ఫాస్టాగ్ FASTag యాన్యువల్ పాస్కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.
నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచుతున్నారని వెల్లడించింది. అధికారిక NHAI ప్లాట్ఫారమ్లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.
వినియోగదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు
ఈ మోసపూరిత పోర్టల్లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్గా నటిస్తూ, నకిలీ పాస్ను "యాక్టివేట్" చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్ కూడా చేస్తారు.ఈ స్కామ్లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.
ఈ మోసం ఎలా జరుగుతుంది?
సెర్చ్ ఇంజన్లలో (Google వంటివి) ప్రకటనల ద్వారా మోసపూరిత లింకులు పైన కనిపించేలా చేస్తారు.
వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన వివరాలు మరియు పేమెంట్ వివరాలను అడుగుతారు.
మీరు చేసే పేమెంట్ నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుంది. చెల్లింపు తర్వాత ఎలాంటి పాస్ రాదు, పైగా మీ బ్యాంక్ వివరాలు కూడా వారి చేతికి చిక్కుతాయి.
సేఫ్టీ టిప్స్
FASTag-సంబంధిత సేవలను ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు రహదారి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఈ సలహాను పంచుకున్నారు.
వినియోగదారులు వెబ్సైట్ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి .ఆన్లైన్లో శోధించేటప్పుడు స్పాన్సర్ చేసిన లింక్లు లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.
మోసగాళ్ళు చట్టబద్ధమైన NHAI చెల్లింపు పేజీలను పోలి ఉండేలా వెబ్సైట్లను సృష్టిస్తారు.
వినియోగదారులు ఈ లింక్లపై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్లు, వాహన సమాచారం , చెల్లింపు ఆధారాలు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు.
చెల్లింపు ఇంటర్ఫేస్ ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనఖాతాలోని సొమ్మును డిజిటల్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ అధికారిక NHAI వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలి.
వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.
కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి OTP లేదా పిన్ అడిగితే చెప్పకండి.
ఒకవేళ మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.
డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అనేది బలమైన రక్షణ అని అధికారులు నొక్కిచెప్పారు, భారతదేశం అంతటా ఆన్లైన్ ఆర్థిక మోసాలు అభివృద్ధి చెందుతున్నందున వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

కాగా 2025 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుండి యాన్యువల్ పాస్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికి తోడు జాతీయ రహదారులపై ప్రయాణించే, ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.


