక స్థైర్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. మనం అప్రమత్తంగా ఉంటూ, మధ్యప్రాచ్యంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని, మనకు చేరువలోనే కాలి బూడిదవుతున్న ఈ ప్రాంతంలో తిరిగి వివేకం ఉదయించాలని కోరుకోవాలి.శైలేశ్ హరిభక్తి వ్యాసకర్త పారిశ్రామికవేత్త, పర్యావరణ కార్యకర్త(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
తలదూర్చితే చావుదెబ్బ తప్పదు.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్!
తెహ్రాన్: హెచ్చరికలు,అల్టిమేట్టంలు ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(83) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఖమేనీ తన సన్నిహితులతో పాటు సైన్యంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఖమేనీ లొంగిపోవాలని నెతన్యాహు,ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ బెదిరింపులకు తానేమి లొంగిపోనని, కాదు కూడదని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో తలదూర్చాలని చూస్తే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.ఎక్స్ వేదికగా ఖమేనీ ఏమన్నారంటే?ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. కాదు కూడదని సైనిక పరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బకొడతామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి ఖమేనీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అవివేకంతో ఇరానియన్లు తనకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఎవరికో (ఇజ్రాయెల్ దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) భయపడి తమను బెదిరిస్తే.. తాము బెదిరిపోమని పునరుద్ఘాటించారు. పదేపదే అమెరికా కవ్వింపు చర్యలకు దిగితే ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ఎదుర్కొంటున్న హానికంటే ఎక్కువ హాని అమెరికా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరాన్ అమెరికాకు చేయబోయే నష్టం గురించి హెచ్చరించారు. The US entering in this matter [war] is 100% to its own detriment. The damage it will suffer will be far greater than any harm that Iran may encounter.— Khamenei.ir (@khamenei_ir) June 18, 2025ఖమేనీని చంపే ఉద్దేశం మాకు లేదు.. కానీ సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతని ఆచూకీ పెద్ద కష్టమేమీ కాదు. అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం మేం అతన్ని చంపే ఉద్దేశంతో లేము. ఖమేనేని చంపితే మా వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. ఖమేనీ భేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షించొద్దు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్పై ఖమేనీ పైవిధంగా స్పందించారు. -
ఇజ్రాయెల్-స్ట్రైకర్.. ఇరాన్ ఫతా ఎంత డేంజరో తెలుసా?
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైల్స్ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ‘ఫతా-1 మిస్సైల్స్’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్సోనిక్ మిస్సైల్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్ మీదకు ఫతా హైపర్సోనిక్ మిస్సైల్స్ను ఇరాన్ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్సోనిక్ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్ డోమ్, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్-స్ట్రైకర్ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్సోనిక్ మిస్సైల్ కారణం. -
ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటైన ఇరాన్ నేడు యుద్ధభూమిగా మారింది. పశ్చిమాసియాలో బలీయమైన సైనిక శక్తి కలిగిన రెండు దేశాలు ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. ఈ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, వైమానిక రంగంతోపాటు కీలక రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. భారీగా సంపద హరించుకుపోయింది. సోమవా రం కొంతవరకు కోలుకున్నాయి. మరోవైపు ఆయుధ తయారీ సంస్థలతోపాటు చమురు కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మారెŠక్ట్ను నమ్ముకోవడం తెలివైన పని కాదన్న ఆలోచనతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు దృష్టి పెట్టారు. వారు తమ సొమ్మును బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. 100 డాలర్లకు ముడి చమురు? ఇరాన్లో ఎప్పుడు యుద్ధం జరిగినా తక్షణమే ప్రభావితమయ్యేది చమురు రంగమే. బ్యారెల్(158.98 లీటర్లు) ముడి చమురు ధర సోమవారం 74.60 డాలర్లకు చేరుకుంది. గురువారంతో పోలిస్తే 7 శాతం పెరిగింది. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారి, హొర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటేస్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ గోల్డ్మాన్ సాచ్స్ తేల్చి చెప్పింది. ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో మూడింట ఒకవంతు హొర్మూజ్ జలసంధి గుండానే జరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది.ఇరాన్, గల్ఫ్ దేశాలను వేరుచేసే అతిసన్నని సముద్ర మార్గమైన హొర్మూజ్పై ఆధిపత్యం ఇరాన్దే. ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్రస్థాయికి చేరితే హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే భారత్, జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఈసారి కూడా మూసివేసే పరిస్థితి ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ముడి చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్ ఆర్థికగా నష్టపోవడం ఖాయం. పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు చమురు ధరలు పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే. చమురు కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వృద్ధిరేటు తగ్గిపోతుంది. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. జీ7 దేశాల్లో కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. విమానయానం మరింత ప్రియం యుద్ధం వల్ల పశ్చిమాసియాలో చాలా దేశాలు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో విమానయాన సంస్థలు తమ విమానాలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి. దీంతో వ్యయం పెరుగుతోంది. విమానయానం మరింత ఖరీదుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా వంటి దేశాల నుంచి తమ విమానాలు నడపడం లేదు. తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తమ గగనతలం పూర్తిగా మూసి ఉంటుందని ఇరాన్ అధికార వర్గాలు ప్రకటించాయి. -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది
-
‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా కూడా ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు. -
తక్షణమే ఖాళీ చేయండి
కనానాస్కిస్/వాషింగ్టన్: జీ7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండడంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ట్రంప్ సూచించారు.ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కెనడాలో మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సాయంత్రం జీ7 దేశాల అధినేతలతో ఫొటోలు దిగారు. ‘‘నేను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి. చాలా ముఖ్యం’’ అని చెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు.దాడులు ఆగాలంటే ఆణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా పాత్ర ఏమిటి? అని ప్రశ్నించగా.. స్పందించడానికి నిరాకరించారు. ఇరాన్కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు. ఇజ్రాయెల్ సైన్యానిదీ అదేమాట టెల్ అవీవ్/టెహ్రాన్: ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసంచేయాలని, అణు శాస్త్రవేత్తలను, కీలక సైనికాధికారులను అంతమొందించాలని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మధ్యభాగంలో క్షిపణి దాడులకు సిద్ధమవుతోంది. సెంట్రల్ టెహ్రాన్లో ఉంటున్న 3.30 లక్షల మంది బయటకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.టెహ్రాన్ను పూర్తిగా ఖాళీ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పిన కాసేపటికే సైన్యం అదే తరహాలో ఆదేశాలివ్వడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టీవీ, పోలీసు ప్రధాన కార్యాలయాలతోపాటు ముఖ్యమైన ఆసుపత్రులు సెంట్రల్ టెహ్రాన్లోనే ఉన్నాయి. రాజధాని నగరంలో 90 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఇక్కడ వైమానిక దాడులు జరిగితే ప్రాణనష్టం ఊహించని స్థాయిలో సంభవించే అవకాశం ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
మరింత ఉధృతంగా దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్: అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇరాన్ సముపార్జించకుండా అడ్డుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ తన దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీం కమాండర్ అయ తొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడు, ఖాటమ్ అల్ –అన్బియా సెంట్రల్ హెడ్క్వార్డర్స్ సారథి, సైనిక జనరల్ అలీ షాద్మానీని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని షాద్మానీ ఉంటున్న ఒక రహస్య ప్రదేశంపై క్షిపణుల వర్షం కురిపించి ఆయన ప్రాణాలుతీసింది. భూతలం నుంచి భూతలం మీది లక్ష్యాలను ఛేదించే 120 మిస్సైల్ లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.ఎఫ్–14 రకం రెండు యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. 10 కమాండ్ సెంటర్లను నేలకూల్చామని పేర్కొంది. దీంతో ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో బదులు చెప్పింది. టెల్ అవీవ్ సిటీలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కార్యాల యంపై మెరుపు దాడులు చేసింది. దీంతో ఆ భవనం ధ్వంసమైనట్లు వార్తలొచ్చాయి. టెల్ అవీవ్తోపాటు వెస్ట్ జెరూసలేంలోనూ బాంబుల మోతలు మోగాయి.ఇజ్రాయెల్లోని హెర్జిలియాలో 8 అంతస్తుల భవంతి ధ్వంసమైంది. ఇకపై మరింతగా దాడులు చేస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సయ్యద్ అబ్దుల్రహీం మౌసావీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఇరాన్లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,277 మంది గాయపడ్డారు. ఇరాన్ జరిపిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. 500 మందికిపైగా పౌరులు గాయపడ్డారు.హెర్జిలియాపై ఇరాన్ దాడిలో ధ్వంసమైన భవంతి నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు , మిలటరీ కమాండర్ షాద్మానీ టెహ్రాన్లో హాహాకారాలుఇరాన్ గగనతల రక్షణవ్యవస్థ దెబ్బతినడంతో ఇజ్రాయెల్ క్షిపణులు పట్టపగ్గాల్లేకుండా విచ్చలవిడిగా విరుచుకుపడ్డాయి. దీంతో టెహ్రాన్ నగరవ్యాప్తంగా మంగళవారం అప్రమత్త సైరన్లు మోగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణభయంతో ఇళ్లలో, బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటే లక్షలాది మంది కాస్పియన్ సముద్రతీరాలకు వాహనాల్లో తరలిపోతున్నారు. వందలాది మంది సమీప అజర్బైజాన్ దేశానికి వలసవెళ్లారు. సొంత వాహనాల్లో జనం వలసవెళ్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. స్టాక్మార్కెట్ పనిచేయలేదు. సరఫరాలేక పెట్రోల్బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపించాయి. స్టాక్ ఉన్నచోట్ల చాంతాడంత క్యూ లైన్లు కనిపించాయి.ఖమేనీ జాడ తెలుసు... ఇప్పుడే చంపం: ట్రంప్జీ7 సదస్సు నుంచి హడావిడిగా అమెరికాకు పయనమైన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ జాడపై మాట్లాడారు. ‘‘ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ప్రస్తుతానికి ఆయనను అక్కడే తలదాచుకోనిద్దాం. ఆయనను చంపేందుకు మిస్సైళ్లను ప్రయోగిస్తే సాధారణ పౌరులు, అమెరికా జవాన్లూ చనిపోయే ప్రమాదముంది. అందుకే ఇప్పుడే ఆయనను చంపబోం. కానీ ఆయనను అలా ప్రాణాలతో ఎక్కువ రోజులు ఉండనివ్వం.అసలే మాకు ఓపిక చాలా చాలా తక్కువ’’ అని ట్రంప్ అన్నారు. ‘‘ ఖమేనీగానీ, ఇరాన్గానీ మాకు వీలైనంత త్వరగా బేషరతుగా లొంగిపోతే మంచిది. అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇప్పటికే సూచించా. మధ్యవర్తిత్వం వహించాలనే ఆసక్తి నాలో తగ్గుతోంది. ఇరాన్ అణుఆశలపై నీళ్లు చల్లాం. నేను కాల్పుల విరమణను కోరుకోవట్లేదు. అంతకుమించిన ఫలితాన్ని ఆశిస్తున్నా. ఇప్పుడు ఈ సమస్యకు వాస్తవిక ‘ముగింపు’ పలకాల్సిందే’’ అని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మరో పోస్ట్పెట్టారు.బంకర్ బస్టర్ బాంబు ఇవ్వండిఇరాన్లో ఫోర్దో అణుఇంధన శుద్ధి కార్మాగారం ఒక పర్వతం కింద భూగర్భంలో నిర్మించారు. దీనిని భూస్థాపితం చేస్తేగానీ ఇరాన్ అణు కార్యక్రమం ఆగదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఎలాగైనా బంకర్లను బద్దలుకొట్టే భారీ బాంబు కోసం అమెరికాను సాయం కోరనుంది. మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ)గా పిలుచుకునే జీబీయూ–57ఏ/బీ బాంబు బరువు ఏకంగా 14,000 కేజీలు. ఇది పేలితే అక్కడ భూమి 200 అడుగుల లోతుదాకా బద్ధలైపోతుంది. అంటే భూగర్భంలోని బంకర్, అణుస్థావరం పూర్తిగా సమాధిదిబ్బగా మారుతుంది.అందుకే ఈ బంకర్ బస్టింగ్ బాంబును తమకు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరుతున్నట్లు సమాచారం. ఇంతటి బరువైన బాంబును కేవలం బీ–2 స్టెల్త్ బాంబర్ యుద్దవిమానం నుంచే ప్రయోగించే వీలుంది. ఈ విమానం కూడా ఇజ్రాయెల్ వద్ద లేదు. ఇజ్రాయెల్ అభ్యర్థనను అంగీకరిస్తే అమెరికానే స్వయంగా తన విమానంతో ఈ బాంబును యురేనియం శుద్ధికర్మాగారంపై పడేయాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.ఎలక్ట్రానిక్ డివైజ్లు వాడొద్దని నిషేధాజ్ఞలుఇజ్రాయెల్ తన శత్రుదేశంలో సైనికుల చేతుల్లోకి వాకీటాకీలు, రేడియోసెట్లను ఏకకాలంలో పేల్చి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులు, వారి వ్యక్తిగత సహాయకులు ఎవరూ స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచ్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించకూడదని ఇరాన్ నిషేధం విధించింది. -
కాల్పుల విరమణ కాదు.. ట్రంప్ రియల్ ఎండ్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..ట్రంప్ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్ఫోర్స్ వన్లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట జూన్ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్ సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు.న్యూక్లియర్ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్.. టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్ రూమ్లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ -
ఇరాన్ వార్ టైమ్ ఆర్మీ చీఫ్ అలీ షద్మానీ హతం
-
తక్షణమే టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని భారతీయులకు ఎంబసీ ఆదేశాలు
-
ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
Israel-Iran Conflict: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. -
ఇరాన్ అణు దాడి చేస్తే.. ఇజ్రాయెల్ ఆప్షన్ 2
-
ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ -
టెహ్రాన్లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 140 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిని వర్శిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేశారు.టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటకు చూడగా, నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తరువాత మరిన్ని పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అన్నారు.తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయన్నారు. ఆ సమయంలో బ్లాక్అవుట్ కావడంతో డార్మిటరీ కింద కూర్చున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకారం అందించారన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ వైస్-డీన్ వచ్చి, ఏమీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వీలైనంత త్వరగా టెహ్రాన్ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేశారు.ఇది కూడా చదవండి: టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక -
టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్(ఇరాన్)లోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, వెళ్లిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఆయన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనంటూ పునరుద్ఘాటించారు. పరిస్థితి మరింత దిగజారకముందే ఇజ్రాయల్తో ఏర్పడే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇప్పడు ఇరాన్కు మరో అవకాశం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రమయ్యేందుకు దారితీసేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంపై స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్న ట్రంప్, అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. కాగా యుద్ధం ముగించాలంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అంతం చేయాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు చేసింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం కొనసాగుతున్నదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇంతలోనే ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం గమనార్హం.ఇది కూడా చదవండి: ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు -
యుద్ధం కాదు... చర్చలే దిక్కు!
ఏ యుద్ధంలోనైనా కనబడే దూకుడే అయిదోరోజుకల్లా ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలో కనబడుతోంది. ఎవరికెవరూ తీసిపోకుండా క్షిపణులు, బాంబులు యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. జనావా సాలను గురిచూస్తున్నారు. ప్రత్యర్థుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఇజ్రా యెల్ విమానాల బాంబుదాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మరణించగా, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్లోని మానవహక్కుల కార్యకర్తలు ప్రకటించారు. అటు రాజధాని టెల్ అవీవ్తో పాటు పలు నగరాలపై ఇరాన్ సాగించిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్లో 14 మంది మర ణించగా, 390 మంది గాయపడ్డారని అక్కడి సైన్యం తెలియజేసింది. తొలుత అణుకేంద్రాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్ రెండోరోజు నుంచి నగరాలూ, పట్టణాలూ లక్ష్యంగా చేసుకుని బాంబులు ప్రయోగిస్తోంది. తయారీరంగ పరిశ్రమలనూ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలనూ, పోలీస్ స్టేషన్లనూ, మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తోంది. ఒక్క తెహ్రాన్లోనే శని ఆదివారాల్లో 250 లక్ష్యాలను దెబ్బతీశామని చెబుతోంది. దక్షిణ ఇరాన్లోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయు క్షేత్రాన్ని, తెహ్రాన్ వెలుపల ఒక చమురు డిపోను ఇజ్రాయెల్ సైన్యాలు పేల్చివేశాయి.అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ చేరువలో ఉన్నదని, అందుకే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ఇస్తున్న సంజాయిషీ బూటకం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అది శుద్ధిచేసిన యురే నియం నిల్వలు ఉంచుకున్నా, బాంబు తయారీకి దరిదాపుల్లో లేదని సాక్షాత్తూ అమెరికా ఇంటెలి జెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ కొన్ని వారాల క్రితం తెలిపారు. అణు ఒప్పందం గురించి అమెరికా– ఇరాన్ల మధ్య చర్చలు సాగుతుండగానే హఠాత్తుగా ఇరాన్పై ఇజ్రాయెల్ అణు ఆరోపణ ఎందుకు చేసినట్టు? ఇరాక్లో సద్దాం హుస్సేన్ను అడ్డు తప్పించటానికి ఆ దేశంలో రసాయన ఆయుధాలున్నాయని కపట నాటకమాడిన అమెరికా అడుగుజాడల్లో ఇజ్రాయెల్ నడుస్తోంది. ఆ సాకుతో సద్దాంను తప్పించి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిద్దామని అప్పట్లో అమెరికా, నాటో దేశాలు భావించాయి. కానీ జరిగిందంతా వేరు. రసాయన ఆయుధాల జాడలేదు సరిగదా... ఉగ్రవాదం మరింతగా విజృంభించింది. ఇప్పటికీ ఇరాక్ కుదుట పడలేదు. అఫ్గాన్, లిబియా, యెమెన్, సిరియాలు సైతం అదే దుఃస్థితిలో ఉన్నాయి. ప్రధాని నెతన్యాహూ రెండు లక్ష్యాలతో ఇరాన్పై విరుచుకుపడ్డారు. మతాచార్యుడు ఖమేనీ కనుసన్నల్లోని పాలకవ్యవస్థను పడగొట్టి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ప్రతిష్ఠించటం అందులో ఒకటైతే, రెండోది స్వదేశంలో తాను కోల్పోయిన పరువు తిరిగి పొందటం. అమెరికా, ఇజ్రాయెల్లు కలిసినా ఇరాన్లో తమకు అనుకూలమైన వారిని ప్రతిష్ఠించటం అసాధ్యం. ఆ రోజులు పోయాయి. 1970వ దశకం వరకూ ఇరాన్ను పాలించిన షా రెజాపెహ్లావీ వంటి అమెరికా కీలుబొమ్మ ఆ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే నెతన్యాహూ రెండో లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనబడటం లేదు. పాలస్తీనాలో దిక్కూ మొక్కూలేని నిస్సహాయ పౌరులపై అమెరికా సరఫరా చేసిన మారణా యుధాలతో విరుచుకుపడటం వేరు. ఇప్పుడు ఇరాన్ జోలికి పోవటం వేరు. ఇరాన్ పౌరులకు తమ ప్రభుత్వంపై ఎంతైనా వ్యతిరేకత ఉండొచ్చుగానీ, కొన్ని దశాబ్దాలుగా వారంతా నిత్యం యుద్ధ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడంటే సౌదీతో ఒక మేరకు స్నేహసంబంధాలు ఏర్పడ్డాయిగానీ ఆ దేశం కూడా ఇరాన్పై కత్తికట్టినదే. గతంలో ఇరాక్తో వైరం ఏర్పడినప్పుడు వరసగా పదేళ్లపాటు యుద్ధం సాగించిన దేశం ఇరాన్. ఎంతగా అమెరికా మద్దతున్నా ఈ మాదిరి సుదీర్ఘ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆర్థికవ్యవస్థ తట్టుకోవటం అసాధ్యం. ఆ మాటకొస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థే అంతటి మహాయుద్ధాన్ని భరించే స్థితిలో లేదు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట పలు దేశాల్లో నాటో కూటమితో కలిసి సాగించిన యుద్ధాల పర్యవసానంగా ఇప్పటికే అమెరికా నిండా మునిగింది. దాని ప్రస్తుత రుణం 36 లక్షల కోట్ల డాలర్లు. ఆర్థికవ్యవస్థకొచ్చే ఆదాయంలో సింహ భాగం దానిపై వడ్డీలకే ఖర్చవుతోంది. ఇజ్రాయెల్కు వత్తాసుగా ఇరాన్తో వైరం పెట్టుకుంటే ఆ సుదీర్ఘ పోరు మరో పదిలక్షల కోట్ల డాలర్లను ఆవిరిచేస్తుంది. తాను అధికారంలోకొస్తే ‘అనవసర యుద్ధాల’ నుంచి అమెరికాను తప్పిస్తానని, ఒక్క సైనికుడు కూడా విదేశీగడ్డపై ఉండే అవసరం రాదని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. అందుకే ‘ఇజ్రాయెల్ జోలికెళ్తే ఖబడ్దార్’ అంటూ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించటాన్ని స్వపక్షంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. అణు చర్చలకు సిద్ధమంటోంది ఇరాన్. కాకపోతే ఇజ్రాయెల్ వద్ద పుష్కలంగా అణ్వాయుధాలుండగా... పౌర అవసరాలకు సైతం యురేనియం వాడకాన్ని అను మతించబోమనటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అంటున్నది. నిజానికి ఒబామా హయాంలో అమెరికా ఆ వెసులుబాటు ఇవ్వటం వల్లనే 2015లో అణు ఒప్పందం సాకారమైంది. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్ ఆ ఒప్పందాన్ని కాలరాశారు. ఇజ్రాయెల్ సృష్టించిన ఈ ఊబి నుంచి బయటపడాలంటే ఇప్పటికీ ట్రంప్కు ఆ ఒప్పందమే దిక్కు. ఈ నాలుగు రోజుల్లో డాలర్ విలువ పదిశాతం తరిగిపోయింది. ఇరాన్తో చర్చించి సమస్య పరిష్కారానికి సాయపడతామని జర్మనీ విదేశాంగమంత్రి యోహాన్ వాదెఫుల్ ముందుకొచ్చారు. అందుకు సిద్ధపడటమే అమెరికా ముందున్న ఏకైక మార్గం. కాదంటే ఇవాళ పశ్చిమాసియా కావొచ్చుగానీ... రేపు ప్రపంచమే పెను సంక్షోభంలో పడుతుంది. అప్పుడు ఆర్థిక పతనం నుంచి అమెరికాను ఎవరూ కాపాడలేరు. -
తలొగ్గుతారా? తయారు చేస్తారా?
పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇరాన్ ఎదుట మిగిలిన మార్గాలు రెండే! అమెరికా, ఇజ్రాయెల్ల ఒత్తిడికి లొంగిపోయి జీవించటమా? లేక స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించటం కోసం అణ్వాయుధాలను తయారు చేసుకోవటమా? అణ్వస్త్ర తయారీని ఇరాన్ కోరుకోవటం లేదు. అటువంటి సామూహిక హనన శక్తి గల ఆయుధ ఉత్పత్తి ఇస్లాం బోధనలకు విరుద్ధమనే సైద్ధాంతిక వైఖరి తీసుకున్న ఇరాన్ అధినేత అయతొల్లా ఖొమేనీ ఆ మేరకు ఆదేశాలు ఎన్నడో జారీ చేశారు. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసమే ఉపయోగించగలమని పలుసార్లు ప్రకటించారు. కానీ అమెరికా శిబిరానికి మౌలికంగా ఇరాన్ పట్లనే శత్రుత్వం ఉంది. అక్కడ అణు పరిశోధనలన్నవి సాకు మాత్రమే!అమెరికా అండతోనే...ఒకసారి ఇటీవలి పరిణామ క్రమాన్ని చూద్దాం. అణు పరిశోధ నలు, వాటి పరిమితుల విషయమై ఇరాన్, అమెరికాల మధ్య ఖతార్లో అయిదు విడతల చర్చలు జరిగాయి. ఆరవ విడత ఈ నెల 15న జరగాల్సి ఉండగా, రెండు రోజుల ముందు 13న ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. దాడుల గురించి తమకు ముందే తెలుసు నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్ 14న స్వయంగా ప్రకటించారు. తాము అమెరికాతో సమన్వయం చేసుకునే దాడులు చేస్తున్నా మని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అంతకుముందు 13 నాడే అన్నారు. తమ ఇంటెలిజెన్స్ సమాచారంతో, తాము సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే దాడులు సాగుతున్నాయని ట్రంప్ 14న వెల్లడించారు. దాడులకు రెండు రోజుల ముందే అమెరికా ప్రభుత్వం పశ్చి మాసియా ప్రాంతంలోని తమ పౌరులకు, దౌత్య కార్యాలయాలకు జాగ్రత్తలు చెప్పి, తమ సైనిక స్థావరాలకు తగు హెచ్చరికలు చేసింది. అయినా తమకు దాడులతో నిమిత్తం లేదని వాదిస్తున్నది.దీన్ని బట్టి కొన్ని ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. పాల స్తీనాతో ముడిబడిన చర్యలకు ఇరాన్ మిత్ర సంస్థలు ఇతర భూభాగాల నుంచి దాడులకు పాల్పడుతుండటం, వాటిపై ఇజ్రాయెల్ ప్రతి చర్యలు కొత్తవి కాదు. అవి ఎట్లున్నా, అణు పరిశోధనల విషయమై ఇరాన్ – అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఈ 15 నాటి ఆరవ విడతలో ఫలించే అవకాశం ఉందని ట్రంప్ సైతం కొద్ది రోజులుగా అంటూ వస్తున్నారు. ఇదంతా నెతన్యాహూకు తెలిసినదే. అటువంటపుడు చర్చలకు సరిగ్గా రెండు రోజుల ముందు దాడులే మిటి? ఈ ప్రశ్నలపై నిపుణుల నుంచి రెండు అభిప్రాయాలు విన వస్తున్నాయి. ఒకటి, అమెరికా–ఇరాన్ చర్చలను, ఒకవేళ పరిష్కారం కుదిరే అవకాశం ఉంటే దానిని భంగపరచటం కోసమే ఇజ్రాయెల్ ఆ పని చేసిందన్నది. రెండు, ముందస్తు దాడులతో ఇరాన్ను భయపెట్టి చర్చలతో దారికి తెచ్చుకోవటం ట్రంప్ ఎత్తుగడ అన్నది. ఈ రెండింటిలో దేనికి అదిగా నిజం కాగల అవకాశాలు ఉన్నాయి కూడా. ఇరాన్తో రాజీ ఇజ్రాయెల్కు ఎంత మాత్రం ఇష్టం లేనిది. అందుకోసం వారు అమెరికానైనా ధిక్కరించగలరు. ఎందుకంటే, పాలస్తీ నాకు నిజమైన మిత్ర దేశంగా మిగిలింది ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక్కటే. వేర్వేరు అరబ్ దేశాలను అమెరికా ద్వారా మిత్రులుగా మార్చుకుంటున్నా, ఎంత మాత్రం రాజీ పడనిది ఇరాన్ మాత్రమే. కనుక దానిని ధ్వంసం చేయాలి. అమెరికాకు సంబంధించి, ఇజ్రా యెల్తో వైరాన్ని వదిలి, పాలస్తీనా కోసం పట్టుబట్టనట్లయితే సరి పోతుంది. ఆ విధంగా ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉంది.వైఖరుల్లో తేడా!అణుశక్తి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణుశక్తి పరిశో ధనలు ఒక పరిమితికి లోబడి జరగాలని, అణ్వాయుధాల ఉత్పత్తికి అవసరమయ్యే యురేనియం 90 శాతం శుద్ధి జరగరాదని 2016లో ఇరాన్కు, అమెరికా తదితర దేశాలకు మధ్య అంగీకారం కుదిరింది. అందుకు బదులు ఇరాన్పై ఆంక్షలు సడలించాలన్నారు. కానీ రెండేళ్ల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కోవటంతో ఆ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంది. అప్పుడు కూడా అధ్యక్షుడు ట్రంప్. అప్పటినుంచి ఈ ఏడేళ్లుగా అణు రాజకీయం నడుస్తూనే ఉంది. అణ్వస్త్రాల కోసం యురేనియంను 90 శాతానికి, అంతకన్నా మించి శుద్ధి చేయవలసి ఉంటుంది. శాంతియుత అవసరాలకు అంత కులోపు అయితే సరిపోతుంది. ఇరాన్ కేంద్రాల్లో ప్రస్తుతం శుద్ధి 60 శాతంగా ఉంది. ఆ మాట ఇరాన్ ప్రభుత్వం చెప్పటమే కాదు అణుశక్తి సంస్థ కూడా ధ్రువీకరించింది. అయినప్పటికీ ఇజ్రాయెలీ నిఘా సంస్థలు మాత్రం తొమ్మిది అణ్వస్త్రాలకు కావలసినంత శుద్ధి ఇప్పటికే జరిగిపోయిందనీ, త్వరలో పదిహేనింటికి జరుగుతుందనీ ప్రచారం మొదలు పెట్టాయి. గమనించదగినదేమంటే అమెరికా మాత్రం ఈ మాట నేటికీ అనటం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయ కూడదనేది ఒక్కటే తమ షరతని ప్రకటిస్తోంది. ఈ విషయమై ఇజ్రాయెల్, అమెరికా వైఖరుల మధ్య తేడా కనిపిస్తుంది. కనీసం శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే ఇరాన్ పరిశోధనలు ససేమిరా చేయరాదని, స్వయంగా శుద్ధి చేయక పోవటమేగాక, పరిమిత శుద్ధి గల ఇంధనాన్ని అయినా ఇతరుల నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలు లేదన్నది ఇజ్రాయెల్ వాదన. ట్రంప్ వైఖరిలో ఇతర అంశాలకు సంబంధించి వలెనే ఇందులోనూ చంచలత్వం కనిపిస్తుంది. ఒకవేళ ఖతార్ చర్చలు సాగి ఉంటే అంగీ కారం ఏదైనా కుదిరేదేమో తెలియదు. అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయబోమని మాత్రం ఇరాన్ స్పష్టం చేస్తోంది. తాము జోక్యం చేసుకుని ఏదైనా మధ్యే మార్గానికి ప్రయత్నించగలమని రష్యా కూడా అంటున్నది. ఇపుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ దాడులు చేయటంతో, అందుకు అమెరికా తోడ్పడినట్లు ట్రంప్ మాటలలోనే కనిపిస్తుండటం వల్ల, తాము చర్చలకు 15న వెళ్లబోవటం లేదని ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో, ఇది శాశ్వత బహిష్కరణ అనక పోవటం గమనించదగ్గది. ఇరాన్ నిజాయతీని, దౌత్య మార్గంలో పరిష్కారానికి కట్టుబడటాన్ని అది చెప్తున్నది.రహస్య అణు కేంద్రాలు?అయితే, ఇరాన్ అణుశుద్ధి అణ్వస్త్ర తయారీ గురించి చెప్పు కోవలసినవి మరికొన్ని ఉన్నాయి. యురేనియం శుద్ధి 90 శాతం మేర ఇప్పటికే జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలూ అమెరికన్ల వద్ద సైతం లేవు. అణు ఇంధన సంస్థ కూడా ఆ మాట అనటం లేదు. కానీ, ఇరాన్ తమకు చూపకుండా దాచి పెడుతున్న విభాగాలు కొన్ని ఉన్నాయని ఆ సంస్థ అంటున్నది. ఆ మాట నిజం కాదని ఇరాన్ కూడా ఖండించటం లేదు. ఇజ్రాయెల్ దాడుల దరిమిలా ఒక కొత్త విషయం వెల్లడించారు. అది, ఎవరికీ తెలియని మరొకచోట కూడా శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నామని! ఇవన్నీ నిజమైనా, చివరకు వారు అణ్వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారనుకున్నా, ఇజ్రాయెల్, అమెరికా సహా ఎన్నో దేశాలకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలు ఉన్నపుడు, తన రక్షణ కోసం ఇరాన్ మాత్రం ఎందుకు తయారు చేసుకోరాదన్నది మౌలికమైన ప్రశ్న. ఉత్తర కొరియా ఉదాహరణ ఇపుడు మరోసారి చర్చకు వస్తున్నది. అదే విధంగా ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లయితే దాడికి ఇజ్రాయెల్, అమెరికాలు సాహసించగలవా? అణువ్యాప్త నిరోధక ఒప్పందాలను ఉల్లంఘించి, ఇజ్రాయెల్ అణ్వస్త్ర తయారీకి రహస్యంగా సహకరించింది అమెరికా, యూరప్లు కాదా? ప్రస్తుత యుద్ధానికి వస్తే, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ ఏకపక్ష విధ్వంసాలు సృష్టించగలగటం వట్టి మాట అని ఇరాన్ తన ఎదురు దాడులతో రుజువు చేస్తున్నది. ఇజ్రాయెల్ ఎంతో ఘనంగా చెప్పుకునే ఐరన్ డ్రోమ్ బలహీనతలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక బలం మహాశక్తిమంతమైనదే గానీ, రెండవరోజు నుంచి కూడదీసుకున్న ఇరానియన్ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చివేయటం మొదలైంది. బహుశా వీటన్నింటి కన్నా ముఖ్యమైన వార్తలు, ఇరాన్ అణు కేంద్రాలకు ఇజ్రాయెల్ దాడులతో వాటిల్లిన నష్టం స్వల్పమైనదేనని, భూగర్భంలో, కొండ లలో చాలా లోతున గల కేంద్రాలు యథాతథంగా ఉన్నాయన్నది. ఇరాన్ చివరకు అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయక తప్పదా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రభుత్వ వార్తా చానల్ ‘ఇరిన్’ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంతభాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహర్ ఎమామి చదువుతున్న వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సహర్ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి, బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్ ఎమామి, మరో యాంకర్తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన, ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్లో టెలికాస్ట్ అయ్యాయి. కాగా, ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ మూడో నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్ కార్యాలయముంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు. టెహ్రాన్ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్లోనూ దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. ఇరాన్లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు.ఇరాన్లో వైద్యుడికి ఉరి 2023 నుంచి జైలులో ఉంటున్న మెడికల్ డాక్టర్ ఇస్మాయిల్ ఫెక్రీకి ఇరాన్ అధికారులు సోమవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్కు అతడు సహరించినట్లు, ఇరాన్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు రుజువయ్యాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025 -
నెక్ట్స్ టార్గెట్ పాకిస్థాన్ ?
-
హోర్ముజ్ జలసంధి మూసివేత..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఆధ్వర్యంలోని హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే యుద్ధం నేపథ్యంలో దీని గుండా చేసే చమురు సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% రవాణాను సులభతరం చేస్తుంది.ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్గా పనిచేస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు, ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. దీని గుండా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే తీవ్రమైన సరఫరా గొలుసు అవరోధాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతుందని చెబుతున్నారు.ముడిచమురు ధరలపై కీలక ప్రభావంసరఫరా అంతరాయాలుఅమెరికా, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్కు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆంక్షల వల్ల ప్రపంచ క్రూడ్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది చమురు ధరలు పెరగడానికి, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటానికి దారితీస్తుంది.మార్కెట్ ఒడిదొడుకులుఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ 10% పైగా పెరగడానికి దారితీశాయి. ఇది దీర్ఘకాలిక సంక్షోభంతో కూడిన మార్కెట్ భయాలను ప్రతిబింబిస్తుంది. పశ్చిమాసియాలో అస్థిరతపై పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.పరిశ్రమలపై ప్రభావం..పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెయింట్స్, కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్పై ఆధారపడతాయి. టైర్లు, రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి. ఏవియేషన్, షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్రష్యాకు అవకాశం..హోర్ముజ్ జలసంధి దిగ్బంధం చేస్తారనే భయాలతో రష్యన్ క్రూడాయిల్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆంక్షల తరువాత ఇప్పటికే రష్యన్ చమురు రాయితీతో లభిస్తుంది. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను పెంచాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఇలాగే హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ భయాలు సృష్టిస్తే గల్ఫేతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుందనే వాదనలున్నాయి.ఇరాన్ బెదిరింపుల వెనుక కారణాలుఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెబుతామని ఇరాన్ ప్రతిస్పందించింది. అందులో భాగంగా హోర్ముజ్ జలసంధిని నిలిపేయడం దాని వ్యూహాత్మక ఎంపికల్లో ఒకటి. ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం. ఇది ప్రపంచ ముడి చమురులో 20% రవాణాకు తోడ్పడుతుంది. దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇరాన్ చారిత్రాత్మకంగా హోర్ముజ్ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది. కానీ ఎన్నడూ దాన్ని నిలిపేయలేదు.పూర్తి మూసివేత సాధ్యం అవుతుందా..?ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ యూకే, ఫ్రెంచ్ మిత్రదేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తుంది. దీన్ని పూర్తిగా నిలిపేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి. -
‘భయంతో చచ్చిపోతున్నాం’.. భారతీయుల తరలింపునకు కేంద్రం ఆపరేషన్!
సాక్షి, ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.The advisory issued in view of the current situation in Iran.All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.మరోవైపు.. ఇరాన్లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
ఇరాన్కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తమపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్ అణు దాడులకు దిగుతుందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్ యూటర్న్ తీసుకుంది.ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్(పాక్) కూడా టెల్అవీవ్పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్ వెల్లడించారు.అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అబ్బే.. అలా అనలేదుఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండిచింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది. భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి. -
ట్రంప్ ను చంపాలని ఇరాన్ చూస్తోంది: నెతన్యాహు
-
ఇరాన్ టార్గెట్ ట్రంప్.. హత్యకు ప్లాన్: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలాంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్కు నంబర్ వన్ శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దుచేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి’ అని చెప్పుకొచ్చారు.Netanyahu claims that Iran tried to assassinate Trump twice, strongly implying that Iran was behind the two assassination attempts in 2024 -- with virtually no pushback from Bret Baier. He then goes on to thank Trump for the extensive US involvement in the current operation pic.twitter.com/savpcfxMMX— Michael Tracey (@mtracey) June 15, 2025ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్కు దక్షిణాన బాట్యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు. తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది. -
ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
టెల్ అవీవ్/వాషింగ్టన్: ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరులను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయెల్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి డీన్ ఎల్స్డన్ ఆరోపించారు. ❗️Firefighters struggle to contain INFERNO after Iranian missile strike in HaifaFour people injured in barrage so far, Israeli authorities say https://t.co/WBuoFUFcj3 pic.twitter.com/zMtkzgfdRL— RT (@RT_com) June 15, 2025ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేట్ను తాకింది. దీంతో కాన్సులేట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా రాయబారి మైక్ హకాబీ చెప్పారు. తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ముందుజాగ్రత్తగా చర్య టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేట్తోపాటు జెరూసలేంలోని అమెరికా ఎంబసీని సోమవారం మూసివేశారు. ఇజ్రాయెల్పై దాదాపు 100 మిస్సైళ్లుప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరిన్ని ప్రతీకార దాడులు ఉంటాయని తేల్చిచెప్పింది. ఇరాన్ దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 24 మంది మరణించారని, 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ సైన్యం 370 మిస్సైళ్లు, వందలాది డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఖుద్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,277 మంది గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. వాస్తవానికి ఇరాన్లో 400 మందికిపైగా మరణించారని చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా.. -
ఇజ్రాయెల్ భీకర దాడులతో దారికొచ్చిన ఇరాన్
-
తెలుగువారంతా క్షేమమే
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రింబవళ్లు సైరన్లు మోగుతున్నాయి. క్షిపణుల వర్షం కురుస్తోంది. అయినా ఎ లాంటి భయం లేదు. నిశ్చింతగానే ఉన్నాం’అని ఇజ్రాయెల్లో ఉంటున్న పలువురు తెలుగువారు తెలిపారు. రెండు రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుత యుద్ధం కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు తిరిగివచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రవి తెలిపారు. సుమారు 1,000 మంది కార్మికులు ఇజ్రాయెల్లోని ఒక్క రమన్గాన్ ప్రాంతంలోనే ఉంటున్నట్టు చెప్పారు. 20 క్షిపణులు పడ్డాయి‘ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే 2,000 క్షిపణులు ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయి. అన్నింటిని ఐరన్డోమ్లు ధ్వంసం చేశాయి. కానీ 20 క్షిపణులు మాత్రం అక్కడక్కడా పలు ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో రిషోల్ లిజియో ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. వివిధ చోట్ల మరో 70 మందికి పైగా గాయపడ్డారు’అని హర్జాలియాలో ఉంటున్న చర్చి ఫాదర్ కొల్లాబత్తుల లాజరస్ తెలిపారు. ఇజ్రాయెల్లోని వివిధ నగరాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో కొందరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, యూరప్ మీదుగా ప్రయాణం చేయాల్సి రావడం వల్ల చార్జీలు పెరిగాయని లాజరస్ చెప్పారు.ఇంటింటికీ స్ట్రాంగ్ రూమ్లు..తెలుగు రాష్ట్రాల నుంచి ఇజ్రాయెల్కు వెళ్లిన వారిలో చాలామంది కేర్గివర్స్గా పని చేస్తున్నారు. వయోధికులకు సేవలు చేసేందుకు మేల్ నర్స్ తరహాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలు సైతం కేర్గివర్స్గా అక్కడి వృద్ధ మహిళలకు సేవలందజేస్తున్నారు. హౌస్కీపింగ్ వర్కర్లుగా కూడా చాలామంది ఉన్నారు. డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసేవారు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. టెల్ అవీవ్కు దూరంగా ఉండే చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలుగువారు చెప్పారు. ‘ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్కు బాంబ్షెల్టర్స్, స్ట్రాంగ్రూమ్లు ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని భావిస్తే బాంబ్షెల్టర్లు, స్ట్రాంగ్ రూమ్లలో తలదాచుకోవచ్చు’అని స్థానికులు తెలిపారు. -
దాడులే దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ ఆదివారం వరసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.ఊపిరి సలపనివ్వని ఇజ్రాయెల్ ఇరాన్కు ఏమాత్రం సమయమివ్వకుండా టెహ్రాన్, సమీప ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పౌర భవన సముదాయంపై దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది చిన్నారులే! ఇప్పటిదాకా 406 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ది సౌత్ పార్స్’ సహజవాయువు ప్రాసెసింగ్ ప్లాంట్ దాడిలో దారుణంగా దెబ్బతింది.పర్షియన్ గల్ఫ్లో బుషెహర్ ప్రావిన్సులోని చమురుశుద్ది కర్మాగారమూ మంటల్లో చిక్కుకుంది. షహ్రాన్ ఆయిల్ డిపోపైనా దాడులు జరిగాయి. ‘‘ఆయుధాల ఉత్పత్తి కేంద్రాల నుంచి సిబ్బంది పారిపోండి. వాటిపై దాడులు చేయబోతున్నాం. అణు విద్యుత్కేంద్రాల సమీప ప్రాంతాల పౌరులూ పారిపొండి’’ అని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇస్ఫహాన్ అణువిద్యుత్ కేంద్రంపై మరోసారి దాడులు చేసినట్టు ప్రకటించింది.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్కు దక్షిణాన బాట్యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.దీనికి భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో కుమారుడు అవ్నర్ వివాహ వేడుకను వాయిదా వేసుకుంటున్నట్టు నెతన్యాహూ వెల్లడించారు. అటు హమాస్, ఇటు ఇరాన్ దాడులతో దేశమంతా యుద్ధంలో మునిగి తేలుతుంతే ఇంట్లో పెళ్లి సంబరాలు చేసుకుంటారా అంటూ విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఖమేనీ హత్యకు ప్లాన్!వారించిన ట్రంప్ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు సమాచారం! అమెరికా ఈ మేరకు వెల్లడించింది. ‘‘అందుకు సర్వం సిద్ధమైంది. వద్దంటూ అధ్యక్షుడు ట్రంప్ వారించడంతో వెనక్కు తగ్గింది’’అని లేదంటే ఖమేనీని చంపడం పెద్ద పని కాదని ఇజ్రాయెల్ వర్గాలు అన్నాయి.వెంటనే ఆపగలను: ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణను ఇప్పటికిప్పుడు ఆపేయగలనని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘ఆ దేశాలను నిలువరించి ఈ రక్తపాతాన్ని ఆపడం నాకు చాలా తేలిక. ఈ రగడతో అమెరికాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్కు మేం ఎలాంటి సాయమూ చేయడం లేదు’’ అని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరాయి.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడులవేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు.తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది. -
ఆటుపోట్లకే అధిక చాన్స్
అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. మరోపక్క ఫైనాన్షియల్ మార్కెట్లలో అత్యంత కీలకమైన బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. దేశీయంగా చూస్తే రుతు పవన కదలికలు, టోకు ధరల గణాంకాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు. వడ్డీ రేట్లపై కన్ను బ్యాంక్ ఆఫ్ జపాన్ రేపు(17న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. మే నెల సమావేశంలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. 2008 తదుపరి గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు కదులుతున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సైతం బుధవారం(18న) పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. గత నెలలో చేపట్టిన సమీక్షలో ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతం వద్దే కొనసాగించేందుకు ఎఫ్వోఎంసీ నిర్ణయించింది.వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తిన గ్లోబల్ అనిశ్చితి, యూఎస్ ఆర్థిక మందగమనం, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రేట్ల కోతకు తొందరపడబోమని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత గల కేంద్ర బ్యాంకుల రేట్ల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్, ఆల్మండ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సేల్స్ హెడ్ కేతన్ వికమ్ తెలియజేశారు. గణాంకాల తీరు మే నెలకు చైనా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు నేడు(16న) విడుదలకానున్నాయి. మార్చిలో నమోదైన 7.7 శాతం నుంచి ఏప్రిల్లో 6.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు 5.9 శాతం నుంచి 5.1 శాతానికి నీరసించాయి. యూఎస్ మే రిటైల్ అమ్మకాలు 17న వెల్లడికానున్నాయి. మార్చిలో నమోదైన 1.7 శాతం నుంచి తగ్గి ఏప్రిల్లో 0.1 శాతానికి పరిమితమయ్యాయి.జపాన్ మే వాణిజ్య గణాంకాలు 18న వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 116 బిలియన్ జపనీస్ యెన్లకు దిగివచి్చంది. ఏప్రిల్లో జపాన్ ద్రవ్యోల్బణం 3.6 శాతంకాగా.. మే వివరాలు 20న తెలియనున్నాయి. దేశీయంగా మే టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 16న వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ 2.05 శాతం నుంచి వెనకడుగువేసి 0.85 శాతానికి పరిమితమైంది. ఇతర అంశాలు దేశీయంగా రుతుపవన కదలికలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, టోకు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్తోపాటు.. రంగాలవారీగా వెలువడే వార్తలు దేశీయంగా ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా...ఆర్బీఐ లిక్విడిటీ పెంపు చర్యలు, గ్లోబల్ ఆందోళనల మధ్య గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,070 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 81,119 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 284 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,719 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.1 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. సాంకేతికంగా... సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి 24,500 దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చని అంచనా. 24,450 వద్ద మరోసారి మద్దతు లభించవచ్చు. ఎగువముఖంగా చూస్తే 25,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,600వరకూ బలపడవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
మళ్లీ ట్రంప్ నోట.. భారత్-పాక్ యుద్ధం మాట!
ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాతో అణు ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారే అణు ఒప్పందానికి ఇరాన్ దూరంగా ఉంటుంది. ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడి సరైనదే. ఇరాన్పై ఇజ్రాయిల్ ఇంకా విరుచుకుపడాలి. ఈ దాడులు సరిపోవు.. అని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తనకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే మరొక రకంగా ఉండటం ట్రంప్కు అలవాటే. ఇరాన్ను ఏదో రకంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నమే ట్రంప్ వ్యాఖ్యల్లో కనబడింది. అంటే ఇక్కడ ఇజ్రాయిల్ను అడ్డుపెట్టుకని ఇరాన్ను ఎలాగైనా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ వ్యాఖ్యల్నే బట్టే అర్థమైంది. ఇప్పుడు డీల్ అంటూ కొత్త పాట..!ఇరాన్పై ఇజ్రాయిల్ వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఇరాన్ చవిచూసింది. మరి ట్రంప్ టార్గెట్ పూర్తయ్యిందో ఏమిటో గానీ, ఇక ఇజ్రాయిల్-ఇరాన్లు డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి తానే మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగైతే భారత్- పాకిస్తాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానో, అలాగే వీరి మధ్య కూడా ఒక ఒప్పందంగానీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు(పాకిస్తాన్తో యుద్ధ విరమణలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ అప్పుడే స్పష్టం చేసింది. మిలటరీ డైరెక్టర్ల పరస్పర అంగీకారంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగిందని పేర్కొంది). తాను ఎన్నో శాంతి ఒప్పందాలు చేశానని, క్రెడిట్ మాత్రం తనకు అవసరం లేదని అంటున్నారు ట్రంప్.నేను చాలా యుద్ధాలు ఆపాను..!తాను తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో కొసావో, సెర్బియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని, వారి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పరిష్కరించాను. బైడెన్(మాజీ అధ్యక్షుడు) తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా కొన్ని చోట్ల దీర్ఘకాలిక ఘ్రయోజనాలు దెబ్బతిన్నాయి. నేను దాన్ని మళ్లీ పరిష్కరిస్తా. ఇక ఈజిప్టు, ఇధియోఫియాల మధ్య నైలు నదీ వివాదం ఉంది. భారీ ఆనకట్టకు సంబంధించి వారి మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతానికి నా జోక్యంతో కనీసం శాంతి వాతావరణం ఏర్పడింది’ అని శాంతి మంత్రాన్ని మళ్లీ జపించారు.మాట వింటే శాంతి.. వినకపోతే యుద్ధంఇప్పుడు ఇరాన్ విషయంలో జరుగుతున్నది అదే. అమెరికా మాట వినలేదనే కారణంతో ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన ట్రంప్.. ఇప్పుడు వారి మధ్య శాంతి ఒప్పందం కుదర్చాల్సిన బాధ్యత తనపైనే ఉందంటున్నారు. ట్రంప్ మాట వింటే భాంతి.. లేకపోతే యుద్ధం అనే పద్ధతిని ఆచరిస్తున్న ట్రంప్ను చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉస్కో అని ఒక దేశాన్ని రెచ్చగొట్టడం.. కాస్కో అని మరో దేశాన్ని హెచ్చరించడం.. ఇక చివరగా డీల్కు వస్తారా అంటూ పెద్దన్న పాత్రకు రెడీ కావడం ఇవే ట్రంప్ వైఖరిలో కనబడటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. కుమారుడి పెళ్లి వాయిదా!
దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధి చేసిన ఇజ్రాయెల్.. ప్రళయ భీకరంగా విరుచుకుపడుతోంది. మరోవైపు, సైన్యాధికారులను కోల్పోయి.. స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ కూడా ప్రతికార దాడులకు దిగుతోంది. వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెడుతోంది.ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు, అమిత్ యార్దేనీకి త్వరలోనే విహహం జరగనుంది. ఈ మెగా వేడుకను నిర్వహించేందుకు నెతన్యాహు కుటుంబం రెడీ అయ్యింది.అయితే, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధ పరిస్థితుల మధ్య నెతన్యాహు తన కుమారుడి పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో కూడా నెతన్యాహు కుమారుడి పెళ్లి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.