భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం  | Government signs MoU to launch Bharat Container Shipping Line | Sakshi
Sakshi News home page

భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం 

Feb 5 2026 6:29 AM | Updated on Feb 5 2026 7:14 AM

Government signs MoU to launch Bharat Container Shipping Line

ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్‌కు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్‌ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ (బీసీఎస్‌ఎల్‌) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.

 అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే కంటెయినర్‌ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ), వీవో చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ, చెన్నై పోర్ట్‌ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement