breaking news
iran
-
ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది!
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంచితే, ఒక లైవ్ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్ బీసెంట్కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ రావడం చర్చనీయాంశమైంది. ‘‘ఉన్నపళంగా ట్రంప్ను బీసెంట్ కలవాలనేది ఆ కాల్ సారాంశం’’. బీసెంట్ స్కై న్యూస్ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్లో ఉండగా బీసెంట్కు పిలుపు వచ్చింది. ఆ స్టూడియోకు ట్రంప్ నుంచి కాల్ రావడంతో ఉన్నపళంగా బీసెంట్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే.. ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్ వెంటనే కలవాలట. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్కి రమ్మన్నారు’ అని బీసెంట్ లైవ్ ప్రోగ్రామ్ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్ తన ఇంటర్వ్యూను అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్ను కలిశారు. అయితే ఆ తర్వాత బీసెంట్ తన లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్ ప్రోగ్రామ్ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే ఆయన ఈ పరిస్థితిని నిర్వహిస్తున్న ప్రభుత్వ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. -
యుద్ధంలో కీలక మలుపు ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
మాతో పెట్టుకుంటే అంతే.. ఇరాన్ మంత్రి
టెహ్రాన్: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో రెండు వారాల యుద్ధానికే అమెరికా పనైపోయిందని తెలిపారు. వాషింగ్టన్ ఇప్పుడు భారత్తో పాటు అనేక దేశాలను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని అడుక్కుంటుందని ఆరోపించారు.పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలపై దాడులు చేయడంతో క్రూడాయిల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతంలో విధించిన ఆంక్షలు సడలించారు. ప్రపంచ దేశాలు తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కౌంటరిచ్చారు,ఆయన మాట్లాడుతూ " గత కొద్ది నెలలుగా అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దంటూ ఆంక్షలు విధించింది. ఇరాన్తో 15 రోజులు యుద్ధం చేయగానే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్తో సహా ఇతర దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని యాచిస్తుంది. యూరప్ సైతం ఈ అక్రమ యుద్ధంలో మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ సపోర్టు లభిస్తోందని భావిస్తోంది" అని అన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందని తెలిపారు.కాగా ఇంతకాలం రష్యాతో చమురు కొనుగోలు ఇతర దేశాలను అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మాస్కో నుంచి పన్ను కొనుగోలు చేసిన వారిపై అధిక పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో భారత్పైన తొలుత పన్నులు పెంచి అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని ప్రకటించింది. అయితే ఇటీవలే రష్యా నుంచి తాత్కాలికంగా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని ఆదేశించినట్లు తెలిపింది. కాగా దీనిపైఇరాన్ విదేశాంగమంత్రి స్పందించారు.కాగా ప్రస్తుతం ఇరాన్ భారత్ విషయంలో సానూకులంగా ఉంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో భారత్ వెళ్లే చమురు నౌకలకు ఇరాన్ అనుమతి తెలిపింది. ఇటీవల భారత్ పతాకంతో ఉన్న రెండు నౌకలు హార్మూజ్ గుండా ఇండియాకు చేరుకున్నాయి. -
అమెరికా ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసిన ఇరాన్..! షాక్ లో ట్రంప్
-
వామ్మో... ఏంటి ఈ రేట్లు! 1KG టమాటా రూ.250... 1KG ఉల్లిపాయ రూ.175
-
పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
పిల్లలూ... పేపర్లలో, న్యూస్పేపర్లలో యుద్ధాలు చూస్తున్నాం. ఈ యుద్ధాలు పైకి ఏ కారణంతో జరిగినా చాలా మటుకు వీటి వెనుక ‘పెట్రోల్’ ఉంటుంది. పెట్రోల్ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ఇంధనం. అది కొన్నిచోట్లే దొరుకుతుంది. అందుకని దాని కోసం చాలా పోరాటాలు సాగుతూ ఉంటాయి. మనం రోజూ బయటకు వెళ్లాలంటే ఏదో ఒక వాహనం కావాలి. అది నడవాలంటే పెట్రోల్ కావాల్సిందే! రోజూ లక్షలాది కార్లు, మోటార్ సైకిళ్ళు, యంత్రాలు పెట్రోల్ సాయంతో నడుస్తాయి. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో పెట్రోల్ నిక్షేపాలు ఏర్పడ్డాయి. ΄ప్లాంక్టన్, ఆల్కే వంటి చిన్న సముద్ర జీవులు మహాసముద్రాలలో నివసించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు, వాటి అవశేషాలు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు సముద్రపు అడుగుభాగంలోని బురద, ఇసుక అవక్షేపాలతో కలిసిపోయాయి. ఆ పోరలు మరింతగా పేరుకుపోవడంతో అవశేషాలు భూమి ఉపరితలం కింద మరింత లోతుగా ఏర్పడ్డాయి. అలా ఇంధన నిక్షేపాలు తయారయ్యాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి, పెట్రోల్ ఏర్పడటానికి దారితీసే ముడి చమురు ఏర్పడటానికి 10 మిలియన్ల నుండి 300 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే పెట్రోల్ నేరుగా తయారు కాదు. భూమి అడుగులోని ముడిసరుకును బయటకు తీసి, కర్మాగారాల్లో దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్గా మారుస్తారు. కొన్ని దేశాలలో పెట్రోల్ని ‘గ్యాసోలిన్’ అని కూడా పిలుస్తారు. కార్బన్ డై ఆక్సైడ్ నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమైతే పెట్రోల్ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం పెట్రోల్తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఛార్జ్ చేసి వాడటం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గించడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది. -
బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు
-
ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...
-
అమెరికాకు వార్నింగ్ ఇస్తూ.. ఇరాన్ సంచలన వీడియో విడుదల
-
ఖర్గ్ ఐలాండ్పై దాడి.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా చమురు మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా, ‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టిందని.. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ను నిర్మూలించానంటూ కూడా జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్సోషల్ పోస్టుల్లో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి. సర్వమూ నాశనమవుతోంది.నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. -
ఇరాన్తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
ఇరాన్తో యుద్ధం మొదలై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. ఇరాన్పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్ ఈస్ట్కు అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నిన్న (శుక్రవారం) భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరం నడిరొడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే చమురులో ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ దాదాపుగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా.. 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
అత్యంత శక్తివంత దేశాలను వణికిస్తున్న ఇరాన్.. అసలైన బలం అదే..!
-
డోస్ పెంచిన అమెరికా.. పశ్చిమాసియాకు భారీగా బలగాలు
-
పశ్చిమాసియాలో భారీగా అమెరికా బలగాల మోహరింపు
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. -
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే! -
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’
జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని ఇరాన్ జట్టు ప్రకటించింది. ఇరాన్ ఆటగాళ్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేం అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. నిజంగా వరల్డ్ కప్ నుంచి ఎవరినైనా తప్పించాలంటే అది ఆతిథ్య అమెరికానేనని ఇరాన్ బృందం అభిప్రాయ పడింది. గల్ఫ్లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్–జూలైలో అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్లో ఇరాన్ పాల్గొనడం సందేహంగా మారింది.లీగ్ దశలో ఇరాన్ తమ మూడు మ్యాచ్లు కూడా అమెరికా వేదికగానే ఆడాల్సి ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్కు క్వాలిఫై అయింది. అయితే ఇరాన్ టీమ్ గురించి మాట్లాడుతూ... ‘ఆ జట్టు ఇక్కడికి వచ్చి ఆడుతుందని నేను అనుకోవడం లేదు. వారి భద్రత, జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా’ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇరాన్ టీమ్ స్పందిస్తూ... ‘వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్.ఇది ‘ఫిఫా’ ఆధ్వర్యంలో జరుగుతుందే తప్ప ఏదో ఒక దేశం నిర్వహించడం లేదు. కాబట్టి వరల్డ్ కప్ ఆడకుండా ఇరాన్ను ఎవరూ తప్పించలేరు. ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం చేతకాదని చెబుతున్న అమెరికానే నిజానికి తప్పించాలి’ అని ట్వీట్ చేసింది. -
ఏం కావాలో ‘ట్రంప్’కు తెలుసు!
‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట. చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే! ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి. 1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు! – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త -
ఇరాన్ ముందుచూపు.. మొజాయిక్ డిఫెన్స్!
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావీ, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్ర నేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా రెండు వారాలుగా ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్, దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా తొలి రోజు దాడిలోనే గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి. అయినా సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ను ఓడించడం దేవుడెరుగు, ఆ దేశాన్ని కాస్త కూడాలొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశి్చమాసియా మొత్తాన్నీ యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటోంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా, డెడ్లీ కాంబినేషన్గా పరిగణించే ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులను దీటుగా ఎదుర్కోవడం ఇరాన్కు ఎలా సాధ్యపడుతోంది? ఇందుకు సమాధానం ఒక్కటే. ఆ దేశం ముందుచూపుతో సిద్ధంచేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం! అత్యంత శక్తిమంతుడైన శత్రువుపై ఇరాన్కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా, ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటిది!! సైనికాధికార వికేంద్రీకరణ ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపళంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి 2005లో పుట్టుకొచి్చందే మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్కముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూలమంత్రం.ఇందులో భాగంగా సైనిక, ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయంప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కూ సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్–కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికా దళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్సీజీ చీఫ్ కమాండర్గా ఎంపికయ్యా మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. పొరుగునుంచే పాఠాలు ఇరాక్లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చీ ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన రెండో రోజు మార్చి 1వ తేదీనే ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ఆద్యంతం ఐఆర్జీసీతోనే ముడిపడ్డ కెరీర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీది. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో నిఘా విభాగంలో చేరారు. అనంతరం ఇరాక్తో పదేళ్ల యుద్ధంలో పోరాడారు. 1992 నాటికి ఐఆర్జీసీ పదాతి దళాల కమాండర్గా ఎదిగారు. 2005లో ఐఆర్జీసీ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా ఎంపికయ్యాక మొజాయిక్ సిద్ధాంతానికి పదును పెట్టారు. 2003లో ఇరాక్ను అమెరికా ఆక్రమించిన తీరు నుంచి నేర్చుకున్న పాఠాలనే అందుకు ముడిసరుకుగా మార్చుకున్నారు.నిద్రలేని రాత్రులేఇరాన్ ముందుచూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైనా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్పైనే గాక గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి.శత్రు దాడులకు ఎక్కడికక్కడ దీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల వంటి పౌర వ్యవస్థలపైనా దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు. -
కుప్పకూలిన రీఫ్యూయలింగ్ విమానం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన కేసీ–135 రీఫ్యూయలింగ్ విమానం పశ్చిమ ఇరాక్లో గురువారం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారు. యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయం నిర్ధారించింది. విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి గానీ, ఫ్రెండ్లీ ఫైర్ గానీ కారణంగా కాదని తేల్చిచెప్పింది. రెండు కేసీ–135 విమానాలు పక్కపక్కనే ప్రయాణిస్తూ ప్రమాదవవశాత్తూ పరస్పరం ఢీకొన్నాయని తెలియజేసింది.వాటిలో ఒకటి కూలిపోగా, మరొకటి స్వల్పంగా దెబ్బతిని ఇజ్రాయెల్లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టంచేసింది. పశ్చిమాసియాలో ఇరాన్పై యుద్ధంలో పాల్గొంటున్న తమ సైన్యానికి మద్దతుగా ఈ విమానాలను అమెరికా రంగంలోకి దించినట్లు సమాచారం. అయితే, పశ్చిమ ఇరాక్లో యూఎస్ కేసీ–135 ఎయిర్క్రాఫ్ట్ను తామే కూల్చేశామని ఇరాన్కు అనుకూలంగా వ్యవహరించే ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది.ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియాలో అమెరికా విమానాలు కూలిపోవడం ఇది నాలుగోసారి. కేసీ–135 రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ను గగనతలంలో యుద్ధ విమానాల్లో ఇంధనం నింపడానికి ఉపయోగిస్తారు. ఇదొక భారీ చమురు ట్యాంకర్ అని చెప్పొచ్చు. కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అని పిలుస్తుంటారు. కేవలం చమురు నింపడానికే కాకుండా, సైనిక ఆపరేషన్లలో గాయపడిన జవాన్లను చికిత్స కోసం తరలించడానికి వాడుతుంటారు. -
ర్యాలీపై దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం నగరం నడిరోడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. దాంతో రాజధాని మీదుగా ఎటు చూసినా దట్టమైన పొగ అలముకుని కన్పించింది.అయితే దాడులకు ఇరానీలు వెరవలేదు. పేలుళ్ల అనంతరం కూడా వేలాదిగా టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘అమెరికాకు, ఇజ్రాయెల్కు మరణం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ గులాం హుసేన్ మొహసెనీ ఎజెయ్, రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ తదితరులు కూడా అందులో భాగస్వాములయ్యారు. పేలుళ్లలో చాలామందే మరణించినట్టు భావిస్తున్నారు. ఇరాన్ మాత్రం ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనావాసులకు మద్దతుగా ఇరాన్ ఏటా ఖుద్స్ డే జరుపుతూ వస్తోంది. ఇరాన్వ్యాప్తంగా క్షిపణి, ఇజ్రాయెల్–అమెరికా బాంబు దాడులు శుక్రవారమూ కొనసాగాయి. ప్రధానంగా సైనిక, క్షిపణి కమాండ్ వ్యవస్థలనే లక్ష్యం చేసుకున్నారు.ఇరాన్ కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. మద్యధరా ప్రాంతంలో మోహరించిన అమెరికాకు చెందిన భారీ విమానవాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్పై ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ‘‘అత్యంత కచ్చితత్వంతో కూడిన మా దాడుల్లో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అది పని చేయడం లేదు. యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతోంది’’ అని పేర్కొంది. అమెరికా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఒక ఇరాన్ పడవ కేవలం తమ నౌకకు అతి సమీపానికి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.అమెరికాకు చెందిన మరో విమానవాహక యుద్ధ నౌక గెరాల్డ్ ఫోర్డ్లోనూ మంటలు చెలరేగడం కలకలం రేపింది. దీనికి యుద్ధంతో సంబంధం లేదని అమెరికా తెలిపింది. ‘‘లాండ్రీ ప్రదేశంలో చెలరేగిన మంటల్లో ఇద్దరు నావికులకు గాయాలయ్యాయి. నౌకకు నష్టమేమీ వాటిల్లలేదు. ఎప్పట్లాగే చురుగ్గా యుద్ధంలో పాల్గొంటోంది’’ అని వెల్లడించింది. మరోవైపు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో 60 మందికి పైగా గాయపడ్డారు.గల్ఫ్పై దాడులే దాడులు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నలుగురు గాయపడ్డట్టు సమాచారం. దుబాయ్ పారిశ్రామిక ప్రాంతంపైనా దాడులు జరిగాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ పైనాన్షియల్ సెంటర్లో ఒక భవనం భారీగా దెబ్బ తిన్నది. అబుదాబి విమానాశ్రయ సమీపంలో కూడా డ్రోన్ దాడులతో మంటలు చెలరేగాయి. తమపైకి దూసుకొచి్చన 7 ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను, 27 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.ఒమన్లోని సొహర్ నగరంపై రెండు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒకటి అల్ అవీ పారిశ్రామిక ప్రాంతాన్ని తాకడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటిదాకా మరణించిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. ముజ్తాబాకు తీవ్ర గాయాలు: హెగ్సెత్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గాయాలతో మొజ్తబా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని ఆయన చెప్పారు. ఇరాన్లో ఇప్పటిదాకా 15 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపారు. మా టార్గెట్ ముజ్తబా: నెతన్యాహుఇరాన్పై దాడులు ఊహించిన దాని కంటే గొప్పగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జీవితానికి గ్యారంటీ లేదన్నారు. ఆయనతో పాటు హెజ్బొల్లా నేత నయీం ఖాసీంను కూడా లక్ష్యం చేసుకున్నట్టు వెల్లడించారు.ఇరాన్ లొంగుబాట: ట్రంప్‘‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టింది. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ను నిర్మూలించాను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్సోషల్ పోస్టుల్లో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి.సర్వమూ నాశనమవుతోంది. నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. యుద్ధంలో ఇరాన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయం చేస్తున్నారని కూడా ట్రంప్ అనుమానాలు వెలిబుచ్చారు. -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ‘ఫిసైల్’పై చర్చలు ముగియక ముందే..!ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్–అమెరికా 2025 జూన్లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రిసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రిసెర్చ్ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్ అయోడిన్ అండ్ జినాన్ (ఎం.ఐ.ఎక్స్.) రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్–క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్ రిసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్ న్యూక్లి యర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తర్వాత నూతన ఇస్పహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. ‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!అసలు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా! -
ఇస్లామిక్ ప్రభుత్వ మద్దతు ర్యాలీలో టెహ్రాన్పై బాంబుల వర్షం..
-
పశ్చిమాసియాలో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
వారు సజీవంగా లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.దీనికి తోడు ఇరాన్ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్)మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ, ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ లేదుకాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు -
అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ దాడి
-
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్పై యుద్దాన్ని మొదలు పెట్టిన తరువాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. אתמול במסיבת העיתונאים עמדתי על היעדים הברורים של המערכה: פגיעה במשטר הטרור באיראן, המשך המאבק מול שלוחותיו, והבטחת ביטחונה ועתידה של ישראל.אנחנו לא מחכים. אנחנו יוזמים, אנחנו תוקפים ואנחנו עושים זאת בעוצמה.צפו בדברים המלאים >> pic.twitter.com/hubJWVdiKQ— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 13, 2026 (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్) ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.ఇదీ చదవండి: లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం! -
అగ్నిగుండంలా పశ్చిమాసియా.. ఇరాన్ పై రెచ్చిపోయిన ఇజ్రాయెల్
-
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు, 14వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై స్పందిస్తూ, పరిస్థితి "చాలా వేగంగా మారుతోంది" అని, అతి త్వరలో ఇరాన్మాకు లొంగిపోనుందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ కొత్త బెదిరింపు తర్వాత ఇరాన్, లెబనాన్లో కొత్త దాడులు జరిగినట్లు తెలుస్తోంది.యుద్ధంలో తన పక్షం గెలిచిందని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఉత్పన్నమైన సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు పెరగడం ద్వారా అమెరికా గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉందని గురువారం అన్నారు. ఇరాన్ ఇంధన బెదిరింపులు చేస్తున్నప్పటికీ, అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "అమెరికా ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, కాబట్టి చమురు ధరలు పెరిగినప్పుడు, మేము చాలా డబ్బు సంపాదిస్తాము." ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. ఇరాక్లో విమాన ప్రమాదం: అమెరికా విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే శత్రుదాడిలో కాకుండా ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానం ప్రమాదానికి గురైంది. మరో విమానంతో జరిగిన ఢీకొనడం వల్ల జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాక్లోని కుర్దిస్తాన్ రీజియన్లో జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.UAE పై ఇరాన్ దాడులుమార్చి 12న ఇరాన్ నుండి ప్రయోగించిన 10 బాలిస్టిక్ క్షిపణులు మరియు 26 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విజయవంతంగా అడ్డుకుంది.దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు UAE మొత్తం 278 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు మరియు 1,540 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసింది. దుబాయ్ మధ్య భాగంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఇది ఇలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రవాసులకు యూఏఈ భారీ ఊరట కల్పించింది. ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత వీసా గడువు ముగిసిన వారు, కొత్త ఎంట్రీ పర్మిట్ అవసరం లేకుండానే మార్చి 31 వరకు ఉండేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధ పరిణామాలపై తొలిసారి స్పందించిన ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ పోరాడుతూనే ఉంటామన , హోర్ముజ్ జలసంధిని మూసివేస్తానని గురువారం నాటి ఒక టెలివిజన్ ప్రెజెంటర్ చదివిన సందేశంలో స్పష్టం చేశారు. రక్తం ధారబోసిన తమ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చు కుంటామని ప్రకటించాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెడుతుండగా ఇరు పక్షాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం. ఈ అనూహ్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2వేలకు పైగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది ఇరాన్లోనే ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఇరు పక్షాల భీకర దాడుల మధ్య కొనసాగుతున్న యుద్ధం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. -
చాకచక్యంగా హార్ముజ్ దాటి ముంబై చేరిన తొలి నౌక
-
ఇరాన్ సంచలన ప్రకటన..
టెహ్రాన్: అమెరికా- ఇరాన్ యుద్ధంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేశాయి. అమెరికా ప్రధాన యుద్ధ నౌక అబ్రహం లింకన్పై దాడి చేసినట్లు ప్రకటించాయి. అయితే, ఈ దాడిని అమెరికా ఖండించింది. అబ్రహం లింకన్పై ఏటువంటి దాడి జరగలేదని, ఇరాన్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ వెనక్కితగ్గడం లేదు. ఏక కాలంలో గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే ఇటు యుఎస్, ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అతిపెద్ద యుద్ధనౌకగా పిలిచే అబ్రహం లింకన్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఎయిర్క్రాఫ్ట్ పెద్దఎత్తున దెబ్బతిన్నట్లు పేర్కొంది.ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. అబ్రహం లింకన్పై ఎటువంటి దాడి జరగలేదని అది అమెరికా విజయంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని విజయవంతం చేయడంలో అమెరికాకు అండగా నిలుస్తోందని చెప్పింది. అబ్రహం లింకన్పై దాడి చేయడానికి ఇరాన్ నౌకలు ప్రయత్నించగా అమెరికా బలగాలు వాటిని ధ్వంసం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో ప్రారంభమైన ఇరాన్పై అమెరికా-ఉక్రెయిన్ సంయుక్త దాడులకు ముందే అబ్రహం లింకన్ చాలా పాపులర్ అయ్యింది. ఇరాన్తో అణుచర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామనే సంకేతంతో అరేబియా సముద్రంలో అమెరికా ఈ క్షిపణిని మోహరించింది. దీనితో మరో రెండు యుద్ధనౌకలను సముద్రంలో నిలిపింది. కాగా అబ్రహం లింకన్ యుఎస్ అతిపెద్ద యుద్ధనౌకThe Abraham Lincoln Carrier Strike Group continues to support Operation Epic Fury and project power from the sea. pic.twitter.com/2o7krBUp70— U.S. Central Command (@CENTCOM) March 12, 2026 -
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అంతకంతకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటగది ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు ఎల్పీజీ (LPG) సరఫరాకు విఘాతం కలగవచ్చనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ‘ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. గ్యాస్ సిలిండర్ల కొరత భయం సామాన్యుడిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నది. ఈ నేపధ్యంలో గత రెండు రోజుల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టౌలుయుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే, ఆ సెగ భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు ఏకంగా 30 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్లో కూడా ఇండక్షన్ స్టౌల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికోసం జనం ఎంతలా ఎగబడుతున్నారంటే, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయి ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు, మెసేజ్లు కనిపిస్తున్నాయి. కేవలం ఇండక్షన్ స్టౌలే కాకుండా, రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలు కూడా నాలుగు రెట్లు పెరగడం విశేషం.బ్లాక్ మార్కెట్ దందాయుద్ధ భయాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అక్రమార్కులు గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, సామాన్యుడిని నిలువునా దోచేస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో గృహ అవసరాల సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా ₹1,800 కి చేరగా, మధ్యప్రదేశ్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹4,000 పలుకుతోంది. ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల సెగ కంటే ఎలక్ట్రిక్ వంట సురక్షితమని భావిస్తున్న గృహిణులు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు ఇండక్షన్ కుకింగ్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా..భారత్లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇండక్షన్ స్టౌల వినియోగం పెరుగుతోంది. ఇంధన భద్రతపై ఆందోళనలు ఉన్న అనేక దేశాల్లో ప్రజలు గ్యాస్ ఆధారిత వంట నుంచి ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లుతున్నారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలు ఇండక్షన్ స్టౌలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఇతర ఆసియా దేశాల్లోని ప్రజల కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఎలక్ట్రిక్ వంట పరికరాలవైపు దృష్టి సారిస్తున్నారు.పొదుపుతో కూడిన భవిష్యత్తుప్రస్తుతం మార్కెట్లో బేసిక్ ఇండక్షన్ స్టౌలు ₹1,200 నుండి లభిస్తుండగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్లు ₹14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ల వినియోగాన్ని సమయం, డబ్బు ఆదా చేసేదిగా వినియోగదారులు గుర్తిస్తున్నారు. యుద్ధ భయం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ గ్యాస్ స్టౌల స్థానాన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు పూర్తిగా ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు -
యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక
-
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం
-
మోజ్తాబా ఆరోగ్యంపై పెదవి విరిచిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఇరాన్ సుప్రీంలీడర్గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ దేశానికి చెందిన 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబాను ఎన్నుకుంది. ఈ ఎన్నికపై ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకుంటే వారే తమ లక్ష్యమని హెచ్చరించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.కాగా పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కొరత ఏర్పడింది. హార్మూజ్ను ఎట్టిపరిస్థితుల్లో తెరిసేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వారి అనుమతి లేకుండా ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడి చేస్తుంది. -
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్తో పాటు మరికొన్ని దేశాలకు 30 రోజుల పాటు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను స్థిరీకరించడంతో పాటు పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సముద్ర రవాణాలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు పలు దేశాలకు వెసులుబాటు కల్పిస్తూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇరాన్ ఉగ్రవాద పాలన వల్ల తలెత్తిన అస్థిరతను ఎదుర్కొంటూనే, చమురు ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ మినహాయింపు కేవలం మార్చి 5 లోపు నౌకల్లో లోడ్ అయిన చమురుకు మాత్రమే వర్తిస్తుందని, ఇది ఏప్రిల్ 4 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. .@POTUS is taking decisive steps to promote stability in global energy markets and working to keep prices low as we address the threat and instability posed by the terrorist Iranian regime.To increase the global reach of existing supply, @USTreasury is providing a temporary…— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 12, 2026ఈ నిర్ణయం వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభం చేకూరదని అమెరికా అధికారులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో మెజారిటీ భాగం చమురు వెలికితీత సమయంలో విధించే పన్నుల ద్వారానే లభిస్తుందని, ప్రస్తుతం కేవలం రవాణాలో ఉన్న నిల్వలను విక్రయించుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చామని స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆసియా జలాల్లో సుమారు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు నిలిచిపోయి ఉంది. తాజా ఉత్తర్వులతో ఈ నిల్వలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్ -
హార్మూజ్ జలసంధిలో భీకర యుద్ధం.. మందుపాతరలు అమర్చిన ఇరాన్
-
ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరోసారి తన కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇరాన్తో నెలకొన్న సంఘర్షణ ‘అత్యంత వేగంగా’ క్లైమాక్స్కు చేరుకుంటోందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో జరిగిన ‘ఉమెన్స్ హిస్టరీ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రస్తుత యుద్ధ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక పటిమను కొనియాడారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తాము చరమగీతం పాడుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని ట్రంప్ ప్రశంసించారు. ‘ఇరాన్ విషయంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మా సైనిక శక్తి అజేయమైనది. చరిత్రలో ఇలాంటి శక్తివంతమైన సైన్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఏం చేయాలో అదే చేస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. గడిచిన 47 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేని ధైర్యసాహసాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని, గత పాలకులు వదిలేసిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. President Trump on Iran: 🇮🇷🇺🇸"Situation with Iran is moving along very rapidly..They really are a nation of terror and hate (regime)...They are paying a big price." pic.twitter.com/BHwApCfpLJ— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 12, 2026ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశాన్ని ‘విద్వేషానికి, ఉగ్రవాదానికి నిలయం’గా అభివర్ణించారు. ఆ ప్రాంతంలో అశాంతిని రేకెత్తిస్తున్న ఇరాన్ పాలక యంత్రాంగం ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యాన్ని ఆధునీకరించడం కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ‘మేము సైన్యాన్ని పునర్నిర్మించాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. సైన్యాన్ని ఇంత భారీగా ఉపయోగించాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు ఆ అవసరాన్ని కల్పించాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. వివరించారు.ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ షాక్: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి -
ఆక్రమణదారుల రక్తం పారిస్తాం
దుబాయ్: ఇరాన్కు చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే ఆయా దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ను నింపేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘీర్ ఖాలీబాఫ్ హెచ్చరించారు.1971లో యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ను స్థాపించడానికంటే ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్ మూడు ద్వీపాలను తన వశం చేసుకుంది. ఇరాన్ కీలక చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చన్న వార్తల నడుమ బఘీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
కోమాలో మొజ్తాబా ?
దుబాయ్: తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీంనేత పీఠంపై కూర్చున్న మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా నీలినీడలు తొలగిపోవట్లేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో తండ్రి, తల్లి, సోదరి, భార్య, కుమారుడు చనిపోగా మొజ్తాబా ఒక కాలును కోల్పోయారని గురువారం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.బాంబుదాడిలో ఆయన పొత్తి కడుపు లేదా లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని ‘ది సన్’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. కోమాలోంచి ఆయన కోలుకోవడం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని, ప్రస్తుతం టెహ్రాన్ నగరంలోని సినా విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని ఆ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రిలోని వ్యక్తులు లండన్లోని తమ వర్గీయులకు పంపిన సందేశంలో ఈ సమాచారం లీక్ అయినట్లు భోగట్టా. -
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా పోర్ట్కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండు నౌకలపై ఇరాన్ దాడి
న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక మీదా ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్ బోట్లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్సీ విష్ణు, జిఫిరోస్ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్ల ట్రాకింగ్ వెబ్సైట్ అయిన ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఐఎన్సీ సంస్థ ‘సేఫ్సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్ను గ్రీస్కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. -
యుద్ధ కల్లోలం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఎడతెరిపిలేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర గురువారం 100 డాలర్లు దాటేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 38 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి, దాడులు ఆపకపోతే బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరడం తథ్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తుండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచదేశాలపై.. ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదని తేల్చిచెప్పారు. శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా–ఇజ్రాయెల్లకు కొత్త ఆఫర్ ఇచ్చారు. మూడు షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తామని చెప్పారు. ముడి చమురు నౌక షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ హార్మూజ్ నుంచి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్లో ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న అమెరికా ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్ చేశామని, బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో 200 డాలర్లకు చేరబోతోందని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖారీ స్పష్టంచేశారు. భద్రతా మండలి తీర్మానం బేఖాతర్ ఇరాన్ యుద్ధం గురువారం పదమూడో రోజుకు చేరుకుంది. దాడులు ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్ తీరంలో కంటైనర్ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉన్న ముహరాఖ్ ద్వీపాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్ను ప్రయోగించింది. రాజధాని రియాద్లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్లోని బస్రా పోర్టుపైనా ఇరాన్ దాడికి దిగడంతో ఇరాక్లోని చమురు కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గల్ఫ్లో దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యూఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచే పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కువైట్లో ఓ భవనాన్ని ఇరాన్ క్షిపణి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. 200 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇరాన్తోపాటు లెబనాన్పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్లో ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా గ్రూప్ను క్షిపణులతో టార్గెట్ చేసింది. గురువారం జరిగిన రెండు దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్లోజరిగిన దాడిలో 8 మంది మృతిచెందగా, 31 మంది క్షతగాత్రులయ్యారు. అరామైన్ టౌన్పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియల్ గల్ఫ్లో ఏరులై పారుతుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలిబాఫ్ హెచ్చరించారు. తమ దీవుల జోలికి రావొద్దని అన్నారు. లెబనాన్లో 634కి చేరిన మృతులుఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే, లెబనాన్లో 1,300 మందికిపైగా మరణించారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో 12 మంది, గల్ఫ్లో ఏడుగురు అమెరికా జవాన్లు మృతి చెందారు.పెజెష్కియాన్ మూడు షరతులు పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలంటే స్పష్టమైన మార్గం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. మూడు షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరాన్ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలని, ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలని పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్లపై ప్రతీకారానికి సిద్ధం అంటూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, అధ్యక్షుడు పెజెష్కియాన్ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే పరాజయం పాలయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అన్నారు. ఇరాన్ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు(రూ.1.04 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ ప్రకటించింది. మొజ్తబా ఖమేనీ యుద్ధ శంఖారావం యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నామని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ(56) తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్లో టీవీ న్యూస్ చానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెల్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుందని సంకేతాలిచ్చారు. హార్మూజ్ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోమని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్–అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతోపాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమేనని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని అన్నారు. తనను సుప్రీం లీడర్గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశానని వెల్లడించారు. ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు. -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్ కు వస్తున్న నౌకను పేల్చేసిన ఇరాన్..!
-
ఇరాన్ ఓపెన్ వార్నింగ్ 200 డాలర్లకు చమురు ధర! ఇక ఆర్థిక సంక్షోభమే
-
ఇప్పటికే హోర్ముజ్.. ఇప్పుడు ఇంకోటి..
అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే ప్రపంచంలోని మరో కీలక సముద్ర మార్గాన్ని కూడా నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోయిన పరిస్థితుల్లో… ఇప్పుడు బాబ్ ఎల్-మందెబ్ జలసంధి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి హెచ్చరించారు. ఇలా జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికా తప్పు చేస్తే అంతే..అల్జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇరాన్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే బాబ్ ఎల్-మందెబ్ జలసంధి పరిస్థితి కూడా హోర్ముజ్ లాగే మారవచ్చని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఈ ప్రాంతం పెద్ద ప్రాంతీయ యుద్ధంలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా అన్నారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 138 నౌకలు వెళ్లే ఈ మార్గంలో… ఒక రోజులో కేవలం రెండు నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు సమాచారం.ప్రపంచ వ్యాపారానికి కీలకంఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మరింత కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు చెందిన నౌకలు వస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడీ ఉద్రిక్తత బాబ్ ఎల్-మందెబ్ జలసంధి వరకు విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యెమెన్-జిబౌటి మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం వెడల్పు కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే.కానీ ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 6.2 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ జలసంధి మూసుకుపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్కు వెళ్లే అత్యంత చిన్న సముద్ర మార్గం పూర్తిగా నిలిచిపోతుంది. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో రెండు వారాల ఆలస్యం మరియు భారీ అదనపు ఖర్చు ఏర్పడుతుంది.బాబ్ ఎల్-మందెబ్ మార్గమే దిక్కుప్రస్తుతం హోర్ముజ్ మార్గం దాదాపు నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాలు బాబ్ ఎల్-మందెబ్ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. ఈ మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్ హౌతి దళాలు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలవు. 2023 నుంచి ఇప్పటివరకు రెడ్ సీ ప్రాంతంలో వందకు పైగా నౌకలపై దాడులు జరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ యుద్ధంలో హౌతీలు పూర్తిగా రంగంలోకి దిగలేదు. కానీ అవసరమైతే ఎప్పుడైనా చర్యలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్తో పాటు బాబ్ ఎల్-మందెబ్ కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా గొలుసు పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి… మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపే పరిస్థితి కనిపిస్తోంది. -వెబ్డెస్క్ -
దుబాయ్ పై మరోసారి దాడి..
-
ఇరాన్ మిలటరీ మరో వార్నింగ్
-
'బ్యారెల్ ధర అంతకు చేరుతుంది'
టెహ్రాన్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, జీ-7 దేశాలు ప్రత్యేక సమావేశం జరిపి అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలు చమురు ధరలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెట్లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ అత్యవసర నిల్వల నుండి 4 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావాలని 32 సభ్య దేశాలు నేడు ఏకగ్రీవంగా నిర్ణయుంచినట్లు సమాచారం.EA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు సంక్షోభం ఉందని కనుకటి IEA సభ్య దేశాలు తక్షణమే స్పందించి అధిక మెుత్తంతో చమురు నిల్వలువిడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. అయితే మరోవైపు ఇరాన్ చమరు ధరల పెరుగుదలపై ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చింది." బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు చెల్లించడానికి ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలి. 1970 తర్వాత ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి (IEA) పెద్ద మెుత్తంలో చమురు నిల్వలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని తెలిపింది. ప్రస్తుతం చమురు బ్యారెల్ ధర 90 -110 డాలర్లుగా ఉంది. అదే విధంగా హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులిచ్చేది లేదని ఒక వేళ తమని కాదని వెళితే నౌకలను పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మూడుకు పైగా నౌకలను పేల్చివేసింది.కాగా ఇంత సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్ వెళ్లే నౌకలకు ఇరాన్ అనుమతిచ్చింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించి భారత నౌకలకు హార్మూజ్ జలసంధిలో రవాణాకు పచ్చ జెండా ఊపింది.. కాగా పశ్చిమాసియా యుద్దం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకూ 2వేలకు పైగా ప్రజలు మృతిచెందారు. అయితే అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు తగ్గకపోవడంతో యుద్దం ఇంకా కొనసాగుతోంది. -
అవును.. హర్మూజ్ జలసంధిలో నౌక ‘సేఫ్సీ విష్ణు’ని పేల్చేశాం : ఇరాన్
టెహ్రాన్: హర్మూజ్ జలసంధి పరిధిని దాటి దాడులకు ఇరాన్ సిద్ధమైంది. సముద్రంలో నౌకలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను నేవల్ మైన్స్తో (సముద్రపు మందుపాతరలు) పేల్చివేసింది. అమెరికాకు చెందిన ‘సేఫ్ సీ విష్ణు’ అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే.. ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే భారత్కు చెందిన ఓ నౌకపై హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే..! 🚨 Indian Embassy in Iraq has confirmed that an attack on the crude oil tanker Safesea Vishnu near Basra on March 11 resulted in the tragic death of an Indian sailor. 15 other Indian crew members were safely evacuated & are receiving all possible assistance from the embassy. pic.twitter.com/vj0X5CbKYU— Megh Updates 🚨™ (@MeghUpdates) March 12, 2026 -
అమెరికా నౌకలను.. పేల్చేసిన ఇరాన్
-
ఇరాన్ అదృశ్య ఆయుధం
-
యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ మూడు షరతులు
-
అమెరికాకు ఇరాన్ షాక్: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి
వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12 రోజులు గడుస్తున్న తరుణంలో, అగ్రరాజ్యానికి భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను కలవరపెడుతున్నాయి. గడిచిన 12 రోజుల్లో ఇరాన్ జరిపిన ఎదురుదాడుల్లో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారు.పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న 22కు పైగా సైనిక, విమానయాన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, 11 ప్రధాన సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలేం, బహ్రెయిన్లోని యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఖతార్లోని ‘అల్ ఉదైద్’ ఎయిర్ బేస్ సైతం ఇరాన్ ప్రతీకారేచ్ఛ నుంచి తప్పించుకోలేకపోయింది. టర్కీలోని ఇంసిర్లిక్ వైమానిక కేంద్రంపైకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చేయలేదని ఖండించడం గమనార్హం.సైనిక కేంద్రాలే కాకుండా, ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ సహా ఆరు దేశాల్లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్, ఇరాక్లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతినగా, భద్రతా కారణాల దృష్ట్యా ఆరు దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఈ యుద్ధంలో అమెరికా మూడు ఎఫ్-15ఈ (F-15E) స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కోల్పోయింది. అయితే ఇవి ఇరాన్ దాడుల్లో కాకుండా, కువైట్ వాయుసేన చేసిన పొరపాటు వల్ల కూలిపోవడం గమనార్హం. ఇరాన్ విమానాలుగా భ్రమపడి కువైట్ ఎఫ్-18 విమానాలు వీటిని పేల్చివేశాయి.వీటితో పాటు 11 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 250 కోట్లు కావడం గమనార్హం. మరోవైపు సుమారు రూ. 22 వేల కోట్ల విలువైన థాడ్ (THAAD) రక్షణ వ్యవస్థల్లోని రాడార్ కేంద్రాలను కూడా ఇరాన్ డ్రోన్లు విజయవంతంగా లక్ష్యం చేసుకున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై పెను భారం పడుతోంది. 'పొలిటికో' నివేదిక ప్రకారం, అగ్రరాజ్యం ఈ యుద్ధం కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 17 వేల కోట్లు) ఖర్చు చేస్తోంది. కేవలం మొదటి వారంలోనే రూ. 51 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒకవైపు ఆయుధ సంపత్తి తరిగిపోతుండటం, మరోవైపు పెరుగుతున్న వ్యయం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ప్రయోగించే చౌకైన 'షాహెద్' డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో నిరాకరించిన ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు అమెరికా కోరుతుండటం గమనార్హం.ఇది కూడా చదవండి: అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా? -
బిగ్ బ్రేకింగ్.. అమెరికా తీరానికి ఇరాన్ యుద్ధ నౌక
-
పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ బీభత్సంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ విధిస్తున్న షరతులకు ఇజ్రాయెల్,అమెరికా అంగీకరించాలని తెలిపారు. షరతులపై అమెరికా,ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపేందుకు రష్యా,పాకిస్థాన్లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అంతేకాదు ఇరాన్ స్పష్టంగా ప్రకటించిన ఈ షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని సూచించారు. అమెరికా-ఇజ్రాయెల్కు విధించిన షరతులు ఇవే మొదటి షరతుగా, ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా, ఇప్పటి వరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది.మూడవ షరతుగా, భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ మూడు షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్ స్పష్టం చేసింది. లేకపోతే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ షరతులు యుద్ధానికి ముగింపు దారితీస్తాయా లేదా అన్నది అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ స్పష్టమైన షరతులు పెట్టడం వల్ల ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అనిశ్చితంగా ఉంది.Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026 -
భారత్ వస్తున్న షిప్ పై ఇరాన్ దాడి
-
దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
-
అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా?
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకార దాడులకు ఇరాన్ కుట్ర పన్నుతోందా? సముద్ర మార్గం ద్వారా డ్రోన్లతో విరుచుకుపడేందుకు ప్రణాళికలు రూపొందించిందా?.. దీనికి అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి అమెరికా నిఘా వర్గాలు. ఇరాన్ తీర ప్రాంతాల నుంచి కాకుండా, అమెరికా గడ్డకు అత్యంత సమీపంలోని అంతర్జాతీయ జలాల నుంచే డ్రోన్ దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోందనే సంచలన విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)వెల్లడించింది. పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఒక అంతర్గత బులెటిన్లో పేర్కొంది.ఎఫ్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2026 ప్రారంభం నుంచే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. గుర్తుతెలియని నౌకల ద్వారా అమెరికా ప్రాదేశిక జలాల సమీపానికి చేరుకుని, అక్కడి నుంచి మానవరహిత విమానాల ద్వారా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే, దానికి ప్రతిగా ఈ ‘డ్రోన్ వార్’ను మొదలుపెట్టాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి? ఖచ్చితమైన లక్ష్యాలు ఏవి? అనే అంశాలపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఐ సూచించింది.ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గత 12 రోజులుగా ఇరుపక్షాల మధ్య జరుగుతున్న పోరులో ఇరాన్ తన డ్రోన్ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. అయితే తాజాగా అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ సామర్థ్యం కొంతమేర తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, అమెరికా పశ్చిమ తీరంలో ఎల్.ఏ. షెరీఫ్ విభాగం అప్రమత్తమైంది. మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం -
ప్రముఖ డేటా సెంటర్లకు ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో నూతన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా సైతం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
ఇరాన్ లో స్కూల్ పై దాడి.. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు
-
హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)
-
యుద్ధ భయం.. లిక్విడ్ క్యాష్ దాచుకోవాలా? బ్యాంకులో రూ.40లక్షల కోట్లు మిస్సింగ్..!
-
ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనం: ఇరాన్
దుబాయ్: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జూలైల్లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే మా జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది. "అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోంది. గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది. వేల సంఖ్యలో మా ప్రజల ఉసురు తీస్తోంది. ఇలాంటి దేశానికి వెళ్లి మేం ఫుట్బాల్ మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుందా? ఆ దేశంలో ఆడే ప్రసక్తే లేదు" అని ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్బాల్ ప్రపంచకప్ను ఇరాన్ బహిష్కరించనుందని తేటతెల్లమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేశారు.చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు -
ఇరాన్ వెనుక రష్యా.. అమెరికా కోసం రంగంలోకి ఉక్రెయిన్
-
సముద్రంలో కదిలే.. అమెరికా యుద్ధ కోట!
-
వాణిజ్య నౌకలపై గురి!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం తగ్గుముఖం పట్టే సూచనలే కన్పించడం లేదు. 12వ రోజైన బుధవారం ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యూఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. నౌక పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. అంతేగాక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. రెండు డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి. ఈ ఘటనలో ఒక భారతీయునితో సహా నలుగురు గాయపడ్డారు. అయితే విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక గల్ఫ్లోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రాలపై కూడా ఇరాన్ ఎడాపెడా దాడులు జరిపింది. ఇకపై పశ్చిమాసియాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుని పెద్దపెట్టున దాడులు చేస్తామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. దాంతో ఆ ఆర్థిక సంస్థల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రయోగించిన 8 డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్, 5 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా నేలకూల్చినట్టు సౌదీ తెలిపింది. ఖతర్, ఒమన్, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో రువైస్ చమురు శుద్ధి కేంద్రాన్ని మూసేస్తున్నట్టు యుఏఈ ప్రకటించింది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాలపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్పై తీవ్ర దాడులు మరోవైపు ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులు బుధవారం కూడా ఇరాన్ను అల్లాడించాయి. రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్లోని బ్యాంక్ సఫా భవనం దాడుల్లో తీవ్రంగా దెబ్బ తింది. దాని సిబ్బందిలో పలువురు మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు బుధవారమూ కొనసాగాయి. రాజధాని బీరూట్లో అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ఐచా బకర్ ప్రాంతంలో పలు భవనాలు దాడుల్లో పూర్తిగా దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లో జరిపిన దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్టు తెలుస్తోంది. వారిలో ఒక రెడ్క్రాస్ సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. లెబనాన్లో మృతుల సంఖ్య 570 దాటినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 160 మంది అమెరికా సైనికులకు గాయాలు ఇరాన్పై యుద్ధంలో ఇప్పటిదాకా 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్టు పెంటగాన్ ప్రధాన అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. ‘‘వారిలో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 108 మంది ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జై విధుల్లో చేరారు’’అని చెప్పారు. అయితే గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 160 పై చిలుకేనని తెలుస్తోంది. 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల: ఐఈఏపారిస్: పశ్చిమాసియా యుద్ధంతో చమురు సరఫరా పడకేసిన నేపథ్యంలో అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఈఏ ఈ స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి! అయితే హార్మూజ్ జలసంధి గుండా చమురు, సహజ వాయువు రవాణా వీలైనంత త్వరగా పునఃప్రారంభం కావడమే సమస్యకు పరిష్కార మార్గమని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీ బిరోల్ ఆశాభావం వెలిబుచ్చారు.మధ్యవర్తిత్వానికి తెర: ఖతర్ దోహా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశం తరఫున చర్చల్లో మధ్యవర్తిగా కొనసాగబోనని ఖతర్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలకు ఆ దేశం మధ్యవర్తిత్వం వహించడం తెలిసిందే. అయినా తమపై ఇరాన్ దాడులు చేసిందంటూ ఖతర్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మహమ్మద్ బిన్ అద్బుల్ అజీజ్ అల్ఖులైఫీ ఆవేదన వెలిబుచ్చారు. హార్మూజ్ పొడవునా మందుపాతర్లు హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాతరలు అమర్చుతోంది! వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయప్రయాసలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హార్మూజ్ను దాటే మార్గం ఇరాన్కు మాత్రమే తెలుసు! ఈ నేపథ్యంలో ఆ మందుపాతరలను తక్షణం తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటమిచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను కనీవినీ ఎరగని స్థాయికి పెంచుతామని హెచ్చరించారు. హార్మూజ్లో మందుపాతరలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్కు చెందిన 16 మైన్లేయర్ పడవలను పేల్చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు, హార్మూజ్ను మూసేసినట్టు ఇరాన్ ప్రకటించినా, ఆ దేశానికి చెందినవిగా భావిస్తున్న పలు చమురు నౌకలు మాత్రం దానిగుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో బ్యారెల్కు 200 డాలర్లు! ప్రపంచం సిద్ధపడాలి: ఇరాన్ పశ్చిమాసియా కల్లోలం నేపథ్యంలో చమురు ధరలు త్వరలో ఆకాశాన్నంటడం ఖాయమని ఇరాన్ జోస్యం చెప్పింది. ‘‘అవి త్వరలో బ్యారెల్కు ఏకంగా 200 డాలర్ల దాకా చేరవచ్చు. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలి’’అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫకరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీసినందుకు ఇలాంటి పర్యవసానాలు తప్పవన్నారు. ‘‘ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇప్పటిదాకా పరిమిత స్థాయి ప్రతీకార దాడులకే పరిమితమయ్యాం. కానీ ఇకపై వాటిపై పూర్తిస్థాయిలో ఎడతెరిపి లేకుండా దాడులకు దిగుతాం’’అంటూ హెచ్చరించారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ దుయ్యబట్టారు. యుద్ధానికి త్వరలో తెర: ట్రంప్ ఇరాన్లో ఏమీ మిగల్లేదన్న అధ్యక్షుడు ఇరాన్పై యుద్ధానికి త్వరలో తెర దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. బుధవారం ఈ మేరకు ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తమ దాడుల అనంతరం ఇరాన్లో ఇంకేమీ మిగల్లేదని అభిప్రాయపడ్డారు. ‘‘లక్ష్యం చేసుకోవడానికి ఇంకేమీ లేదక్కడ. యుద్ధం ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నీ దాదాపుగా నెరవేరినట్టే. కాబట్టి ఇక నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధానికి తెర పడుతుంది’’అని ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. -
భారత్కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. దుబాయి నుంచి భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మెుత్తం 23 మంది సిబ్బంది ఉండగా ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది.. అయితే ఈ నౌకలో ఏం సరఫరా జరుగుతుంది. అనే వివరాలు తెలియాల్సి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని యుఎఇలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ నౌకథాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పిసిఎల్కు చెందింది. భారతదేశంలోని కాండ్లా పోర్టుకు ప్రయాణమైన ఈ నౌక.. హార్ముజ్ జలసంధిని దాటుతుండగా అటాక్ జరిగింది. ఈ దాడిపై ఇరాన్ స్పందించింది. వ్యుహాత్మక హర్ముాజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్ప్రెస్ రోమ్, థాయ్ బల్క్ క్యారియర్, మయూరీ నరీ అనే ఓడలు ప్రయాణిస్తున్నాయని.. వాటికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌక అయినా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్జీసీ కమాండర్ అలిరేజా టాంగ్సిరి స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఇరాన్ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయినప్పటీకీ భారత్కు వస్తున్న నౌకలపై దాడి చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయం. కాగా హర్మూజ్ జలసంధి గుండా దాదాపు 20 శాతం చమురు రవాణా జరుగుతుంది. దీనిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఇరాన్ ఆ మార్గం గుండా ప్రయాణించిన నౌకపై దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి -
ఇరాన్ భీకర దాడులు.. గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం
-
యుద్ధం మరింత భీకరం.. టార్గెట్ అమెరికా
-
మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు
దోహా: పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలేవీ ఇరాన్కు శత్రువులు కావని, పరస్పర దాడుల వల్ల ఏ పక్షానికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ తక్షణమే శత్రుత్వాన్ని వీడి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.గత రెండు వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న తీవ్రస్థాయి బాంబు దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని తన పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఇంధన సరఫరా వ్యవస్థ ఈ ఉద్రిక్తతల వల్ల అతలాకుతలమవుతోంది. పౌర నివాసాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఖతార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖతార్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిణామాలు అత్యంత దురదృష్టకరమని , ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తమ దేశ ప్రయోజనాలను, ప్రాంతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమపై దాడులు జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడం అసాధ్యమని ఇరాన్ గుర్తించాలని ఆయన సూచించారు.ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి తక్షణ పరిష్కారం అవసరమని బిన్ అబ్దుల్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ దేశాలు ఇరాన్కు వ్యతిరేకం కాదన్న విషయాన్ని టెహ్రాన్ అర్థం చేసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికే ఖతార్ ప్రధాని మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ఇరాన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పొరుగు దేశాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో కూడా ఖతార్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. యుద్ధ వాతావరణాన్ని వీడి, శాంతి మార్గంలో పయనించాలని ఇరు పక్షాలకు ఖతార్ విజ్ఞప్తి చేస్తోంది. ఇది కూడా చదవండి: Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం -
క్షిపణుల వర్షం.. యుద్ధం తీవ్రం.. పశ్చిమాసియాలో సైరన్ల మోత
-
దాడులు ఉదృతం.. నేను రెడీ.. మీరు రెడీనా..?
-
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
-
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఎంపికలో బిగ్ ట్విస్ట్!
టెహ్రాన్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు పెదవి విరిస్తున్నారు. తాజాగా, ట్రంప్ మాత్రమే కాదు మొజ్తాబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవని, గతంలో పలు మార్లు చెప్పిన ఆయతుల్లా వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తాజాగా, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్లో తన వారసుడిగా మొజ్తాబా అనర్హుడంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ, వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయని సామెత చందంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం అనివార్యమైంది.ఇరాన్లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్ యూనియల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (ఎన్యూడీఐ) రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ.. మొజ్తాబాకు ఇరాన్ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్)కి ఉంది. మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా, గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్జీసీ తరుఫు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని చెప్పారు.ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్జీసీ చూస్తోంది. అందుకే మొజ్తాబాను ఎంచుకుంది. ఐఆర్జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ ఆరోపించారు. -
యుద్దం వేళ భారీ ట్విస్ట్.. ఇరాన్కు ఉత్తర కొరియా మద్దతు
ప్యాంగ్యాంగ్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై తాజాగా ఉత్తర కొరియా స్పందించింది. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్నికను ఉత్తర కొరియా స్వాగతించింది. అదే సమయంలో పశ్చిమాసియా దేశంపై చట్టవిరుద్ధమైన దాడులకు ఇజ్రాయెల్, బద్ధ శత్రువు అమెరికాను విమర్శించింది.ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఓ ప్రకటనలో.. ఇరానియన్లు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ఉత్తర కొరియా గౌరవిస్తుందని పేర్కొంది. అలాగే, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చట్ట విరుద్ధం. ఇరాన్పై వారి సైనిక చర్యలు, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. ఇరాన్ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నం చేయడమేంటి?. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేయడంతో పాటుగా అస్థిరతను పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా (china) తాజాగా స్పందించింది. మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్లో హత్యకు గురైన తండ్రి అలీ ఖమేనీ వారసుడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవడంపై తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది. మోజ్తాబా ఖమేనీని నియమించాలనే ఇరాన్ నిర్ణయాన్ని వారి అంతర్గత విషయంగా చైనా పేర్కొంది.ఏ సాకుతోనైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత , ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఇజ్రాయెల్ కు హితవు పలికారు. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మోజ్తాబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను చైనా గతంలో చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఖండించింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. -
ఇరాన్తో యుద్ధం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే..
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.. -
పుతిన్కు ట్రంప్ ఫోన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ సాగింది. ఇరాన్–అమెరికా, ఉక్రెయిన్–రష్యా సంఘర్షణలపై ఇరువురు నేతలు చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభంతోపాటు ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం కొనసాగుతున్న మాస్కో–వాషింగ్టన్–కీవ్ చర్చలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.ఇరాన్లో జరుగుతున్న యుద్ధం పట్ల పుతిన్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశారని, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తోపాటు గల్ఫ్ దేశాల నాయకులతో గతవారం జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్కు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ట్రంప్ సైతం తాజా పరిణామాలపై తన మనసులో మాటను పుతిన్తో పంచుకున్నారని స్పష్టంచేశారు. ఈ ఏడాది ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. భారత్, చైనాలతోపాటు యూరప్లోని మిత్రదేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు ఇరాన్పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్పై గత పది రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని ‘స్వల్పకాలిక విహారయాత్ర’గా అభివర్ణించారు. ఆయన తాజాగా ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఇప్పటిదాకా 5,000 లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం ఉందన్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ఖబడ్దార్ హొర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హొర్మూజ్లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా.. ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చిచెప్పారు. హొర్మూజ్లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఇది చైనాకు, ఇతర దేశాలకు తాము ఇస్తున్న బహుమతి అని వ్యాఖ్యానించారు. ఒక్క లీటర్ కూడా రవాణా చేయలేరు: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) మంగళవారం ఘాటుగా స్పందించింది. హొర్మూజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చిచెప్పింది. తమదేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హొర్మూజ్ నుంచి చమురు రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది. -
దాడులు ఉధృతం
దుబాయ్: పశ్చి మాసియా యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు ఉధృతం చేస్తోంది. యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ విరుచుకుపడింది. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఒక మహిళ(29) మరణించగా, 8 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఆరు డ్రోన్లు నేలకూల్చి నట్లు కువైట్ నేషనల్ గార్డు దళం వెల్లడించింది.యూఏఈలో పారిశ్రామిక నగరమైన రువాస్పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు బాంబులు, సైరన్ల మోతతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. జెరూసలేం, టెల్ అవీవ్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమవైపు దూసుకొచ్చిన ఇరాన్ మిస్సైళ్లను తుత్తునియలు చేశామని ఖతార్ రక్షణ శాఖ తెలియజేసింది. హొర్మూజ్పై ఇరాన్ గురి ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్లో అమెరికా సైనిక స్థావరాలపై కేవలం మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో సరిపెట్టకుండా హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇక్కడ చమురు రవాణా నౌకలను అడ్డుకుంటోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు పెరిగేకొద్దీ అమెరికా, ఇజ్రాయెల్పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం తథ్యమని, ఫలితంగా ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్ అంచనా వేస్తోంది. ముడి చమురు బ్యారెల్ ధర 90 డాలర్లు దాటేసింది. ఫిబ్రవరి 28 నాటి ధరతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. హొర్మూజ్లో చమురు రవాణా నౌకలపై ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఏడుగురు నావికులు మరణించారు. మంగళవారం పర్షియన్ గల్ఫ్లో యూఏఈ తీరంలో చమురు రవాణా నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అండదండలతో దాడులకు తెగబడుతున్న హెజ్బోల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మిలిటెంట్లు హతం కాగా, నలుగురు గాయపడినట్లు తెలిసింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దక్షిణ లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. హెచ్బొల్లాపై భీకర దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటివరకు 1,230 మంది మరణించారు. లెబనాన్లో 397 మంది, ఇజ్రాయెల్లో 11 మంది మృతిచెందారు. అలాగే ఏడుగురు అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: రష్యా యుద్ధాన్ని ముగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా మని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికాలకు సూచించారు.ఇరాన్పై అత్యంత భీకర దాడులు: హెగ్సెత్ ఇరాన్పై అత్యంత భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈరోజే ఈ దాడులు జరుగబోతున్నాయని మంగళవారం ప్రకటించారు. ఇరాన్పై గరిష్ట సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్ సైన్యం గత 24 గంటల్లో స్వల్పంగానే క్షిపణులు ప్రయోగించిందని తెలిపారు. ఇరాన్ ఆయుధ బలం క్షీణిస్తోందని తెలిపారు. బెదిరింపులకు భయపడం: ఇరాన్యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఎక్స్’లో పోస్టుచేశారు. కాల్పుల విరమణ కోసం ఎదురు చూడడం లేదని, శత్రువులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ సైనికాధికారి అలీ లరిజానీ ఉద్ఘాటించారు. హొర్మూజ్లో చమురు రవాణాను అడ్డుకుంటే 20 రెట్లు బలంగా దెబ్బకొడతామన్న ట్రంప్ హెచ్చరికలను కొట్టిపారేశారు. అమెరికా కంటే బలమైన దేశం కూడా ఇరాన్ను ఏమీ చేయ లేన్నారు. ‘మిమ్మల్ని మీరు నాశనం చేసుకో కుండా జాగ్రత్తగా ఉండండి’ అంటూ అమెరికాకు సూచించారు. ఇరాన్ ప్రజలకు సహకరిస్తాంనియంతృత్వం, రాక్షస పాలన నుంచి బయటపడడానికి ఇరాన్ ప్రజలకు సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అంతిమంగా రాజకీయ, పాలనాపరమైన మార్పును సాధించుకోవడం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రయత్నాలతో ఇరాన్ నాయకత్వం బలహీనపడుతోందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వెన్నుముక విరిచేశామని, ఇప్పటికీ తాము క్రియాశీలకంగా ఉన్నా మని వ్యాఖ్యానించారు. ఇరాన్లో శాశ్వతమైన మార్పు రావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. -
తిప్పలు తప్పని యుద్ధం
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్లోని ఫెయిర్ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్కు రోమ్పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి. నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం. యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే! -
ట్రంప్ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. “నిన్ను మించిన వారికి కూడా ఇరాన్ను నాశనం చేయడం సాధ్యం కాలేదు. జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వే ఖతం అవుతావు” అని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని పై విధంగా స్పందించారు.కాగా, ‘హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గత దాడుల కంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ మళ్లీ ఎప్పటికీ పునర్నిర్మాణం కాలేదు. అంతలా ఆ దాడులు ఉంటాయి’ అని తెలిపారు. కానీ, అలా జరగకూడదని తాను ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని అని ట్రంప్ అన్నారు.మొజ్తాబాను కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఆయన ప్రశాంతంగా జీవించలేరని చెప్పారు. ఇరాన్ ఎంచుకున్న లీడర్ తనకు నచ్చలేదని ట్రంప్ చెప్పారు. అలీ ఖమేనీ రెండో కుమారుడిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మోజ్తబా ఖమేనీ నియామకానికి ముందు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గతంలో వెనెజువెలా విషయంలో అమెరికా జోక్యం ఉన్నట్లే ఇప్పుడూ ఇరాన్ విషయంలో ఉండాలని అన్నారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది.హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హోర్ముజ్ జలసంధి నుంచి ఒక లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పింది. పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి ప్రపంచానికి చమురు రవాణా జరిగే అత్యంత కీలక సముద్ర మార్గమే హోర్ముజ్ జలసంధి.ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. మంగళవారం ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరిగింది.బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇరాన్ దాడి ఒక నివాస భవనాన్ని తాకింది. 29 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా తూర్పు చమురు ప్రాంతంపై వచ్చిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కువైట్ నేషనల్ గార్డ్ 6 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రువైస్ పారిశ్రామిక సిటీలో డ్రోన్ దాడి తర్వాత అగ్ని ప్రమాదం చెలరేగింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పని చేశాయి. -
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
-
యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్కొరతతో హెటళ్లు బంద్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆటో ఎల్పీజీమహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది. మరెంత కాలం సంక్షోభం?పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్లో ట్వీట్ చేసింది.భారత్లో ఎల్పీజీ డిమాండ్ఒకప్పటితో పోలిస్తే.. భారత్లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
ఇరాన్ స్కూల్ పై దాడి... దాడి అమెరికా పనేనా?
-
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
-
ఆ ధైర్యం ఇరాన్కు ఎక్కడనుంచి వచ్చింది?
ఇరాన్ యుద్ధం.. ఆ దేశం కోరుకున్నది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనిని కోల్పోయి తీవ్ర వేధనను భరిస్తూనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్లో ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ పరిస్థితి ఇక ముగిసినట్లే అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. ‘నిండా మునిగిన వాడికి చలేమిటి’ అన్నట్లు ఇరాన్ యుద్ధం చేసే తీరును గమిస్తేనే అర్థమవుతోంది.అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గుబెల్ పుట్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట రాగానే, అంతే వేగంగా స్పందించింది ఇరాన్. తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా--ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్కు కౌంటరిచ్చింది. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా కంటిన్యూగా చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పిన ఇరాన్.. ఇప్పుడు పదేళ్లు అయినా యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది. ట్రంప్లో భయం మొదలైందా..?ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ ఒక్కసారిగా హుకుం జారీ చేశారు. ఇరాన్ చమురు నిల్వలు మన టార్గెట్ కాదని, వాటిపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. దాంతో అమెరికా-ఇజ్రాయెల్లో భిన్న వైఖరి కనిపించింది. ఇక ‘ మీ పని అయిపోయింది’ అంటూ ఇరాన్ స్వయంగా లొంగిపోవాలంటూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న ట్రంప్కు ఎక్కడో భయం ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో అది ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాల ట్రంప్ ముఖాన్ని చీదిరించుకుంటారనే ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది విశ్లేషకులు అభిప్రాయం. మరొకవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం కూడా ట్రంప్లో అలజడి రేపుతున్నట్లే కనబడుతోందని అంటున్నారు. ఇరాన్ను తక్కువగా చూడొద్దు: అమెరికా నిఘా వర్గాలుమరొకటి ఏమిటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసే శక్తిని దాదాపు క్రోడీకరించుకుందనే అనుమానం కూడా ట్రంప్లో ఉంది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తాము ధ్వంసం చేశామనే ఇరాన్ అణు కేంద్రాలను ఆ దేశం తిరిగి పునరుద్ధరించే పనిలో ఉందని అమెరికా నిఘా వర్గాలే చెప్పాయి. అయితే దానిపైనే ప్రస్తుతం తమ ఫోకస్ ఉందని, వాటిని వారు ఎక్కడికి తరలిస్తారు.. ఎలా పునరుద్ధరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాయి. అంటే ఇరాన్ అణు ఆయుధాల అవసరమైన స్థాయిలో యురేనియంను శుద్ధిచేస్తోందనే విషయం అమెరికా చెప్పకనే చెప్పేసింది. అంటే అణు ఆయుధాలు ఇరాన్ నుంచి తయారైతే అదే తమకు ముప్పని అమెరికాకు బాగా తెలుసు. దాంతోనే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతుండగా, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఘనంగా ముగిస్తామని అంటోంది. అది అమెరికా-ఇజ్రాయెల్కు బుద్ధిచెప్పిన తర్వాతే తమ యుద్ధం ఆగుతుందని.. అంత వరకూ యుద్ధంలో వెనకడుగేసి ప్రసక్తే లేదని అంటోంది.పుతిన్కు ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్లు?ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం. ఇరాన్పై దాడిని తొలుత ఖండించిన వారిలో పుతినే ఉన్నారు. మరి అటువంటి పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది. అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుందని ఆరోపించిన అమెరికా.. ఇప్పుడు ఆ ధేశ అధ్యక్షుడికే ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మరొక ప్రశ్న. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్గా మారింది. ఒకవేళ అమెరికా అనుమానపడుతున్నట్లే అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసే పనిలో ఉంటే మాత్రం అది ప్రపంచానికి ముప్పుగానే చెప్పొచ్చు. -
‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు
వాషింగ్టన్: యుద్ధ క్షేత్రంలో కనిపించే క్షిపణుల హోరు, పేలుళ్లు, ప్రాణనష్టం.. ఇవి అమెరికాకు వినోదాన్ని పంచే ఆటల్లా ఉన్నాయి. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను ఒక అద్భుతమైన ‘వీడియో గేమ్’లా చిత్రికరిస్తూ సోషల్ మీడియాలో అమెరికా ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్, ఐరన్ మ్యాన్ వంటి పాప్ కల్చర్ పాత్రలు, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి వీడియో గేమ్ క్లిప్పింగులతో వైట్ హౌస్ విడుదల చేస్తున్న వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. యుద్ధాన్ని వినోదంగా మార్చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇరాన్పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా పెంటగాన్, వైట్ హౌస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఎక్స్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా విడుదలవుతున్న ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలపై విరుచుకుపడుతుంటే, వెనుక నేపథ్య సంగీతం యాక్షన్ సినిమా ట్రైలర్ను తలపిస్తోంది. ముఖ్యంగా ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ స్టైల్లో క్షిపణులు తగిలిన వెంటనే స్క్రీన్పై ‘కిల్ స్కోర్’ గ్రాఫిక్స్ కనిపిస్తుండటం గమనార్హం. ఈ వీడియోలకు ఇప్పటికే 5.8 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి.కేవలం గేమింగ్ మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఇష్టపడే స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ వంటి కార్టూన్ పాత్రలను కూడా అమెరికా తన ప్రచారానికి వాడుకుంటోంది. ఒక క్షిపణి దాడి తర్వాత మరో దాడి చేసే ముందు ‘నేను మళ్ళీ చేయడం చూడాలనుకుంటున్నారా?’ అంటూ వచ్చే డైలాగులను జోడించడంపై అందరూ మండిపడుతున్నారు. టాప్ గన్, గ్లాడియేటర్ వంటి హాలీవుడ్ చిత్రాల క్లిప్పింగులతో యుద్ధ విమానాలను పోలుస్తూ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించుకుంటోంది. Damn teryata sudah di ramalkan 😂🤣🤣 pic.twitter.com/SEzrodEo9z— Kageyoru (@Kageyoru_) March 8, 2026‘యుద్ధం వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది. గతంలో యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించేవారు. కానీ ఇప్పుడు విధ్వంసాన్ని వినోదంలా చూపిస్తున్నారు’ అని మాజీ అండర్ సెక్రటరీ జేమ్స్ గ్లాస్మాన్ విమర్శించారు. యువతను, ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకోవడానికే ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విమర్శలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. అమెరికా సైనిక సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, ఇరాన్ క్షిపణి కేంద్రాలను ఎంత సమర్థంగా ధ్వంసం చేస్తున్నామో ప్రజలకు ‘రియల్ టైమ్’లో చూపించడమే తమ ఉద్దేశమని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి.. -
ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక యుద్ధం ముగింపుపై అనిశ్చితి
-
చమురు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం తీవ్రతరం
-
గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మీరు కాదు.. మేమే: ఇరాన్
యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రధానమైన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్లతో పాటు కీలకమైన స్థావరాలను నాశనం చేశామని, యుద్ధం ముగింపు ఒక్కటే మిగిలి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం అందుకు ధీటుగా బదులిస్తోంది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్ కౌంటర్ల మీద కౌంటర్ల ఇస్తోంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్కు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం. గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది కూడా మేమే. మీపై(అమెరికా-ఇజ్రాయెల్) దాడులు చేస్తూనే ఉంటాం’ అని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ ఆందోళనఅమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని, అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. -
ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు?
వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్లతో నేరుగా సైనిక పోరాటం సాగిస్తున్న ఇరాన్.. విదేశాల్లో ఉన్న తన ‘స్లీపర్ సెల్స్’ను అప్రమత్తం చేస్తూ, రహస్య సంకేతాలు పంపినట్లు సంచలన సమాచారం బయటకు వచ్చింది. ‘ఆపరేషనల్ ట్రిగ్గర్’గా భావిస్తున్న ఒక ఎన్క్రిప్టెడ్ (రహస్య సంకేతాలతో కూడిన) సందేశాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మృతిచెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక ప్రత్యేక రేడియో స్టేషన్ ద్వారా ఈ సంకేతాలు వెలువడినట్లు ‘ఏబీసీ న్యూస్’ కథనం వెల్లడించింది. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడకుండా, పాతకాలపు రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా పంపిన ఈ సందేశం కేవలం సంబంధిత ‘కోడ్’ తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. విదేశాల్లో మాటువేసిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద మూకలు, గూఢచారులకు తక్షణమే దాడులకు దిగాలని లేదా విధ్వంసక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ ఈ ‘ట్రిగ్గర్’ సందేశాన్ని పంపినట్లు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు గమనించాయి.అయితే ఈ దాడులు ఎక్కడ జరగవచ్చనే దానిపై నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాల భద్రతా విభాగాలకు సూచనలు అందాయి. గత వారం రోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భీకరమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. మరోవైపు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయగా, ఆ సంస్థ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గడ్డపైనే ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఉగ్రవాద వ్యతిరేక బృందాలను హై అలర్ట్లో ఉంచారు. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, మయామి వంటి ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల వద్ద గస్తీని పెంచారు. అమెరికా భూభాగంపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. "యుద్ధం అన్నాక ప్రాణనష్టం తప్పదు, మేము అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుఉ సిద్ధంగా ఉన్నాం’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం గమనార్హం.ఇది కూడా చదవండి: యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి -
దోహా, ఖతార్, యూఏఈపై.. ఇరాన్ భీకర దాడులు
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆయన తెలిపారు. అయితే, అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న దాడులు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఇరాక్ పరిధిలోని కుర్దిస్థాన్ రీజియన్లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈకి ఆస్ట్రేలియా అండగా నిలిచింది. అత్యాధునిక గగనతల క్షిపణులను సరఫరా చేయడంతో పాటు నిఘా విమానాలను రంగంలోకి దించుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న యూఏఈ కాన్సులేట్ జనరల్ భవనంపై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దాడిని యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, సాగుతున్న ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులెవరో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు యూఏఈకి ఆస్ట్రేలియా సైనిక సాయాన్ని ప్రకటించింది. అత్యాధునిక ‘అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్’ క్షిపణులను యూఏఈకి పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి గగనతలం సురక్షితంగా ఉండటం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు యూఏఈ సుమారు 1,500కు పైగా క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని, పౌర భద్రత దృష్ట్యా ఈ సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్ తన దాడులను ఇంధన కేంద్రాల వైపు మళ్లించింది. బహ్రెయిన్లోని అల్ మామీర్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ ‘బాప్కో’ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్ నుంచి వెళ్లే బియ్యం, ఇండోనేషియా కాఫీ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు.. తామే నిర్ణయిస్తామని సవాల్ విసిరాయి. కాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వచ్చే కొన్ని నెలల వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొంది. -
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
వాషింగ్టన్: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన వారసుడిగా ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే చమురు ధరలు భారీగా పెరిగి, 2022 తర్వాత తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని ఇరాన్లో యుద్ధం రోజులు తరబడి కొనసాగుతుందనే సంకేతంగా భావించారు.అయితే అనూహ్యంగా చమురు ధరలు పడిపోయాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదనే అంచనాల నడుమ అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో మియామి గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొంత చెడును వదిలించడానికి మేం మధ్యప్రాచ్యంలో ఓ చిన్న విహారయాత్ర చేశాం. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగా ఉంటుంది. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో, ఇరాన్తో యుద్ధం ముగుస్తుందనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద చమురు రవాణా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.దాడుల ప్రభావంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో జరిగిన సంభాషణల తర్వాత ‘వివాదానికి రాజకీయ, దౌత్య పరిష్కారం అవసరం’ అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై దాడుల విషయంలో ట్రంప్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ వ్యూహమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
ఇరాన్కు తుర్కియే వార్నింగ్..
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు రెండోసారి కూల్చివేశాయని, ఇలాంటి "తప్పుడు, రెచ్చగొట్టే చర్యలు" కొనసాగిస్తూ మధ్యప్రాచ్యాన్ని మళ్లీ గత శతాబ్దంలోలా యుద్ధభూమిగా మార్చేస్తామంటే ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ, ఇరాన్కు సంబంధించిన పరిణామాలను తుర్కియే నిశితంగా గమనిస్తోందని తెలిపారు. తమ ఆందోళనలను నేరుగా టెహ్రాన్కు తెలియజేశామని చెప్పారు. “ఇరాన్కు అవసరమైన హెచ్చరికలు ఇచ్చాం. అయినప్పటికీ వారు తప్పుదోవలోనే కొనసాగుతున్నారు” అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.దౌత్యపరమైన పరిష్కారాలకే తుర్కియే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. “ఇతర యుద్ధాల మాదిరిగానే తుర్కియే న్యాయం వైపు నిలుస్తుంది. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికే మేము మద్దతు ఇస్తాం” అని తెలిపారు.అదే సమయంలో దేశ రక్షణ సామర్థ్యాలపై కూడా ఎర్డోగాన్ నమ్మకం వ్యక్తం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకునే ఎలాంటి బెదిరింపులకైనా తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం తుర్కియేకి ఉందని పేర్కొన్నారు. “తుర్కియే ప్రతి రంగంలో బలమైన దేశం. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలదు” అన్నారు. "మధ్యప్రాచ్యాన్ని శతాబ్దం క్రితం మాదిరిగా మళ్లీ ఆపరేటింగ్ టేబుల్పై ఉంచడానికి అనుమతించం" అని ఎర్డోగాన్ హెచ్చరించారు.అలాగే గాజా పరిస్థితిపై మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్న ఘటనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించుకుంటూ ఇజ్రాయెల్ రెండు దేశాల పరిష్కారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించకుండా త్వరగా ముగియాల్సిన అవసరం ఉందని, లేకపోతే యూరప్-ఆసియాతో పాటు ప్రపంచానికే నష్టం జరుగుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు. -
చమురు నిల్వలే లక్ష్యం!
దుబాయ్: పశ్చిమాసియాలో పోరు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. ఆదివారం 4 కేంద్రాలపై దాడులు చేయగా సోమవారం ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ క్షిపణి, అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్రస్థాయిలో దాడులను కొనసాగించాయి. దాంతో నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి.రాకెట్ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలపై కూడా రోజంతా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వలనే లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల్లో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కింది. సౌదీ అరేబియాలో అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రంపైనా పలు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశలవారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇరాన్ తీరు బాధ్యతారహితమంటూ మండిపడింది.అరబ్ దేశాలపై ఇలాగే దాడులు కొనసాగిస్తే అంతిమంగా అందరికంటే భారీగా నష్టపోయేది ఆ దేశమేనంటూ తీవ్రంగా హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్పైకి కూడా ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. దాడుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆదివారం తమపై ఇరాన్ జరిపిన దాడుల్లో మరణించిన ఇద్దరిలో ఒక భారతీయుడు ఉన్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని సౌదీ అరేబియా పేర్కొంది. బహ్రెయిన్లో 32 మందికి గాయాలు యూఏఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి. బహ్రెయిన్లో ఓ పౌర ఆవాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఏఈపై కూడా 15 బాలిస్టిక్ మిసైళ్లు, 18 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, ఆరు డ్రోన్లను అడ్డుకున్నట్టు ఖతర్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ తీర సమీపంలో అమెరికా యుద్ధ నౌకలతో పాటు చమురు నౌకలను కూడా లక్ష్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.తమ దేశ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ ఖండాంతర క్షిపణిని నాటో డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసినట్టు టర్కీ ప్రకటించింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ను నిర్వీర్యం చేసినట్టు ఇరాక్ వెల్లడించింది. మరోవైపు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 486కు చేరినట్టు లెబనాన్ పేర్కొంది. ఎన్నికపై నిరసనలు! సుప్రీం నేత పదవిని వారసత్వంగా మొజ్తబాకు కట్టబెట్టడంపై ఇరాన్లో పలువురు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1979లో వారసత్వ పోకడలపై పోరాడి రాచరికాన్ని కూలదోసి, ఇప్పుడు మళ్లీ అదే దారిలో వెళ్లడం ఏ మేరకు సరైందని వాళ్లు ప్రశి్నస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. ఇరాన్కు మా దన్ను: పుతిన్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. నూతన సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తబాకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్కు అన్నివిధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో పౌరులపై ఇరాన్ దాడులను జపాన్, ఈజిప్ట్ ఖండించాయి. మొజ్తబాకే ఓటుఅమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసుడు ఎవరన్న సస్పెన్షన్కు ఇరాన్ సోమవారం తెర దించింది. ఊహించినట్టుగానే ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీనే సుప్రీం నేతగా ప్రకటించింది. 88 మంది మత పెద్దలతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఖమేనీపై జరిగిన దాడిలో 56 ఏళ్ల మొజ్తబా కూడా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే.ఖమేనీతో పోలిస్తే మొజ్తబా మరింత కరడుగట్టిన మతవాదిగా, అమెరికా విద్వేషిగా పేరుబడ్డారు. దీనికి తోడు తండ్రితో పాటు మొజ్తబా తల్లి, భార్య, చిన్న కుమారుడు కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. దాంతో ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దాంతో మొజ్తబా సారథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతిదాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు, ఖమేనీ వారసునిగా ఎవరిని ఎన్నుకున్నా మట్టుబెట్టి తీరతామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పోరు మరింత ముమ్మరం కావడమే తప్ప నెమ్మదించే పరిస్థితులు కని్పంచడం లేదు.ఎరిత్రియా దాకా వెళ్లి తిరిగొచ్చిన ఇండిగో విమానం న్యూఢిల్లీ: భారత్ నుంచి ఇంగ్లండ్లోని మాంచెస్టర్కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎరిత్రియా నుంచే వెనక్కు తిరిగొచ్చింది. ఈ ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. విమానం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయల్దేరింది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం, ఎరిత్రియా గగనతలంలోకి ప్రవేశించనుందనగా ఉన్నట్టుండి వెనుదిరిగి ఢిల్లీ చేరుకుంది.ఇందుకు దారితీసిన కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఎరిత్రియా హఠాత్తుగా గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుందని ఇండిగో వర్గాలు అంటున్నాయి. యూరప్ రూట్లలో నడిపేందుకు నార్వేకు చెందిన నోర్సే అట్లాంటిక్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన బోయింగ్ 787 విమానాలను ఇండిగో లీజుకు తీసుకుంది. ఇక్కడే ఎరిత్రియా ఎయిర్ ట్రాఫిక్ విభాగం అయోమయానికి లోనై అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.చమురు ధరలు దిగొస్తాయి: ట్రంప్పశ్చిమాసియా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు చూసి భయపడాల్సిన పనేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘‘చమురు నిల్వలకు కొరతేమీ లేదు. వాటి ధరలు త్వరలోనే దిగొస్తాయి’’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. వెనెజువెలా చమురు సాయంతో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. ఇరాన్ క్షిపణి పాటవాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అతి దగ్గర్లో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.మరో అమెరికా సైనికుని మృతిమార్చి 1న కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల్లో గాయపడ్డ మరో సైనికుడు తాజాగా మృతి చెందాడు. అమెరికా సైన్యం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 8కి పెరిగింది.ఇజ్రాయెల్లో గాయపడ్డ భారతీయుడుఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం క్షిపణి దాడుల సందర్భంగా టెల్ అవీవ్లో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ‘‘మెడకు తీవ్ర గాయంతో విషమ పరిస్థితుల్లో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’’ అని వెల్లడించారు. -
పీపా 100 డాలర్ల పైకి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ ముడిచమురు రేట్లు మరింతగా మండుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి ఎగసింది. నైమెక్స్ క్రూడ్ (డబ్ల్యూటీఐ) ఏప్రిల్ డెలివరీ ధర ఒక దశలో 31.44 శాతం పెరిగి 120 డాలర్లకు దాదాపు దగ్గరగా 119.48 డాలర్లను తాకింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 28.82 శాతం పెరిగి 119.46 డాలర్లకు ఎగిసింది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోవడం, ప్రాంతీయంగా పలు దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.ఉద్రిక్తతల కారణంగా కీలక షిప్పింగ్ మార్గంలో నౌకలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఉండటంతో గ్లోబల్గా దాదాపు అయిదో వంతు ముడిచమురు, సహజ వాయువు సరఫరా నిలి్చపోయినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ‘హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగించడం తొలి దశ. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండో దశలో మరింత తీవ్రమైన రిసు్కలు ఉండొచ్చు. ప్రాంతీయంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలపై నేరుగా దాడులు చేయొచ్చు. మూడో దశలో కీలకమైన నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఎంసీఎక్స్లో భగ్గు.. అంతర్జాతీయ పరిణామాలతో దేశీ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో కూడా ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. మార్చి డెలివరీ కాంట్రాక్టు ఎకాయెకిన 26 శాతం ఎగిసి (రూ. 2,186) జీవితకాల గరిష్ట స్థాయి రూ. 10,549ని తాకింది. మార్చి కాంట్రాక్టు అప్పర్ సర్క్యూట్ తాకిందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సెషన్లలో రూ. 11,300కి కూడా పెరిగే అవకాశం ఉందని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఆమిర్ మక్డా చెప్పారు.బ్యారెల్ ధర ఒక డాలరు పెరిగేతే ఏటా భారత్పై 1.8 బిలియన్ డాలర్ల భారం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయిల్ రేటు 50 డాలర్లు పెరిగి, ఏడాది పాటు కొనసాగితే 90 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతమని మిశ్రా పేర్కొన్నారు.సంక్షోభాలు.. యుద్ధాలతో ఆజ్యం..సుమారు దశాబ్దంన్నర కాలంగా వివిధ సంక్షోభాలు, యుద్ధాలతో ముడిచమురు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కమోడిటీల బూమ్ ఏర్పడింది. ఆయిల్ ధరలు ఆ ఏడాది జూలై 11న ఆల్టైం గరిష్టస్థాయి 147.50కి ఎగిశాయి. ఆ తర్వాత 2011లో పశి్చమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తిరుగుబాట్లతో దద్దరిల్లినప్పుడు 127 డాలర్ల స్థాయిని చూశాయి.అమెరికన్ షేల్ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ముంచెత్తడంతో 2015 తొలినాళ్లలో 50 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంధనానికి డిమాండ్ పడిపోయి, చమురు ఉత్పత్తి దేశాలు నిల్వలను వదిలించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రెంట్ క్రూడ్ రికార్డు కనిష్టం 15.98 డాలర్లకు కూడా పతనమైంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మైనస్ 40.32 డాలర్లను తాకింది. మళ్లీ 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆయిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. 2022 తొలినాళ్లలో 139 డాలర్లకు ఎగబాకాయి. -
వంట నూనెలు సలసల!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికా యుద్ధం మొదలైన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలు, పప్పు దినుసు లు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్ కామర్స్ ఆన్లైన్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గతవారం రోజుల్లోనే లీటరుకు రూ. 15–25 వరకు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఫిబ్రవరి చివరలో హైదరాబాద్లో లీటరు రూ.150కి అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి చేరింది. వేరుశనగ నూనె కూడా రూ. 180కి పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే పామాయిల్ ధర లీటరుకు రూ.15 నుంచి రూ. 20 మేర పెరిగింది. మార్కెట్లో నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగంబజార్, సికింద్రాబాద్ వంటి హోల్సేల్ మార్కెట్లలో కూడా హోల్సేల్ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్ వ్యాపారులు కూడా ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది. పెరిగిన పప్పుల ధరలు గల్ఫ్ దేశాల నుంచి రావలసిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 130–150 మధ్య పలుకుతోంది. వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల వీటి ధరలు కిలో రూ.180 నుంచి రూ.200కి చేరాయి. పెసర పప్పు, మినప్పప్పు ధరలు కూడా ఎగబాకాయి. ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెపుతున్నాయి. వంట సామగ్రి ధరలు పెరిగాయ్ ఏం యుద్ధమో ఏమో. వంట నూనెలతోపాటు పప్పులు, మిర్చి, వేరుశనగ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ రేట్లు పెంచారు. ఈ ధరలతో హోటల్ నడుపుడు ఎట్లనో తెలుస్తలేదు. ధరలు పెరిగితే మేం కూడా టిఫిన్లు, చపాతి, భోజనాల ధరలు పెంచక తప్పదు. ధరలు పెరగకుండా సర్కార్ ప్రయత్నించాలి. –శేషమ్మ, హోటల్ నిర్వాహకురాలు, నాగర్ కర్నూల్ -
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్ తెలిపింది.ఈ దాడి ఇరాన్లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్లోని ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. -
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
టెహ్రాన్: ‘ట్రంప్ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో మరణించిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు తీసింది.‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్పై దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ, “ఆ స్కూల్పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్ స్కూల్ విషాదాన్ని ఇరాన్పై నెట్టే ప్రయత్నం చేశాడు.ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇనాబ్ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్, ఇటు ఇరాన్ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ విచారణలో మినాబ్లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరగగా, స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది.గత ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఇనాబ్ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్ ట్రెవర్ బాల్ తెలిపారు.అంతేకాదు, తొలిసారి ఐఆర్జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్ స్కూల్ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు. -
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..
-
టెహ్రాన్పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం
-
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం
-
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
చిక్కుల్లో ట్రంప్.. ఇరాన్ స్కూల్పై దాడి ఇజ్రాయెల్ పనే..
-
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. శత్రుదేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. దేశంలోని వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించింది.ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఐఆర్ఐబీ వార్తా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. విదేశాల్లో నివసిస్తూ సొంత దేశానికి శత్రువుల్లా పనిచేస్తున్న వారి ఆస్తులు స్వాధీనం చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని ఇరాన్ న్యాయ వ్యవస్థ సైతం స్పష్టం చేసింది.ఈ ప్రకటన న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థలో కూడా ప్రచురితమైంది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా అమెరికా ప్రభుత్వాల కోసం జరిగే ఏదైనా ఇంటెలిజెన్స్ లేదా ఎస్పియోనాజ్ కార్యకలాపాలు జరిగితే ఆయా పౌరుల ఆస్తులు స్వాధీనం చేయడం పాటు మరణదండన కూడా విధించవచ్చని హెచ్చరించింది. ఇరాన్కు వ్యతిరేకంగా తప్పులు చేసినట్లు నిర్ధారణ అయితే వదిలేది లేదని ఇరాన్ చెప్పింది. గత అక్టోబర్లో అమలు చేసిన చట్టం గురించి ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు లేదా సంస్థలకు అనుకూలంగా తమ పౌరులు పనిచేస్తే చేస్తే ఆస్తుల స్వాధీనంతో పాటు ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఇతర చట్టపర శిక్షలు వర్తిస్తాయని తెలిపింది.పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నగరాలపై సైనిక దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి.. విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులపై కూడా ఇరాన్ దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. 10,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. -
గ్యాస్ సంక్షోభం
-
అమెరికా-ఇజ్రాయిల్ల మధ్య భిన్న స్వరం
ఇప్పటివరకూ ఇరాన్పై సంయుక్తంగా దాడి చేస్తూ వస్తున్న అమెరికా- ఇజ్రాయెల్లు ఓ విషయంలో మాత్రం రెండుగా చీలిపోయాయి. చమురు నిల్వల అంశంలో అమెరికా-ఇజ్రాయెల్ వైఖరి భిన్నంగా ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసిన నేప థ్యంలో ట్రంప్ హుకుం జారీ చేశారు. ఆ చమురు నిల్వలపై దాడి చేయొద్దంటూ ఇజ్రాయిల్ను ఆదేశించారు. దీంతో అమెరికా- ఇజ్రాయెల్ మధ్య కాస్త ఏరుపాటు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఒక్కసారిగా ట్రంప్ ఆదేశాలకు నెతాన్యాహూ అలిగారట. -
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ది ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది.పశ్చిమాసియాలోనే అధికం..గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను (డీసాలినేషన్ ప్లాంట్స్.. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు) ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా, ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి.గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఇలా.. కువైట్: 90% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరుయుఏఈ: 90% నీరు డీసాలినేషన్ ద్వారా తాగునీరు ఒమాన్: 86% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరు దొరుకుతుంది.బహ్రెయిన్: 80 శాతం.. అత్యధికంగా డీసాలినేషన్ మీద ఆధారపడుతోంది. సౌదీ అరేబియా: 70% నీరు డీసాలినేషన్ ద్వారా తాగు నీరు ఖతార్: 70 శాతం చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి.నీటిపై యుద్ధ ప్రభావం.. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే, ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80–90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది.ఇరాన్కు నష్టం తక్కువే.. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యామ్లు, భూగర్భ జలాలు మీద ఆధారపడుతుంది. అందువల్ల తీరప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా, ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రత స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది. -
దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే
-
ట్రంప్నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.ఇరాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.అయితే ఇరాన్లో సాధారణంగా సుప్రీం లీడర్ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.🚨 BREAKING: The Islamic regime of Iran just named Ali Khamenei's SON as the NEW SUPREME LEADER — Mojtaba KhameneiPresident Trump has already said he is an "UNACCEPTABLE" successor to Ali Khamenei"Everybody that seems to want to be a leader, they end up DEAD!"How long will… pic.twitter.com/2MiCYtXrxT— Eric Daugherty (@EricLDaugh) March 8, 2026కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్ఈస్ట్లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ఇరాన్ సుప్రీం నేత ఖరారు?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆయన వారసుని ఎంపిక పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పేరును ఇప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సుప్రీం నేతకు కూడా ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ‘కొత్త నేతను ఎన్నుకున్నాం’ అని కమిటీ సభ్యుడు అయతొల్లా మొహమ్మద్ మెహ్దీ మిర్బాఖేరీ చెప్పారు. ‘‘అయితే ఇంకొన్ని అవరోధాలున్నాయి. వాటిని పరిష్కరించాకే ఆయన పేరు వెల్లడిస్తాం’’ అన్నారు.సుప్రీంనేత ఎంపిక కోసం జరిపే సమావేశంపై సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దాడుల వేళ భద్రతా కారణాల రీత్యా సమావేశం అక్కర్లేదని, ఎవరికి మద్దతు పలికేదీ సూచిస్తే చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డట్టు అయతొల్లా మొహ్సీన్ హైదరీ అలేకాసిర్ చెప్పారు. మరికొందరేమో ఏదేమైనా కమిటీ భేటీ కావాల్సిందేనని పట్టుబట్టారు. ‘‘సుప్రీంనేత ఎంపిక పూర్తయింది. పేరును అసెంబ్లీ సెక్రటరీ అయతొల్లా హషీం హొస్సేనీ బుషేరీ వెల్లడిస్తారు’’ అని మరో సభ్యుడు అహ్మద్ అలామొల్హొదా చెప్పారు. దివంగత ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల ముజ్తాబా ఖమేనీనే సుప్రీం నేతగా ఎన్నుకుని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముజ్తాబా గాయపడ్డారా? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోవడం తెల్సిందే. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంత∙సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు
టెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్ రాజధాని టెహ్రాన్తో పాటు అల్బోర్జ్లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్ నగరాలపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది.భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్లో వర్క్షాపులను, హార్స్రైడింగ్ క్లబ్ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్ ఎయిర్పోర్టులో ఇరాన్కు చెందిన ఎఫ్–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్లో ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్పై నిఘా కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్జీసీ ఇంటర్నల్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్ ఫోర్స్ కాంపౌండ్ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికా రాడార్లు నేలమట్టం కువైట్పై ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అల్–అదిరీ ఎయిర్బేస్పై మిస్సైల్, డ్రోన్ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. యూఎస్ థాడ్ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్–గైడెడ్ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యమే తమ డిశాలినేషన్ ప్లాంట్పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్లో తాగునీటికి డిశాలినేషన్ ప్లాంట్లే ప్రాణాధారం. స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. మంటల్లో కువైట్ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలుఇరాన్ సైన్యం కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.ఇరాన్ దాడుల్లో ఇద్దరు కువైట్ బోర్డర్ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పైనా ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ సైన్యం 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు. -
మార్కెట్లో చమురు మంట!
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత క్షీణించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మండుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంటును దెబ్బతీయనున్నట్లు తెలియజేశారు. దీంతో అమ్మకాలదే పైచేయి కానున్నట్లు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ గత వారాంతాన ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం ఎగసి 92.6 డాలర్లను దాటగా.. న్యూయార్క్ నైమెక్స్లో లైట్ స్వీట్ క్రూడ్ 12 శాతంపైగా జంప్చేసి 91 డాలర్లకు చేరింది. అయితే గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు నిర్వహిస్తుంటే.. ఇరానియన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతున్నట్లు వెలువడుతున్న వార్తలు చమురు ధరలకు మరింత మద్దతివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి దేశీయంగా మార్కెట్లో సెంటిమెంటుకు షాకివ్వనున్నట్లు తెలియజేశారు.దేశీయంగా ముడిచమురు అవసరాలకు 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా సవాళ్లు, ధరల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయే అవకాశముంది. ఇది ధరలకు ఆజ్యం పోయడంతోపాటు.. రూపాయిని బలహీనపరచనున్నట్లు ఆరి్థకవేత్తలు వివరించారు. వెరసి ఈ వారం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, చమురు ధరలపైనే మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్, ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి తెలియజేశారు. క్రూడ్ షాక్.. ముడిచమురు ధరలు ఇప్పటికే దేశీయంగా పలు రంగాల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఏటీఎఫ్ ధరలతో విమానయానం ఖరీదుగా మారనుంది. మరోపక్క టైర్లు, పెయింట్ల ముడిసరుకుల ధరలకు రెక్కలు రానుండటంతో లాభదాయకత దెబ్బతినే వీలుంది. చమురు శుద్ధి కంపెనీల మార్జిన్లు సైతం బలహీనపడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆయా రంగాల కౌంటర్లలో అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు చెబుతున్నారు. ధరలు బలపడితే ఆర్బీఐ కఠిన పరపతి విధానాలవైపు మొగ్గు చూపవలసివస్తుందని ఆరి్థకవేత్తలు అభిప్రాయపడ్డారు. గణాంకాలు కీలకం.. ఈ వారం దేశీయంగా ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో సీపీఐ అంచనాలకంటే అధికంగా 2.75 శాతంగా నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఫిబ్రవరి నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ బాటలో యూఎస్ ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో ఉపాధి కల్పన, జనవరి వాణిజ్య లోటు వివరాలు ప్రకటించనుంది. 2025 డిసెంబర్లో వాణిజ్య లోటు 70.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతేకాకుండా అక్టోబర్–డిసెంబర్(క్యూ4) జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి.నేలచూపులోనే...గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో నిలిచాయి. నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ 2,368 పాయింట్లు(2.9 శాతం) పతనమైంది. 78,919 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 728 పాయింట్లు(2.9 శాతం) కోల్పోయి 24,450 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3.1 శాతం చొప్పున క్షీణించాయి.టెక్నికల్గా వీక్ ⇒ నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగే వీలుంది. ఇంతకంటే బలహీనపడితే.. 23,500 వరకూ క్షీణించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 24,500 పాయింట్ల ఎగువన 25,000– 25,300 పాయింట్ల వద్ద అమ్మకాలు ఎదురుకావచ్చు. ⇒ బలహీనతలు కొనసాగితే సెన్సెక్స్ 77,000 పాయింట్లకు జారే అవకాశముంది. ఈ స్థాయి దిగువన 76,000–75,500 పాయింట్ల వద్ద మద్దతు లభించే వీలుంది. ఇక్కడినుంచి బలపడితే.. 80,200–80,700 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. -
Stock Markets: ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలిపుడు?
గల్ఫ్ అంటేనే చమురు మార్కెట్కు హృదయం లాంటిది. అలాంటి గల్ఫ్లో పెద్ద దేశంగా చెలామణి అవుతున్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లనే కాదు... స్టాక్ మార్కెట్లనూ అతలాకుతలం చేస్తున్నాయి. దేశానికి కావలసిన ముడి చమురులో 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్పైనా ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు అనూహ్యంగా కదులుతున్నాయి. సూచీలు రోజూ 1–2 శాతం పడటం... కొంత రికవరీ కావటం జరుగుతోంది. ఇక కొన్ని షేర్లయితే దారుణంగా పడ్డాయి.ఐటీ సహా పలు షేర్లు మూడేళ్ల కనిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ల నుంచి విత్డ్రా అయి సురక్షిత సాధనాలవైపు మళ్లాలా? లేక మరికొంత ఇన్వెస్ట్ చేయాలా? సిప్లు ఆపేయాలా? కొనసాగించాలా? అసలు యుద్ధ ప్రభావం ఎన్నాళ్లుంటుంది? గతంలో యుద్ధాలు జరిగినపుడు మార్కెట్లు ఎలా స్పందించాయి? ఎన్నాళ్లకు కోలుకున్నాయి? వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లకు అవగాహన కలిగించడానికే ఈ ‘వెల్త్’ స్టోరీ...భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు వెళ్లటం పెరిగిన నాటి నుంచీ... అంటే 1990ల నుంచీ చాలా యుద్ధాలు, సంక్షోభాలు వచ్చాయి. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ వరకూ పలు యుద్ధాలతో పాటు.. కోవిడ్ వంటి అంతర్జాతీయ సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినపుడు మార్కెట్లు తక్షణ స్పందనగా పతనమయ్యాయి. ఆ పతనం కొన్ని సార్లు భారీగా ఉంటే... మరికొన్నిసార్లు తక్కువగానే కనిపించింది. కోలుకోవటానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడితే... కొన్నిసార్లు వేగంగానే రికవరీ అయ్యాయి. మరో అద్భుతం ఏంటంటే ప్రతి యుద్ధం... ప్రతి సంక్షోభం ఓ కొత్త చరిత్రకు మార్గం చూపించింది. 1991 గల్ఫ్ యుద్ధం: సంస్కరణలకు మార్గం గల్ఫ్ యుద్ధ సమయంలో చమురు ధరలు 17 డాలర్ల నుంచి 36 డాలర్లకి ఎగబాకాయి. అంటే రెట్టింపుకన్నా ఎక్కువ. పైపెచ్చు మన దగ్గర చాలినంత విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. దీంతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురయింది. సెన్సెక్స్ సుమారు 21శాతం పతనమైంది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా కొత్త భారతదేశం ఆవిష్కృతమయ్యింది. 1990ల చివరినాటికి మార్కెట్ కొన్ని రెట్లు పెరిగింది. 2000 డాట్కామ్ బబుల్: సుదీర్ఘ రికవరీ ఇంటర్నెట్ కంపెనీలు పుట్టగొడుగులుగా వచ్చి... వాటికి సరైన ఆదాయ మార్గాలు లేకపోవటంతో మూతపడాల్సి వచ్చిన సమయమది. డాట్కామ్ బుడగ బద్దలయింది. కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 6,150 పాయింట్ల నుంచి 2,594 పాయింట్లకి పడిపోయింది. రికవరీకి రెండున్నరేళ్లకు పైగానే (దాదాపు 850 రోజులు) పట్టింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సాగిన రికవరీ ఇది.అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటం... ద్రవ్యపరంగా క్రమశిక్షణ పాటించటం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చాయి. 2004 తర్వాత మళ్లీ బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. మార్కెట్ల రికవరీని పక్కనబెడితే... డాట్కామ్ విప్లవం వల్ల ప్రపంచాన్ని కనెక్ట్ చేసే బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పడింది. సముద్రగర్భ కేబుళ్లతో పాటు విస్తృతమైన నెట్వర్క్ వచ్చింది. అది తరువాతి కాలంలో ప్రపంచ గతినే మార్చేసింది. 2008 ఆర్థిక మాంద్యం: భారీ పతనంఅమెరికాలో సబ్ప్రైమ్ సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసిన సమయమది. లేమన్ బ్రదర్స్తో మొదలుపెట్టి పలు ఆర్థిక సంస్థలు అప్పులు రికవరీ అయ్యే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆర్థిక దిగ్గజాలు బోర్డు మూసేశాయి. పొదుపుపై నిలబడ్డ భారత వ్యవస్థ దేశంలో ఏ ఆర్థిక సంస్థా కుప్పకూలకుండా కాపాడినా... భారత్కు కూడా మాంద్యం తాకిడి తప్పలేదు.ఫలితంగా సెన్సెక్స్ 21,206 పాయింట్ల నుంచి 7,697 పాయింట్లకు పతనమైంది. అంటే దాదాపు 64% పతనం. అప్పట్లో స్టాక్ మార్కెట్ యుగం ముగిసినట్టే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్బీఐ లిక్విడిటీ మద్దతు, ప్రభుత్వ ఆరి్ధక ఉద్దీపన ప్యాకేజీలు, ఇన్ఫ్రా పెట్టుబడులు మార్కెట్కు మళ్లీ ఊపిరి పోశాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో స్రూ్కటినీని పెంచటంతో పాటు కొత్త పెట్టుబడి సాధనాలకు మార్గం చూపించింది. 2020 కోవిడ్: వేగవంతమైన రికవరీ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయటంతో అంతర్జాతీయంగా స్టాక్మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచం లాక్డౌన్ అయింది. సెన్సెక్స్ 39 శాతం పతనమైంది. కానీ కేవలం 230 రోజుల్లోనే తిరిగి పాత గరిష్ఠ స్థాయిని చేరుకుంది. కాకపోతే ఈ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్వైపు నడిపించింది. సోషల్ మీడియాను కొత్త శిఖరాలకు చేర్చింది. పేమెంట్ల వ్యవస్థను, కార్యాలయాల్లో పనిచేసే పద్ధతిని సమూలంగా మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న చాలా మార్పులు కోవిడ్ ఫలితమేనంటే అతిశయోక్తి కాదు. 2022 రష్యా– ఉక్రెయిన్ యుద్ధం: ద్రవ్యోల్బణ షాక్ ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగటంతో ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు 8 శాతం దాకా పతనమయ్యాయి. అయితే దేశం 6 నెలల్లో ఈ యుద్ధ ప్రభావం నుంచి కోలుకోగలిగింది. ఉక్రెయిన్ ఉద్రిక్తత కారణంగా భారత్ తన సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చుకుంది. గ్లోబల్ యుద్ధాల్లో నిలబడే శక్తిని సమకూర్చుకుంది. 2023–2026 అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు పది రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని క్షిపణి దాడులతో హతమార్చాయి. ఇరాన్ ప్రతి దాడులకు దిగటంతో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసింది. ఈ యుద్ధం ఫలితంగా ముడి చమురు ధరలు గడిచిన వారం రోజుల్లోనే 36 శాతం వరకూ పెరిగాయి. దీని ప్రభావం భారత్పై ఎక్కువే కావటంతో స్టాక్ మార్కెట్లు విపరీతంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ యుద్ధం ఆరంభానికి ముందు 26,300 పాయింట్లను తాకిన నిఫ్టీ... దాదాపు 1,800 పాయింట్లు నష్టపోయింది. అంటే దాదాపు 7 శాతం పతనమైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. భారత్పై యుద్ధ ప్రభావాలు ఒకప్పటిలా ఉండే అవకాశం తక్కువ, ఎందుకంటే..⇒ సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఫారెక్స్ రిజర్వులున్నాయి. ⇒ పొదుపు ఆధారితం నుంచి వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. ⇒ రూపాయి కదలికలను – లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం రిజర్వ్బ్యాంకుకు ఉండడం. ⇒ దేశీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?సంక్షోభాల గురించి స్టాక్మార్కెట్లు చెబుతున్నదొకటే. పతనం తాత్కాలికం. ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంటే మార్కెట్లూ పెరుగుతాయి. నిపుణుల సూచన ప్రకారం... ఇప్పటికే మార్కెట్లు కొంత పడ్డాయి. భారీగా లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తాత్కాలికంగా కొంతవరకూ వెనక్కి తీసుకున్నా పర్వాలేదు. కానీ నష్టాల్లో వైదొలగటం అనేది సరైన నిర్ణయం కాదు. మార్కెట్ల పతనం అనేది మరింత పెట్టుబడులకు అవకాశంగానే భావించాలి తప్ప ఉపసంహరణకు కాదు. సిప్ చేస్తున్నవారు మార్కెట్లు మరింత పతనమైతే మరింత పెట్టుబడి పెట్టే మార్గాన్ని పరిశీలించుకోవాలి. దిగువ స్థాయిల్లో సిప్ను కొనసాగిస్తేనే మంచి లాభాలు కళ్లచూస్తారు. యుద్ధాలు, సంక్షోభాలు ప్రతికూలం (నష్టపోయే రంగాలు)⇒ ఏవియేషన్⇒ ఆటోమొబైల్స్ ⇒ కెమికల్స్ ⇒ ఆయిల్ ఆధారిత పరిశ్రమలుఅనుకూలం (లాభపడే రంగాలు)⇒ డిఫెన్స్ సంబంధిత కంపెనీలు ⇒ ఎఫ్ఎంసీజీ సంస్థలు ⇒ ఫార్మా కంపెనీలు⇒ చమురు అన్వేషణ సంస్థలు ⇒ గోల్డ్ సంబంధిత పెట్టుబడులు -
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏం జరగబోతుంది?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి దాదాపు తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఈ యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. దాడులను మరింత విస్తరిస్తామని.. చాలా బలంగా దెబ్బతీస్తామంటూ ఇరాన్కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోతుందంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఘాటుగానే స్పందించారు.కాగా, రెండు, మూడు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. -
ఇరాన్ కొత్త నాయకుడి ప్రకటనపై అందుకే జాప్యం..
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. కొత్త నాయకుడిని ఎన్నుకున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాయకుడిని అసెంబ్లీ సెక్రటేరియట్ అధిపతి ప్రకటించనున్నారు. అధికారికంగా పేరుబయట పెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు మజ్తబానే కొత్తనాయకుడంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది.వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కొత్త నాయకుడి ప్రకటన జాప్యం అవుతుందని సమాచారం. కొత్త నాయకుడిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున.. కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. -
పశ్చిమాసియాలో నిప్పుల వాన.. ఇజ్రాయెల్ ట్రెండింగ్లో యాప్
అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇరాన్ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్లు ఇప్పుడు ఆ దేశంలో హల్చల్ చేస్తున్నాయి. రాకెట్లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్ ఐ షవర్?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ యాప్కు ట్రెండింగ్లో ఉంది. యాప్ను ఉపయోగించే యూజర్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్లు, సైరన్లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్ కమాండ్’, ‘రెడ్ అలర్ట్’వంటి యాప్లు సైతం వార్నింగ్ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.యుద్ధంలోనూ ప్రేమ.. యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్లు మోగగానే సమీప బంకర్ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్లు రంగంలోకి దూకాయి. బంకర్ ముఖద్వారాల వద్ద క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్ను స్కాన్చేస్తే ఆ బంకర్లో ఉన్న వాళ్ల సోషల్మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం లేదా చాటింగ్ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్తో మాట్లాడించే డేటింగ్ యాప్లూ బాంబర్ల వద్ద క్యూఆర్ కోడ్రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. సురక్షిత మార్గాలనూ చూపుతూ.. ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్ లొకేషన్ను సూచించే యాప్లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాకు చేరుకున్న సైనికుల పార్థివదేహాలు ట్రంప్ నివాళి
-
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
అమెరికాకు భారీ నష్టం.. కొండను తవ్వి ఎలుకను పట్టారా
-
నాలుగువైపుల నుంచి తగలబడుతున్న ఇరాన్
-
ఎప్పుడూ వాడని మిస్సైల్ ఇరాన్ పై వాడుతున్న అమెరికా
-
టెహ్రాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ బీకర దాడులు
-
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ
ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందియుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తూ "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపిందికాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్ జరిపిన అటాక్స్ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. -
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తి..!
పశ్చిమాసియాలో కురుస్తున్న నిప్పుల వాటనఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్న అమెరికా,ఇజ్రాయెల్వెనక్కి తగ్గని ఇరాన్ -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
-
దుబాయ్: మెరీనా టవర్పై ‘బాలిస్టిక్’ శకలాలు.. యూఏఈ అప్రమత్తం
దుబాయ్: గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు విస్తరిస్తున్న తరుణంలో దుబాయ్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, ఆ క్షిపణి శకలాలు దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన భవనంపై పడటంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భవనం పైభాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని అధికారులు గుర్తించారు.గల్ఫ్ రీజియన్లో ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతల భద్రతను మరింత పటిష్టం చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను యూఏఈ రక్షణ విభాగం గుర్తించింది. వీటిలో 15 క్షిపణులను, 119 డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూల్చివేసిన ఒక క్షిపణి శకలాలు దుబాయ్ మెరినాలోని ఒక టవర్ ఫాసాడ్పై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని దుబాయ్ ప్రభుత్వ మీడియా విభాగం తెలిపింది.యుద్ధ సంక్షోభం మొదలైన తర్వాత మొదటిసారిగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మనం ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నాం. ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారుతాం’ అని ఆయన దేశప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులపై విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశాలకు కలిగిన ఇబ్బందులకు ఆయన క్షమాపణలు తెలిపారు.తమపై దాడులు జరిగితే తప్ప, తాము ఏ పొరుగు దేశంపైకి క్షిపణులను ప్రయోగించబోమని ఇరాన్ స్టేట్ టీవీ వేదికగా ప్రకటించారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన 'బేషరతు లొంగుబాటు'ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్ అణు కార్యకలాపాలకు నిరసనగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్పై భారీ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ♦️ התקפת כטב"ם על מגדל רב הקומות בעיר דובאי pic.twitter.com/swNhyNGk4z— Asslan Khalil (@KhalilAsslan) March 7, 2026 -
పూటకో మాట!
ఒకటే నోరు. కానీ పూటకో మాట. రోజుకోవైఖరి. ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయం గొలుపుతోంది. సహేతుకమైన కారణమేదీ లేకుండానే ఏకపక్షంగా తెర తీసిన ఈ యుద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అగ్ర రాజ్యం కిందా మీదా పడుతోంది. ఫిబ్రవరి 28న శనివారం ఇజ్రాయెల్తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్పై అమెరికా భారీ స్థాయి యుద్ధానికి దిగడం తెలిసిందే. ఆ క్రమంలో యుద్ధ కారణాలకు సంబంధించి ట్రంప్ మొదలుకుని ఆయన యంత్రాంగంలోని ఇతర నేతల దాకా పదేపదే మాట మారుస్తూ నవ్వులపాలు అవుతున్నారు.ఇప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆమోదయోగ్యమైన కారణం కూడా చూపలేకపోయారు. ఫలితంగా ట్రంప్ సర్కారు సొంత ప్రజల దృష్టిలోనే పలుచన కావడంతో పాటు స్వదేశంలో శరవేగంగా ఆదరణ కోల్పోతోంది. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ తొలుత చెప్పారు. తర్వాత అణు ముప్పును బూచిగా చూపారు. కొన్ని కారణాలైతే పరస్పర విరుద్ధంగా కూడా ఉండటం విశేషం! ఇలా యుద్ధం మొదలైన ఈ 8 రోజుల్లోనే ట్రంప్, ఆయన యంత్రాంగం పదేపదే మాట ఎలా మారుస్తూ వచ్చిందంటే...ఇరాన్ విముక్తి కోసమే!ఇరాన్ మత పాలకుల దశాబ్దాల దమననీతికి బదులిచ్చేందుకు, వారి బారినుంచి ఆ దేశాన్ని విముక్తం చేసేందుకే యుద్ధం మొదలు పెట్టినట్టు ఫిబ్రవరి 28న శనివారం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. దానికి చరమగీతం పాడబోతున్నాం. అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం’’ అని 8 నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘‘ఈ సువర్ణావకాశాన్ని ఇరాన్వాసులు అందిపుచ్చుకోవాలి. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకునే సాహసం ప్రదర్శించాలి’’ అంటూ పిలుపునిచ్చారు! అనంతరం తొలి బాంబులు ఇరాన్ను తాకిన కాసేపటికి ఆక్సియోస్ న్యూస్ వెబ్సైట్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తా. లేదంటే రెండు మూడు రోజుల్లోనే ముగించేస్తా. మా దాడి నుంచి కోలుకునేందుకు ఇరాన్కు ఎలాగూ ఏళ్లు పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.స్వీయ రక్షణకే!ఫిబ్రవరి 28న యుద్ధం మొద లైన కాసేపటికే ఐక్యరాజ్య సమితిలో యూఎన్ మిషన్ మరో వైఖరి తీసుకుంది. స్వీయరక్షణ కోసమే ఇరాన్పై దాడికి దిగాల్సి వచ్చిందంటూ భిన్న స్వరం వినిపించింది! ‘‘ఇరాన్ క్షిపణి పాటవం, అణ్వాయుధ ఆకాంక్షలు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలకు పెను ముప్పుగా మారాయి. అందుకే దానిపై దాడులు తప్పలేదు’’ అని చెప్పుకొచ్చింది. శాంతియుత పరిష్కారం కోసం ఎంతగా సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందంటూ ఐరాసలో అమెరికా రాయబారి వైక్ వాల్జ్ మొసలి కన్నీరు కార్చారు. ‘‘కనుక ఇజ్రాయెల్తో కలిసి దాడులకు దిగక తప్పలేదు. యూఎన్ చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం మా చర్య పూర్తిగా చట్టబద్ధమే’’ అంటూ వాదించారు. తమ చర్యను స్వాగతిస్తూ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ పండుగ చేసుకుంటున్నారని అదేమీ లేదు!ఐరాసలో అమెరికా వినిపించిన స్వరాన్ని పెంటగాన్ వర్గాలు ఆ మర్నాడే ఖండించడం విశేషం! యుద్ధం మొదలైన మర్నాడు మార్చి 1న తాజా పరిస్థితిని అవి కాంగ్రెస్కు నివేదించాయి. ఆ క్రమంలో, ‘‘గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై గానీ, సిబ్బందిపై గానీ తొలుత దాడులకు దిగే ఉద్దేశం ఇరాన్కు ఏమాత్రమూ లేదు. దానిపై ఇజ్రాయెల్ తొలుత దాడి చేస్తే తప్ప ఇరాన్ నాయకత్వం అలాంటి ఆలోచన కూడా చేయబోదు’’ అని స్పష్టం చేశాయి!రూబియోను ఖండించిన ట్రంప్!రూబియో వ్యాఖ్యలను ఆ మర్నాడే ట్రంప్ ఖండించారు. ఇరాన్పై సైనిక చర్యకు దిగాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని మార్చి 3న స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ మమ్మల్ని ఒత్తిడి చేయడమేమిటి? అయితే గియితే మేమే ఇజ్రాయెల్ను ఒత్తిడి చేశామని చెప్పాలి’’ అని కూడా అన్నారు. ఇరాన్ దురుద్దేశాలే సైనిక చర్యకు కారణం తప్ప ఇజ్రాయెల్ కాదన్నారు. దాంతో రూబియో కంగుతిన్నారు. ముందు రోజు తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే సందర్భరహితంగా చూపించి దురుద్దేశాలు ఆపాదించిందంటూ నాలిక మడతేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్రూబియో భిన్న స్వరంపెంటగాన్ వర్గాల వ్యాఖ్యలు చేసిన మర్నాడే, అంటే మార్చి 2న అందుకు పూర్తి భిన్నంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఏ క్షణంలోనైనా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ సైనిక ఫీల్డ్ కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై దాడి యోచనలో ఉన్నట్టు నాకు కచ్చితమైన సమాచారముంది. అప్పుడు మన స్థావరాలకూ ముప్పు తప్పదు. కనుక మనమే ముందస్తు దాడులకు దిగడం తప్ప మరో మార్గం లేదు. లేదంటే భారీగా నష్టపోతాం’’ అని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి రహస్య భేటీలో చెప్పుకొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగుతుండటంతో తమకూ మరో మార్గం లేకపోయిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు!ట్రంప్ను చంపాలనుకున్నారు!మార్చి 4న పెంటగాన్ బ్రీఫింగ్లో అమెరికా రక్షణ మంత్రి ఇరాన్పై యుద్ధానికి సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. ఇరాన్ ఐఆర్జీసీ సైనిక యూనిట్ కమాండర్కు ఈ మేరకు బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ (ఖమేనీ హత్య ద్వారా) వారిపై ట్రంపే పై చేయి సాధించారు’’ అని చెప్పుకొచ్చారు! -
శత్రు భయంకర క్షిపణి
ఇరాన్పై ఇంతకు మునుపెన్నడూలేనంతగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ములపొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీరంగ దిగ్గజం లాక్హీడ్ మార్టీన్ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధిచేసి ఇచ్చిన ‘ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్(పీఆర్ఎస్ఎం) సైతం ఇప్పుడు ఇరాన్పై దాడులకు సిద్ధమైంది.యుద్ధంలో పీఆర్ఎస్ఎంను తొలిసారిగా ఉపయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ‘‘చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి క్షిపణి పీఆర్ఎస్ఎంను ఇరాన్పై మొదలెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఉపయోగించాం. తీవ్రమైన దాడులను విజయవంతంగా పూర్తిచేసింది. క్షిపణుల సాయంతో శత్రుసేనలను ఎటూ పాలుపోకుండా చేస్తున్న మా సాయుధ బలగాల శక్తియుక్తులను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో వ్యాఖ్యానించారు. క్షిపణి లాంచర్ అయిన హైమొబిలిటీ ఆర్టీలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ఎం142 నుంచి పీఆర్ఎస్ఎంను ప్రయోగించిన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ తన ఖాతాలో షేర్చేశారు. దాడిచేస్తే తప్పించుకోవడం కల్ల.. అమెరికాలోని మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే లాక్హీడ్ మార్టీన్ సంస్థ 2023 డిసెంబర్లో ఈ రకం క్షిపణులను అమెరికా బలగాలను అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో నాశనంచేయడం పీఆర్ఎస్ఎంల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(ఎంఆర్ఎల్ఎస్)తోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు.ముఖ్యంగా ఎంఎల్ఆర్ఎస్ఎం–270, హైమార్స్ఎం–142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంచర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంచర్ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ‘ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్’విధానంలో దీనిని రూపొందించారు. వేర్వేరు ఇతర కంపెనీల లాంచర్ నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు. అత్యంత సురక్షితం.. యుద్ధక్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించకముందే రవాణా సమయంలో పొరపాటున కిందపడినా, అగి్నకి ఆహుతైనా, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్ను క్రియాశీలంచేశాక మాత్రమే భారీస్థాయిలో పేలిపోయి పెనువినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం ఎంజీఎం–140 బాలిస్టిక్ క్షిపణుల స్థానంలో కొత్త పీఆర్ఎస్ఎంలను తీసుకొచ్చారు. ఇవి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు.పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లుకాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్ సమీపంలోని రస్ అల్ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే పీఆర్ఎస్ఎంలతో ఇరాన్పైకి నిరాటంకంగా దాడిచేయాలని అమెరికా భావిస్తోంది.రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్య శ్రేణి అణ్వాస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే పీఆర్ఎస్ఎస్ల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,నేషనల్ డెస్క్ -
యుద్ధ కల్లోలం.. విమానాశ్రయాలపై దాడులు
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికీ పెరుగుతూనే ఉంది. శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కనీవినీ ఎరగని స్థాయిలో దాడులకు దిగాయి. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడ్డాయి. దాంతో విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగానికి చెందిన 16 విమానాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా తదితర గ్రూపుల నుంచి ఆయుధాలు, నిధుల సేకరణకు ఆ విమానాలను ఇరాన్ వినియోగిస్తోందని ఆరోపించింది.విమానాశ్రయ సమీపంలోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్ కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఇస్ఫహాన్లోని అణు కేంద్రంపైనా బాంబుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇరాన్వ్యాప్తంగా 400కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. వారం రోజుల్లో ఇరాన్లో 3,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా వెల్లడించింది. వాటిలో కీలకమైన కమాండ్ సెంటర్లు, సైనిక ప్రధాన కార్యాలయాలు, క్షిపణి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఉన్నట్టు పేర్కొంది.ఇరాన్లో మృతుల సంఖ్య 1,332కు పెరిగినట్టు ఐరాసలో ఆ దేశంలో రాయబారి ఆమిర్ సయీద్ ఇరవనీ తెలిపారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. దుబాయ్ విమానాశ్రయంపై మరోసారి డ్రోన్ దాడి చేసింది. దాంతో రన్వేకు అతి సమీపంలో పలుచోట్ల పొగ భారీగా పైకెగసిన దృశ్యాలు వైరల్గా మారాయి. బాంబు సైరన్లు మోగడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోని ట్రెయిన్ టన్నెళ్లలోకి పరుగులు తీశారు. విమానాశ్రయం నుంచి విమాన సరీ్వసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.దుబాయ్వ్యాప్తంగా పలుచోట్ల భారీ పేలుళ్లు విని్పంచాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోనూ ఓ సైనిక విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ప్రాంత నగరమైన నబిషిట్, పరిసరాల్లో కనీసం 47 మంది వాటికి బలయ్యారని లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 40 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 300 దాటినట్టు వెల్లడించింది. హెజ్బొల్లా దాడుల్లో తమ సైనికులు ఐదుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. ఆ దేశాలపై దాడులు చేయబోం: పెజెష్కియాన్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఎదుర్కొనే క్రమంలో గల్ఫ్ దేశాలపైనా దాడులకు దిగినందుకు వాటికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు తెలిపారు. తమకసలు వాటిపై దండెత్తే ఉద్దేశమే లేదన్నారు. ‘‘ఆ దేశాల నుంచి తమపై దాడులు జరిగితే తప్ప ఇకనుంచి వాటిపై దాడికి దిగబోం. మా నాయకత్వ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసినట్టుగా ఆ దేశానికి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ మతిలేని దాడులను పూర్తిగా నిలిపేసేదాకా వాటిని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూనే ఉంటామని ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ ఇప్పటికే పూర్తిగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.పెజెష్కియాన్ ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. ‘‘పశ్చిమాసియాను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయతి్నంచిన ఇరాన్ ఇప్పుడు తానే అతి పెద్ద ఓటమి పాలైంది. మా దాడుల తీవ్రత వల్లే గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. తద్వారా వాటికి లొంగిపోయింది. ఇరాన్ తోటి గల్ఫ్ దేశాల చేతుల్లో ఓడటం వేల ఏళ్లలో ఇదే తొలిసారి.ఇందుకు పశ్చిమాసియా దేశాలన్నీ నాకు ధన్యవాదాలు తెలిపాయి’’అన్నారు. ఇరాన్పై యుద్ధాన్ని పశ్చిమాసియాకే గాక ప్రపంచమంతటికీ అమెరికా చేసిన గొప్ప మేలుగా ట్రంప్ అభివరి్ణంచడం విశేషం. ఇరాన్కు చెందిన 42 యుద్ధ నౌకలను మూడు రోజుల్లోనే ధ్వంసం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్తో పాటు సమాచర వ్యవస్థలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తాము దాడులు చేయకపోతే ఇరాన్ అతి త్వరలో అణుపాటవం సంతరించుకునేదని తెలిపారు. సైన్యంపై అదుపు తప్పిందా? పెజెష్కియాన్ ప్రకటన తుంగలోకి ఇరాన్ సైన్యంపై ప్రభుత్వానికి పట్టు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగడం గమనార్హం! బాలిస్టిక్ క్షిపణులను నియంత్రించే పారామిలిటరీ విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అధ్యక్షుని ప్రకటనతో నిమిత్తం లేకుండా గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులు నిరి్నరోధంగా కొనసాగాయని చెబుతున్నారు. ఈ గందరగోళానికి తెర పడాలంటే సుప్రీం నేతను ఎన్నిక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాల్సిందేనని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’కు ప్రముఖ మత పెద్ద అయతొల్లా నాసర్ మకరం షిరాజీ విజ్ఞప్తి చేశారు. లెబనాన్లో... ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ దద్దరిల్లింది. నబిషిట్ వద్ద నరమేధానికి తోడు జౌతార్ అల్ షర్కియా, అరబ్ సలీం, జిబ్చిట్ తదితర ప్రాంతాలపైనా క్షిపణి, బాంబు దాడులు కొనసాగాయి. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు కనీసం ఆరుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం...అయినా గల్ఫ్పై దాడులు గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగింది! దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ కూడా దాడులకు గురయ్యాయి. దోహాలోనూ పేలుళ్లు విని్పంచాయి. కనీసం 86 క్షిపణులు, 148 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు బహ్రెయిన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సాగే నౌకలకు భద్రత కలి్పస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎద్దేవా చేసింది.‘అక్కడ అమెరికా సేనలను ఎదుర్కొందుకు మేం వెయిటింగ్’అంటూ అగ్ర రాజ్యాన్ని కవ్వించింది. వాటిని ఎక్కడికక్కడ తొక్కిపారేస్తామని ఇరాన్ సైన్యం కూడా ఒక ప్రకటనలో హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్తో పాటు అబుదాబి, కువైట్ సహా గల్ఫ్వ్యాప్తంగా అమెరికా స్థావరాలపైనా మా నావికా దళం భారీగా లక్షిత దాడులు చేసింది. తద్వారా మా యుద్ధ నౌకను ముంచేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం’’అని ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో కుర్దు వేర్పాటువాదుల స్థావరాలపైనా దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్పైనా ఇరాన్ దాడుల తీవ్రత కొనసాగింది. జెరూసలేం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. టెల్ అవీవ్లో కూడా రోజంతా బాంబుల శబ్దాలు విన్పిస్తూనే ఉన్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ముడిచమురు మంట
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) : పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం.. ఇరాన్ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్లోని అమెరికా రక్షణ స్థావరాలన్నిటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థలాంటి హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించటంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల దాడి ఆరంభించే నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా 92.69 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 13 శాతం పెరగటం గమనార్హం. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్షణం 100 డాలర్లు దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతులపై భారం... భారత్కు అవసరమైన చమురులో 85–88 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది.ఈ ఏడాది తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగటంతో పాటు ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలు పెరిగి ఆయా రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకూ వ్యాపిస్తుంది.దేశీయంగా పలు చర్యలు...ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి భారత్ ఇప్పటికేపలు చర్యలు తీసుకుంటోంది. వ్యూహాత్మకంగా చమురు నిల్వలను పెంచుకోవటంతో పాటు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని విస్తరించటం.... ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవటం వంటివి ఇప్పటికే చేస్తోంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద ఆదేశాలు జారీ చేస్తూ... ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టంచేసింది. మన దగ్గర 6-8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలున్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికితోడు దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్ నిల్వలూ ఉన్నాయని, సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే సరిపడేంత ఆయిల్ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది. ధరలు పెరిగిందిలా...ఫిబ్రవరి 28 71 డాలర్లు మార్చి 7 92.69 డాలర్లు -
ఇండియాలోని ఇజ్రాయెల్లో నిశ్శబ్దం
హిబ్రూ–ప్రభావిత కేఫ్ సంస్కృతి సహా పలు ఇతర లక్షణాల కారణంగా మన దేశంలోని హిమాలయ ప్రాంత గ్రామమైన కసోల్ ను ‘మినీ ఇజ్రాయెల్‘ గా పేర్కొంటారు. ఈ ప్రాంతం తొలిసారి ఈ పర్యాటక సీజలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణాన్ని చవిచూస్తోంది. చాలా కాలంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చే సందర్శకులపై ఆధారపడిన స్థానిక వ్యాపారాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.సుందరమైన పార్వతి లోయలో ఉన్న కసోల్, కల్గా , పుల్గా వంటి సమీప గ్రామాలు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ బ్యాక్ప్యాకర్లకు ఇష్టమైన స్టాప్లుగా నిలుస్తూన్నాయి. చెక్క ఇళ్ళు, ఆపిల్ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఉపకరించేప్రత్యేక పర్యాటక సంస్కృతికి నిలయాలుగా మారాయి.ఇక్కడి చాలా కేఫ్లు ఇజ్రాయెల్ శైలిలో రూపొందిన వంటకాలను అందిస్తాయి అతిథులకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా హోమ్స్టేలు తరచుగా తమ మెనూలను హిబ్రూలో ముద్రిస్తాయి. అయితే, ఈ సంవత్సరం, సందర్శకుల రాక కనిపించక సందడి తగ్గిపోయింది. ‘‘అంతర్జాతీయ బ్యాక్ప్యాకర్లకు బాగా ప్రసిద్ధి చెందిన జిప్సీ హౌస్ కేఫ్ – హోమ్స్టే దగ్గర ఆ తేడా కనిపిస్తోందని సిబ్బంది అంటున్నారు. ‘సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది కానీ డిమాండ్ లో తరుగుదల స్పష్టంగా ఉంది‘ అని ఒక ఉద్యోగి అన్నారు. ‘సాధారణంగా ప్రతి సీజన్ లో మాకు 50 నుంచి 100 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు వస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు అని చెప్పారు.ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అని వీరు అంటున్నారు, యుద్ధం ప్రయాణ సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. అదే ధరమ్కోట్ కసోల్ వంటి బ్యాక్ ప్యాకింగ్ కేంద్రాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోవచ్చునని విదేశీ పర్యాటకులకు కీలక ప్రవేశద్వారాలుగా ఉంటున్న మనాలి, సిమ్లా వంటి టాప్ హిల్ స్టేషన్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చునని అంచాన వేస్తున్నారు. స్థానిక ఆపరేటర్ల ప్రకారం, సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పార్వతి లోయలో ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఫుల్ సీజన్. ‘ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్ బ్యాక్ప్యాకర్లు కసోల్ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు అని ఓ ట్రావెల్ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి, ఈ సంఖ్యలు వందల్లోనే ఉండవచ్చు’’ అన్నారాయన. ఈ మార్పు బుకింగ్ విధానాలలో కూడా కనిపిస్తుందని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు.‘ఇజ్రాయెల్ పర్యాటకులు సాధారణంగా తమ బసలను 20–30 రోజుల ముందుగానే బుక్ చేసుకుని మార్చి నాటికి రావడం ప్రారంభిస్తారు‘ అని విదేశీ సందర్శకులతో పనిచేసే ట్రావెల్ ఏజెంట్ రంజిత్ రాణా అంటున్నారు. ‘‘ఈ సంవత్సరం దాదాపుగా ఏ మాత్రం బుకింగ్లు లేవు. ఫిబ్రవరిలో వచ్చిన వారు కూడా ముందుగానే వెనుదిరిగారు.’’ అని చెప్పారాయన.హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన పర్యాటక డేటా ప్రకారం, కాంగ్రా జిల్లా సిమ్లా జిల్లా తర్వాత పార్వతి లోయను కలిగి ఉన్న కులు జిల్లా విదేశీ పర్యాటకుల రాకపోకలలో రాష్ట్రంలోని మొదటి మూడు జిల్లాల్లో ఒకటి. అందువల్ల అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తేడా వస్తే అది స్థానిక జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్ కనెక్టివిటీ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషించింది. టెల్ అవీవ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ మార్గం తాత్కాలికంగా మూతబడింది. అలాగే చాలా కాలంగా భారతదేశానికి వెళ్లే ఇజ్రాయెల్ ప్రయాణికులకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. టెల్ అవీవ్ నుంచి దుబాయ్కు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి...తో చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్న ట్రంప్.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.ఇరాన్.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్ ఎద్దేవా చేశారు.కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది. -
ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!
-
భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్
-
కొచ్చి పోర్ట్ లో ఇరాన్ యుద్ధనౌక...ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి జైశంకర్ రియాక్షన్
-
క్షమించండి.. కానీ అమెరికాను వదిలి పెట్టం ఇరాన్ సంచలన ప్రకటన
-
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ కు రష్యా నిఘా సహాయం?
-
ఇరాన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన
ఇరాన్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పారు. ఇకపై పక్కదేశాలపై దాడి చేయమన్నారు. "మీరు మా జోలికి రాకుంటే.. మేము మీ జోలికి రామని" తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తి లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అదే విధంగా మీ దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చొద్దని.. అక్కడి నుండి అమెరికా తమపై దాడి చేయకుండా చూసుకోవాలని సూచించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిదాడులతో ఇరాన్ విరుచుకపడింది. ఈ నేపథ్యంలో దుబాయి, కువైట్, బహ్రెయిన్, యుఏఈలతో పాటు ఇతర గల్ఫ్ దేశాలలోని USA స్థావరాలతో ఇరాన్ దాడులు జరిపింది. అక్కడితో ఆగకుండా ఆ దేశంలోని ఆయిల్ రిఫైనరీలు, విమానాశ్రయాలపై మిస్సైల్స్తో విరుచుకపడింది. దీంతో ఇరాన్ తీరుపై గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. -
సౌదీ అరేబియాపై ఇరాన్ బాంబుల వర్షం
-
ఖమేనీ కుమారులు క్షేమం?.. తాజా ఫొటోలు వైరల్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ -
ఇరాన్ లో భూకంపం


