ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరిక
దుబాయ్: ఇరాన్కు చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే ఆయా దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ను నింపేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘీర్ ఖాలీబాఫ్ హెచ్చరించారు.
1971లో యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ను స్థాపించడానికంటే ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్ మూడు ద్వీపాలను తన వశం చేసుకుంది. ఇరాన్ కీలక చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చన్న వార్తల నడుమ బఘీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


