న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది.


