breaking news
iran
-
ఇరాన్లో ఉద్రిక్తతలు..ఇండిగో ఫ్లైట్స్ రద్దు
ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య ఆసియాలోని కొన్ని నగరాలకు ఫిబ్రవరి 11 వరకూ విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ వివరాలను తన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్లో చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మేము గమనిస్తున్నాము. కస్టమర్ల భద్రత రీత్యా టిబిలిసి, అల్మట్టి, బాకు మరియు తాష్కెంట్లకు బయలుదేరే ఇండిగో విమానాలు 11 ఫిబ్రవరి రద్దు చేస్తున్నాము. అని ఇండిగో వివరణ ఇచ్చింది. ప్రయాణికులు మరో తేదీలలో విమాన ప్రయాణమో లేదా టికెట్ డబ్బులు పూర్తిస్థాయిలో రీఫండ్ కావాలో వారి ఇష్టం మేరకు ఆఫ్షన్లు ఎంచుకోవచ్చుని తెలిపింది. అయితే ప్రస్తుతం ఇరాన్లో అంతర్గత సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో అక్కడి ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో వేలాదిమంది మృతిచెందారు. ఈ అంశంపై తొలి నుంచి హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ఇరాన్కు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. తమ సైన్యం ఇరాన్కు బయిలుదేరిందని ప్రకటించారు. ఇరాన్ సైతం వెనక్కి తగ్గేదిలేదని ప్రకటించడంతో రెండుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. -
అటెన్షన్.. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి!
ఇరాన్పై ఏ క్షణంలోనైనా దాడులు జరగొచ్చు. ఇందుకోసం అమెరికా అంతా సిద్ధం చేసుకుంటోంది. అబ్రహం లింకన్తో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీ .. అన్నీ ఎర్ర సముద్రానికి చేరుకోవడమే ఆలస్యం!. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయంటూ వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ తాజాగా గల్ఫ్నకు చేరుకుంది. జనవరి 19నే మలక్కా జలసంధిని ఈ అణుశక్తి విమానవాహక దాటిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది కూడా. దీంతో ఇరాన్పై యూఎస్ ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.ఇరాన్ వద్ద కాచుకు కూర్చొన్న అమెరికా యుద్ధనౌకకు తోడుగా యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫి, యుఎస్ఎస్ స్ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు చేరకున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇవి ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా.. హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం దీన్ని మోహరించినట్లు అమెరికా చెబుతోంది. అయితే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను ఎర్ర సముద్రం రీజియన్కు తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నుంచి సూయాజ్ కాలువకు చేరుకుకోవాలనేదే ఉద్దేశంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే మాత్రం.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడం ఖాయం. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు. అయితే.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు కూడా ట్రిగ్గర్ మీదే ఉందంటూ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని బంకర్లో సురక్షితంగా దాచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో.. ఇటు చర్చల అంశమూ తెర మీదకు వస్తోంది. చర్చలు ముందుకుసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్కు ఇప్పటికే తెలుసని ట్రంప్ పేషీలోని ఓ ముఖ్యాధికారి వ్యాఖ్యానించారు కూడా. -
ఇరాన్ అగ్రనేత కుమార్తెకు షాకిచ్చిన అమెరికా
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేపో మాపో యుద్ధం తప్పదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితులున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ మిలిటరీ అధికారులు.. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్లోని ఓ బంకర్కు తరలించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ కుమార్తె డాక్టర్ ఫాతిమా అర్దేషిర్ను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఎమోరీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫాతిమా పనిచేస్తోంది. అయితే ఆమె తండ్రి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుడిగా ఉన్నారు. కాగా ఇరాన్లో జరుగుతున్న ప్రజా నిసనలపై భద్రతా దళాలు కఠినంగా వ్యవహరించడంలో అలీ లారిజానీ కీలక పాత్ర పోషించారని అమెరికా ట్రెజరీ విభాగం అతడిపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే ఫాతిమా అర్దేషిర్పై ఎమోరీ యూనివర్సిటీ వేటు వేసింది. -
ఇరాన్లో మృతులు 30 వేల పైమాటే?
టెహ్రాన్: ఇరాన్ వ్యాప్తంగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన నిరసనల్లోనే కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ టైమ్ పత్రిక ఈ విషయం తెలిపింది. గురు, శుక్రవారాల్లోనూ ఇరాన్ భద్రతా విభాగాల సిబ్బంది ఇంతే కర్కశంగా వ్యవహరించారని, మరణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. మృతదేహాలున్న ప్లాస్టిక్ బ్యాగులు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణల్లో గుట్టలుగా పడి ఉన్నాయని, అంబులెన్సులకు బదులుగా వీటిని తరలించేందుకు 18 చక్రాలుండే సెమీ ట్రయిలర్లను వాడుతున్నారని పేర్కొంది. జనవరి 21న సుప్రీం నేత ఖమేనీకి అందించిన సమాచారం ప్రకారం నిరసనల్లో 3,117 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆస్పత్రుల రికార్డుల ఆధారంగా చూస్తే 30,304 మంది మృతుల్లో 5,459 మంది వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ధ్రువీకరించారు. -
ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..
-
ఏ క్షణమైనా యుద్ధం.. ఈసారి అణుబాంబులేనా?
-
‘మేము భయపడే ప్రసక్తే లేదు..
‘ఇరాన్ వైపు అమెరికా బలగాలు.. ఇక యుద్ధమే తరువాయి.. ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే ఇరాన్పై అమెరికా విజృంబించడం ఖాయం..’ ఇవే మనకు గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న వార్తలు. అమెరికా వెనక్కి తగ్గిందనేది కాసేపు.. అంతలోనే ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందనేది మరొకవైపు. ఏది ఏమైనా తమది వెనక్కి తగ్గే మనస్తత్వం కాదని అంటోంది ఇరాన్. అవసరమైతే ఎందాకైనా పోరాడతామని స్సష్టం చేసింది. తమకు యుద్ధాలు కొత్త కాదని, వాటికి భయపడటం అనేది తమ రక్తంలోనే లేదని భారత్లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయ్యద రెజా మొసాయెబ్ మోత్లాఘ్ స్పష్టం చేశారు. ముంబైలో ఇరాన్ కాన్సులేట్ ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఇరాన్ నైజం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వివరించే యత్నం చేశారు. ఇటీవల ఇజ్రాయిల్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని, అంతకుముందు తాము ఎదుర్కొన్న యుద్ధ పరిస్థితులను వివరించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ఏ సమయంలోనూ తాము ధైర్యం కోల్పోలేదన్నారు. తాము ఎవరో భయపెడితే భయపడిపోయే తత్వం కాదన్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ కూడా దేనికి భయపడరన్నారు. ఖమేనీ బంకర్లో దాక్కున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. బంకర్లో దాక్కొనేంత పిరికి నేత ఖమేనీ కాదన్నారు. దేనికైనా తమ దేశం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక భారత్తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆంక్షల బెదిరింపులు ఉన్నప్పటికీ భారత్తో సంబంధాలు యధావిధిగా కొనసాగించేందుకు యత్నిస్తున్నామన్నారు. -
ఇరాన్-అమెరికా.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
ఇరాన్ అమెరికా మధ్య కమ్ముకుంటున యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ సైన్యం ఇరాన్కు బయల్దేరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వేళ.. అక్కడి ప్రజల తీవ్ర నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారని హక్కుల సంఘాలు నివేదికలు ఇచ్చాయి. అలాగే వేల మందిని జైల్లో పెట్టారని.. వాళ్లలో కొందరిని దేశద్రోహులుగా ఉరి తీయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము చూస్తూ ఉండబోమని.. ఇరాన్ నిరసనకారులకు అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు. ఈ లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో నిరసనకారుల ఉరితీత ఆగిపోయింది. అయితే.. తన వల్లే నిరసనకారుల ఉరి ఆగిందంటూ ట్రంప్ ప్రకటించుకోగా.. ఇరాన్ దానిని తోసిపుచ్చింది. కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదన్నట్లు ఖమేనీ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. దీంతో ట్రంప్నకు మళ్లీ కోపమొచ్చింది. ఈలోపు.. ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న అనుమానాలూ వ్యక్తం చేసిన ఆయన.. గట్టి వార్నింగే ఇచ్చారు. సైనిక చర్యే చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు జారీ చేసిన ఆయన.. అదనపు బలగాలనూ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు ట్రిగ్గర్పైనే ఉందంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇరాన్ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. వాటిని మేం ఉపయోగించకపోవచ్చు. ఏం జరుగుతోందో చూద్దాం అని ట్రంప్ దావోస్ సదస్సు అనంతరం వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా.. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో పరిస్థితి హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
ఇరాన్పై యుద్ధమేఘాలు!
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారా? పాలస్తీనాలో యుద్ధానికి తెర దించేందుకు ‘శాంతి బోర్డు’ ఏర్పాటును ప్రకటించిన మర్నాడే పశ్చిమా సియాను మరోసారి రణరంగంగా మార్చ బోతున్నారా? ఆ దిశగా సర్వసన్నాహాలూ శరవేగంగా జరిగిపోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. అమెరికా యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు భారీ స్థాయిలో పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వాటితో పాటు పదాతి సైన్యాన్ని కూడా అమెరికా మోహరిస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఐరన్డోమ్తో పాటు తన రక్షణ వ్యవస్థలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరుచుకుంటోంది! దాంతో పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది. అరేబియా దిశగా నౌకలుయుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో కూడిన భారీ సైనిక పటాలాన్ని ఇరాన్ దిశగా అమెరికా తరలిస్తోంది! ఇటీవలి దాకా దక్షిణ చైనా సముద్రంలో లంగరేసిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక యుద్ధనౌక అరేబియా సముద్రం కేసి కదులుతోంది. అది జనవరి 20 నాటికే మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నౌక తన ఆటోమాటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆఫ్ చేయడం గమనార్హం. దాంతో ప్రస్తుతం అదెక్కడున్నదీ గుర్తించే వీల్లేకుండా పోయింది. గంటకు 20 నాటికల్ మైళ్లకు మించిన వేగంతో ప్రయాణిస్తున్న నేపథ్యంలో శుక్రవారానికే ఆ నౌక అరేబియా సముద్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఇరాన్లోని లక్ష్యాలను ఢీకొట్టాలంటే అది ఉత్తర అరేబియా సముద్రంలో లంగరు వేయాల్సి ఉంటుంది. పలు డిస్ట్రాయర్ నౌకలు, అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములు, యుద్ధ విమానాలు అబ్రహం లింకన్తో పాటు తరలి వెళ్తున్నాయి. దానిపై కనీసం 60 దాకా అత్యాధునిక ఎఫ్/ఏ–18 యుద్ధ విమానాలున్నట్టు సమాచారం. రీ ఫ్యూయలింగ్ అవసరం లేకుండా ఏకంగా 2,300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేరగల సామర్థ్యం వాటి సొంతం! అయినా ముందుజాగ్రత్తగా యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే కేసీ–135 ఏరియల్ రీఫ్యూయలర్లను కూడా అమెరికా రంగంలోకి దించుతోంది! ఇక ఐఎస్ఎస్ లింకన్కు తోడుగా వెళ్తున్న జలాంతర్గాముల్లో వీటితో పాటు ఒహాయో శ్రేణికి చెందిన అత్యాధునిక గైడెడ్ క్షిపణులుండటం విశేషం. వాటిలో ఒక్కో జలాంతర్గామికీ కనీసం 154 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యముంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధంగా ఉన్నట్టే. వీటితోపాటు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కూడా ఇప్పటికే పశ్చిమాసియాలోని పలు సైనిక స్థావరాల్లో మోహరించాయి. ఒక విమానం లాండవుతున్న ఫొటోలను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. ఇవేగాక థాడ్, పాట్రియాట్ వంటి అదనపు క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పశ్చిమాసియా పొడవునా, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాల్లో మోహరిస్తున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. సీ–17 రవాణా విమానాలూ...అమెరికాకు చెందిన అత్యంత భారీ సీ–17 సైనిక రవాణా విమానాలు కూడా మూడు రోజులుగా జోర్డాన్లోని మఫ్రాక్ అల్ ఖవాజా వైమానిక స్థావరం నుంచి ఇరాన్ సమీపంలోని అమెరికా బేస్లకు చక్కర్లు కొడుతున్నాయి. ఇరాన్ దాడిని కాచుకునేందుకు అవి ఇజ్రాయెల్కు పాట్రియాట్–3 శ్రేణి క్షిపణులను సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. తమపై దాడి అంటూ జరిగితే ముందుగా ఇజ్రాయెల్ భరతం పడతామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మిత్ర దేశం భద్రత విషయంలో అమెరికా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇవేగాక అవసరాన్ని బట్టి డీగో గార్షియా దీవిలోని వైమానిక స్థావరం నుంచి బీ2 స్టెల్త్ బాంబర్లను కూడా అప్పటికప్పుడు రంగంలోకి దించాలని అమెరికా సైన్యం నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు! లేదంటే నేరుగా అమెరికా నుంచి కూడా వాటిని ఇరాన్ దిశగా తరలించే అవకాశముంది.ఇరాన్పై డేగకన్ను: ట్రంప్అతి పెద్ద అమెరికా సైనిక పటాలం ఇరాన్కేసి కదులుతోందని ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘మా కీలక యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు గల్ఫ్కేసి దూసుకెళ్తున్నాయి. వాటన్నింటి దృష్టీ ఇరాన్ మీదే ఉంది’’ అని స్పష్టం చేశారు. గురువారం దావోస్ నుంచి వాషింగ్టన్ తిరిగి వెళ్తూ ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు ‘పెద్ద నిర్ణయం’ తీసుకునే ఉద్దేశం నాకేమీ లేదు. అయితే ఇరాన్ను నిశితంగా పరిశీలిస్తున్నాం. బహుశా ఈసారి ఆ దేశంపై మా సైనిక శక్తియుక్తులను ప్రయోగించాల్సిన అవసరం రాకపోవచ్చేమో. కానీ అక్కడి పరిస్థితిని డేగకళ్లతో గమనిస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.ట్రంప్వి పచ్చి అబద్ధాలుదుబాయ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఉరిశిక్షల రద్దు’ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవలి భారీ నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వందలాది మందికి ఇరాన్ ఉరిశిక్షలు విధించినట్టు వార్తలు రావడం తెలిసిందే. అలాగైతే సైనిక చర్య తప్పదన్న తన హెచ్చరకల వల్ల కనీసం 840 ఉరిశిక్షలను ఇరాన్ రద్దు చేసిందని గురువారం కూడా ట్రంప్ ప్రకటించుకున్నారు. అది పచ్చి అబద్ధమని ఇరాన్ న్యాయాధికారి మొహమ్మద్ మొవాహెదీ అన్నారు. ‘అసలు ఆ సంఖ్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మా న్యాయవ్యవస్థ అలాంటి నిర్ణయమే తీసుకోలేదు’’ అని ఆయన శుక్రవారం చెప్పుకొచ్చారు. మరోవైపు, భారీ నిరసనల్లో మరణించిన వారి సంఖ్యను 3,117గా ఇరాన్ తాజాగా పేర్కొంది. కానీ 5,000 మందికి పైగా మరణించినట్టు హక్కుల సంఘాలు తెలిపాయి.వాణిజ్యం ఛిన్నాభిన్నమే!ఇరాన్పై అమెరికా యుద్ధానికే దిగితే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం కావడం ఖాయం. ముఖ్యంగా చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోనుంది. ఇరాన్ నియంత్రణలోని హార్మూజ్ జలసంధి గుండా రోజుకు ఏకంగా 2 కోట్ల బ్యారెళ్ల మేరకు చమురు రవాణా జరుగుతుంది. యుద్ధ పరిస్థితే వస్తే దాన్ని పూర్తిగా నిలిపేయవచ్చు. అంతేకాదు, ఇరాన్ దగ్గర భారీ పరిమాణంలో ఉన్న యురేనియం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని వద్ద 10 అణుబాంబుల తయారీకి సరిపోయే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు అంచనా. -
ట్రంప్ ఓవరాక్షన్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.ఇరాన్లో నిరసనలు.. ఇదిలా ఉండగా.. ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మందికిపైగా మృతిఇరాన్లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. -
తగ్గేదేలే.. ఇరాన్ వైపునకు భారీగా అమెరికా బలగాలు
చల్లారుతుందనుకున్న అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ట్రంపరితనంతో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే.. ఈ చర్యపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించింది.ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళ్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు నాకు నివేదికలు అందిస్తున్నారు. పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని గనుక కొనసాగిస్తే.. అమెరికా కచ్చితంగా కఠినంగా స్పందిస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలను మిడిల్ఈస్ట్కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ హెచ్ఆర్ఏఎన్ఏ లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరి తీయాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే వాళ్లను ఉరి తీసే ప్రయత్నాలు చేస్తే.. ఇరాన్పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరి వేసే ప్రణాళికను రద్దు చేసిందని మొన్నీమధ్య ప్రకటించారు కూడా. ఈ నిర్ణయం కారణంగానే ఆ దేశంపై సైనిక చర్య విషయంలో తాను వెనక్కి తగ్గినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే తాజాగా.. సుమారు 837 మందిని ఉరి తీయకుండా నేను కాపాడాను అంటూ ఆయన ప్రకటించారు.‘అణు’ వార్నింగ్దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుంది, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. ఐరాస విభాగం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా నెలకు ఓసారి ‘అణు తనిఖీ’ చేపట్టాలి. కానీ, గత ఏడు నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ఖబడ్దార్.. అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. -
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
‘‘నన్ను చంపేస్తే.. ఇరాన్ను భూస్థాపితం చేస్తాం’’ అంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. 'న్యూస్ నేషన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్లో అశాంతి ఇలాగే కొనసాగితే దేశం మొత్తం పేలిపోతుందంటూ మరో వార్నింగ్ ఇచ్చారు. కాగా, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇటీవల పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే..@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026 మరోవైపు, ట్రంప్.. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు. -
ట్రంప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్లోని చాబహర్ ఓడ రేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్పై సెప్టెంబర్లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్లోని గ్వాదర్ పోర్ట్కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్కు అందించింది. చాబహర్పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ ఓ నేరగాడు
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో సంభవించిన ప్రజల మరణాలు, విధ్వంసాలకు ఆయనే కారణమన్నారు. నిరసనలకు ఆజ్యం పోసింది ట్రంపేనంటూ నిందించారు. ఇటీవల తలెత్తిన అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందన్నారు. ఇరాన్ను అస్థిరపర్చడం ద్వారా పైచేయి సాధించాలన్నదే ఆ దేశం లక్ష్యమన్నారు. అయితే, తమ దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టలేరని కుండబద్దలు కొట్టారు. విధ్వంసానికి కారణమైన దేశీయ, విదేశీ నేరగాళ్లను శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎంతో సంయమనం పాటిస్తోందని, అదే సమయంలో హింసకు కారణమైన వారిపై సహనంచూపే ప్రసక్తే లేదన్నారు. ‘దేశంలో జరుగుతున్న ఆందోళనల విషయంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడే వారిని ఇరానియన్లుగా పేర్కొన్నారు. నిరసనలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారు. సైన్యాన్ని మద్దతుగా పంపుతామంటూ ఉసిగొల్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అశాంతికి ఆజ్యం పోశారు’అని ఖమేనీ విమర్శించారు. అంతర్గత, బాహ్య శత్రువులపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అల్లర్లను కఠినంగా అణచివేయడంతోపాటు రెచ్చగొట్టే వారి వెన్ను విరుస్తామన్నారు. అశాంతికి కారణమైన లోపలి, బయటి నేరగాళ్లను వదలబోమని తెలిపారు.రెండు రోజుల్లోనే 12 వేల మందిదేశంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణగదొక్కేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్లోని కుద్స్ బలగాలు, అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగినట్లు చెబుతు న్నారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రుల్లోనే కనీసం 12 వేల మందిని ఇవి పొట్టన బెట్టుకున్నాయని సమాచారం. అధికారిక సమాచారం, ఆస్పత్రుల్లో డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేనల్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అయితే, నిరసనల్లో ఇప్పటి వరకు 3,090మంది చనిపోయినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 2,885మంది నిరసన కారులున్నారంది. ఇలా ఉండగా, శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 8 గంటల సమయంలో జాతిని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయాలని ప్రజలకు అమెరికాలో ఉన్న రాజ కుటుంబ వారసుడు రెజా పహ్లావీ పిలుపునిచ్చారు. -
భయంగా బతికాం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉది్వగ్న పరిస్థితులు కనిపించాయి. ఇరాన్ నుంచి క్షేమంగా తిరిగివచ్చిన తమ కన్నబిడ్డలను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలతో స్వాగతం పలికారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల కోసం పెద్ద సంఖ్యలో జనం ఎయిర్పోర్టుకు తరలిచ్చారు. ఇరాన్లో కొన్ని రోజులుగా ప్రజల ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండడం, శాంతి భద్రతలు దిగజారుతుండడంతో అక్కడున్న భారతీయులు కమర్షియల్ విమానాల్లో శుక్రవారం అర్ధరాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుంచి తిరిగిరావాలని భారత ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారు లు, పవిత్ర క్షేత్రాల దర్శనానికి వెళ్లిన భక్తులు ఇరాన్లో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారు స్వదేశానికి తిరిగిరావడానికి భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సహకరించాయి. అతిత్వరలో మరికొందరు భారతీయులు ఇరాన్ నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం. వ్యవస్థలు స్తంభించిపోయాయి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత పలువురు తమ భయానక అనుభవాలను వ్యక్తంచేశారు. ఇరాన్లో అక్షరాలా యుద్ధ వాతావరణమే నెలకొందని వెల్లడించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిక్షణం భయంభయంగా బతికామని అన్నారు. అక్కడ పరిస్థితులు నానాటికీ భీకరంగా మారుతున్నాయని, బయటకు వెళితే ప్రాణాలతో తిరగి వస్తామన్న గ్యారంటీ లేదని తెలిపారు. వ్యవస్థలన్నీ దాదాపు స్తంభించిపోయాయని, ఇంటర్నెట్ సేవలను ఆపేశారని, ఫోన్లలో మాట్లాడుకొనే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అక్కడ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తోందని వివరించారు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది ‘‘నెల రోజుల క్రితం ఇరాన్ వెళ్లాం. కానీ, రెండు వారాల క్రితమే సమస్యలు మొదలయ్యాయి. బయటకు వెళితే నిరసనకారులు అడ్డుకొనేవారు. మా వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చేవారుకాదు. చేసేది లేక మా నివాసానికి తిరిగి వచ్చేవాళ్లం. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఎక్కడేం జరుగుతోందో తెలిసేది కాదు. మా క్షేమ సమాచారాలను ఇండియాలోని కుటుంబ సభ్యులకు చేరవేసే అవకాశం కూడా దక్కలేదు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది. అది నిజంగా చాలా కష్టమైన సమయం. మొత్తానికి భారత ఎంబసీ సహకారంతో బయటపడ్డాం’’అని ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు. సొంత ఖర్చుతోనే వచ్చా.. ‘‘నేను ఇరాన్లో షిరాజ్ నగరంలో ఉన్న మెడికల్ కాలేజీలో చదుకుంటున్నా. కానీ, ఇంటర్నెట్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అసలేం జరుగుతోందో తెలిసేదికాదు. భారత ప్రభుత్వ సూచనతో స్వదేశానికి తిరిగివచ్చా. నేను సొంత ఖర్చుతోనే వచ్చా. ప్రభుత్వం మాకోసం ప్రయాణ ఏర్పాట్లు చేయలేదు’’అని ఓ వైద్య విద్యారి్థని తెలియజేశారు. 9 వేల మంది భారతీయులు ఇరాన్ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇరాన్లో ప్రస్తుతం దాదాపు 9 వేల మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ చెప్పారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎవరూ ఇరాన్కు వెళ్లే ప్రయత్నం చేయొద్దని కోరారు. -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
ఇరాన్ అంత ఈజీ కాదు.. ఇజ్రాయెల్ సలహాతో వెనక్కి తగ్గిన ట్రంప్
-
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
ఇరాన్లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. ఇరాన్లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇరాన్లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. -
ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు
-
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది. ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్నకు తెలుసు ‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్పై ఒత్తిడి తెచ్చి ట్రంప్ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా. కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు. -
మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడిన పుతిన్.. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని క్రెమిన్ వెల్లడించింది. అదేవిధంగా, ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో పుతిన్కు వివరించారని కూడా తెలిపింది. ఐరాసతోపాటు ఇతర ప్రపంచ వేదికలపై ఇరాన్ వైఖరికి మద్దతు తెలిపేందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు పెజెష్కియాన్ ధన్యవాదాలు తెలిపినట్లు ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇలా ఉండగా, ఇరాన్ అణు నిరాయు«దీకరణకు అంగీకరిస్తే ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం లభించినట్లేనని ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ చెప్పారని టాస్ పేర్కొంది. అలా జరక్కుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా తెలిపింది. -
ఇరాన్పై దాడులు లేనట్లే!
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్న్యూస్లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎప్పుడేం చేయాలో ట్రంప్కు తెలుసు మరోవైపు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఆగని ఆందోళనలు ఇరాన్లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి. ఆ ఆలోచన ఇంకా ఉంది ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. -
ఇరాన్ బలం ఎఫ్-14 యుద్ధ విమానాలు... ఇచ్చిన దేశం పైనే దాడి?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ఫోర్స్లో కీలకంగా భావిస్తున్న ఎఫ్-14 ఫైటర్ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.ఎఫ్-14 ప్రత్యేకతలు ఎఫ్-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి. అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
నిరసనకారులను చంపేయండి
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు చేస్తున్న వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మతాధికారి అహ్మద్ ఖటామీ ఈ మేరకు మరణ ఆజ్ఞలను విడుదల చేశారు. ‘‘ఇది దేవుని తీర్పు’’ అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టెహ్రాన్లో జరిగిన ప్రార్థనలకు నాయకత్వం వహించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక రేడియో వెల్లడించింది. నిరసనకారులను ఉరితీయాలంటూ ఖటామీ ఫత్వాను జారీ చేయగానే.. ఆ ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఇదే వేదికపైనుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా ఖటామీ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్పై దాడిని వాయిదా వేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న మర్నాడే.. ఖటామీ నుంచి ఈ తరహా ఫత్వా జారీ కావడం గమనార్హం..! గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు ఇరాన్లోని భారతీయులను తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. అటు ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో ఇరాన్ ఉప రాయబారి గులాం హుస్సేన్ దర్జీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేశారు. తమ దేశంలో గందరగోళానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల వెనక అమెరికా వ్యూహాత్మక హస్తముందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మళ్లీ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీపై గుర్రుగా ఉన్నట్ల తెలుస్తోంది. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ట్రంప్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇదెలా ఉండగా.. ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అధికారులు ప్రకటించారు. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. తాము అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారని, వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులని ఆరోపించారు. -
ఇరాన్ సంక్షోభం.. ఐరాస భద్రతా మండలిలో ఆసక్తికర పరిణామం
ఇరాన్ సంక్షోభం నేపథ్యంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి.. అమెరికా సైనిక దాడులు జరపడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ముగిసిన ఈ భేటీలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, ఇరాన్ మహిళా ఉద్యమకారిణి మసీహ్ అలినెజాద్.. యూఎన్ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి భేటీలో పాల్గొన్న ఆమె.. ఇరాన్ యూఎన్ రాయబారి ఘోలంహోసేన్ డర్జీని టార్గెట్ చేసుకున్నారు. ‘‘మీరు(ఇరాన్) నన్ను మూడుసార్లు చంపాలని చూశారు. నా ఇంటి వద్దకు మనుషుల్ని పంపించారు. వాళ్లను నేను చూశాను కూడా’’ అని వ్యాఖ్యానించారామె. ఖమేనీ ప్రభుత్వం ఐసిస్లా ప్రవర్తిస్తోందన్న మసీహ్.. ఇరాన్లో అణచివేతలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. అంతర్జాతీయ ఖండనలు ఏమాత్రం సరిపోవని, ప్రపంచ దేశాలు ఇరాన్పై ఒత్తిడిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇరాన్ ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఉద్ఘాటించారు. ఐరాన్లో జరుగుతున్న నిరసనలు గొప్ప ఉద్దేశంతో కూడుకున్నవని.. ఐరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని.. మా దేశం, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్లతో ఉన్నారు అని స్పష్టం చేశారు. నిరసనలు విదేశీ కుట్ర కాదని.. ఐరాన్ ప్రభుత్వం తన ప్రజలకే భయపడుతోందని వాల్ట్జ్ అన్నారు.యూఎన్ అధికారులు ఇరాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై సైనిక దాడులు జరిగితే ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరం చేస్తాయని హెచ్చరించారు.ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ తరఫున మార్థా పోబీ మాట్లాడుతూ.. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించాలి అని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఏ క్షణమైనా.. అమెరికా.. ఇరాన్ యుద్ధం..!
-
ఇజ్రాయెల్లో భూకంపం.. అణు పరీక్షలే కారణమా?
ఇరాన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. విరోధి దేశం ఇజ్రాయెల్లో భూకంపం సంభవించింది. నెగెవ్ ఎడారిలోని డిమోనా ప్రాంతంలో 4.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. టెహ్రాన్ హెచ్చరికల నేపథ్యంతో టెల్ అవీవ్ రహస్యంగా అణు పరీక్షలు జరిపి ఉండవచ్చని.. ఇదే భూకంపానికి కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. గురువారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు జెరూసలేం వరకు ప్రభావం చూపాయి. కొన్ని సెకన్లపాటు నేల కంపించగా.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్లోని అన్ని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరుగుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. దీంతో ఇది సహజసిద్ధమైన భూకంపం కాకపోవచ్చనే చర్చ మొదలైంది. ఇది ఇరాన్తో పాటు అమెరికాకు ఇజ్రాయెల్ పంపిన సంకేతం అయి ఉండొచ్చనే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా.. డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు రహస్య అణు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 1950లలో నిర్మించిన ఈ కేంద్రంలో హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. పైగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల విస్తరణ కూడా ధృవీకరణ అయ్యింది. అయితే అణు పరీక్షలు, అణ్వాయుధాలున్నాయనే ప్రచారాన్ని ఆ దేశం ఏనాడూ అంగీకరించలేదు. అయితే ఇజ్రాయెల్ భూగర్భ శాస్త్ర సంస్థ మాత్రం అధికారికంగా ఇది సహజ భూకంపమేనని ప్రటించడం గమనార్హం.ఇరాన్ అణు ప్రోగ్రామ్ను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశమంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు కూడా జరిపింది. ఆ సమయంలో ఇరాన్ కూడా అణు పరీక్షలు నిర్వహించినట్లు విస్తృత ప్రచారం జరిగింది.ఇక ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ బ్యాన్, సమాచార వ్యవస్థలను కట్టడి చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఆందోళనకారుల్ని కఠినంగానే అణచివేస్తున్నారనే సమాచారం మాత్రం బయటకు పొక్కుతోంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో మరణాలు(వేలల్లోనే) సంభవించినట్లు, అరెస్టులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై హింసను ఉపేక్షించేది లేదని, అవసరమైతే సైనిక చర్య తప్పదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో చర్చలకు ఆస్కారం ఉందన్న మాటను ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ.. తమ దేశం జోలికి వస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నారు. -
ఇజ్రాయెల్లోని ఇండియన్స్కు అలర్ట్..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్కు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అందరూ స్థానిక అధికారులు, ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయ 24x7 హెల్ప్లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392 సంప్రదించాలని తెలిపింది.పెరుగుతున్న ఉద్రిక్తతలుఇరాన్లో విస్తృత స్థాయిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ అయింది. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా అవకాశం కొట్టిపారేయకపోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది.ఈ పరిణామాల ప్రభావంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో ప్రజా ఆశ్రయాలను తెరవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో “అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండటం మంచిది” అనే ఉద్దేశంతో అన్ని ప్రజా ఆశ్రయాలను తెరవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రయత్నాలుఇరాన్లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. -
ఇరాన్ టార్గెట్.. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు?
పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా తమపై ఏదైనా చర్యకు ఉపక్రమిస్తే.. ఉన్నఫళంగా స్పందించేందుకు ఇరాన్ సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ను కూడా టార్గెట్గా చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఓ ప్రకటనను విడుదల చేసినట్లు అరబిక్ మీడియా వెల్లడించింది. ప్రధానంగా ఐఆర్జీసీ తన వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను అరబిక్ మీడియా ఉటంకించింది. ప్రధానంగా ఇజ్రాయెల్కు చెందిన ఎనిమిది వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులను సిద్ధం చేసినట్లు చెబుతోంది. తన శక్తిమంతమైన ‘ఫతాహ్’ క్షిపణిని సైతం ఇజ్రాయెల్తో పాటు.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై గురిపెట్టినట్లు పేర్కొంటోంది.అమెరికా, లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే.. వెంటనే తమ ప్రతిస్పందనలో భాగంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తామని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఫతాహ్ క్షిపణులు హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యాలను ఛేదించడమే కాకుండా.. మార్గమధ్యంలో వాటి దిశను మార్చే అవకాశాలుంటాయి. అయితే అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు.ఇదీ చదవండి:నెతన్యాహూ క్రీట్కు పారిపోయాడు..! -
ట్రంప్ భయం?.. ఉరిశిక్ష రద్దు చేసిన ఇరాన్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా ఇరాన్లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు. అయితే సడెన్గా పరిస్థితి యూటర్న్ తీసుకుంది.అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు. -
ట్రంప్ టారిఫ్లు.. కేంద్రానికి శశిథరూర్ కీలక సూచన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అమెరికా సుంకాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యమైనంత ఈజీ కాదు. భారీ నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
ఇరాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తుందనే కారణంగా ఇరాన్.. అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, గగనతం మూసివేస్తున్న సమయంలో ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, ఇండిగో సంస్థ, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించే సమయానికి చాలా విమానాలు తమ మార్గాలను మళ్లించుకున్నాయి. అయితే, ఈ మూసివేత ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇరాన్ గగనతలంలో భారత్కు చెందిన ఇండిగో విమానం ప్రయాణంలో ఉంది. జార్జియాలోని టీబీలిసీ నుంచి వస్తున్న ఇండిగో 6E-1808 విమానం ఇరాన్ తన బోర్డర్లను మూసివేయడానికి సరిగ్గా నిమిషాల ముందు గగనతలం చివరి వరకు వచ్చేసింది. సరైన సమయంలో సదరు ఇండిగో విమానం.. ఇరాన్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ గగనతంలోకి ప్రవేశించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఆ సమయంలో ఇరాన్ భూభాగంపై ఉన్న ఏకైక 'నాన్-ఇరానియన్' విమానం ఇండిగోనే కావడం గమనార్హం.విమానయాన సంస్థల సూచనలు..ఇక, ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం అనిశ్చితంగా ఉన్నందున భారత విమానయాన శాఖ (DGCA) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి సూచనలే జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.కేంద్రం అడ్వైజరీ..ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. భారతీయులు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమ స్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. అలాగే, ఇరాన్కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. IndiGo flight 6E1808 is now the last non-Iran-registered passenger aircraft in Iranian airspace. pic.twitter.com/qEAU83gYrK— Chendur.Vengat (@coolvnkt) January 14, 2026అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు, ఇరాన్ అంతర్గత అశాంతి నేపథ్యంలో టెహ్రాన్ తన గగనతలాన్ని శత్రు విమానాలకు దొరక్కుండా మూసివేసింది. కమర్షియల్ విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ గగనతంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేతతో భారత్ నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. -
ఇరాన్ పై దాడులకు అమెరికా రెడీ!
-
ట్రంప్ వార్నింగ్తో వెనక్కి తగ్గిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది. ‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది. -
‘అప్పుడు మిస్సయిన బుల్లెట్ ఇప్పుడు దిగుతుంది’
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చుతామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు బహిరంగంగా ప్రసారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇంకా గుర్తుండగానే ఈ బెదిరింపు వెలువడింది. ఆ ఏడాది జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రక్షణగా చేరి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు అక్కడికక్కడే హతమార్చాయి.ఇప్పుడు అదే ఘటనకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్తో ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ..‘గతంలో బుల్లెట్ మిస్సైంది.. ఇక మిస్సవ్వదు, ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది’ అంటూ ట్రంప్ను బహిరంగంగా బెదిరించింది. దాడులకు దిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంచనాతో అమెరికా అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో తన సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై సైనిక దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, టెహ్రాన్ ఇప్పటివరకు చేసిన అత్యంత బహిరంగ బెదిరింపులలో ఈ ప్రసారం ఒకటిగా నిలిచింది. అదే సమయంలో, అమెరికా తమ దేశంలో అంతర్గత అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు దేశంలో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ట్రంప్పై ఇరాన్ మీడియా చేసిన బెదిరింపులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్్కకు చెందిన స్టార్లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఇరాన్పై ఇప్పుడే దాడి చేయొద్దు: ట్రంప్ను కోరిన అరబ్ దేశాలు
ఇరాన్పై సైనిక దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్తో పాటు కొన్ని అరబ్ దేశాలు కోరినట్లు ఎన్బిసి న్యూస్ నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఇంకా అమెరికా దాడితో కూలిపోయేంత బలహీనంగా లేదని ఈ దేశాల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.ఇరాన్లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా నిరసనకారుల హత్యలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన క్రమంలో ఈ నివేదిక వెలువడింది.నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో పాలన మార్పునకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేవలం విదేశీ సైనిక దాడితో ఆ లక్ష్యం సాధ్యం కాదని అమెరికా అధికారులకు స్పష్టం చేశారు. అలాంటి దాడి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా పరిస్థితిని మరింత సంక్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.సైనిక చర్యలకు బదులుగా, ఇరాన్ ప్రభుత్వాన్ని లోపలినుంచి బలహీనపరిచే వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇందులో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను ఎదుర్కొనేందుకు ఇరానియన్ ప్రజలకు సహాయం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, సైబర్ దాడులు నిర్వహించడం, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఉన్నతాధికారులపై పరిమిత చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఇరాన్పై అమెరికా నేతృత్వంలో దాడి చేపట్టేందుకు పొరుగు దేశాల మద్దతు లేదని ఒక అరబ్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకార చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకమయ్యే ప్రమాదం కూడా ఉందని మరో అరబ్ అధికారి హెచ్చరించారు. -
భారత్ను ఆశ్రయిస్తున్న ఇరాన్..!
అశాంతి, ఆందోళనలు ఒకవైపు.. యుద్ధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి బెదిరింపులు.. వెరసి ఇరాన్ ప్రభుత్వం కకలావికలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ను ఎదుర్కొనేందుకు భారతే అండగా ఉంటుందని ఇరాన్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా ఎక్స్ లో బుధవారం పోస్టు చేశారు. ఆ వెంటనే ఇరాన్లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ విదేశాంగ శాఖ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం..!అయితే.. తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను జైశంకర్ పంచుకోలేదు. ఇరాన్లో పరిస్థితులపై చర్చించినట్లు మాత్రం వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ ఇప్పుడు భారత్ మద్ధతు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మంగళవారం కూడా మంత్రి జైశంకర్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్(ఐఓఆర్ఏ) సెక్రటరీ జనరల్ సంజీవ్ రంజన్తో సమావేశమయ్యారు. ఐఓఆర్ఏ సభ్య దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కీలక రంగాలను సమీక్షించారు. ప్రభుత్వాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలకు సంబంధించిన సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. -
ఎర్ర సముద్రంలోకి అమెరికా నౌక..
ఇరాన్పై యుద్ధం దిశగా అమెరికా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. యూఎస్ విమాన వాహక నౌక రూజ్ వెల్ట్ ఇటీవలే ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది. ఈ మేరకు యూఎస్ సైనిక అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.అదే సమయంలో, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక జలాంతర్గామితో పాటు మూడు క్షిపణి విధ్వంసక నౌకలు కూడా మోహరించబడి ఉన్నాయని ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టవచ్చిన చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు పెంటగాన్ పలు ఎంపికలను సమర్పించింది. వీటిలో సైబర్ దాడులు అలాగే హోంల్యాండ్ సెక్యూరిటీ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే చర్యలు కూడా ఉన్నట్లు సమాచారం.ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఎర్ర సముద్రం, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని బలోపేతం చేయడం ద్వారా తమ మిత్ర దేశాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్కు అనుబంధంగా ఉన్న సాయుధ గుంపులు వాణిజ్య నౌకలపై దాడులు పెంచుతున్న నేపథ్యంలో, సముద్ర మార్గాల రక్షణకు ఈ మోహరింపు కీలకంగా మారింది.ఇదిలా ఉండగా, ఇరాన్తో ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దిగకుండా ఒత్తిడి పెంచడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచుతూనే, అవసరమైతే సత్వర స్పందనకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపడమే ఈ సైనిక కదలికల ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ రాజకీయాలపై, అలాగే ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్లో భారతీయులకు హైఅలర్ట్
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం టెహ్రాన్లోని భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. ‘‘ఇరాన్లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. భారతీయులు వెంటనే ఇరాన్ను వీడాలి. సురక్షిత దేశాలకు వెళ్లాలి. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు వీలైనంత తర్వగా ఆ దేశం నుంచి బయట పడాలి’’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.ఈ నెల 5న జారీ చేసిన అలర్ట్ తో పోలిస్తే.. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు జరుగుతున్న ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. నిత్యం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో టచ్లో ఉండాలని ఆదేశించింది. స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలని పేర్కొంది.మరోవైపు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో బుధవారం సాయంత్రం ఫోన్లో చర్చలు జరిపింది. కాగా.. ఇరాన్ అల్లర్లలో మరణాల సంఖ్య 12 వేలకు పెరిగినట్లు ‘ద గార్డియన్’ పత్రిక వెల్లడించింది. నిరసనకారులతోపాటు.. భద్రతాబలగాలు కూడా మృతిచెందినట్లు వివరించింది. బుధవారం సాయంత్రం 300 మృతదేహాలను టెహ్రాన్ వర్సిటీ ప్రాంగణంలో సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలను ప్రచురించింది. అయితే.. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ మాత్రం ఇప్పటి వరకు 2,550 మరణాలు నమోదైనట్లు తెలిపింది. వీరిలో 2,403 మంది నిరసనకారులు కాగా.. మిగతా 147 మంది ఐఆర్జీసీ, పోలీసు బలగాలకు చెందినవారని వివరించింది. -
అమెరికాను సమర్థంగా ఎదుర్కొంటాం: ఇరాన్
టెహ్రాన్: తమ దేశంపై అమెరికా దాడులు చేయనున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వైట్హౌస్ ప్రయత్నాలను తాము విఫలం చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ మహమ్మద్ బక్పూర్ స్పష్టం చేశారు.‘‘శత్రువు(అమెరికా) వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా.. తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ దాడినైనా ఎదుర్కొనే సామర్థ్యం, పూర్థిస్థాయి సన్నద్ధత మాకు ఉంది. శక్తిమంతమైన ఇరాన్కు వ్యతిరేకంగా వైట్హౌస్ పావులు కదుపుతూ.. భ్రమల్లో బతుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు.. ఇద్దరూ ఇరాన్ యువత హంతకులే’’ అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు ట్రంప్, నెతన్యాహుల కిరాయి సేనలు చేసిన క్రూరమైన దాడులను ఇరాన్ ఎప్పటికీ మరిచిపోదని, ఈసారి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. కాగా.. ఇరాన్పై యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోందని పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇక్కడ దాడులు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు.. బ్రిటన్ కూడా పశ్చిమాసియాలోని తమ బేస్లలో ఉన్న సైన్యం, వైమానిక దళాలను వెనక్కి రప్పిస్తున్నాయి. -
పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్
దుబాయ్: తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది. ఇరాన్కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది. కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం. -
ఇరాన్పై యుద్ధం.. హింట్ ఇచ్చిన ట్రంప్?!
టెహ్రాన్: ఇరాన్లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది. -
ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎంక్యూ-4సీ ట్రైటాన్జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇరాన్లో కల్లోలం - ట్రంప్ హెచ్చరికప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.తిరిగి వస్తున్న యుద్ధనౌకలుగత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ -
ఇరాన్ లో మారణహోమం.. 12 వేల మంది మృతి
-
యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులుఅధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్తో భారత్కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.ఎగుమతులు-దిగుమతులుభారత్ నుంచి ఇరాన్కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.ట్రంప్ హెచ్చరిక - భారత్పై ప్రభావంట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.భారత్ ఇరాన్కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవుభారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బఅమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు -
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది. అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఇరాన్కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా. అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. -
రావణకాష్టంగా ఇరాన్
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సము దాయాలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఉద్యమ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను స్తంభింపజేసింది. అయితే నాలుగు రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్కాల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత రెండు వారాలుగా తాము పడుతున్న బాధలు, నరకయాతనను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరవు పెట్టారు. సెంట్రల్ టెహ్రాన్లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మొహరించారని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బంధువులకు చెప్పారు.ఆన్లైన్ సదుపాయం లేక బ్యాంక్లలో నగదు లావాదేవీలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుండటంతో జనాలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకారులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తూ కాల్పులు జరుపుతుండటంతో ఉద్యమసంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 2,003 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ మంగళవారం ప్రకటించింది. వీరిలో 1,850 మంది ఉద్యమకారులుకాగా 135 మంది పోలీసులు ఉన్నారు. అభంశుభం తెలియని 9 మంది చిన్నారులు, ఉద్యమంలో పాల్గొనని 9 మంది సాధారణ జనం సైతం కాల్పుల్లో కన్నుమూశారు. మరోవైపు అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేస్తే ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగడం ఖాయమన్న అంచనాలతో ఇరానియన్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనల ధాటికి దుకాణాలు మూతబ డుతున్నాయి. నిరంకుశ, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగి ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాదిగా జనం వీధుల్లో నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన ఖమేనీ సర్కార్ పోలీసులను రంగంలోకి దింపి లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెప్తోంది. పోలీసులు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణల్లో వేలాది మంది గాయపడ్డారు. గత రెండువారాల వ్యవధిలో 10,700 మందికిపైగా నిరసనకారులను ప్రభుత్వం అరెస్ట్చేసింది.ఉద్యమకారుడు ఇర్ఫాన్ను ఉరితీస్తాం..సుప్రీంకమాండర్ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరనస ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్ సొల్తానీని బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్ను ప్రభుత్వం బలితీసుకుంటోందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ‘హెంగ్వా ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. టెహ్రాన్ శివారు కరాజ్లోని ఫర్దీస్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ను జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించాడని ఇర్ఫాన్పై నేరాభియోగాలు మోపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుని ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడూ చూడలేదని టెహ్రాన్వాసులు అసహనం వ్యక్తంచేశారు. ఇర్ఫాన్ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమె ఈ కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ఇరాన్లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక అడ్వైజరీని జారీచేసింది.నేనున్నా.. రెచ్చిపోండి: ట్రంప్ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడారు. ఈ మేరకు ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరానియన్లు దేశ భక్తులు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి. హంతకులు, దాడులు చేసే వారి పేర్లను రాసిపెట్టుకోండి. మనందరం కలిసి వాళ్ల అంతుచూద్దాం. దాడులకు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దారుణ హత్యోదంతాలు ఆగేదాకా ఇరాన్ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. అందుకే ఇరాన్ అత్యున్న తాధికారులతో అన్నిరకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నాం. త్వరలోనే మీకు మా సాయం అందుతుంది. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగేన్’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారో ట్రంప్ వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ చెప్పారు. -
ఇరాన్పై టారిఫ్ కొరడా!
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణిచేస్తున్న ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా దాడులతో సమాధానం చెబుతుందని అంతా భావిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా టారిఫ్ల కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, నిరసనలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఇరాన్ను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేలా, వాణిజ్యరంగంలో ఇరాన్ను ఏకాకిని చేసేలా ట్రంప్ పథక రచన చేశారు.ఇందులోభాగంగా ఇకపై ఇరాన్తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి దేశంపై తాము 25 శాతం అదనపు టారిఫ్లను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘మాతో వ్యాపారం చేసే దేశాలు ఒకవేళ ఇరాన్తోనూ వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే ఆ దేశాలపై అదనంగా 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.భారత్పై పడనున్న పెను ప్రభావం ట్రంప్ తాజా నిర్ణయం భారత్ను ఇరకాటంలో పడేసింది. ఇరాన్కు ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటి. చైనా, తుర్కియే, యూఏఈ, పాకిస్థాన్లతో పాటు భారత్ కూడా ఇరాన్తో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఆంక్షల వలయంలో ఉన్న భారత్పై రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు జరుపుతున్నందుకుగాను, అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించింది. ఇప్పుడు ఇరాన్తో సంబంధాల కారణంగా అదనంగా మరో 25 శాతం భారం పడనుంది. దీంతో అధిక టారిఫ్లకు భయపడి ప్రపంచదేశాలు ఇరాన్తో వాణిజ్యాన్ని పూర్తిగా తగ్గించుకుంటాయి.అంతర్జాతీయ వాణిజ్యం కునారిల్లడంతో విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో ఇరాన్ చివరకు ఏకాకిగా మారుతుందని, అప్పుడు తాను చెప్పిన మాట ఇరాన్ వింటుందని అమెరికా భావిస్తోంది. అయితే అధిక టారిఫ్ కారణంగా ఇకపై ఇరాన్తో భారత వాణిజ్య పరిమాణం భారీగా తగ్గే ప్రమాదముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత్–అమెరికా వాణిజ్య బంధంపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే వీలుంది. ఇరాన్తో భారత్ వేల కోట్ల వాణిజ్యంఇరాన్తో భారత్ వాణిజ్య బంధం కేవలం వ్యూహాత్మకమే కాదు, ఆర్థికంగానూ కీలకమైనది. 2023లో భారత్ నుంచి ఇరాన్కు దాదాపు 1.19 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,740 కోట్లు) ఎగుమతులు జరిగాయి. ఇందులో సింహభాగం బాస్మతి బియ్యానిదే. ఏటా దాదాపు రూ.6,623 కోట్ల విలువైన బియ్యం ఇరాన్కు ఎగుమతి అవుతోంది. తేయాకు, పంచదార, ఔషధాలు, సోయాబీన్ సైతం ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షల భయంతో ఈ ఎగుమతులు నిలిచిపోతే, దేశీయ మార్కెట్లో ఈ పంటల ధరలు పడిపోయి అన్నదాతలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.అలాగే ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే డ్రైఫ్రూట్స్, రసాయనాల ధరలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఇరాన్ నుంచి భారత్ 1.02 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,205 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో డ్రైఫ్రూట్స్ (ఎండు ద్రాక్ష, అంజీర్), రసాయనాలు, గాజు పాత్రలు ఉన్నాయి. డీజీసీఐఎస్ 2025 గణాంకాల ప్రకారం ధాన్యాల ఎగుమతి 64.9 కోట్ల డాలర్లుగా ఉండగా, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 7.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కృత్రిమ నారలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కృత్రిమ ఆభరణాల వంటివీ ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి.అగమ్యగోచరంగా ‘చాబహార్’ భవిష్యత్తుభారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ అత్యంత కీలకమైనది. పాకిస్థాన్ను పక్కనపెట్టి మధ్య ఆసియాకు చేరేందుకు భారత్ దీనిని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. 2024 మే నెలలో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్లోని షాహిద్ బెహెష్తీ టెర్మినల్ నిర్వహణ కోసం ఇరాన్తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఓడరేవు అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడే అవకాశం ఉంది.భారత్–ఇరాన్ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. ఒకవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా.. మరోవైపు వ్యూహాత్మక మిత్రదేశమైన ఇరాన్. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు భారత్కు పెద్ద సమస్యగా తయారైంది. డాలర్ ఆధిపత్యం లేకుండా రూపాయి మారకంలో వాణిజ్యం చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్ను వదులుకునే సాహసం భారత్ చేయలేకపోవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన మంత్రం ప్రయోగిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఇరాన్లో నిరసనకారుడు ఇర్ఫాన్కి ఉరి శిక్ష: అంతర్జాతీయ ఆందోళన
ఇరాన్లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానీకి ఉరి శిక్ష విధించనున్నట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. రాజధాని టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరంలో జరిగిన నిరసనల సందర్భంగా సోల్తానీని గత వారం అరెస్టు చేశారు. సరైన విచారణ లేకుండా జనవరి 14న అతనికి ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు కుటుంబానికి సమాచారం అందింది. నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటివరకు నిరసనలలో 648 మంది మరణాలు అధికారికంగా నమోదు అయ్యాయని IHR తెలిపింది. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని అంచనాల ప్రకారం, మరణాల సంఖ్య 6,000 దాటే అవకాశం ఉంది. ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా స్వతంత్ర ధృవీకరణ కష్టమవుతోంది. ఇప్పటివరకు 10,000 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరో మానవ హక్కుల సంస్థ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (NUFD) సోల్తానీ ఉరి శిక్షను ఆపాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. సోల్తానీ చేసిన నేరం ప్రజాస్వామ్యం కోసం తన గొంతు వినిపించడం మాత్రమేనని NUFD పేర్కొంది. అమెరికా నివేదిక ప్రకారం, కరాజ్లో శనివారం నిరసనల సమయంలో సోల్తానీని అరెస్టు చేశారు. సోల్తానీపై "దేవునిపై యుద్ధం చేస్తున్నాడు" అనే అభియోగం మోపబడింది. ఈ అభియోగం ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్షకు దారితీస్తుంది. న్యాయవాదిని కలిసే హక్కు కూడా అతనికి నిరాకరించబడిందని NUFD ఆరోపించింది. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. సోల్తానీకి ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్నది ఇంకా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ఈ ఘటన ఇరాన్లో ప్రజాస్వామ్య ఉద్యమాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందా లేదా ప్రభుత్వం మరింత కఠినతర చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. -
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మంది మృతిఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. అయితే ఇరాన్ రెడ్లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP— Open Source Intel (@Osint613) January 13, 2026 -
కంత్రి ట్రంప్.. అసలు ఉద్దేశం బయటపడిందిగా!
ట్రంప్ ఉద్దేశం నిజంగా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ తీయడమేనా?. అందుకే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించారా?.. ఇక మీదట ఏ దేశం కూడా ఇరాన్ వైపు చూడకూడదనేదే ఆయన ఆలోచనా?. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే కాదేమో అనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన కనిపిస్తోంది ఆయన వ్యవహారం.‘‘మోదీ-ట్రంప్ది నిజమైన స్నేహం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారత్-అమెరికా రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం అనేది చాలా కీలకం. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇక సుంకాలనేవి పెద్ద విషయమే కాదు. మాకు భారత్ తర్వాతే ఎవరైనా’.. ఇది భారత్కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో.. ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం.. ఏదైనా సరే అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ నిర్ణయాలు భారత్ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్ యద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకున పెడుతున్నామని చెబుతూ.. భారత్పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే.. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల పెంపు నిర్ణయం భారత్కు వర్తించనుంది. దీంతో ట్రంప్ అసలు టార్గెట్(రష్యా, ఇరాన్..)తో పాటు భారత్ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్నేహ హస్తం చాస్తూనే..రెండో దఫా అధికారంలోకి వచ్చాక భారత్తో ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్ అమెరికాకు బాగా కావాల్సిన దేశమని.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారాయన. అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం లేదు. కీలక సదస్సులకు కూడా ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహ బంధానికి బీటల వారిందా? అనే చర్చా నడిచింది. అయితే.. ‘‘నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి..’’ అంటూ ఓ వారం కిందట కూడా ట్రంప్ మాట్లాడారు.ఇంకా అయిపోలేదు.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ కరెక్ట్గా లేదంటూ ప్రతీకార సుంకంగా 25 శాతం.. అటుపై వద్దని చెబుతున్నా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతున్నారంటూ పెనాల్టీ పేరు చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలను ఆయన తన మిత్రదేశం పైనే విధించినట్లైంది. అందునా.. ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుండానే(నాన్చుతూ వస్తున్నారు) ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతలతో దానిని 75 శాతానికి పెంచారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. రష్యాతో చమురు వాణిజ్యం జరిపే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధించే బిల్లుపై ఆయన ఇప్పటికే సంతకాలు చేశారు. ఆ బిల్లును రేపోమాపో అమెరికా చట్ట సభలో ముందుకు కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు అమెరికాతో భారత్ సంబంధాలు బలహీన పడ్డాయి. ఆయన తీరు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరింత అధ్వాన్నం కావొచ్చనే అమెరికా మాజీ విదేశాంగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.ఇరాన్-భారత్.. ఎలాంటి ఎఫెక్ట్రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం వైఖరి మొండిగానే కనిపిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని.. జాతి ప్రయోజనాలకు తగ్గట్లు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా.. దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇరాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించబోతుంది.. ఇరాన్ నుంచి భారత్ మెథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరాలు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఇరాన్కు.. ఆర్గానిక్ కెమికల్స్, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్-భారత్ మధ్య 2024-2025 వాణిజ్యం విలువ.. అక్షరాల రూ.14,000 కోట్లు. అందులో భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.10,000 కోట్లు కాగా, దిగుమతులు రూ.3,700 కోట్ల పైమాటే. అయితే.. ట్రంప్ 2018లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. ఎంతగా అంటే.. 2019లో ఆ వాణిజ్యం విలువ రూ.1.5 లక్ష కోట్లుగా ఉండేది. మరి తాజా ఆంక్షలతో ఏం జరుగుతోందో చూడాలి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కొత్త టారిఫ్లు కఠినంగా అమలు చేస్తే.. భారత కంపెనీలు అమెరికా మార్కెట్ యాక్సెస్ కాపాడుకోవడానికి ఇరాన్తో వ్యాపారాన్ని తగ్గించవలసి రావొచ్చు. అదే జరిగితే.. ఇరాన్కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.చాబహార్పై డైలమా?భారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ పాత్ర అత్యంత వ్యూహాత్మకం. పైగా భారత్ అక్కడ షహీద్ బెహేష్తీ టెర్మినల్ అభివృద్ధి చేస్తోంది. అయితే.. 2018 ఆంక్షల సమయంలో భారత్ విజ్ఞప్తి మేరకు ట్రంప్ సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చారు. తిరిగి.. 2025 సెప్టెంబర్లో పరిస్థితుల ప్రభావమని చెబుతూ ఆ మినహాయింపును రద్దు చేశారు. దీంతో ఆ మినహాయింపు ఏప్రిల్ 29తో ముగియనుంది. దీంతో మినహాయింపు గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.ఏమై ఉండొచ్చు.. తనను తాను శాంతి కాముకుడిగా చెప్పుకుని తిరుగుతున్న ట్రంప్.. పెద్దన్న హోదాలో వరుసగా యుద్ధాలను ఆపుతున్నానంటూ హడావిడి చేస్తున్నారు. ఈ వంకతో నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని పక్కా ప్లాన్డ్తో ముందుకు సాగారు. కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ట్రంప్ను నోబెల్ వరించలేదు. దానికి భారత్ మోకాలు అడ్డుపెట్టిందని ఆయన బలంగా భావించి ఉండొచ్చు. పాక్తో ఉద్రిక్తతలు చల్లారడంలో ట్రంప్ ప్రేమయం(మూడో వ్యక్తి) లేదని ఢిల్లీ వర్గాలు తేల్చేశాయి. ఈ ప్రకటన ఆయనకు స్వతహాగా కోపం.. అసహనం తెప్పించి ఉండొచ్చు. పోనీ ఉక్రెయిన్ యుద్ధంతోనైనా నోబెల కల నెరవేరిందా? అంటే అదీ లేదు. వాణిజ్యం ఆపేయకుండా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ పరోక్షంగా సహకరించిందనే కోపమూ ఉండొచ్చు. వీటన్నింటితో పాటు షాంగై సదస్సు వేదికగా.. పుతిన్-జింగ్పిన్-మోదీల స్నేహంగా మెదలడమూ ట్రంప్కు నచ్చకపోయి ఉండొచ్చు. కారణాలేవైనా.. భారత్ విషయంలో ఆయన అనుకున్నది చేస్తూ పోతున్నారు. -
ట్రంప్ టారిఫ్ తో ఆదేశాలకు ఎఫెక్ట్..
-
ఇరాన్కు కొత్త టెన్షన్.. చైనా కరుణించేనా?
టెహ్రాన్: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ ఖమేనీకి కొత్త టెన్షన్ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తమీర్ హేమాన్ ధృవీకరించారు. దీంతో, ఇజ్రాయెల్ దాడుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా తమీర్ హేమాన్ మాట్లాడుతూ.. ఇరాన్లో ఇటీవలి పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసింది. గడిచిన రెండు వారాల్లో రెండు సార్లు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసే వరకు వెళ్లింది. కానీ, ఇరాన్పై అమెరికా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని దాడులు చేయలేదు. ఇరాన్కు సంబంధించి అమెరికాతో చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు లేవు. ఇరాన్లో ఇప్పటికే ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి.ఇక, ఇరాన్లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలిసింది.🔥 BREAKING: Israel came this close to striking Iran, twice, in the last few weeks. Former IDF intelligence chief Tamir Hayman just confirmed what many feared: we’re on the edge of something massive.👇— Fouled Anchor 🇺🇸🍊 (@anchor_fouled) January 13, 2026మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. చైనాను సాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కూడా ఇరాన్కు చైనా సాయం అందించింది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్కు పంపినట్లు తెలిసింది. మూడు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ మూడు విమానాలూ కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వైపు నుంచి ఇరాన్ సమీపంలోని వెళ్లాయి. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. అతడికి ఉరిశిక్ష
టెహ్రాన్: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే దాదాపు 600 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు కానుంది. దీంతో, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వివరాల మేరకు.. టెహ్రాన్ శివారులోని కరాజ్ సమీపంలోని ఫర్దిస్కు చెందిన సోల్తానీ జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన సోల్తానీ అరెస్టు అయ్యాడు. అయితే, ఇరాన్లో నిరసనల నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులను హెచ్చరించే క్రమంలో సోల్తానీకి మరణ శిక్షను విధించారు. ఒక మానవ హక్కుల సంస్థ, మీడియా నివేదికల ప్రకారం.. సోల్తానీకి విధించిన శిక్ష బుధవారం అమలు కానుంది. కాగా, గతంలో ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి మరణశిక్షను ఒక సాధనంగా ఉపయోగించినప్పటికీ, ఆ మరణ శిక్షలు ఎక్కువగా కాల్చివేతల ద్వారానే అమలు చేయబడ్డాయి. కానీ, ప్రస్తుత నిరసనలలో మాత్రం మొదటిసారిగా సోల్తానీని ఉరితీయనున్నట్టు సమాచారం. నిరసనల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. Erfan Soltani is scheduled to be executed by hanging in Iran in 48 hours.He was arrested in Karaj on January 9 for taking part in the protests. His family was given just 10 minutes to say goodbye. No lawyer. No fair trial. Days later, the Islamic regime sentenced him to death.… pic.twitter.com/jxRwCJznpj— Sarah Raviani (@sarahraviani) January 12, 2026కుబుంబ సభ్యుల ఆందోళన.. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ నివేదించిన ప్రకారం సోల్తానీ కేసు తదుపరి విచారణలను నిరోధించే లక్ష్యంతో వేగంగా మరణ శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక, నార్వేలోని కుర్దిష్ పౌర హక్కుల సంస్థ ఈ మరణ శిక్ష అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సోల్తానీ అరెస్ట్ అయిన నాటి నుంచి అతడిని న్యాయవాది సంప్రదించడం, తన వాదనలను వినిపించే అవకాశం కూడా దక్కలేదు. అరెస్టు చేసిన అధికారి గుర్తింపుతో సహా కేసులోని కీలక అంశాల గురించి అతని కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, షెడ్యూల్ ప్రకారం అతడికి మరణ శిక్ష అమలు చేస్తామని అధికారులు తమకు తెలియజేశారని సుల్తానీ కుటుంబ సభ్యులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.అనుకూల ప్రదర్శనలు.. తాజాగా ఇరాన్లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘అమెరికన్- ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ తిరుగుబాటు’గా ఈ ప్రదర్శనలను ఇరాన్ (Iran) అధికారిక మీడియా ప్రసారం చేసింది. కాగా, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలన్నింటిపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.ట్రేడింగ్ ఎకనమిక్ డాటా బేస్ ప్రకారం.. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లు ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే.. భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఇక భారత్ కూడా ఇరాన్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామే. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% (5.1 బిలియన్ డాలర్లు) భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇరాన్పై ఇప్పటికే.. అణ్వాయుధాల నేపథ్యంతో ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేయడం, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం.. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పించడం.. అలాగే.. ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే.. ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రామ్లకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సభ్యులు, ఆ దేశం తరఫున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయడం, వాళ్లు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బ తీయడానికే.. వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది.చల్లారని జ్వాలలుఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమైన సంగతి తెలిసిందే. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో.. వందల మంది మరణించగా(646 మంది అని తాజా సమాచారం).. వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉరి తీతలకు కూడా సిద్ధమైంది. అయితే ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు.చర్చలంటూనే..ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పబ్లిక్గా ట్రంప్ కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇరాన్ను వేరే రీతిలో డీల్ చేస్తన్నారని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ, అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారామె. ఈ తరుణంలో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబ్ పేల్చడం గమనార్హం. -
చర్చలకు దిగొచ్చిన ఇరాన్
దుబాయ్: దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సామరస్యంగా చర్చించుకుందామని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ నాయకత్వంతో చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. అయితే నిరసనకారుల మరణాల సంఖ్య ఇలాగే పెరిగితే మాత్రం తాను చర్చలకు బదులు ‘చర్యలు’ తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్ హెచ్చరించారు. ‘‘మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గట్టి ఆప్షన్లనే పరిశీలిస్తున్నాం’’ అని వెల్లడించారు. అమెరికా దాడికి దిగితే దీటుగా తిప్పికొడతామన్న ఇరాన్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా, ‘వారు అదే చేస్తే కనీవినీ ఎరగని రీతిలో వారిపై విరుచుకుపడతాం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చర్చల ప్రకటనపై ఇరాన్ ధ్రువీకరించలేదు. అయితే అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధకార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాచీ చెప్పారు. అయితే అవి ఏకపక్షంగా ఉంటే అంగీకరించబోమన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ మాత్రం నిరసనల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, రక్తపాతాల ఏకైక ఉద్దేశం తమపై దాడికి అమెరికాకు అవసరమైన సాకు కల్పించడమేనని దుయ్యబట్టడం విశేషం. మరోవైపు మూడో వారానికి చేరిన ఇరాన్ ఆందోళనల్లో మృతుల సంఖ్య599కు చేరుకున్నట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వీరిలో 525 మంది దాకా నిరసనకారులు కాగా మిగతా మృతులు పోలీసు, భద్రతా సిబ్బంది అని పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్య 11 వేలు దాటినట్టు తెలిపింది.ప్రదర్శనల్లో అధ్యక్షుడు..నిరసనలు నింగినంటుతున్న వేళ ఇరాన్లో మరో పరిణామం చోటుచేసుకుంది. వాటికి ప్రతిగా ప్రభుత్వ అనుకూలంగా ఉన్న వేలాది మందితో ఇరాన్ సర్కారు రాజధాని టెహ్రాన్లో భారీ ప్రదర్శనలకు దిగింది. అధ్యక్షుడు పెజెష్కియాన్తో పాటు విదేశాంగ మంత్రి తదితరులు వీటిలో పాల్గొనడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రజాగ్రహంగా ఇరాన్ వీటిని అభివర్ణించింది. కెర్మన్, రష్త్ తదితర పట్టణాల్లోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు, ఇరాన్లో సుస్థిరత నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. ఈ విషయంలో బయటి శక్తుల ప్రమేయానికి తావుండరాదని స్పష్టం చేసింది. సొంత ప్రజల మీదే ఇరాన్ యంత్రాంగం ఇంత దారుణంగా దమనకాండకు దిగడం దారుణమని జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ విమర్శించారు. నిరసనకారుల ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.స్టార్ లింక్ సేవలు కట్మిన్నంటుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కట్టడి చేసే యత్నాల్లో భాగంగా ఇరాన్లో స్టార్ లింక్ ఉపగ్రహ సేవలను ఖమేనీ యంత్రాంగం నిలిపేసింది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ ‘కిల్ స్విచ్’ను యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఈ అత్యాధునిక జామింగ్ పరిజ్ఞానాన్ని ఇరాన్కు రష్యా లేదా చైనా అందించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కొద్దిరోజుల క్రితమే నిలిపేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ నెట్వర్క్ ద్వారానే అక్కడి సమాచారం అంతో ఇంతో బయటి ప్రపంచానికి తెలుస్తూ వస్తోంది. తాజాగా ఆ లింకును ఇరాన్ తెంచేసింది. ఏమిటీ కిల్ స్విచ్?స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసేందుకు ఇరాన్ యంత్రాంగం వాడిన కిల్ స్విచ్ ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిలిటరీ గ్రేడ్జామింగ్ ఎక్విప్మెంట్. దీని ఖరీదు 15.6 లక్షల డాలర్లని సమాచారం. స్టార్లింక్ రిసీవర్లు తమ యూజర్లను లొకేట్ చేసి వారితో కనెక్టయ్యేందుకు జీపీఎస్ను వాడతాయి. మిలిటరీ గ్రేడ్ జామర్లు ఆ లింకును తెంపేస్తాయి. అందుకోసం సదరు ఉపగ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో సిగ్నళ్లను విడుదల చేస్తాయి. మొత్తం వ్యవస్థను కలిపి కిల్ స్విచ్గా పేర్కొంటారు. 2014 నుంచీ రష్యా ఈ టెక్నాలజీని వాడుతోంది. -
అష్టదిగ్బంధంలో ఇరాన్!
సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు. పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది. ఇరాన్కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది. పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి. -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ వార్నింగ్
-
రెడ్ లైన్ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం
ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్కు అమెరికా మరో సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘‘ఇరాన్ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. కరెన్సీ పతనం, బడ్జెట్లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్ 28న తేదీన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి. హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్పై దాడి జరిగితే, ఇజ్రాయెల్తో పాటు అన్ని అమెరికా బేస్లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన. 2022 తర్వాత ఇరాన్లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిపై మోరల్ పోలీసింగ్ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది. ఇరాన్పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్ సైబర్ ఎటాక్స్, ఇరాన్పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్తో మాట్లాడి స్టార్లింక్ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. -
దద్దరిల్లుతున్న ఇరాన్.. ఖమేనీ ఫోటో కాల్చి సిగరెటికి నిప్పు
-
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
దాడి చేస్తే అంతు చూస్తాం
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు. ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు. వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నిరసనల వెల్లువ! ఇరాన్లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్లైన్లో వైరల్గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మషాద్లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదమే ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 538 మందికి పైగా బలి !రెండు వారాలకు పైగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం. టెహ్రాన్లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 30 మందిని, కెర్మన్షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు. బలహీనంగా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్ ఇరాన్ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్వైడ్గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
ఇరాన్లో నిరసనలు ఉధృతం
టెహ్రాన్/దుబాయ్: నింగినంటుతున్న నిత్యావసర సరకులు ధరలు, పేదికకం, అవినీతి, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజల్లోంచి పెల్లుబికిన ఉద్యమాగ్ని మరింత ఎగసిపడుతోంది. రెండు వారాలుగా ఉద్యమిస్తున్న నిరసనకారుల శనివారం సైతం తమ ఆందోళనను కొనసాగించారు. ఉత్తర టెహ్రాన్లోని సాదత్ అబాద్ ప్రాంతంలో వేలాది మంది స్థానికులు రోడ్ల మీద కొచ్చి భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఖమేనీ, ఆయన పాలన అంతమవ్వాలి అని నినదించారు. ఇస్ఫమాన్ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలపైకి ఆందోళనకారులు గ్యాసోలిన్ బాంబులను విసిరేశారు. మహిళలు తమ హిజాబ్లను తొలగించి తగలబెట్టారు. నియంత పాలన నశించాలని నినదించారు. ఈ సందర్భంగా ఖమేనీ చిత్రపటానికి నిప్పంటించారు. అయితే ఆందోళనకారుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేందుకు, తాజా సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను స్తంభింపజేసింది. అయినాసరే ఆందోళనలు మరింత విస్తృతమవుతూ ఖమేనీ సర్కార్కు పెనుసమస్యగా మారాయి. దీంతో ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ అజాద్ రంగంలోకి దిగి ఆందోళనకారులన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అత్యంత కఠిన శిక్షలు విధిస్తాం. అలాంటి వాళ్లంతా దేవునికి శత్రువులే. వాళ్లకు మరణశిక్ష వేస్తాం’’అని అన్నారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో ఇప్పటిదాకా 551 మంది చనిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. హింసిస్తే దాడులు చేస్తా: ట్రంప్ ఇరాన్లో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తన మద్దతు మరోసారి ప్రకటించారు. ‘‘శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఇరాన్ ప్రజలపై ఖమేనీ ప్రభుత్వం విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఆందోళనలను అణిచివేసే క్రమంలో నిరసనకారులను పొట్టనబెట్టుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దళాలు రంగంలోకి దిగడం ఖాయం’’అని ట్రంప్ అన్నారు. ఉధృతంచేయండి: యువరాజు పిలుపు ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశాన్ని వీడిన ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ శనివారం ఆందోళనకారులకు తాజాగా మరో సందేశం పంపించారు. ‘‘అందరూ జాతీయ జెండాలు, చిహా్నలతో వీధుల్లోకి వచ్చేయండి. శనివారం, ఆదివారం సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టండి. కేవలం వీధుల్లోకి వస్తే సరిపోదు. నగరాల కూడళ్లను ఆక్రమించండి. నేను కూడా ఉద్యమకారునిగా మారతా. త్వరలోనే మాతృభూమిపై అడుగుపెడతా’’అని వీడియో సందేశంలో పహ్లావీ పేర్కొన్నారు.నారీ నిరసన... కొత్తగా టెహ్రాన్: ఇరాన్లో అయొతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలో 1979లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఇస్లామిక్ చైతన్యవిప్లవంలో మహిళా హక్కులు మాడిమసైపోయినందుకు తీవ్ర నిరసనగా నేడు మహిళాలోకం కొత్త తరహాలో ఉద్యమిస్తోంది. ఖమేనీ ఫొటోకు నిప్పుపెట్టి ఆ తర్వాత తగలబడిపోతున్న అదే ఫోటోతో తమ సిగరెట్ను అంటించుకుంటూ అతివలు తమలోని నిరసనజ్వాలలను జనానికి తెలియజేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన ద్రవ్యోల్బణం, అవినీతి, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజలు గత కొద్దిరోజులుగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తుండటం తెల్సిందే. వీటికితోడు మహిళాలోకం చేస్తున్న ఈ నయా నిరసనకు ఆన్లైన్ వేదికలు జై కొట్టాయి. -
అమ్మాయిల నోట్లో సిగరెట్.. చేతిలో లైటర్..
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran! Young Iranian women are leading the revolution against the Islamic regime.pic.twitter.com/UIFYHMPBGA— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026అయితే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.Iranian women burning their hijabs in Tehran tonight. Protesters are also torching property linked to Islamic regime forces, including vehicles, mosques, and even their residences.This is a message not only to the regime, but for the who world to see#Iran #IranRevolution2026 pic.twitter.com/A910OUoJSL— acpcrf (@acpcrf) January 10, 2026ఇక, డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.These Iranian women are showing their faces, no burkas, no fear...inside Iran....calmly smoking while burning a photo of Khamenei.That takes more courage than the entire Western left-wing feminist class combined.These women aren’t posting slogans or trying to run over law… pic.twitter.com/dZItOJzwzw— Flopping Aces (@FloppingAces) January 9, 2026 -
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
దుబాయ్: ఇరాన్లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. ఇరాన్ యువరాజు పిలుపుగురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్కాల్స్పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. -
ఇరాన్లో ఉద్రిక్తతలు.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్కు విజ్ఞప్తి
ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలలో మరణాల సంఖ్య 62కి పెరిగింది.ఈ నేపథ్యంలోనే ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్కు రెజా పహ్లవి విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో నిరసనలు చెలరేగుతున్న ఇరాన్ దివంగత రాజు బహిష్కృత కుమారుడు రెజా పహ్లవి కోరడం హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్టర్ అమెరికా ప్రెసిడెంట్.. దయచేసి ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.మరోవైపు నిరసనకారులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ హెచ్చరించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలాంహోస్సేన్ మొహ్సేని-ఎజెయ్ శిక్షను అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన నిరసనకారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్, విదేశీ దేశాలతో కమ్యూనికేషన్ను నిషేధించింది.నిరసనల మధ్య ఖమేనీ ప్రసంగంటెహ్రాన్లో అశాంతి మధ్య.. సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా సమస్యలపై దృష్టి పెట్టాలని ట్రంప్కు సూచించారు. నిరసనకారులు మరొక దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖమేనీ అన్నారు. దేశం విదేశీ కిరాయి సైనికులను సహించదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారు. నిరసనలపై ఇరాన్ రాష్ట్ర టీవీ ఒక నివేదికలో ఇజ్రాయెల్ మరియు అమెరికన్ "ఉగ్రవాద ఏజెంట్లు" హింసను ప్రేరేపించారని నిందించిన తర్వాత సుప్రీం లీడర్ ప్రకటన వచ్చింది.Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026 -
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది. -
ఆయన్ని సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయొద్దు
తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్లో ఖమేనీ స్పందిస్తూ..మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.మీ సంగతి చూస్కోండినిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్కు ఖమేనీ హితవు చెప్పారు.ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2026 ఆర్థిక బడ్జెట్పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్గన్స్, వాటర్ కేనన్లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
ఖమేనీ వ్యతిరేక అల్లర్లతో భగ్గుమంటున్న ఇరాన్
-
47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..!
ఇరాన్లో నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్తో యుద్ధం అనంతరం ఇరాన్లో రాజకీయ సంక్షోభం ప్రబలింది. ప్రధానంగా ఇరాన్ సుప్రీంలీడర ఆయుతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతండటంతో ఆ దేశ ప్రజల ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛ జీవితం లేదని, ఇరాన్లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 47 ఏళ్లగా చచ్చిపోయే ఉన్నాను..ఒక మహిళ తడిసిన రక్తంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఖమేనీ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది. ఆమె నాలుకపై రక్తం కారుతున్న దృశ్యాలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. ‘ నేను 47 ఏళ్లుగా చచ్చిపోయే ఉన్నాను.. ఇంకా భయమెందుకు. ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది’ అంటూ పెద్దగా కేకలు పెడుతూ నిరసన వ్యక్తం చేయడం అక్కడ ఖమేనీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతోంది. నియంత ఇక లేడు.. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా ఉండదు..! ఇరాన్ నియంతగా పేరు గాంచిన ఖమేనీ ఇక లేడని, ఆయనకు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ కూడా ఇక ఇరాన్లో ఉండదని ప్రజలు తమ నిరసన గళం విప్పారు. తాము ఖమేనీ పాలనలో నలిగిపోయే ఉన్నామని, ఇక ఆ పరిపాలన వద్దంటూ కదం తొక్కుతున్నారు. ఖమేనీ స్వచ్ఛదందగా రాజీనామా చేస్తే ఓకే కానీ ఒకవేళ అలా జరగని పక్షంలో తామే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా.. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. I’m not afraid. I’ve been dead for 47 years this is the voice of a woman in Iran who is fed up with the Islamic republic.47 years ago, the Islamic Republic took our rights and turned a nation into hostages.Today people have nothing left to lose, they rise.Iran is rising. pic.twitter.com/GAawmynE0C— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 8, 2026 ఇదీ చదవండి:ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం -
ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది మరో ‘జెన్జీ’ కానుందా?ఇది క్రమంగా జెన్జీ(Gen-Z) ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ఆగ్రహంతో ఇరానీయులు వీధుల్లోకి వచ్చి, పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రజలు ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాలతో తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. Iranians have had enough.They want the regime to fall pic.twitter.com/31pKHpNZD2— Visegrád 24 (@visegrad24) January 9, 2026 ఫహ్లవి పిలుపుతో మరింత ఉధృతం..పహ్లవి గురువారం, శుక్రవారం స్థానిక సమయం రాత్రి 8 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెహ్రాన్లోని పలు ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆయన ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో ఉన్న పహ్లవి తిరిగి రావాలని ఇరాన్ ప్రజల ఆశాభావంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పహ్లవి తప్పకుండా తిరిగి వస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. Another video from Dolat Street in #Tehran, capital city of #Iran, shows protesters chanting slogans against the Islamic regime and expressing support for #RezaPahlavi, the leader of Iran’s revolution. #IranProtests pic.twitter.com/AO1SmFq9DT— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1) January 9, 2026 ట్రంప్తో కలిసి పని చేయండి.. పాలనను గాడిలో పెట్టండిఖమేనీతో పాటు, యూరోపియన్ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలసి పాలనను గాడిలో పెట్టాలని వాగ్దానం చేయాలని పహ్లవి డిమాండ్ చేశారు. ‘ ‘ఇరాన్ ప్రజలతో మళ్లీ సంబంధాలు ఏర్పడేలా అన్ని సాంకేతిక, ఆర్థిక, దౌత్య వనరులను వినియోగించమని నేను వారిని కోరుతున్నాను, తద్వారా వారి స్వరం మరియు సంకల్పం వినబడేలా, కనిపించేలా అవుతుంది. నా ధైర్యవంతమైన సహచరుల స్వరాలు మూగబారనివ్వకండి’ అని తెలిపారు. BREAKING:The people of Tehran are burning down regime buildings right now. The crowd is MASSIVE. pic.twitter.com/V5j6nwbLb4— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) January 8, 2026 -
..ఇక ఇరాన్ వంతు !!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ట్రంప్ అదుపు తప్పారు. ఆయనది మతిలేని దూకుడు’’ అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. వెనెజువెలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం కచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియాటుడే వార్తాసంస్థతో మాట్లాడుతూ శాక్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు’’ అని వెల్లడించారు. అమెరికాను ధూర్త దేశం (రోగ్ స్టేట్)గా శాచ్స్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ అంతకుమించిన ధూర్త దేశమంటూ ఆక్షేపించారు. ‘‘అవి రెండూ నిజంగా ఇరాన్పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ‘‘ఇరాన్ మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం మరో అర డజను దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్దేనని యూరప్ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.పిల్ల చేష్టల ట్రంప్సైన్యం, ముఖ్యంగా సీఐఏ, పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు, ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ శాక్స్ ఆరోపించారు. ‘‘ఇక ట్రంప్ నిజానికి ఓ ఉన్మాది. ఎక్కడ చమురు కనిపించినా అది తమదేననే రకం. ఆయనవి పిల్ల చేష్టలు. వెనెజువెలాపై ఆయనకు ఎప్పట్నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా 2017లో లాటిన్ అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు. వెనెజువెలాపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మదురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్స్టేట్ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేంది అధ్యక్షుడు కాదు, డీప్స్టేట్’’ అని శాక్స్ చెప్పుకొచ్చారు. ‘‘నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే వస్తోంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వెనెజువెలాలో అదే పునరావృతం అయ్యేలా కన్పిస్తోంది’’ అని అంచనా వేశారు. -
నెక్ట్స్ టార్గెట్ ఇరాన్? అదే జరిగితే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మారు మోగిపోతుంది. వెనెజువెలా అధ్యక్షున్ని ఆయన దేశంలోనే నిర్భంధించి అమెరికా జైల్లో పడేయడంతో.. ట్రంప్ మాటలే కాదు చేతలూ చేయగలడని అంతా అనుకుంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడి నెక్స్ట్ టార్గెట్ ఏ దేశమా? అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త జెప్రీ సాచస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉందన్నారు.ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టినాటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు లేకున్నా ఆ దేశానికి వ్యతిరేకంగా ఉన్నా అస్సలు సహించడం లేదు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్' అనే భావనతో చాలా దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధిక పన్నులు వేయడంతో పాటు ప్రత్యక్ష యుద్దాలకు వెనుకాడడం లేదు. తనకు అనుకూలంగా లేని దేశాలను ఇన్ని రోజులు మాటలతో హెచ్చరించిన ట్రంప్ తాజాగా తన సత్తా ఎంటో చూపాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే నెపంతో వెనిజువెలా అధ్యక్షుడిని బంధించి అమెరికా తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ దేశం అయి ఉండవచ్చని ప్రముఖ ఆర్థిక వేత్త జేప్రీసాచ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన ఏమన్నారంటే.. "ప్రస్తుతం ట్రంప్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. ఆయన మెుదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ‘‘నేను వెనెజువెలాపై ఎందుకు దాడి చేయకూడదు’’ అని అనుకున్నారు. అంటే ఆ భావన ఎప్పటి నుంచో ఆయనలో ఉందన్నమాట. అయితే ఇటీవల జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో కలిసి ‘‘ఇరాన్.. నెక్స్ట్ నువ్వే’’ అన్నారు. బహుశా ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇరాన్ వద్ద అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్స్ ఉండడంతో పాటు ఆ దేశానికి ప్రధాన శక్తుల అండ ఉంది. ఇది ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు" అని ఆయన అన్నారు.అమెరికా విదేశాంగ విధానాన్ని అక్కడే పెంటగాన్ నడిపిస్తోంది అన్నారు. అదేవిధంగా యూఎస్ కంటే ఇజ్రాయెల్ మరింత ప్రమాదకరమైన దేశమన్నారు. ఇండియా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెప్రీ సాచస్ పైన పేర్కొన్న వివరాలు పంచుకున్నారు. కాగా గతేదాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరగగా అమెరికా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఆదేశానికి చెందిన బి-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. తర్వాత ట్రంప్ ఎంట్రీతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అణు ఒప్పంద విషయంలో మాత్రం ట్రంప్ ఇరాన్పై ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. -
ట్రంప్ ‘హిట్ లిస్ట్’
కొలంబియా ట్రంప్ తరచూ పేర్కొనే ‘డ్రగ్స్ ధూర్త’దేశాల్లో ఇదొకటి. వెనెజువెలా రాజధాని కరాకాస్పై అమెరికా దాడి చేసిన కొద్ది గంటల్లోనే కొలంబియాకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపుల వెనక ఉన్నది కూడా ‘చమురు’ఆకాంక్షలేనన్నది పరిశీలకుల అంచనా. ఎందుకంటే వెనెజువెలాకు పశ్చిమాన ఉండే కొలంబియా కూడా భారీ చమురు నిక్షేపాలకు ఆలవాలమే. పైగా వెనెజువెలా మాదిరిగానే అది కూడా నిత్యం కల్లోలంగా ఉండే దేశమే. ట్రంప్ నిజంగా దాడికే నిర్ణయించుకుంటే ఇది ఆయన పనిని సులభతరం చేసే అంశమే. ట్రంప్ పదేపదే మొత్తుకుంటున్న డ్రగ్స్ భూతం నిజంగానే కొలంబియాలో విశ్వరూపం దాల్చింది.మొత్తం లాటిన్ అమెరికాలోనే డ్రగ్స్ వ్యాపారానికి కేంద్రబిందువు ఆ దేశమే! ముఖ్యంగా కొకైన్ అక్కడ ఏరుగులా పారుతుంటుంది. ఈ డ్రగ్స్ను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో విచ్చలవిడిగా అమెరికాలోకి గుమ్మరిస్తున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం. ఈ కారణంగానే ఆయనపై గత అక్టోబర్లో ట్రంప్ భారీ ఆంక్షలు కూడా విధించారు. ‘‘కొలంబియాను ఓ శాడిస్టు పాలిస్తున్నాడు. అతని హయాం ఇంకెంత కాలమో సాగబోదు’’అని ఆదివారం ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే కొలంబియాలో ఉన్నట్టుండి అమెరికా బలగాలో, ప్రత్యేక దళాలో దిగినా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల అంచనా!ఇరాన్ ప్రస్తుతం భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న దేశమిది. ఇటీవల ఇజ్రాయెల్తో ఇరాన్ ‘12 రోజుల’ఘర్షణల సందర్భంగా అమెరికా కూడా ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపించడం తెలిసిందే. ముఖ్యంగా అక్కడి అణు స్థావరాలు, మౌలిక సదుపాయాలను తుత్తునియలు చేసింది. తాజా ఆందోళనలను కూడా మరోసారి తనకు అనువుగా ఉపయోగించుకునే దిశగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఆందోళనకారులను పొట్టన పెట్టుకుంటే సహించేది లేదని, భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ను బెదిరించారాయన.‘‘ఇరాన్ గతంలోలా తన సొంత ప్రజలను పొట్టన పెట్టుకుంటామంటే ఊరుకోబోం. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని కూడా చెప్పుకొచ్చారు. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలో ట్రంప్ జరిపిన సుదీర్ఘ భేటీలో ప్రధాన చర్చనీయాంశం ఇరానే అని కూడా చెబుతున్నారు! త్వరలో ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులకు దిగేలా ఆ భేటీలో పథక రచన కూడా జరిగిందని అంటున్నారు! అదే నిజమైతే సందట్లో సడేమియా మాదిరిగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగానే అమెరికా కూడా మరోసారి ఇరాన్పై పెద్దపెట్టున విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు. మెక్సికోట్రంప్ తొలినుంచీ ద్వేషిస్తూ వస్తున్న దేశం. 2016లో తొలిసారి అధ్యక్ష బరిలో దిగినప్పుడు ఆయన ప్రధాన నినాదం, ఎజెండా కూడా దక్షిణాన మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ కడతాననే! గతేడాది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టగానే ట్రంప్ చేసిన తొలి సంతకం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ఫైలు మీదే! ఆ దేశమంటే ఆయనకు ఆ స్థాయిలో విద్వేషం!! డ్రగ్స్తో పాటు అక్రమ వలసదారులు కూడా మెక్సికో నుంచి అమెరికాలోకి విచ్చలవిడిగా పోటెత్తుతున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం.దీని కట్టడికి ఆ దేశం ఉద్దేశపూర్వకంగానే గట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ‘‘మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ చాలా శక్తిమంతమైనవి. వాటి కట్టడికి ఇక అమెరికానే ఏదో ఒకటి చేయాలి’’అని ఆదివారం మీడియా భేటీలోనే ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘వాటిపై పోరుకు అమెరికా సైన్యాన్ని పంపుతానంటే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తిరస్కరించారు’అంటూ అసహనం కూడా వెలిబుచ్చారు.క్యూబా అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే ఈ బుల్లి కమ్యూనిస్టు దేశం దశాబ్దాలుగా దానికి కంట్లో నలుసుగా మారింది. ఫలితంగా 1960ల నుంచీ అమెరికా నుంచి భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. వెనెజువెలాతో క్యూబాకు అత్యంత సన్నిహిత బంధముంది. వెనెజువెలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయినట్టే. ఇది ఆ బుల్లి దేశపు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేలా కని్పస్తోంది. బహుశా అందుకేనేమో, ‘‘క్యూబా ఆదాయమంతటికీ వెనెజువెలా నుంచి వస్తున్న చమురే ఆధారం. ఆ మార్గం మూసుకున్న కారణంగా అదిప్పటికే కుప్పకూలుతున్న దేశం. కనుక దానిపై సైనిక చర్య కూడా అనవసరమేమో’’అంటూ ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు.క్యూబాలో అధికార మారి్పడి అత్యవసరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పదేపదే చెబుతుండటం తెలిసిందే. గత శనివారం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి మదురో దంపతులను బందీలుగా పట్టుకున్న అనంతరం రూబియో మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను గనక ఇప్పుడు (క్యూబా రాజధాని) హవానాలో ఉంటే, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యుంటే కాస్త ఆందోళనలోనే పడి ఉండేవాన్ని’అన్నారు. తద్వారా, క్యూబాపై అమెరికా ఇప్పటికే గురి పెట్టిందని చెప్పకనే చెప్పారు. ఇంతా చేస్తే, రూబియోది క్యూబా నుంచి అమెరికాకు వలస వచి్చన కుటుంబం కావడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
‘‘ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. ఇరాన్లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అలాంటి ఇలాంటి సంక్షోభం కాదుఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్లో డాలర్కు 42 వేల రియాల్కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఖమేనీ పాలనప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
‘మీరు.. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా..’
నిన్న మొన్నటి వరకూ ఇరాన్ లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వెనెజువాలాలో గత వారంగా జరుగుతున్న పరిణామాలు ఉదహరిస్తూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. ‘ మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది’ అని ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు యేర్ లాపిడ్ పేర్కొన్నారు..అమెరికా సైన్యం.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అరెస్ట్ చేసిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ,ఇరాన్ పాలకులు వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను గమనించాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా అమెరికా ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయగలిగితే, ఇరాన్ పాలకులు కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చనే సంకేతాలు పంపారు లాపిడ్. ఇది ఇరాన్క ఒక హెచ్చరిక లాంటిదిగా పేర్కొన్నారు. ఇరాన్ పాలకులు తమ చర్యలకు గణనీయమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ భేటీ తర్వాత.. వెనెజువాలాపై అగ్రరాజ్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన మదురోను నిర్బంధించింది. ఆయనపై నార్కో-డ్రగ్స్ ముద్ర వేసి న్యూయార్క్లో తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ను ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు హెచ్చరించడం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే.. తమపై దాడికి దిగితే అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్కు మాటల ప్రతిదాడికి దిగింది. ఒకవేళ అమెరికాతో తమపై యుద్ధానికి దిగితే కచ్చితంగా తిప్పి కొడతామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. తాము మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ తాజా పరిణామాలు ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు.. -
విదేశాంగ శాఖ కీలక సూచనలు
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లే భారత పౌరులు అత్యవసరమైతే తప్ప ఆదేశానికి వెళ్లకూడదని సూచించింది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్లో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరడంతో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, కఠినఆంక్షలు విధించడం తదితర చర్యలు చేపట్టారు. ఈ నిరసనల్లో బలగాల కాల్పుల్లో దాదాపు 15మందికి పైగా మృతిచెందారు.దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇరాన్లో జరుగుతుంది నిశితంగా గమనిస్తున్నాం. గతంలో మాదిరి అమాయకులను చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుంది. అని అన్నారు. దీంతో మరోసారి ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది. భారతీయులు అత్యవసరమైతే తప్ప ఇరాన్కు వెళ్లకూడదని తెలిపింది. అదేవిధంగా ఆదేశంలో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.అదే విధంగా భారత ఎంబసీకి సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అందుకు ఎంబసీ వెబ్సైట్, సోషల్ మీడియా ఫాలో కావాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో అధికశాతం మంది విద్యార్థులే. -
ఇంటర్నెట్పై ఇరాన్ కీలక నిర్ణయం
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో తగ్గినట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై కఠిన ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ టాఫ్ ప్లేసులో ఉందని అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.ఇరాన్లో ప్రస్తుతం ఆర్థికసంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, మానవహక్కుల ఉల్లంఘన తదితర కారణాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియాలతో పాటు ఇతర సాధనాలపై బ్యాన్ విధించింది.దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు ఉండడంతో ప్రధాన సోషల్ మీడియా సాధనాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో నిషేదం విధించింది. అదే ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో దాదాపు పూర్తి స్థాయిలో దాదాపు 90 నుంచి 97శాతం ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కంటెంట్పై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్లను ప్రసారం కాకుండా ఆంక్షలు విధించింది.డిజిటల్ అపార్థైడ్ అంతేకాకుండా ఇరాన్లో ఇప్పుడు అనుమతి ఉన్న వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వైట్ సిమ్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంటర్నెట్కు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు పొందగలరు. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ వాడకంపై కొన్ని పరిమితులు కల్పించబడ్డాయి. దీంతో ఈనియమంపై అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.ఇలా నిరంతరంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతో ఆదేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ ట్రెండ్ నడస్తున్న నేపథ్యంలో రోజువారీ దైనందిన అవసరాలకు ఇంటర్నెట్ అవసరమైన నేపథ్యంలో ఆంక్షలు నేపథ్యంలో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ నుండి దేశాన్ని వేరుచేసి ఇరాన్కు చెందిన ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచి్చ, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం నాలుగు నగరాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. మరోవైపు నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో రాజధాని టెహ్రాన్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలని, ధరలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సైతం ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి. పాతాళానికి రియాల్ విలువ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 42,125 రియాల్స్గా నమోదయ్యింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్టం. ఇరాన్పై అమెరికాతోపాటు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షల ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లో 2022 తర్వాత ప్రజా ఉద్యమం రగులుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు నిర్బంధించారు. ఆమె పోలీసు కస్టడీలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలు భద్రతా సిబ్బంది దాడిలో ఏడుగురు మరణించడం పట్ల జనం మండిపడుతున్నారు. తమ పోరాటం ఉధృతం చేస్తామని తేలి్చచెబుతున్నారు. గురువారం లారెస్తాన్ ప్రావిన్స్లోని అజ్నా సిటీలో నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బక్తియారీ ప్రావిన్స్లోని లార్డెగాన్ నగరంలోనూ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫాహాన్ ప్రావిన్స్లో ఉన్న ఫులద్షహర్లో ఒకరు బలయ్యారు. మరోవైపు జనం దాడిలో ఇద్దరు పారామిలటరీ గార్డులు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కౌహదస్త్ నగరంలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. విదేశీ జోక్యాన్ని సహించం: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తిప్పి కొట్టారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేలి్చచెప్పారు. తమ సమస్యలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉందన్నారు. ఇరాన్ వ్యవహారాల్లో అనవసరంగా కలుగుజేసుకోవాలని చూడడం సరైంది కాదని సూచించారు. ఇతర దేశాలు ఈ విషయం గుర్తించాలని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్లో అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే అమెరికా అంతిమంగా ప్రయోజనాలే దెబ్బతింటాయని స్పష్టంచేశారు. గత ఏడాది జూన్లో ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం ఇరాన్ కరెన్సీ విలువ పడిపోకుండా కాపాడే విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంకేతాలిచ్చారు. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని, ప్రజలు శాంతించాలని కోరారు. నిరసనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్న ట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణలో మృతిచెందినవారి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి చావు తప్పదంటూ ఈ సందర్భంగా జనం నినాదాలు చేశారు. హద్దు మీరితే జోక్యం: ట్రంప్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై ఆయుధాలు ప్రయోగిస్తే తాము జోక్యం చేసుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పోస్టు చేశారు. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలపై హద్దు మీరి ప్రవర్తిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. నిరసనకారులను కాపాడుకుంటామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు. -
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్లో జెన్జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్లోని టెహ్రాన్తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు. If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026 -
ఇరాన్ను ఈసీఆర్ కేటగిరీలో చేర్చిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.ఇవే 19 ఈసీఆర్ దేశాలుఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటి?ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?ఈసీఆర్ పాస్పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.వలస కార్మికుని పాస్పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్లో నమోదు అవుతాయి.అలాగే, ఈసీఆర్ పాస్పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటే?ఈసీఎన్ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.ఈసీఎన్ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:* 10వ తరగతి ఉత్తీర్ణులు* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు* 50 సంవత్సరాల పైబడిన వారువీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదుఏ పాస్పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622 -
టెన్షన్ టెన్షన్: వెనిజులా వైమానిక దళంలో ఇరాన్ యుద్ధ డ్రోన్లు!
ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో యుద్ధం వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. ఉక్రెయిన్లో ఉపయోగించే హమాస్తో అనుసంధానించబడిన ఈ ఇరాన్ యుద్ధ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి యూఎస్కు కొన్ని మైళ్లు దూరంలో ఉండటంతో మరింత ఆందోళన కల్గిస్తోంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని ట్రంప్ పేర్కొన్నారు. దాంతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వెనిజులా దానికి ప్రతిగా సన్నద్ధమవుతుందన్న దానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా,ఇజ్రాయెల్
జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళనఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.భవిష్యత్ ప్రభావంఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
టెహ్రాన్: మధ్య ఇరాన్లో ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం ఆలస్యంగా ఇస్ఫాహాన్ నుండి ఈశాన్య నగరమైన మషాద్కు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.బస్సు హైవే మధ్యలో ఉన్న సెంట్రల్ గార్డ్ రైల్ను ఢీకొని, ఎదురు లేన్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక టాక్సీని ఢీకొని బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు, టాక్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. మొత్తం 13 మంది మరణించారు. -
మరోసారి వార్ కు ఇజ్రాయిల్?
ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, హిజ్బూల్లాతో పూర్తిస్థాయిలో యుద్ధం చేసేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పాటు యుద్ధంతో ఆర్థికంగా, ఆయుధ సామాగ్రి పరంగా కొంత కొరత ఉండగా ప్రస్తుతం మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ యుద్ధం కోసం ఆధునాతన సాంకేతిక వాడుతున్నట్లు తెలుస్తోంది.కాగా కొద్ది నెలల క్రితమే ఇజ్రాయిల్, పాలస్తీనా గాజాలోని హమాస్ తో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో పాటు ఇతర దేశాలు యుద్ధ విరమణకు ఎంతగానో కృషి చేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మారోసారి యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
డాలర్కు 12 లక్షల రియాల్స్
టెహ్రాన్: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమైంది. ఒక్క అమెరికన్ డాలర్తో మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందనటానికి ఇదే నిదర్శనం. దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. మాంసం, బియ్యం, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామా న్యుల రోజువారీ జీవనం సైతం గగనంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా జూన్లో ఇజ్రాయెల్ దాడులకు దిగడం, ఇరాన్ ప్రతిదాడుల అనంతరం అమెరికా రంగంలోకి దిగడం తెల్సిందే. మళ్లీ ఇజ్రాయెల్తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ వాసులను వెంటాడుతున్నాయి. -
భారతీయులకు షాకిచ్చిన ఇరాన్
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మోసం , అక్రమ రవాణా కేసులు పెరిగిన నేపథ్యంలో టెహ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.సాధారణ పాస్పోర్ట్లను కలిగి ఉన్న భారతీయ పౌరులకు వన్-వే టూరిస్ట్ వీసా రద్దు నిబంధనల అమలు 2025 నవంబర్ 22 నుంచి నిలిపివేస్తున్నట్టు భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. అంటే నవంబరు 22 తరువాత సాధారణ పాస్పోర్ట్లున్న భారతీయ పౌరులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెట్టాలంటే వీసా ఉండాల్సిందే.భారతదేశం స్పందనఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తమ పౌరులకు జాగ్రత్తలు సూచిస్తూ ఒక అడ్వైజరీ విడుదల చేసింది.ఉపాధికి సంబంధించిన తప్పుడు హామీలు మూడవ దేశాలకు రవాణా హామీలతో భారతీయ పౌరులను ఇరాన్కు ఆకర్షించిన అనేక సంఘటనలపై కేంద్రం దృష్టిని ఆకర్షించిందని విదేశాంగ మంత్రి తెలిపారు. వీసా మినహాయింపు సౌకర్యం ద్వారా వ్యక్తులు ఇరాన్కు ప్రయాణించేలా మోసగించారనీ, ఇరాన్కు చేరుకున్న తర్వాత, వారిలో చాలా మందిని విమోచన కోసం కిడ్నాప్ చేశారని అందుకే ఈ మినహాయింపునుటెహ్రాన్ నిలిపివేసిందని పేర్కొంది. ఇరాన్ను సందర్శించాలనుకునే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని , వీసా రహిత ప్రయాణం లేదా ఇరాన్ ద్వారా మూడవ దేశాలకు పంపించే ఏజెంట్ల మోసంలో చిక్కుకోవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.పర్యాటకందేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇరాన్ వీసా-రహిత ప్రవేశాన్ని 2024లో ఫిబ్రవరిలో భారతీయులకు వీసా మినహాయింపును పొడిగించింది. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇస్ఫహాన్, షిరాజ్ వంటి వారసత్వ నగరాలు, కోమ్ ,మషద్ వంటి తీర్థయాత్ర గమ్యస్థానాలు, ఎడారి ప్రకృతి దృశ్యాలు , పురాతన సిల్క్ రోడ్ మార్గాలతో పాటు, ఇరాన్ భారతీయ ప్రయాణికులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి.ముఖ్యంగా యూరప్ లేదా మధ్య ఆసియాకు వెళ్లే బడ్జెట్ ప్రయాణికులకు ఇరాన్ కూడా ఒక కీలకమైన రవాణా కేంద్రం.ఇరాన్లో మోసం కేసులుఈ సంవత్సరం మే ప్రారంభంలో, అక్రమ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు బయలుదేరిన ముగ్గురు పంజాబ్ వ్యక్తులను ఇరాన్లో కిడ్నాప్ చేశారు. పంజాబ్లోని ఒక ఏజెంట్ హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బిఎస్ నగర్), అమృత్పాల్ సింగ్ (హోషియార్పూర్) లకు దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చాడు. వారికి ఇరాన్లో బస కల్పిస్తామని అతను వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.అయితే, మే 1న వారు ఇరాన్లో అడుగుపెట్టిన వెంటనే, వారిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. బాధితుల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం, కిడ్నాపర్లు రూ. 1 కోటి విమోచన క్రయధనం డిమాండ్ చేశారు.ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారతదేశం ఇరాన్ అధికారులను కోరిన తర్వాత ముగ్గురు వ్యక్తులను రక్షించారు. సెప్టెంబర్లో, ఇరాన్లో ఉద్యోగం కోరుతున్న తమ పౌరులు ఇటీవలి నకిలీ ఉద్యోగ ఆఫర్ల కేసులను దృష్టిలో ఉంచుకుని "కఠినమైన నిఘా" పాటించాలని భారతదేశం హెచ్చరించింది. -
చావు చులకనైపోయిన వేళ.. !
చావు చులకనగా మారడం అంటే ఇదేనేమో. మనిషి జీవిత విలువను తక్కువగా చూడటం, మరణాన్ని సాధారణ సంఘటనగా భావిస్తే అది మానవతా ప్రశ్నలను రేకెత్తిస్తుంది.సమాజం వ్యక్తి జీవితాన్ని గౌరవించకపోతే, చావు ఒక సాధారణ శిక్షగా మారుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. అన్యాయపు శిక్షలు: వేగంగా, విచారణ లేకుండా అమలు చేసే ఉరిశిక్షలు చావును చులకనగా మార్చే ఉదాహరణలు.ప్రజలలో భయాన్ని చాటేందుకు చావును సాధారణంగా చూస్తుంది నేటి అధికార వ్యవస్థ. నేటి అధికార వ్యవస్థలకు చావు అనేది వ్యూహంగా మారుతుందంటే అతిశయోక్తి కాదేమో.తాజాగా ఒక భయంకరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇరాన్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 74 మృతదేహాలను అతి దారుణంగా ఓ ఆనకట్టలో పడేశారనేది ఆ వార్త సారాంశం. ఆ ఆనకట్ట వర్షాలు లేక ఎండిపోవడంతో ఆ మృతదేహాలు బయటపడ్డాయట. వారిందరికీ చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. వారిని దుప్పట్లో చుట్టేసి మరీ పడేశారనేది సమాచారం.అంటే వారికి ఉరి శిక్షను అమలు చేసి, ఇలా ఆనకట్టలో పడేశారనేది తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇరాన్లో ఉరిశిక్షలు చాలా వేగంగా అమలు చేస్తారు. అందులోనూ రాజ(దేశ) ద్రోహం కింద అయితే మరో అడుగు ముందుకేసి మరీ ఉరిని అమలు చేస్తారు.వారు దేశ ద్రోహానికి పాల్పడ్డారో లేదో మనకు తెలీదు కానీ, ఉరిశిక్షను చాలా వేగవంతంగా అమలు చేసినట్లు మృతదేహాల పరిస్థితి ని బట్టి తెలుస్తోంది. వారిని దేశ ద్రోహులుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఇలా పడేసినా ఎవరూ గుర్తించరని భావించి ఇలా చేసే ఉంటారనే సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తున్న వైనం. అయితే ఈ వార్త ప్రచురించిన ఇరాన్ ప్రభుత్వ మద్దతు మీడియా తర్వాత దానిని తొలగించడం కూడా చకచకా జరిగిపోయిందనే వార్త కూడా మరొకటి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది కొన్ని రోజుల వ్యవధిలో తెలిసే అవకాశం ఉంది.🔴 Horrifying:Reports that at least 74 bodies have been found in the Karaj Dam in Iran, all thought to be executed anti-regime dissidents.Because of the drought and lack of rain, this dam has dried up almost completely and revealed a MASS GRAVE.The victims had their hands… pic.twitter.com/7tz4m2PjYq— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) November 11, 2025 -
ట్రంప్కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్పై ఈ ఏడాది జూన్లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి! -
పాక్ స్మగ్లర్కు 40 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
ఇరాన్ నుండి యెమెన్లోని హౌతీలకు బాలిస్టిక్ క్షిపణి భాగాలను అక్రమంగా రవాణా చేసినందుకు పాకిస్తాన్ పౌరుడు ముహమ్మద్ పహ్లావన్కు అమెరికాలోని వర్జీనియా కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరేబియా సముద్రంలో అమెరికా సైనిక ఆపరేషన్ సందర్భంగా పహ్లావన్ను అరెస్టు చేశారు. గతేదాడి అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టగా, తాజాగా పాక్ పౌరుడు పహ్లావన్కు బుక్ అయ్యాదు. హౌతీలకు బాలిస్టిక్ క్షిప;ణులన అందించే క్రమంలో పహ్లావన్ సిబ్బంది తాము మత్స్యకారులుగా నమ్మించి అధికారుల్ని బురిడీ కొట్టించారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్లోని అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, వారు గాజా ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తూ ఆయధాల ఆక్రమ రవాణా చేసేవారు. అయితే తాము హౌతీలకు ఆయుధాలు సరఫరా చేయలేదని ఇరాన్ పదే పదే ఖండిస్తూ వచ్చింది. పహ్లావాన్ పడవలో దొరికిన ఆయుధాల అక్రమ రవాణాను కోర్టు ముందుకు తీసుకొచ్చిన యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు.. ఆయుధ వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన ఆయధాలుగా నిరూపణ చేశారు. దాంతో పహ్లావన్కు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది. -
ఇరాన్పై ఐరాస మళ్లీ ఆంక్షలు
దుబాయ్: ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆ దేశంపై పూర్తి స్థాయి ఆంక్షలను విధించింది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు సంపాదించిందంతా ఆహారం కోసమే ఖర్చు పెడుతూ, భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండగా వారిపై ఆంక్షల వల మళ్లీ పడింది. అణు కార్యక్రమాన్ని వదిలేయాలంటూ చిట్టచివరి నిమిషంలో ఐరాసలో జరిగిన దౌత్య చర్చలు విఫలం కావడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిఫలితంగా, విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి. ఇరాన్ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలూ ఆగిపోతాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని చూస్తే మరిన్ని ఆంక్షలు మోపే ప్రమాదముంది. ఈ ఆంక్షలు ‘స్నాప్బ్యాక్’గా (స్వయంచాలికంగా–ఆటోమేటిక్)గా అమల్లోకి వస్తాయి. దీనివల్ల, ఇరాన్పై విధించిన ఇతర ఆంక్షల మాదిరిగా చైనా, రష్యాలు భద్రతామండలిలో వీటిని వీటో చేయడం కుదరదు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో ఈ షర తులన్నీ ఉన్నాయి. జూన్లో ఇజ్రాయెల్తోపాటు అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ ఆ దేశం వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలకేనంటూ ఇరాన్ చెబుతున్నా అమెరికా, పశి్చమదేశాలు అనుమానిస్తున్నాయి. నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైతే యురే నియంను 60 శాతం వరకు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కదా అని ప్రశి్నస్తున్నాయి.ఎన్పీటీ నుంచి వైదొలిగే యోచన ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాఫ్ తెలిపారు. ఆంక్షలను ఆయన అన్యాయమన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగినందున యూరప్ దేశాలైన యూకే, జర్మనీ, ఫ్రాన్స్లకు స్నాప్బ్యాక్ అమలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఐఏఈఏ నుంచి వైదొలగడం ఇరాన్ తీవ్రమైన తప్పిదమని, ఇదే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్లు ఆ దేశంపై మళ్లీ దాడులకు దిగే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. -
‘ఇరాన్లో ఉపాధి’ పేరుతో మోసపోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో మంచి ఉద్యోగం, అధిక జీ తం అంటూ కొందరు ఏజెంట్లు చెప్పే మాటలను నమ్మవద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇరాన్లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న భారీ మోసం, కి డ్నాప్ల పర్వం ఇటీవల బయటపడిన విషయాన్ని గు ర్తు చేసింది. మాయ మాటలతో ఇరాన్కు రప్పించుకుని, ఆ తర్వాత కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న నేరగాళ్ల ముఠాల బారిన పడవద్దని కోరింది. ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే కల్పించిందని స్పష్టం చేసింది. అయితే, నేరగాళ్లతో సంబంధాలున్న కొందరు ఏజెంట్లు ఇదే అదనుగా ఉద్యోగాల కోసం కూడా వీసా లేకుండా వెళ్లవచ్చని నమ్మిస్తున్నారని తెలిపింది. ఇలాంటి ఆఫర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరింది. తప్పుడు వాగ్దానాలు చేసే ఏజెంట్లు కిడ్నాపర్లతో కుమ్మక్కై ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
ఆ దేశాల్లో ‘ఆయుధ ఫ్యాక్టరీలు’ నిర్మించాం.. ఎక్కడున్నాయో సిక్రెట్: ఇరాన్
అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించామంటూ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్తో భీకర యుద్ధం ముగిసి రెండు నెలలు గడవకముందే ఇరాన్ ప్రకటన సంచలనం రేపుతున్నాయి. అయితే, ఆయుధ తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించామనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్షిపణి అభివృద్ధిపైనే తమ సైన్యం ప్రధాన దృష్టి పెట్టిందన్న ఆయన.. ఇటీవల ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులను మాత్రం వాడలేదంటూ చెప్పుకొచ్చారు.పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాం.. త్వరలోనే వాటిని అధికారికంగా తెరుస్తామంటూ నజీర్జాదే వెల్లడించారు. గత ఏడాది కాలంలో అభివృద్ధి చేసిన క్షిపణులు అత్యాధునిక, అత్యంత శక్తిమంతమైనవిగా ఆయన పేర్కొన్నారు. 12 రోజుల యుద్ధం ఆగకపోతే.. తమ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోలేకపోయేవని.. అందుకే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్నారు.కాగా, ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్లు పోరుపంథాలోనే పయనించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో యుద్ధం హోరాహోరిగా సాగింది. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. అయితే, ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
ఇజ్రాయెల్ దెబ్బకు వెనక్కి తగ్గిన సిరియా.. ‘డ్రూజ్’తో కాల్పుల విరమణ
డమాస్కస్: సిరియా దక్షిణ ప్రాంతంలో గత కొంతకాలంగా జాతి ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతలో ఇజ్రాయెల్.. ఇరాన్ రాజధాని డమాస్కస్లోని సిరియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. డ్రూజ్ కమ్యూనిటీ, సిరియన్ అధికారుల మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరుణంలో ఈ దాడి జరిగింది. దీంతో ఇజ్రాయెల్- సిరియా మధ్య ఘర్షణలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరియాలో నివసిస్తున్న మైనారిటీ డ్రూజ్ కమ్యూనిటీని రక్షించేందుకే దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రభుత్వ దళాలు- సున్నీ బెడౌయిన్ తెగల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో డ్రూజ్ కమ్యూనిటీ విలవిలలాడుతోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారని సిరియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో.. డ్రూజ్ కమ్యూనిటీని విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.సిరియాలోని స్వీడా ప్రావిన్స్లోని డ్రూజ్ కమ్యూనిటీ, సున్నీ బెడౌయిన్ తెగల మధ్య గత కొంతకాలంగా జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 248 మందికి పైగా జనం మరణించారు. వారిలో 92 మంది డ్రూజ్ కమ్యూనిటీకి చెందినవారు కావడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే దక్షిణ సిరియా నుండి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్లోని గోలన్ హైట్స్ సరిహద్దులో అదనపు సైనిక మోహరింపును ప్రారంభించింది. ఈ పరిణామాల నేపధ్యంలో సిరియన్ ప్రభుత్వ అధికారులు వెనక్కి తగ్గి, డ్రూజ్ కమ్యూనిటీతో కాల్పుల విరమణ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర వార్తా సంస్థ ‘సనా, డ్రూజ్ నేత సంయుక్తంగా ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. -
ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ను క్యాన్సర్ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది. -
‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.గత కొన్ని వారాలుగా ఇరాన్లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో సూచించింది. ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది. pic.twitter.com/boZI4hAVin— India in Iran (@India_in_Iran) July 15, 2025ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ను అంతమొందించేందుకు ప్రయత్నం
-
ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అధ్యక్షుడికి గాయాలు
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ను అంతమొందించేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఆయన స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది.వివరాల ప్రకారం.. జూన్ 15వ తేదీన పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలీబా, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహసేనీ ఇజేయ్తోపాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్జీసీ అనుబంధ ఫార్స్ న్యూస్ ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో అధ్యక్షుడు మసౌద్.. స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది. ఇక, తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవలే ధ్రువీకరించారు. ‘వారు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మరోవైపు.. ఫార్స్ న్యూస్ వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో పెజెష్కియాన్ కాలికి గాయమైంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. భవనం కింది భాగంలో ఇరాన్ అధికారులు ఉన్నారు. పేలుడు సంభవించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అత్యవసర వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవడంతో భవనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. -
నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. -
అమెరికా ప్రెసిడెంట్ ను చంపేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
ట్రంప్ టార్గెట్గా ఇరాన్ భారీ ప్లాన్.. సన్బాత్ సమయంలో డ్రోన్తో దాడికి..
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని.. అధ్యక్షుడు సన్బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇరాన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మరోవైపు.. ఇరాన్ వ్యాఖ్యలకు ట్రంప్ సెటైరికల్ కౌంటరివ్వడం గమనార్హం.ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించారు. ఇక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్-ఎ-లాగో రిసార్ట్లో అధ్యక్షుడు సన్బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.Larijani: "We can target Trump's navel!"Javad Larijani, in a televised program, said:"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025ట్రంప్ కౌంటర్.. ఇరాన్ అధికారి లారిజాని వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నా. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్.. మీరు చివరిసారిగా ఎప్పుడు సన్బాత్కు వెళ్లారు అని విలేకరి అడగ్గా.. ట్రంప్ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని సమాధానం ఇచ్చారు. సన్బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్గా చాలా విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని టార్గెట్ చేసిన వారిపై బ్లడ్ పాక్ట్ అనే ప్లాట్ఫామ్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం. ట్రంప్నకు బౌంటీ ఇవ్వాలని బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. ఇది జులై 8 నాటికి ఇది 27 మిలియన్ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది. -
ఇన్నాళ్లకు వేదికపై ఖమేనీ.. మారుమోగిన నినాదాలు
టెహ్రాన్: ఇజ్రాయెల్తో వివాదం.. ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా భీకర దాడుల అనంతరం తాజాగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక బహిరంగ వేదికపై కనిపించారు. టెహ్రాన్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపధ్యంలో ఇంతకాలం ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.తాజాగా ఇరాన్లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం సంతాప దినాలలో ఖమేనీ కనిపించారు. షియా ముస్లిం క్యాలెండర్లోని అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఆయతుల్లా ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఖమేనీ ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఖమేనీ సంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన అక్కడి జనం పలు నినాదాలు చేశారు. 📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشورا pic.twitter.com/09mfwm3qFM— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025జూన్ 14న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నేత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వైమానిక దాడుల తొలి రోజుల్లో ఖమేనీ రికార్డ్ చేసిన సందేశాలు మీడియాకు విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన ప్రసంగాలను ముందే రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇది కూడా చదవండి: పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం -
పశుబలం తప్ప ఏం మిగిలింది?
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం. ఆ విధంగా ప్రపంచానికి ప్రజాస్వామిక ఆదర్శంగా నిలవాలి. కానీ అమెరికా వీటన్నిటినీ బాహాటంగా ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నది. అందుకు కారణం తన ఏకధృవ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతుండటం. ఈ చర్చను ప్రస్తుతానికి ఇరాన్ అంశంతోనే మొదలుపెట్టి చూద్దాము. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగటమే కాదు, అసలు యుద్ధమే ముగిసిపోయిందన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించిన తర్వాత, జూన్ 28న అన్న మాటలను గమనించండి – ‘యుద్ధంలో నాశనమైన ఇరాన్ అధినేత ఖొమైనీ, యుద్ధంలో తామే గెలిచామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారు. మూడు అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో దాక్కున్న ఆయన అమెరికా, ఇజ్రాయెల్ సేనల చేతిలో నీచమైన చావు చావకుండా నేనే కాపాడాను. టెహ్రాన్ దిశగా భారీ సంఖ్యలో వెళుతుండిన ఇజ్రాయిల్ విమానాలను తిప్పించాను. ఆ దాడి జరిగితే అక్కడ వేలాదిమంది చనిపోయేవారు. అయినప్పటికీ ఇరాన్ అధినేత నాకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా తామే గెలిచామంటున్నారు. ఇరాన్ అణు పరిశోధనలు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ బాంబులు వేయిస్తా. ఇరాన్పై ఆంక్షలను సడలించాలనుకున్నాను గాని ఇక ఆ పని చేయను.’కేవలం ఈ మాటలను విశ్లేషిస్తే చాలు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఏ విధంగా గౌరవిస్తున్నదో తెలిసేందుకు. ప్రజాస్వామికంగా పెద్దమనిషి తరహాలో వ్యవహరించేందుకు ట్రంప్కు ఏమీ లేదు. బాంబులు తప్ప, పశుబలం తప్ప. విషయాన్ని సూటిగా మరొకమారు చెప్పుకోవాలంటే కళ్లెదుట కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో స్వచ్ఛందంగా భాగస్వామి అయిన ఇరాన్కు ఆ సంస్థ నిబంధనల ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన శుద్ధికి పూర్తి హక్కు ఉంది. వారు ఆ ప్రకారం కట్టుబడటమే కాక, మారణాయుధాల తయారీ ఇస్లాం బోధనలకు విరుద్ధం కనుక ఆ పని చేయబోమంటూ ఫత్వా సైతం జారీ చేసుకున్నారు. వారు నిబంధనలను ఉల్లంఘించలేదని అణుశక్తి పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) స్వయంగా చెప్తున్నది. కాదు, కొద్ది వారాలలోనే బాంబులు తయారు చేయనున్నారు అంటూ ఇజ్రాయిల్ అనే శత్రుదేశం పాతికేళ్లుగా ఆరోపిస్తూ వస్తున్నది. అమెరికా దానికి వత్తాసు పలుకుతోంది.ఇజ్రాయిల్ కుప్పలుగా తయారు చేసుకున్న అణ్వస్త్రాలను గురించి అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఎన్నడూ పొరపాటున అయినా పల్లెత్తు మాట అనడంలేదు. ఒక యూఎన్ఓ సభ్య దేశం మరొక యూఎన్ఓ సభ్య దేశంపై అసత్యపు ఆరోపణలతో, సైనిక దాడి జరుపుతున్నా వ్యతిరేకించకపోవడం ప్రజాస్వామ్యమా? చివరికి తానే రంగంలోకి దిగి బాంబుదాడులు జరపడం ఏమిటి? కొన్ని యూరోపియన్ ప్రజాస్వామిక రాజ్యాలు అందుకు సహకరించటమేమిటి? ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నది అంటున్న వారు, ఇరాన్ వల్ల ఏర్పడిన ముప్పు ఏమిటో, ఇరాన్ అణ్వాయుధాల తయారీ స్థాయికి వెళ్లిందన్న ఆరోపణలకు ఆధారాలేమిటో, తామందరూ సభ్యులైన యూఎన్ఓ అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా చర్చించారా?వారు ఆ పని చేయలేదు, చేయరు కూడా. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎల్లప్పుడూ నమ్ముకున్నది అంతిమంగా బల ప్రయోగాన్నే. ప్రస్తుత సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలతోనూ నిమిత్తం లేకుండా, కేవలం అసత్య ఆరోపణలతో ఈ చర్యలకు పాల్పడే అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందసలు? కనిపిస్తున్నదే, పశుబలం నుంచి వచ్చింది. ఆ బలానికి మూలాధారం సామ్రాజ్యవాద ప్రయోజనాలు. ఎటునుంచి, ఎటువంటి ఎదురు లేకుండా, ఏ అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలతో నిమిత్తం లేకుండా, మంచైనా, చెడైనా ఏకఛత్రాధిపత్యంగా సాగాలనే దురహంకారం. ప్రస్తుత యుద్ధ సందర్భంలో మొదటి నుంచి చివరి వరకు, పైన పేర్కొన్న ట్రంప్ మాటలతో సహా కనిపించేది అదే.యుద్ధంతో తక్షణ సంబంధం గల విషయాలు ఇవి కాగా, మౌలిక స్థాయి సంబంధాలు కలవాటిని చూద్దాం. మూలం ఎక్కడుంది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఇజ్రాయిల్, అమెరికాలు మొదటి నుంచి అడ్డుకుంటుండడంలో ఉంది. అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థలకు అమెరికా చేస్తున్న హాని గురించి పలు దృష్టాంతాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పారిస్ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల నుంచి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకోవటాలు, అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్పై దాడి, పనామా కాలువను, గ్రీన్ల్యాండ్ను, కెనడాను ఆక్రమించుకోగలమని బెదిరింపులు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్)తో పాటు డాలర్ శక్తిని ఆధారం చేసుకుంటూ తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు, వందల కోట్ల డాలర్లను తమ బ్యాంకులలో స్తంభింప చేయటం, తమ నియంత్రణలోకి తీసుకొని మరెవరికో ఇవ్వటం వంటివన్నీ ప్రజాస్వామ్యమా? మొదట చెప్పుకున్నట్లు వీటికి ఆధారం అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థల నియమ నిబంధనలు కాదు. వారికి మిగిలిన ఆధారం పశుబలం మాత్రమే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు
టెహ్రాన్: ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల దరిమిలా ఆ దేశాలపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతోల్లా నాసర్ మకరెం షిరాజీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీచేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలదోయాలని మకరెం షిరాజీ ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. BREAKING: Iranian Grand Ayatollah Issues FATWA Against President Trump, Seen as Call for Global TerrorIran’s top Shiite cleric, Grand Ayatollah Naser Makarem Shirazi, has just issued a religious fatwa against President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu,… pic.twitter.com/Ud6BWKvL9a— Simon Ateba (@simonateba) June 30, 2025ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా యుద్ధ నేతగా పరిగణిస్తారని మకరెం తన తీర్పులో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్గా గుర్తించినవారికి ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్లో ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించింది. 12 రోజులపాటు సాగిన ఈ యుద్ధం అనంతరం ఈ మతపరమైన ఆదేశం వెలువడింది. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా.. ఇజ్రాయెల్ దళాలతో చేరిన దరిమిలా ఈ యుద్ధం ముగిసింది.ఇది కూడా చదవండి: ‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్.. -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
అణుహత్యలు!
ఇరాన్ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ’ అధిపతి అయిన మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్ డెస్క్యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు. ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్ అణు సూత్రధారి మొహ్సేన్ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.ఇప్పటి వరకు 100 హత్యలుఅణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.నాలుగు ‘హంతక’ దేశాలుచరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్ యూనియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా ఇజ్రాయెల్ దాడులకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మోసాద్’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. ఏఐతో చంపేశారుశాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుపటి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారాయి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్ లో మరణించిన ఫెరేడౌన్ అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటపడిన వారే. ఇరాన్ కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ 2019 నుంచీ నిఘా వేసింది. 2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్ కంట్రోల్డ్ మెషీన్ గన్ ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్ విడి భాగాలను ఇరాన్ లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. మొత్తం 15 బుల్లెట్లను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కనున్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్ గన్ ఉంచిన వాహనం కూడా పేలిపోయి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ వెలుపల ఒక కమాండ్ సెంటర్ నుంచి నిర్వహించడం విశేషం.చెప్పి చేయటం మొదలైంది!సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. ఎంత ప్రభావం ఉంటుంది?శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు లభించవచ్చు కూడా. -
వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త -
ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ అనంతరం పలు వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ మరోమారు హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ నిజంగా తమతో ఒక ఒప్పందానికి రావాలనుకుంటే, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నేత ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను అబ్బాస్ అరఘ్చి ఖండించారు. ట్రంప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిజాయితీ వ్యవహరించాలనుకుంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదన్నారు. ట్రంప్ తన అనుచిత వ్యాఖ్యలతో ఖమేనీ అభిమానులు, మద్దతుదారులను బాధపెడుతున్నారని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు.ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకుమించి ఆ దేశానికి మరో మార్గం లేదని అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఇరానియన్ ప్రజలు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనిని హత్య నుండి రక్షించానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్న దరమిలా అబ్బాస్ అరఘ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో చర్చలకు తిరిగి రావాలని ట్రంప్ కోరారు. అయితే అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని ఇరాన్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్ -
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్లో 10 వేల మంది, ఇజ్రాయెల్లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్తోపాటు తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. -
అమెరికాతో అణు చర్చలు జరపబోమని ఇరాన్ ప్రకటన
-
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్పై జూన్ 14వ తేదీన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు. -
12 రోజుల యుద్ధంలో గెలిచిందెవరు? ఓడిందెవరు?
-
అమెరికా దాడుల ఎఫెక్ట్.. ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory. File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. -
అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. -
ఇరాన్ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. -
ముగ్గురు ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఇరాన్.. ముగ్గురు ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసింది. గూఢచర్యం అనుమానం, గూఢచారులకు ఆవాసం కల్పిస్తున్న ఆరోపణలతో 700 మందిని అరెస్టు చేసింది. 12 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్కు సహకరించారని, ఒక వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని మొసాద్కు అందించారని ఇరాన్ ఆరోపించింది. ‘హత్యలు చేయడానికి దేశంలోకి పరికరాలను దిగుమతి చేయడానికి ప్రయత్నించిన ఇద్రిస్ అలీ, ఆజాద్ షోజై, రసూల్ అహ్మద్ రసూల్లను అరెస్టు చేసి... ఇజ్రాయెల్కు సహకరించినందుకు ఈ ఉదయం శిక్ష అమలు చేశారు. వారిని ఉరితీశారు’అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వెబ్సైట్ పేర్కొంది. తుర్కియే సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయవ్య నగరమైన ఉరి్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి. నీలిరంగు జైలు యూనిఫాంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోటోను కూడా కోర్టు పంచుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరాన్లో ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్తో సహా విదేశీ నిఘా సేవలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏజెంట్లను అరెస్టు చేయడం, ఉరితీయడం తరచుగా జరుగుతుంది. జూన్ 13న ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆ దేశంతో సంబంధాలున్న వ్యక్తులపై త్వరిత చర్యలు తీసుకుంటామని టెహ్రాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే దోషులుగా తేలిన అనేక మంది వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. -
మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాడు సద్దాం నేడు ఖమేనీ అమెరికా పాన్ అదేనా?
-
అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ట్రంప్
ఇరాన్ (Iran)లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా (USA) ఆదివారం(జూన్ 22న) ప్రత్యక్షంగా దాడులు చేసిందన్నది తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఓ నివేదిక తయారుచేసింది. ఈ నివేదికల్లోని విషయాలు పలు మీడియాల్లో కథనాలుగా వెలువడగా.. ఇప్పుడవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అవి నకిలీ వార్తలని పేర్కొన్న ఆయన.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇదన్నారు. ‘నకిలీ వార్తలు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యూఎస్ దాడుల్లో ఇరాన్కు పరిమితంగా నష్టం వాటిల్లిందని అందులో తెలపడం గమనార్హం. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్డో, నతాంజ్లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. దాడులకు ముందే భారీగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించినట్లు అందులో పేర్కొంది. అయితే ఈ సందర్భంగా ఫోర్డో కేంద్రం గురింంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది దాదాపు 150–300 అడుగుల గట్టిగా ఉన్న పర్వతాల కింద నిర్మించబడిన సురక్షితమైన సైట్. అందుకే, US సైన్యం ఉపయోగించిన ‘బంకర్ బస్టర్’ పేలుడు బాంబులు కూడా దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినట్టు Pentagon నివేదిక పేర్కొంది. US బాంబర్లు 12 గుబు-57 బాంబులు ఫోర్డోపై, మరికొన్ని నతాంజ్పై వేయగా, US నేవీ సబ్మరిన్ ఇస్ఫహాన్పై దాదాపు 30 టోమాహాక్ క్షిపణులు ప్రయోగించింది.ఇక, బయటకు వచ్చిన ఈ నివేదికలను వైట్హౌస్ (White House) ధ్రువీకరించినప్పటికీ.. అందులోని అంశాలను కొట్టిపారేసింది. ‘ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ను కించపరచడమే. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధపైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం ఇది. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అవన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయి’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఎక్స్లో పేర్కొన్నారు.“Everyone knows what happens when you drop fourteen 30,000 pound bombs perfectly on their targets: total obliteration.” - LEAVITT https://t.co/a6zCgFnheq— Aishah Hasnie (@aishahhasnie) June 24, 2025మరోవైపు.. సైనిక చర్యతో ఇరాన్ నుంచి అణు ముప్పు తొలగించినట్లు కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా బాంబర్ల దాడుల్లోనూ ఇరాన్ అణు కేంద్రాలకు పరిమిత నష్టం వాటిల్లిందన్న నిఘా నివేదికలపై మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!. -
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
12 రోజుల యుద్ధానికి బ్రేక్.. ఇజ్రాయెల్ ను పూర్తిగా నమ్మలేం..
-
ఆగిన దాడులు!. యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్
-
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
యురేనియంను దాచేసింది!
గుట్టుచప్పుడుకాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనంచేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంతశుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.ఎంతో కష్టపడి శుద్ధిచేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసేంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియం నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలంచేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేం తెలీకుండానే యురేనియంలేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు.పక్కా ప్రణాళికతో..చిన్నని స్థూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారుచేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ మారియానో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతిచర్చలకు సిద్ధమైతే, తమ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది.‘‘ చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ల యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనంచేశాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం’’ అని ఏబీసీ వార్తాసంస్థతో జేడీ వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ మారియానో సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ‘‘ఇందులో దాచాల్సిందేమీ లేదు. అంతా బహిరంగ రహస్యమే.తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకు ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారుచేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60 శాతమే. 90 శాతం శుద్ధత ఉంటేనే అణుబాంబుకు అక్కరకొస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫహాన్ అణుకేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారు’’ అని రఫేల్ వెల్లడించారు. ఆ 16 ట్రక్కులు ఎక్కడ?ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వారి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కుల నిండా ఏవో బ్యారెళ్లను నింపి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే ట్రక్కులపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేశాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాటిపై దాడులుచేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాతో మరో కథనం వెలువడింది. -
ఆగిన దాడులు!
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/జెరూసలేం: యుద్ధజ్వాలలతో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్ శాంతించాయి. ఇజ్రాయెల్కు దన్నుగా ఇరాన్పై బంకర్ బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఆ తర్వాత తీరిగ్గా శాంతిమంత్రం జపించింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలూ అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. కానీ అప్పటినుంచి రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి.ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. దాంతో ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ఒక దశలో ఇజ్రాయెల్పై కన్నెర్రజేశారు. తర్వాత ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న పోరుకు ప్రస్తుతానికి తెర పడింది. ఈ పరిణామాన్ని భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే కాల్పుల విరమణ షరతులేమిటి, ఇరు దేశాలు వాటిలో ఎన్నింటికి, ఏ మేరకు అంగీకరించాయి వంటివన్నీ ప్రస్తుతానికైతే జవాబుల్లేని ప్రశ్నలే! ట్రంప్ తిట్ల వర్షం సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయంటూ మంగళవారం తెల్లవారుజామున ట్రంప్ తన సామాజిక మాధ్యమం‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణ మరో ఆరు గంటల తర్వాత నెమ్మదిగా అమల్లోకి వస్తుంది. ఇరు దేశాలూ సైనిక చర్యల నుంచి వెనుదిరుగుతాయి. రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ యుద్ధం కొనసాగితే పశ్చిమాసియా భస్మీపటలం అవుతుంది. అంతదాకా పోనివ్వను. కాల్పుల విరమణతో ప్రపంచం, పశ్చిమాసియా శాంతిని గెల్చుకున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. విరమణ వెనుక ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహీమ్ అల్ థానీ కృషి కూడా ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు కొనసాగాయి.తమకు ఎలాంటి విరమణ ప్రతిపాదనా రాలేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తొలుత ప్రకటించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్లోని బీర్òÙబా సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాము దాడులు చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, తొలుత దాడులు చేసింది ఇజ్రాయెలేనని గుర్తు చేశారు. వాళ్లే ముందుగా దాడులు ఆపితే తామూ ఆపుతామని ప్రకటించారు. తర్వాత దక్షిణ, ఉత్తర ఇరాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు చనిపోయారు. టెహ్రాన్ సమీపంలోని రాడార్ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది.మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. అయినా ఇరాన్ దాడులను ఉధృతం చేయడంతో మరోసారి ప్రతిదాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్ మండిపడ్డారు. రెండు దేశాలూ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వాటినుద్దేశించి పలు బూతు మాటలు కూడా ప్రయోగించారు. ‘‘బాంబులేయడం ఆపండి. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలిపించండి’’ అంటూ ఇజ్రాయెల్కు అలి్టమేటమిచ్చారు. యుద్దం మొదలయ్యాక ఇజ్రాయెల్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం ఇదే తొలిసారి. ‘‘ఇరాన్ ఇక ఎప్పటికీ అణ్వస్త్రదేశంగా అవతరించబోదు. అణుబాంబును తయారు చేయబోదు’’ అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాత్రం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. దాంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మోతలు విని్పంచినట్టు తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఇరాన్లో 974 మంది చనిపోయారని, 3,458 మందికిపైగా గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హ్యూమ్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ ప్రకటించింది. తమ దేశంలో 28 మంది చనిపోయారని, 1,000 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రయెల్ పేర్కొంది. కొద్దిరోజులుగా మూసేసిన తన గగనతలాన్ని మంగళవారం సాయంత్రం తిరిగి తెరిచింది. పశ్చిమాసియా దేశాలకు విమాన సరీ్వసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.పరిష్కారానికి తోడ్పడతాంఇరాన్–ఇజ్రాయెల్ నడుమ ఘర్షణలను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. ‘‘యుద్ధం ఏ సమస్యలకూ పరిష్కారం కాదు. చర్చలే ఏకైక మార్గం. ముందనుంచీ ఇదే భారత్ వైఖరి’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొందిమరో శాస్త్రవేత్త మృతిఅణు కార్యక్రమంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన శాస్త్రవేత్త మొహమ్మద్ రెజా సెదీఘీ సాబర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్లోని ఆస్తనీయే అష్రాఫీయేలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేసింది. జూన్ 13న జరిగిన దాడి నుంచి రెజా తప్పించుకున్నా ఆయన 17 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. రెజాపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. ఆయన మృతితో తాజా పోరులో భాగంగా ఇజ్రాయెల్ హతమార్చిన ఇరాన్ అణుశాస్త్రవేత్తల సంఖ్య ఏకంగా 14కు పెరిగింది. -
విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. -
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అంత ఎత్తున లేచారు. తన మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ అని ఇరు దేశాలు ప్రకటించిన కాసేపటికే మళ్లీ క్షిపణులతో యుద్ధానికి దిగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ‘నాకు చెప్పిందేమిటి?.. మీరు చేస్తున్నదేంటి? అని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సహనాన్ని కోల్పోయి అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు. ఇక వారి ఇస్టం.. వారికిష్టమొచ్చింది చేస్కుంటారు అంటూ ట్రంప్ మీడియా సాక్షిగా అసహనం ప్రదర్శంచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ః మీడియాలో వైరల్గా మారింది. Trump is absolutely FUMING that Israel & Iran have broke the ceasefire:“We basically have two countries that have been fighting so long and so hard that they don't know what the f*ck they're doing.”He also warned Israel directly on Truth Social: “DO NOT DROP THOSE BOMBS.” pic.twitter.com/yHQeUybgUK— J Stewart (@triffic_stuff_) June 24, 2025 అయితే ఆటు తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోరంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తిరిగి సొంత గడ్డపైకి వచ్చేస్తాయని, అదే సమయంలో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగిందన్నారు. ఇక తక్షణమే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. -
Israel Iran War: యుద్ధం ముగిసింది
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
జెరూసలేం: పశ్చిమాశియాలో యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్పై ప్రతిదాడులకు దిగింది. దీంతో గంటల వ్యవధిలో ఇరు దేశాల మధ్య యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ దాడులకు దిగిందని హెచ్చరించింది. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇరాన్ స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తరువాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదని . అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది. ⭕️"In light of the severe violation of the ceasefire carried out by the Iranian regime, we will respond with force."-The Chief of the General Staff, LTG Eyal Zamir in a situational assessment now— Israel Defense Forces (@IDF) June 24, 2025 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఇరు దేశాలు తన మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది.ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పశ్చిమాశియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్పై భీకరదాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం అదే తరహాలో ఇరాన్ దాడుల్ని ప్రతిఘటించింది. ఇరాన్ దాడుల్ని జ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)మంగళవారం ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. -
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్!
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు మూడవ ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న అస్థిర వాతావరణం.. ఒకవేళ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, మిత్రదేశాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజలకు ఆశ్రయం కల్పించేలా కొన్ని దేశాలున్నాయి. ఆయా దేశాల్లోని భౌగోళిక, రాజకీయ స్థితిగతులు, సైనిక తటస్థత , స్థిరమైన పరిస్థితుల కారణంగా సురక్షితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ‘ది మెట్రో’ తెలిపిన వివరాల ప్రకారం ఆ దేశాలు ఇవే..అంటార్కిటికాఅణు యుద్ధం జరిగిన పక్షంలో అంటార్కిటికా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. అణు శక్తులకు ఈ ప్రాంతం చాలా దూరంలో ఉంది. దేశంలోని 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడి మంచుతో కూడిన వాతావరణం మనుగడకు సవాలుగా నిలుస్తుంది.ఐస్లాండ్అత్యంత శాంతియుత దేశాలలో ఒకటిగా, స్థిరమైన ర్యాంక్తో ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఐస్లాండ్ పూర్తి స్థాయి యుద్ధంలో ఎప్పుడూ పాల్గొనలేదు. దేశ భౌగోళిక స్థానం యుద్ధాలకు తక్కువ అవకాశమిస్తుంది. అయితే అణుయుద్ధం నుంచి రక్షణ కల్పించడంలో అంత అనువైన దేశం కాదు.న్యూజిలాండ్తటస్థ వైఖరితో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. ఇక్కడ పర్వత భూభాగాల కారణంగా రక్షణను అందిస్తుంది. ఈ దేశం ఉక్రెయిన్కు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది.స్విట్జర్లాండ్రెండవ ప్రపంచ యుద్ధంలో స్విట్జర్లాండ్ తటస్థతంగా వ్యవహరించింది. ఇక్కడి పర్వత ప్రాంతాలు యుద్ధాల నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతుంటారు. దేశ రాజకీయ తటస్థ వైఖరి కారణంగా దాడులకు అవకాశం తక్కువ.గ్రీన్లాండ్ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ పేరొందింది. దేశ రాజకీయ తటస్థత.. యుద్ధ భయాలను దూరం చేసేదిగా ఉంది. 56 వేల మంది జనాభా మాత్రమే కలిగిన ఈ దేశంలో సంఘర్షణలకు ఆస్కారం చాలా తక్కువని చెబుతుంటారు.ఇండోనేషియాఇండోనేషియా నిరంతరం ప్రపంచ శాంతికి ప్రాధాన్యతనిస్తూ, తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ స్వతంత్ర వైఖరి, భౌగోళిక రాజకీయ స్థానం మొదలైనవి ఈ దేశాన్ని ప్రపంచ సంఘర్షణలవైపు చూసేలా చేయనివ్వవు.తువాలుకేవలం 11 వేల మంది జనాభా కలిగిన చిన్న ద్వీప దేశమిది.ఇక్కడి పరిమిత మౌలిక సదుపాయాలు, వనరులు యుద్ధ పరిస్థితులకు తావులేనివిధంగా ఉన్నాయి. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఈ దేశం అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.అర్జెంటీనాఅర్జెంటీనాకు సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ, ఇక్కడి వ్యవసాయ వనరుల కారణంగా ఇది సాపేక్షంగా సురక్షితమైన దేశంగా పేరొందింది.భూటాన్1971లో తటస్థతను ప్రకటించినప్పటి నుండి భూటాన్ సురక్షితంగా ఉంటోంది. దేశంలోని పర్వత భూభాగం యుద్దాల నుంచి రక్షణను అందిస్తుంది. దేశ భౌగోళిక స్వరూపం బాహ్య ముప్పుల సులభంగా తప్పించుకునే విధంగా ఉంది.చిలీనాలుగు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న చిలీ.. విస్తారమైన తీరప్రాంతాన్ని, సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగివుంది. ఇది ప్రజలకు భద్రతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో చిలీ ఒకటిగా నిలిచింది.ఫిజీఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఫిజీ ఉంది. దట్టమైన అడవులు ఈ దేశాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫిజీ తన ర్యాంక్ను కాపాడుకుంటూ వస్తోంది.దక్షిణాఫ్రికాదేశంలోని సారవంతమైన భూమి, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రజల మనుగడకు తగిన అవకాశాలను అందిస్తున్నాయి. దేశంలోని వైవిధ్యమైన వనరులు, వ్యవసాయ సామర్థ్యం.. సంక్షోభాల సమయంలో దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయి. ఇది కూడా చదవండి: 24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్ -
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందులో భాగంగా.. ఇరాన్ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్, నారాయణలు తెలిపారు. ఆపరేషన్ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్ 13వ తేదీన ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది. -
భారత విమాన సర్వీసులపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్
-
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం.ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈలోపు ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది.ఆపై కొన్ని గంటల్లోనే టెల్అవీవ్పై టెహ్రాన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్ ఇస్తూ ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. -
నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. -
ట్రంప్ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన కారణంగానే కుదిరిందంటూ.. ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ‘ఇజ్రాయెల్ - ఇరాన్ ఒకేసారి తన దగ్గరకు వచ్చి, శాంతి నెలకొల్పాలని కోరాయని పేర్కొన్నారు. ఆ క్షణంలో ఆ దేశాల ఆవశ్యకతను తాను గుర్తించానని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని గ్రహించానని పేర్కొన్నారు. ఈ విధమైన నిర్ణయం ఆ రెండు దేశాలకే కాకుండా, ప్రాంతీయంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.ప్రపంచ వేదికపై తనను తాను డీల్ మేకర్గా చెప్పుకుంటున్న ట్రంప్ ఈ రెండు శత్రుదేశాల మధ్య కొత్త అధ్యాయానికి గల అవకాశాలను వివరించారు. ఈ దేశాలు భవిష్యత్తులో అపారమైన పరస్పర ప్రేమ, శాంతి శ్రేయస్సును చవిచూస్తాయన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్లకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. దేవుడు ఆ దేశాలను దీవించాలని కోరుకుంటూ ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు మరింతగా పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ నేతలతో దౌత్య మంతనాలు నిర్వహించారన్నారు. ఇరు దేశల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం ఒక కీలక షరతుపై ఆధారపడి ఉందని సమాచారం. ఇరాన్ ఇకపై దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తుందనేదే ఆ షరతు అని తెలుస్తోంది. ఇరాన్ తన దాడులను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చిందని, తక్షణ దాడులకు ప్రణాళికలు లేవని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమన్వయ సాధనలో ట్రంప్ ప్రత్యక్ష ప్రమేయంతో ఈ పురోగతి సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు -
‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన -
సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొద్దిపేపటికే టెహ్రాన్ దానిని ఖండించింది. దీనిపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. అయితే తమ సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ సంధి దిశగా మొగ్గుచూపుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయిని విశ్లేషకులు అంటున్నారు.ఇరాన్ మంత్రి అరఘ్చి ఒక ప్రత్యేక పోస్ట్లో ఇజ్రాయెల్పై టెహ్రాన్ తన సైనిక కార్యకలాపాలను ముగించిందని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఢీకొడుతూ తమ శక్తివంతమైన సాయుధ దళాల సైనిక కార్యకలాపాలు చివరి నిమిషం వరకు, అంటే ఉదయం 4 గంటల వరకు కొనసాగాయన్నారు. ఇరానియన్లందరితో కలిసి, దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం చివరి వరకూ పోరాడిందని, శత్రువుల దాడిని చివరి నిమిషం వరకు తిప్పికొట్టిన దళాలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ తాజాగా 12 రోజుల ఘర్షణల అనంతరం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ ఉదయం 9:30 (ఐఎస్టీ) నుండి ప్రారంభమై 24 గంటల పాటు దశల వారీ ప్రక్రియగా ఉంటుందని, ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే బాటలో నడుస్తుందని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఈ కాల్పుల విరమణ వాదనలపై స్పందించలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో జతకట్టిన అమెరికా.. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలను ధ్వంసం చేసిన దరిమిలా ఈ యుద్ధంలో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యూఎస్ ఎయిర్ బేస్లపైనా దాడి జరిపినట్లు వార్తలు
-
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.అయితే ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం నాలుగు గంటలలోపు ఆపితే, ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని మిస్టర్ అరఘ్చి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
యుద్ధం ముగిసింది.. ఇరాన్-ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ కీలక ప్రకటన
కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.


