breaking news
Scam
-
నేను తప్పు చేయలేదు...అంతా నందు భర్తే చేశాడు!
-
అయోధ్య విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్..!
-
లొంగిపోతే మంచిది.. కీలక సాక్ష్యాలను బయటపెడుతున్న మాజీ ఉద్యోగులు
-
మళ్ళీ కలుద్దాం... మీరు ఎప్పుడూ కలవరు.. ఇది గ్యారంటీ కారణం ఇదే
-
నందు మాయం.. ఇక దొరకరు... కనిపించరు..! ఎక్కడికి వెళ్లారంటే
-
కొత్త డ్రామానా..? సంచలన వీడియో రిలీజ్ చేసిన 'నందుస్ వరల్డ్' నందన
-
బయటపడ హెరిటేజ్ ఫుడ్స్ లీలలు బట్టబయలు!
-
కేసు ఏమైంది? లండన్ లో నందూస్ కపుల్ ఎంజాయ్..!
-
కోట్లు కొట్టేసి UKలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు
-
నందు లగ్జరీ లైఫ్ వెనుక డార్క్ సీక్రెట్! ఎవరికీ తెలియని నిజాలు ఇవే
-
అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) విరాళాల కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తులో నిందితులు దొంగలించిన సొత్తును వాష్రూమ్ల్లో దాచి పెట్టిన విషయం కలకలం రేపుతోంది. నిందితుల సమాచారంతో ఈ స్కామ్లో రామ్ మందిర్ ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిందితుడు అవినాష్ మిశ్రాను (శుక్లా) పోలీసులు విచారించినప్పుడు అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కూడా పాల్గొనేవారని సమాచారం.అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. దొంగిలించిన కోట్లాది రూపాయల నగదును గుడి వెలుపలికి తీసుకెళ్లే ముందు తాత్కాలికంగా వాష్రూమ్లలో (మరుగుదొడ్లలో) దాచినట్లు ఒప్పుకున్నాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి చంపత్ రాయ్ అనుచరుడైన టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ ఉద్యోగుల వద్ద ఉండేదని నిందితుడు తెలిపాడు.నిందితులకు ఆలయ ప్రాంగణంలోని సిసిటివి (CCTV) కెమెరాల స్థానాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే నిఘా సిబ్బంది తమ కదలికలను సరిగ్గా గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కెమెరాల కంటికి చిక్కకుండా ఒకరికొకరు కవర్గా నిలబడి డబ్బును దొంగిలించేవారని శుక్లా వివరించాడు. దొంగిలించిన సొమ్ముతో భూములు, ఇళ్లను కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై దృష్టి సారించారు.లెక్కింపు గది తాళాలు - బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు:అరెస్ట్ అయిన నిందితుల్లో 'టిన్నూ యాదవ్' (రామశంకర్ యాదవ్) అత్యంత కీలకమైన వ్యక్తిగా తేలాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ సిబ్బంది వద్ద ఉండేది. కేవలం లోపలి వ్యక్తులే కాకుండా, బ్యాంక్ సిబ్బందితో కూడా కుమ్మక్కై ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన సొమ్ములో టిన్నూ యాదవ్తో పాటు సదరు బ్యాంక్ ఉద్యోగులు కూడా వాటాలు పంచుకున్నట్లు సమాచారం.కాగా విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్లు ఈ అవకతవకలపై ప్రశ్నలు తలెత్తడంతో గత వారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కుంభకోణం వ్యవహారంలో యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT విచారణ ప్రారంభించడానికి ముందే పోలీసులు రూ. 58 లక్షలను రికవరీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
దుబాయ్, బెంగళూరులో ఆస్తులు... షాకింగ్ నిజాలు బయటపెట్టిన నందు స్నేహితులు!
-
దోపిడీతో అడ్డంగా దొరికిపోయారు.. అయ్యో ఇప్పుడెలా
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
మీ తండ్రిని జైలులో పెడితే... పారిపోయింది నువ్వు మిస్టర్ లోకేశ్..!
-
అయోధ్య విరాళాల స్కామ్.. కీలక సభ్యుల రాజీనామా
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అయోధ్య రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చంపత్రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఎనిమిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసులు నమోదు చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం.. రామమందిరానికి భక్తులు సమర్పించిన రూ.200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.ఈ కేసులో మరింత సంచలనంగా మారిన అంశం.. సీసీటీవీ ఫుటేజీ మాయమవడం. అలాగే ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు విశ్వాసంతో సమర్పించిన డబ్బు, కానుకలను అంతర్గతంగా ఉన్నవారే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.ప్రస్తుతం అరెస్టయిన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్లింది? ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ట్రస్ట్లోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య రామమందిరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా సమర్పించిన విరాళాలే అక్రమాలకు గురయ్యాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రస్ట్లో ఇద్దరు కీలక సభ్యుల రాజీనామా, పలువురు అరెస్టులు, భారీ విరాళాల మాయంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.యోగి ఏమన్నారంటే.. అయోధ్య విరాళాల చోరీ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. "అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. అయోధ్యపై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. శ్రీరాముడిని గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది.. చర్యలు కూడా ప్రారంభమయ్యాయి" అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన.. "ఈరోజు ఆరోపణలు చేస్తున్నవారే ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించారు. అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచే వ్యతిరేకించారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన వారిపై లాఠీచార్జీలు, కాల్పులు జరిపారు. రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు, కావడ్ యాత్రను నిషేధించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడమే కాకుండా ముక్కలు చేసింది. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్కు అందించాలి. రామభక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడొద్దు" అని యోగి అన్నారు. -
ఇండియాకు నందుస్ వరల్డ్ కపుల్
-
16 రాష్ట్రాల్లో సీబీఐ భారీ దాడులు : ఇద్దరు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర-VI' (Operation Chakra-VI) పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో సీబీఐ అధికారులుదాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం కోల్కతాలో ఒకర్ని, చెన్నైలో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.సుదీర్ఘ ఆపరేషన్లో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు గురువారం దేశంలోని 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రదేశాలలో సమన్వయంతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. తెలంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టింది. నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, సైబర్ నేరాల సొమ్మును మళ్లించడానికి వీలుగా 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలను' (మరోకరి పేరిట తెరిచే ఖాతాలు) నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై, కోల్కతాలలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులలో భాగస్వామ్యమై, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. -
హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!
ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 'బాస్ స్కామ్' అనే కొత్త రకమైన సైబర్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీల్లో ఉన్న సీఈఓలు, ఉన్నతాధికారుల పేరుతో నటిస్తూ ఆర్థిక లావాదేవీలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.మోసగాళ్లు సాధారణంగా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఏదో నియమం ఉల్లంఘించిందని లేదా తక్షణమే సెక్యూరిటీ అప్డేట్ అవసరమని చెప్పి అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భయపెడతారు.ఇలా నమ్మిస్తూ ఒక జిప్ ఫైల్ పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే కంప్యూటర్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ముఖ్యంగా విండోస్ కంప్యూటర్లను టార్గెట్ చేస్తూ, ఆ సిస్టమ్ను హ్యాక్ చేసి, ఆఫీసు వాట్సాప్ వెబ్ అకౌంట్లను కూడా నియంత్రణలోకి తీసుకుంటారు. దీని ద్వారా నేరగాళ్లు నిజమైన సీఈఓ అకౌంట్లా నటించి ఫైనాన్స్ విభాగానికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు పంపుతారు.కొన్ని సందర్భాల్లో వారు కాంటాక్ట్ లిస్ట్ను కూడా మార్చి, దానిలో ఒక నెంబర్ను సీఈఓ పేరుతో సేవ్ చేస్తారు. దీంతో ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ నిజమైనదే అని ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బును మోసపూరిత ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు.ఫైనాన్స్ విభాగాలు ఈ మోసానికి ఎక్కువగా గురవుతున్నాయని ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. ఎందుకంటే వారు తరచుగా సీనియర్ మేనేజ్మెంట్ ఆదేశాలను నేరుగా పాటిస్తారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంస్థ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ఇలాంటి స్కామ్ నుంచి బయటపడటానికి ముందుగా నిర్దారించుకోవడం మంచిది. ఏదైనా ఎమర్జెన్సీ డబ్బు ట్రాన్స్ఫర్ అభ్యర్థన వచ్చినప్పుడు, అది నిజమా కాదా అని తప్పనిసరిగా ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద ఫైళ్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే అధికారిక సంస్థలు వాట్సాప్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్లు పంపవనే విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.అంతే కాకుండా.. సిస్టమ్లలో సెక్యూరిటీ పాలసీలు అమలు చేయడం, వాట్సాప్లో లాగిన్ అయిన పరికరాలను తరచూ చెక్ చేయడం, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచడం అవసరం. ఈ తరహా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు సూచించింది. -
నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!
-
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. -
ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసిన ఒక విస్తుపోయే మ్యాట్రిమోనియల్ మోసం కలకలం రేపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), అధునాతన ఎడిటింగ్ టూల్స్ సాయంతో నకిలీ పెళ్లికూతుళ్ల ప్రొఫైళ్లను సృష్టించి, పెళ్లికాని యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక కేటుగాళ్ల ముఠాను కాన్పూర్ పోలీసులు రట్టు చేశారు. కేవలం ఫోటోలు, మాయమాటలతో నమ్మిస్తూ, ఒక బాధితుడి నుంచే ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ఈ గ్యాంగ్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న సరికొత్త నేరాలకు అద్దం పడుతోంది.డేటా చోరీ.. మాయమాటల వలపోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి పెళ్లికాని యువకుల వ్యక్తిగత డేటాను సేకరించేది. ఆ తర్వాత తాము నడుపుతున్న కాల్ సెంటర్ల ద్వారా టెలికాలర్లతో మ్యారేజ్ కౌన్సిలర్లుగా ఫోన్లు చేయించేవారు. ‘మీ ప్రొఫైల్కు తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది’ అంటూ మధురమైన గొంతుతో యువకులను నమ్మించేవారు. ఇంటర్నెట్ నుండి సాధారణ మహిళల ఫోటోలను డౌన్లోడ్ చేసి, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అత్యంత ఆకర్షణీయమైన ప్రొఫైళ్లుగా మార్చి బాధితులకు పంపేవారు.విడతల వారీగా దోపిడీఈ గ్యాంగ్ ‘పర్ఫెక్ట్ రిష్తా’, ‘షాదీ మ్యాచ్’, ‘షాదీ మ్యాచ్ ఇండియా’ వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించింది. బాధితులు ఆ అందమైన అమ్మాయిల ఫోటోలను చూసి నిజమేనని నమ్మిన తర్వాత అసలు దోపిడీ మొదలయ్యేది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత ప్రొఫైల్ యాక్టివేషన్ చార్జీలు, సంబంధం ఖాయం చేయడానికి ఫీజు, చివరికి అమ్మాయితో మాట్లాడించడానికి లేదా ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయడానికి అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు గుంజేవారు. ఏడాది కాలంలో ఇలా వేలాది మందిని ముంచినా, ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు.పోలీసుల మెరుపు దాడి.. నిందితుల అరెస్ట్ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ అధికారిణి అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందం మూడు చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ కేసులో రంజిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, లీగల్ సలహాదారుడిగా ఉన్న అమిత్ కుమార్, జాగ్రతి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు, కంప్యూటర్ సిస్టమ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
‘ఈ–స్టాంపు’ల కుంభకోణం దర్యాప్తు పురోగతి ఏంటి?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. పిల్ వివరాలుఅనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళనవారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశంసాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు. -
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
-
Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్..
-
రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్
నీట్ యూజీ (NEET UG-2026 రీ-ఎగ్జామ్కు సమయం సమీపిస్తున్న వేళ, పేపర్ల లీక్పై పలు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫాం టెలిగ్రామ్పై తాత్కాలికంగా నిషేధం విధించినంత మాత్రాన సరిపోతుందా? మిగిలిన యాప్లను ఎలా నియంత్రిస్తారు? అంటూ పరీక్ష వ్యవస్థపై, భద్రతపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి హెచ్చరించారు. నీట్ రీ-ఎగ్జామ్కు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్నఒక వీడియో సందేశంలో, జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ టెలిగ్రామ్ (Telegram) ఛానెళ్లలో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఆయన కోరారు. పరీక్ష ఒత్తిడిలో ఉన్న విద్యార్థులే టార్గెట్గా, అబద్ధపు వాగ్దానాలతో ఈ కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.రూ. 14 వేల నుండి రూ. 10 లక్షల దాకాకొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు లీకైన పేపర్లు ఇస్తామంటూ విద్యార్థుల నుండి రూ. 14వేల రూ. 25వేలవరకు డిమాండ్ చేస్తున్నాయని కామకోటి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు కూడా డిమాండ్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు.టెలిగ్రామ్ ఛానెళ్లలో పేపర్ లీక్ అయినట్లు చూపే స్క్రీన్షాట్లు, వీడియోలు ఎలా సృష్టిస్తారో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వివరించారు. ఛానెల్ అడ్మిన్లు పాత మెసేజ్లను ఎడిట్ చేసి, ఒరిజినల్ డేట్ (పాత తేదీ) మారకుండానే అందులో కొత్త కంటెంట్ను పెట్టగలరు.దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ షేర్ చేసినట్లు తప్పుగా కనిపిస్తుంది.జూన్ 21న పరీక్ష ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ఎడిట్ చేసిన స్క్రీన్షాట్లు, తప్పుడు పోస్టులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఫార్వార్డ్ చేయవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే, వాటిని తిరిగి రాబట్టడం అసాధ్యమని కామకోటి చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులతో అడ్మిట్ కార్డ్లు (Admit Cards), ఫోన్ నంబర్లు లాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయొద్దని స్కామర్లు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?విద్యార్థులు కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్సైట్ , ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి. ఫేక్ మెసేజ్లు, ఫార్వార్డ్ మెసేజ్ల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఇలాంటి సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద మెసేజ్లు కనిపిస్తే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!To every NEET candidate and parent - please watch this. A few minutes that could save you serious money and stress this week.Scammers on Telegram were running two rackets targeting you:1️⃣ Channels demanding ₹14,000 to ₹25,000 - some even ₹10 lakh - claiming they'll send you… pic.twitter.com/aqpickJLAv— National Testing Agency (@NTA_Exams) June 16, 2026 -
నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?
-
మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..
-
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. -
వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు
-
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
-
నందూస్ వరల్డ్ స్కామ్.. ఎక్కడికి పారిపోయినా UK గవర్నమెంట్ వాళ్ళని వదిలిపెట్టదు..
-
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
-
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
-
అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!
-
ఏ క్షణమైనా అరెస్ట్ పరారీలో నందుస్ ఫ్యామిలీ
-
నందూస్ వరల్డ్పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు
-
భర్తది ఏం లేదు... మాస్టర్మెండ్ నందునే?
-
బిగ్ ట్విస్ట్! పరారీలో నందుస్ ఫ్యామిలీ!
-
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్లోడ్లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
ఆఫీసులన్నీ క్లోజ్, నందుస్ భార్యాభర్తలు ఎక్కడ?
-
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
అమ్మ.. రమనందనా.. తప్పించుకుందాం అనుకున్నావా?
-
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికి ఇస్తాం.... సంచలన ఆడియో లైవ్ లో ప్లే చేసి..!
-
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...
-
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
నందు కేసులో కొత్త ట్విస్ట్.. రాజీనామాపై అనేక అనుమానాలు..!
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
రూ.2,400 కోట్ల భారీ స్కాం.. అడ్డంగా బుక్కైన సన్నీ లియోన్
-
నందుస్ వరల్డ్ చీకటి రహస్యాలు
-
కేంద్ర నివేదికతో చంద్రబాబు అవినీతి బట్టబయలు..!
-
నందు ఎంత రాక్షసి అంటే .. ప్రెగ్నెంట్ తో ఉన్నా
-
నందూస్ ఫ్యామిలీ పరార్ ?
-
LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా
ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటాప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
నందు దంపతులకు జైలు శిక్ష? న్యాయవాది సంచలన కామెంట్స్
-
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
-
నందూస్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్.. అసలు నిజం ఇదేనా?
-
నందుతో ఫోన్ లో... షాకింగ్ నిజాలు బయటపెట్టిన జైపాల్ రెడ్డి!
-
నందుస్ భార్యాభర్తలకు UK గవర్నమెంట్ బిగ్ షాక్!
-
వాట్సాప్లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!
లుథియానా: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘వ్యవస్థను మారుద్దాం, ఉద్యమంలో భాగస్వాములుకండి’ అంటూ వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి ఇప్పటికే పలువురు బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని లుథియానా పోలీసులు ఒక అధికారిక వీడియోను విడుదల చేస్తూ, ఈ సైబర్ ఉచ్చులో పడవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.నకిలీ మెంబర్షిప్ ఈ కుట్రలో భాగంగా సైబర్ కేటుగాళ్లు యువతను, సామాజిక మార్పును కోరుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం చేరండి’, ‘అవినీతిపై గళమెత్తండి’ అనే ఆకర్షణీయమైన నినాదాలతో వాట్సాప్, సోషల్ మీడియాలో నకిలీ లింకులను పంపుతున్నారు. ఈ సందేశాలతో పాటు వచ్చే ఫిషింగ్ లింక్ను క్లిక్ చేయగానే, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దొంగిలించడమే కాకుండా మొబైల్లో హానికరమైన మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని ఉత్తరప్రదేశ్ పోలీస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు రాహుల్ మిశ్రా పేర్కొన్నారు.లింక్ నొక్కితే జరిగే నష్టం ఏంటి?సాధారణంగా కేవలం లింక్ను క్లిక్ చేయడంతోనే నేరుగా డబ్బులు కట్ కావు. కానీ, ఆ లింక్ ఓపెన్ చేయగానే వచ్చే నకిలీ వెబ్సైట్లలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు, లేదా యూపీఐ పిన్ నమోదు చేయమని అడుగుతారు. ఆ వివరాలను పూరించిన వెంటనే క్షణాల్లో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయల్లొ ఆసక్తి ఉన్నవారు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయి. ఏదైనా అధికారిక సంస్థ పేరుతో వచ్చే సందేశాల యూఆర్ఎల్, డొమైన్ స్పెల్లింగులను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ నకిలీ లింకులను గుర్తించవచ్చు.పొరపాటున క్లిక్ చేస్తే ఏం చేయాలి?ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేసి, మీ బ్యాంకింగ్ వివరాలను పంచుకుంటే అస్సలు ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్ హెల్ప్లైన్కు కాల్ చేసి డెబిట్/క్రెడిట్ కార్డులను, యూపీఐ సేవలను బ్లాక్ చేయించుకోవాలి. మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను వెంటనే మార్చాలి. ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా తక్షణమే జాతీయ సైబర్ హెల్ప్లైన్ నంబర్ ‘1930’ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలి.ఇది కూడా చదవండి: 50 శాతం మార్జిన్తో ‘బొద్దింక’ వ్యాపారం! -
నందూస్ అక్రమాలపై జైపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
-
ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
నందు భర్త ఆడవాళ్లకు నరకం చూపించాడు! చచ్చిపోతామన్నా పట్టించుకోలేదు
-
నందూస్ వరల్డ్ కపుల్స్.. ఇలా దొరుకుతాం అని అనుకోలేదు..!
-
నందుస్ వరల్డ్ మధుకర్ సంచలన ఆడియో లీక్
-
నందూస్ వరల్డ్ బాధితుడి ఆవేదన..జాబ్ తో పాటు వీసా ఇస్తామని
-
టీటీడీలో తెరపైకి మరో కొత్త వివాదం
-
నమ్మించి మోసం చేశారు..! పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ..
-
ఇప్పుడు మాకు చావే దిక్కు వాళ్ల వల్ల UKలో అడుక్కు తింటూ బతికాం
-
యూట్యూబర్ నందు ఫ్యామిలీకి లుక్ అవుట్ నోటీసులు!
-
మమల్ని ఎలా మోసం చేసారంటే..! నందుస్ వరల్డ్ బాధితులు చెప్పిన సంచలన నిజాలు
-
వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు
-
ఇరుక్కున్న యూట్యూబ్ దంపతులు..!
-
రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు
సాక్షి, ముంబై: భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ (Rajesh Exports) భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆరోపించింది. ఈ మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్ బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్లోకి జారుకుంది.బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్కు చెందినవాల్కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం) తప్పుడు ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.ఎల్ఐసీకీ తప్పని ముప్పురాజేష్ ఎక్స్పోర్ట్స్లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు. పరోక్షంగా సంబంధం ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను కూడా ప్రభావితం చేయనుంది.ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటంమరోవైపు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది. ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్లు, రెడ్ ఫ్లాగ్లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
లోకేష్ గుట్టురట్టు.. పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు.. మెగా DSCలో లీకులు
-
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
-
Viral Video: మేం ఏ తప్పు చెయ్యలేదు.. కావాలనే ఆ ముగ్గురు చేస్తున్నారు
-
వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు
-
వైద్య పరికరాల కొను‘గోల్మాల్’!
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోళ్లు భారీ స్కామ్లా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేసి నాణ్యమైన అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లే లక్ష్యంగా భారీ అవినీతికి తెర తీసినట్లు విమర్శలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ) వైద్య శాఖ ఉన్నతాధికారి.. కీలక నేతలు.. ఇలా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ గొలుసు కట్టుగా ఈ కమీషన్ల దందా సాగుతోంది. దీంతో ముడుపుల భారాన్ని కూడా పరికరాల ధరలో కలిపేసి కాంట్రాక్టర్లు రెట్టింపు రేట్లు కోట్ చేస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. కమీషన్లు ఇవ్వండి.. ధర మీ ఇష్టం..! చంద్రబాబు సర్కారు వచ్చాక ప్రభుత్వాస్పత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఎంఎస్ఐడీసీ అవినీతికి అడ్డాగా మారిపోయింది. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్ట్ ఖరారు మొదలు పర్చేజ్ ఆర్డర్ (పీవో), బిల్లులు మంజూరు దాకా ప్రతి స్థాయిలో ముడుపుల తంతు సాగుతోంది. ముఖ్యంగా పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ఐడీసీ ఎక్యుప్మెంట్ విభాగానికి చెందిన కీలక అధికారి కమీషన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు. కొత్త కాంట్రాక్ట్లు, పీవోల జారీకి ఆయన స్థాయిలో మూడు శాతం కమీషన్ గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇక బిడ్ల పరిశీలన, డెమోలలో లబ్ధి చేకూర్చే ఒప్పందం, బిల్లులు ప్రాసెసింగ్.. ఇలా వివిధ స్థాయిల్లో రెండు శాతం మేర దండుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇలా ఎంఎస్ఐడీసీ స్థాయిలో ఐదు శాతం మేర కమీషన్లు వసూలు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంట్రాక్ట్ దక్కాలన్నా, పీవో రావాలన్నా సర్కార్లో కీలక నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని కమీషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న అధికారి తేల్చి చెబుతున్నారు. అలా కీలక నేతలు కనిష్టంగా 5 శాతం నుంచి 10 శాతానికిపైగా దోచుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. కమీషన్లు దండుకోవడంలో ఆరోగ్య శాఖలోని ఓ అత్యున్నత అధికారి రాజకీయ నేతలతో పోటీపడుతున్నారు. ఆయన కూడా 5 శాతం నుంచి 10 శాతం మేర రాబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాదికి చెందిన సదరు అత్యున్నత అధికారి అక్కడి డిస్ట్రిబ్యూటర్ సంస్థలతో పెద్ద మొత్తంలో వాటాలు మాట్లాడుకుని పారదర్శకంగా జరగాల్సిన టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎంఎస్ఐడీసీ మొదలుకుని ప్రభుత్వంలోని నేతల వరకూ 15 నుంచి 25 శాతం మేర కమీషన్లు డిమాండ్ చేస్తుండటంతో కంపెనీలు వాటిలాభాలు కూడా వేసుకుని వైద్య పరికరాల ధరలను చుక్కలను తాకిస్తున్నాయి. అయినా సరే.. తాము అడిగినంత కమీషన్ చెల్లిస్తే ఎంత ధర కోట్ చేసినా ఫర్వాలేదనే రీతిలో లోపాయికారీ ఒప్పందాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అటు అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దల అండదండలతో కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రంలో విక్రయిస్తున్న వైద్య పరికరాల ధరల కంటే రెండు మూడు రెట్లు అధికంగా కోట్ చేస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవిగో..! ధరలో ‘ఎక్స్ట్రా’క్టర్ తెలంగాణాలో రూ.1.04 లక్షలతో ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ పరికరాన్ని మన దగ్గర రూ.3.13 లక్షల చొప్పున సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏకంగా రూ.2 లక్షలకు పైగా అధికంగా చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో ‘సాక్షి’లో కథనం రావడంతో సెకండరీ హెల్త్లో దాదాపు 230 పరికరాల కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే పెద్ద మొత్తంలో కమీషన్ల డీల్ కుదరడంతో ఎలాగైనా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రూ.3.13 లక్షల ధరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంఎస్ఐడీసీ జస్టిఫికేషన్ తీసుకుంది. అదే ధర ఆధారంగా పరికరాల కొనుగోలుకు ఇండెంట్లు పంపాలని డీఎంఈ, డీఎస్హెచ్, డీహెచ్లకు లేఖ రాసింది. ఈఎన్టీ సిమ్యులేటర్.. దబిడి ది‘బిడ్’! బోధనాస్పత్రుల్లో పెద్దగా అవసరం లేని ఈఎన్టీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలు పేరిట స్కామ్కు తెర తీశారు. ఒకే రకం కంపెనీ పరికరాలను సరఫరా చేస్తామని రెండు సంస్థలు బిడ్లు వేస్తే సింగిల్ బిడ్గా పరిగణించి తిరస్కరించకుండా ఆమోదించారు. బహిరంగ మార్కెట్లో రూ.కోటి నుంచి రూ.3 కోట్లు పలికే ఒక్కో పరికరాన్ని ఏకంగా రూ.4.44 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి నేరుగా ఓ ఉత్తరాది కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. హిస్టోస్కోపి.. మా‘యేఐ’నా..! గైనిక్ విభాగాలకు సంబంధించి హిస్టోస్కోపి పరికరాల కొనుగోలుకు గత నెలలో ఆర్సీ ఖరారు చేశారు. ఈ పరికరాన్ని గత ప్రభుత్వంలో రూ.46 లక్షలతో సరఫరా చేసేలా బిడ్లు రాగా ఇప్పుడదే కంపెనీకి చెందిన పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట ఏకంగా రూ.69.45 లక్షలకు ఆర్సీ ఖరారు చేశారు. ఎక్స్రే.. బాప్రే 800 ఎంఏ డిజిటల్ ఎక్స్రే పరికరాన్ని రూ.1.23 కోట్లతో కొనుగోలుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఖరారు చేశారు. తమిళనాడులో రూ.69 లక్షలతో కొనుగోలు చేసిన ఇదే పరికరాన్ని ఇక్కడ ఏకంగా రూ.50 లక్షలకుపైగా అధిక ధరతో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఎంత మెరుగైన పరికరం కొన్నప్పటికి రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాటదని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇండెంటే లేకుండా ఆస్పత్రులకు పరికరాలు! సాధారణంగా వైద్య పరికరాల కొనుగోలుకు ఆస్పత్రుల నుంచి ఆయా విభాగాధిపతుల కార్యాలయాలకు ఇండెంట్ రావాలి. ఆస్పత్రి సూపరింటెండెంట్లు/సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, చికిత్సల అవసరాల నివేదికను సేకరించాలి. అయితే ఈ ప్రక్రియను పక్కనపెట్టి నేరుగా డీఎంఈ కార్యాలయం నుంచి ఇండెంట్ పంపి గతేడాది ‘పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ 3 ఇన్ 1 ప్రోబ్’ పరికరాల కొనుగోళ్లను చేపట్టారు. ఏకంగా 78 పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ పరికరాలను బోధనాస్పత్రులకు డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పరికరానికి రూ.11.33 లక్షల చొప్పున దాదాపు రూ.9 కోట్లు ఇందుకు వెచ్చించారు. కీలక నేతతో కాంట్రాక్ట్ సంస్థ డీల్ కుదుర్చుకోవడంతో అవసరం లేని పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. 17 బోధనాస్పత్రులకు 78 పరికరాలు సమకూర్చాలని గతేడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నుంచి ఎంఎస్ఐడీసీకి ప్రతిపాదన వెళ్లింది. ఒక్కో ఆస్పత్రికి రెండు నుంచి ఆరు పరికరాల చొప్పున అవసరముందని అందులో పేర్కొన్నారు. కాంట్రాక్టు సంస్థ ఈ ఏడాది ప్రారంభం నుంచి పరికరాల సరఫరా చేపట్టింది. అసలు ఇండెంటే పెట్టకుండా ఈ పరికరాలు ఆస్పత్రులకు చేరుతుండడంతో ఖంగుతిన్న వైద్యులు అవి తమకెందుకని, వాటి అవసరమేలేదంటూ ఏకంగా డీఎంఈకి రాసిన లేఖల్లో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసం వాడే ఈ పాయింట్ ఆఫ్ కేర్ పరికరాలు తమకెందుకని వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, విజయనగరం తదితర ఆస్పత్రుల్లో ఈ పరికరాల అవసరమేలేదని.. వెనక్కు తీసుకెళ్లిపోవాలని కాంట్రాక్టర్కు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొన్నిచోట్ల వీటిని తీసుకుని స్టోర్స్, వార్డుల్లో మూలనపడేశారు. నిజానికి బోధనాస్పత్రులలో ఇప్పటికే అధునాతన అ్రల్టాసౌండ్, రేడియాలజీ స్కానింగ్ యంత్రాలున్నాయని వైద్య వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కమీషన్ల కోసం ఆస్పత్రులకు అవసరం లేని పరికరాలను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ చేస్తున్నారని చర్చించుకుంటున్నాయి.ట్రెడ్మిల్ రూ.11లక్షలు!మార్కెట్లో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు పలికే ట్రెడ్మిల్ను ఏకంగా రూ.11 లక్షల చొప్పున బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసేలా రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారు చేశారు. ఈ ధర చూసి అవాక్కైన డీఎంఈ అధికారులు కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం.అక్రమాల అ‘క్షయ’పాత్రటీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్రే పరికరాల కొనుగోలుకు ఇటీవల టెండర్ ఖరారు చేశారు. ఒక్కో పరికరాన్ని రూ.21.84 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పోర్టబుల్ ఎక్స్రే పరికరాలను కేంద్ర ఆరోగ్య శాఖ టీబీ కార్యక్రమంలో భాగంగానే రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలకే పలు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి కూడా 40 వరకూ పరికరాలు ఇప్పటికే అందాయి. బ్లూటూత్ కనెక్షన్తో కూడిన పోర్టబుల్ ఎక్స్రే, ల్యాప్ట్యాప్, ఇతర పరికరాలు కేంద్రం సరఫరా చేసిన ఎక్యుప్మెంట్లో ఉన్నాయి. ఎక్స్రే తీస్తే రిపోర్ట్ ల్యాప్ట్యాప్లో జనరేట్ అయ్యే సౌకర్యం ఉంది. ఐతే ఇదే తరహా పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట దాదాపు రూ.22 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఇది కేంద్రం సరఫరా చేసిన పరికరాల ధరలతో పోలిస్తే రూ.7 లక్షల మేర అధికం. రాష్ట్ర ప్రభుత్వం 100 పరికరాలను ప్రస్తుతం కొనుగోలు చేయబోతోంది. ఈ లెక్కన ఒక్కో పరికరానికి రూ.7 లక్షల చొప్పున రూ.7 కోట్ల మేర అదనంగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో టెండర్ పిలవగా కేవలం రెండు సంస్థల బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. నామమాత్రపు పోటీ ఉన్నప్పటికీ తొలి పిలుపులోనే కాంట్రాక్ట్ ఖరారు చేశారు. మరోవైపు వెంటిలేటర్లు, అనస్తీషియా వర్క్స్టేషన్స్, ఇతర వైద్య పరికరాల కొరత ఆస్పత్రులను తీవ్రంగా వేధిస్తోంది. రోగులకు ఊపిరి పోయాల్సిన ఈ పరికరాల కొనుగోళ్లను మాత్రం ఏడాదిగా సాగదీస్తున్నారు. వివిధ టెండర్లలో రెండు మూడు బిడ్లు అర్హత సాధించినా పోటీ లేదని తిరస్కరిస్తున్నారు. దీన్నిబట్టి రేటు కుదిరితే ఒకలా లేదంటే మరోలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మో.. మామోగ్రఫీ.. డీఎంఈ పరిధిలోని ఆరు బోధనాస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున మామోగ్రఫీ పరికరాల కొనుగోలుకు గత మార్చిలో కాంట్రాక్టు ఖరారు చేశారు. అల్లెంజర్స్ కంపెనీకి చెందిన ‘మామ్ వీనస్+’ మామోగ్రామ్ కొనుగోలు, ఇన్స్టలేషన్కు రూ.1.71 కోట్ల చొప్పున ధర ఖరారు చేశారు. ఇదే మోడల్ పరికరాన్ని నేరుగా తయారీ సంస్థ నుంచి తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ రూ.83.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇన్స్టలేషన్కు రూ.12.82 లక్షలు ఇచ్చింది. అంటే ఒక్కో పరికరానికి సుమారు రూ.96 లక్షలు వెచ్చించారు. ఇదే పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.1.71 కోట్లకు అంటే ఒక్కో పరికరంపై ఏకంగా రూ.75 లక్షలు అధిక ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే ఆరు పరికరాలకు రూ.4.50 కోట్ల మేర అధికంగా ప్రజాధనాన్ని వెచ్చించారు. ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అత్యధిక ధరకు మామోగ్రఫీ పరికరాల కొనుగోలులో భారీ అవినీతికి తెర తీశారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సదరు సంస్థకు ఎంఎస్ఐడీసీ దాసోహం అవుతోందన్న ఆరోపణలున్నాయి. -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
జాబ్ పేరుతో పేదల నుంచి లక్షలు వసూలు చేసి.. ఆడియో వైరల్..
-
DSCలో దగా.. లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయండి
-
YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!
-
DSC పేపర్ అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ కు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చింది?
-
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
-
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
బయటపడ్డ DSC స్కామ్! లోకేష్ వెన్నులో వణుకు
-
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
-
అసలు ఏలా స్కామ్ చేశారంటే? సంచలన నిజాలు బయటపెట్టిన DSC అభ్యర్థి
-
స్కాం ఎలా చేశారంటే..? కోట్లల్లో డీల్.. బయటపడ్డ లోకేష్ DSC స్కాం
-
మెగా DSCపై చంద్రబాబు వీడియో అంబటి నెక్స్ట్ లెవెల్ ర్యాగింగ్
-
IPL వెలుగులో బెట్టింగ్ ‘చీకటి ఆట’!
ఐపీఎల్ (IPL) సీజన్ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్ఫారమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్సైట్లు, మనీ లాండరింగ్ నెట్వర్క్ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లను గుర్తించిన క్లౌడ్సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్సైట్ డొమైన్లు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ గుర్తించింది.ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్ఫారమ్ అడ్మిన్ ప్యానెల్ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్డ్రా రిక్వెస్ట్లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.రూ. 4.65 కోట్ల విత్డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్ఫారమ్లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్డ్రా రిక్వెస్ట్లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.మనీ మ్యూల్ నెట్వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.క్రికెటర్ల పేరిట డీప్ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్లను ఏఐ (AI) డీప్ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కలెక్టర్ కి చెప్పండి.. టీడీపీ మట్టి దందాను బట్టబయలు చేసిన YSRCP
-
అమెరికా కొలువుల స్కామ్.. భారత్లో మూలాలు?
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) భారీ షాక్ ఇచ్చింది. ఎఫ్-1 (ఎఫ్-1) వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కింద ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 10,000 మంది విద్యార్థులు నకిలీ కంపెనీల ఉచ్చులో ఉన్నట్లు దర్యాప్తులో తేలడం తీవ్ర సంచలనంగా మారింది.ఓపీటీ అక్రమాల పుట్టఐసీఈ డైరెక్టర్ టాడ్ ఎమ్ లియోన్స్ ఈ భారీ స్కామ్ వివరాలను వెల్లడిస్తూ, ఓపీటీ ప్రోగ్రామ్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుష్, ఒబామా హయాంలో కొద్ది మంది కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)ఆధ్వర్యంలో మొదలైన ఈ పథకం.. నేడు లక్షలాది మంది వలస కార్మికులకు అక్రమ దారిగా మారిపోయిందన్నారు. ట్రంప్, బైడెన్ పాలకుల సమయంలో ఈ నకిలీ ఉద్యోగాల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, అస్సలు ఉనికిలోనే లేని కంపెనీల్లో వేలాది విద్యార్థులు పనిచేస్తున్నట్లు కల్పిత ఆధారాలు సృష్టించారని ఆయన తెలిపారు. కేవలం టాప్ 25 ఓపీటీ యాజమాన్యాలను పరిశీలించగా, 10 వేల మంది విద్యార్థులు అనుమానాస్పద కంపెనీల్లో ఉన్నట్లు బయటపడిందని, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని లియోన్స్ అన్నారు. Another great win for our fraud task force. We will not tolerate foreign nationals abusing our visa system at the expense of the American people. https://t.co/smFBgxha3w— JD Vance (@JDVance) May 12, 2026తాళం వేసిన ఆఫీసులు.. గుట్టు రట్టుదర్యాప్తు అధికారులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వందలాది మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారని చెబుతున్న కంపెనీల చిరునామాలకు వెళ్లి చూడగా, అక్కడ కేవలం ఖాళీ భవనాలు, తాళం వేసిన తలుపులు మాత్రమే కనిపించాయి. ఒకే అడ్రస్పై పలు కంపెనీలు రిజిస్టర్ కావడం, ఏ ఒక్కరికీ లీజు అగ్రిమెంట్లు లేకపోవడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా అనుమానాస్పద నగదు లావాదేవీలు జరగడం మొదలైనవి అధికారులను విస్మయానికి గురిచేశాయి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) బృందం టెక్సాస్లో ఇటీవల 18 ఓపీటీ వర్క్సైట్లపై దాడులు చేయగా, ఈ నకిలీ కంపెనీల వెనుక ఉన్న భారీ కుట్ర బట్టబయలైంది. MASSIVE #OPT FRAUD We have identified over 10,000+ foreign students identified with fake jobs. We’re taking it this very seriously. Full video of the @ICEgov director speaking.#F1 #studentvisa pic.twitter.com/8MNysI1apO— M9 USA🇺🇸 (@M9USA_) May 12, 2026తీగ లాగితే ఇండియా డొంకటెక్సాస్ దాడుల్లో బయటపడిన విషయాలు ఈ స్కామ్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక వర్క్సైట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీటీ విద్యార్థులు ఉన్నారని యాజమాన్యం చెప్పగా, రికార్డుల్లో మాత్రం ఏకంగా 500 మంది ఉన్నట్లు తేలింది. అధికారుల ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని అక్కడి సిబ్బంది.. ఇండియాలో ఉన్న తమ హెచ్ఆర్ (హెచ్ఆర్) ప్రతినిధులను అడగాలంటూ దాటవేశారు. ఈ నెట్వర్క్ అంతా వెబ్సైట్లలో ఒకే విధమైన జాబ్ పోస్టింగులు ఇస్తూ, ముఠాగా ఏర్పడి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయింది.ఇది కూడా చదవండి: నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’ -
మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సంజీవ్ అరోరా చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన విషయంలో వచ్చిన ఆరోపణలపై తాజాగా జరిగిన దర్యాప్తులో ఏకంగా రూ. 157 కోట్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాల కుంభకోణం వెలుగుచూడటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న మనీలాండరింగ్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.అక్రమ లావాదేవీల గుట్టు రట్టుమే 9వ తేదీన చండీగఢ్లోని ఆయన అధికారిక నివాసంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు సంజీవ్ అరోరాను అరెస్టు చేశారు. అనంతరం గురుగ్రామ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. తాజా దర్యాప్తు ప్రకారం నకిలీ మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై ఏజెన్సీలు దృష్టి సారించాయి. షెల్ కంపెనీల (నకిలీ సంస్థల) ద్వారా, బ్యాంకు ఖాతాలను పదేపదే మార్చుతూ, నిధులను ఎలా మళ్లించారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.కూలీ ఖాతాలోకి కోట్ల రూపాయలుఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ కీలక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది. అరోరాతో సంబంధం ఉన్న హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ (హెచ్ఎస్ఆర్ఎల్) అనే సంస్థ 2023 ఆగస్టు నుండి 2024 జనవరి మధ్యకాలంలో ‘ఎస్కె ఎంటర్ప్రైజెస్’కు 41 ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 27.73 కోట్లను బదిలీ చేసినట్లు వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎస్కె ఎంటర్ప్రైజెస్ ఒక దినసరి కూలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. ఎలాంటి వాస్తవిక వాణిజ్య కార్యకలాపాలు లేని ఈ డమ్మీ ఖాతాల ద్వారా, అసలు డబ్బు మూలాలు దాచివుంచుతూ నిధులను దశలవారీగా మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.పంజాబ్ కేబినెట్లో కీలక మార్పులుసంజీవ్ అరోరా అరెస్టు నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు బదలాయిస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖను అమన్ అరోరాకు, స్థానిక సంస్థల శాఖను హర్జోత్ బైన్స్కు, విద్యుత్ శాఖను తరుణ్ప్రీత్ సోండ్కు అప్పగించింది. ఈ మార్పులను గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సోమవారం సాయంత్రం ఆమోదించారు. కాగా అరోరాను ప్రస్తుతానికి శాఖలు లేని మంత్రిగా కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తుండగా.. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు? -
కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?
తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్కు రాలేదని తెలిపారు. -
పంజాబ్ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ
గురుగ్రామ్: పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను గురుగ్రామ్లోని ప్రత్యేక కోర్టు ఆదివారం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. రూ.100 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో శనివారం ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ (హెచ్ఎస్ ఆర్ఎల్) కంపెనీకి సంబంధించిన సంస్థలపై పూర్తి యజమానిగా, నియంత్రణాధికారిగా అరోరా వ్యవహరిస్తున్నారని ఈడీ పేర్కొంది. అవకతవకల వ్యవహారంలో అరోరా పాత్ర కీలకంగా ఉందని పేర్కొంది. నేరారోపణల్లో ఈయనతోపాటు, సహాయకుల ప్రమేయం ఎంతో తేల్చేందుకు ఈడీ కస్టడీ కోరడం సబబేనని జడ్జి తన ఉత్తర్వులో అభిప్రాయపడ్డారు. -
జాబ్ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ రూపొందించిన జాబ్ సెర్చ్ సేఫ్టీ పల్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది. ఈ నేపథ్యంలో జాబ్ ప్లాట్ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్ఇన్ ఇండియా హెడ్ (లీగల్, పబ్లిక్ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్ జెడ్ ప్రొఫెషనల్స్లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్ ఎక్స్లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది. → ఉద్యోగం కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి. → చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. -
మాములోడు కాదు..! ఈ స్కామ్ లో వాడి తల్లి కూడా ఉంది
-
నిరూపిస్తే శిక్షకు సిద్ధం.. డాగ్ బ్లడ్ కేసులో డాక్టర్ సవాల్
-
ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ స్కామ్!
సాక్షి,ఢిల్లీ: ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్ను రిటైల్ అవుట్లెట్స్ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ఆదేశాల వెనుక వందల కోట్ల స్కాం ఉన్నట్లు బయటపడింది. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.50. రిటైల్ బంకుల్లో ధర రూ.98 కాగా, బల్క్లో రూ.153. రిటైల్ బంకుల నుంచి డీజిల్ను రవాణా చేయాలని ప్రభుత్వం సూచించడం ద్వారా ప్రతి లీటర్పై రూ.50 లాభం వచ్చేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ లాభాల్లో వాటాలు పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు ఈ కుట్ర బహిర్గతమైంది -
నీ డప్పు ఆపు... ప్రజల కష్టాల వైపు కొంచెం చూడు...
-
కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్
సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
అంతా అమరావతిలో ఖర్చు చేస్తే.. మా పరిస్థితి ఏంటి.. బాబుపై తిరగబడ్డ రాయలసీమ ప్రజలు
-
మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?
-
ఉమ్మడి కరీంనగర్.. వెలుగులోకి రూ.800కోట్ల కుంభకోణం
సాక్షి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్ మర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.800 కోట్లకు టోకరా వేసింది.మల్టినెట్ వర్కింగ్ సంస్థ యూనిక్ ఎస్ఎంసీఎస్ పేరుతో భారీ ఎత్తున జిల్లా వాసుల నుంచి డిపాజిట్లు, ప్రీమియం వసూళ్లు చేపట్టింది. పెట్టిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని ఆశ చూపించింది. అధిక లాభాలకు ఆశపడిన పెట్టుబడి దారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. భారీ ఎత్తున వసూళ్ల అనంతరం బోర్డు తీప్పేసింది. సంస్థకు తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
అమ్మకానికి అమరావతి!
-
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
10 కోట్లు స్కామ్.. పంజాగుట్టలో సింగర్ మంగ్లీపై కేసు
-
360 లక్షల కోట్లు..! వాటే విజన్
-
హైదరాబాద్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల నుంచి రూ. 5 కోట్లు మేర వసూలు చేసింది ఓ గ్యాంగ్, అయితే ఎంతకీ ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వారిని నిలదీశారు బాధితులు. ఈ విషయాన్ని నాన్చడంతో అనుమానం వచ్చిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 452 మంది బాధితులు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. -
లక్ష పెట్టు కోటి పట్టు.. నూజివీడులో భారీ మోసం
-
రూ. 300 కోట్ల స్కామ్.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ని బట్టబయిలు చేశారు. సూమారు రూ. 300 కోట్ల విలువైన భారీ అంతర్జాతీయ ప్రాడ్ని గుర్తించి ఈ కేసుకు సంబంధించిన 11 మంది నేరస్థులను అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి, పెట్టుబడి పథకం పేరుతో తనను రూ. 31.45 లక్షలు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక నకిలీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని నమ్మించి, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని పెట్టుబడులు పెట్టిన తర్వాత క్యాష్ విత్డ్రా కోసం ప్రయత్నిస్తే ఆ యాప్ పనిచేయడం ఆగిపోయిందన్నారు.అయితే ఈకేసు విషయమై విచారణ చేపట్టగా ఈ ముఠాకు కంబోడియా వంటి దేశాల్లోని అంతర్జాతీయ సైబర్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితులు 100కు పైగా నకిలీ కంపెనీల పేరుతో 260కి పైగా బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై ఇప్పటివరకు 2,567 ఫిర్యాదులు నమోదయినట్లు పేర్కొన్నారు..అయితే ఈ ముఠాకు సంబంధించిన కీలక వ్యక్తి కరణ్ కజారియా. ఇతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా, ఏప్రిల్ 3న కోల్కతా విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇతను విదేశీ ఆపరేటర్లకు, భారతీయ ఏజెంట్లకు మధ్య వారధిగా ఉంటూ, దోచుకున్న సొమ్మును క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశాలకు తరలించేవాడని తెలిపారు.అరెస్టు సమయంలో నిందితుల వద్దనుంచి 48 మొబైల్ ఫోన్లు,అనేక ఏటీఎం కార్డులు, చెక్కు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రూ. 19 లక్షల నగదును బ్యాంక్ ఖాతాల్లో స్తంభింపజేసినట్లు పేర్కొన్నారు. -
బాబు మన కోసం మళ్లీ పుట్టి.. రాజధానిని పూర్తి చేస్తాడు
-
ఎ‘వరెస్ట్’ స్కామ్: టూరిస్టులకు ‘విషం’ ఇచ్చి..
ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్రమైన వంచనకు గురవుతున్నారు. కొందరు గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి, పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పర్యాటకులకు తెలియకుండా వారి ఆహారంలో విషం కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 167 కోట్లు) ఇన్సూరెన్స్ స్కామ్కు పాల్పడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే...నేపాల్లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ఉద్దేశపూర్వకంగా ‘బేకింగ్ సోడా’ కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల పర్యాటకులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇది చూసి పర్యాటకులు తమకు ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ (ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యం) వచ్చిందని భ్రమపడతారు. వెంటనే గైడ్లు వారిని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించాలని ఒత్తిడి చేస్తారు.వందల కోట్ల దోపిడీ ఇలా..ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. పర్యాటకులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. నేపాల్ టూరిజం రంగంలో ఇలాంటి స్కామ్లు పెరిగిపోతుండటంతో, ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం నిలిపివేశాయి. ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి -
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
-
ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు
ఇప్పటివరకు బ్యాంకుల స్కాం గురించి విన్నాం. భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాదారులు మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ గోల్డ్ లోన్(Gold Loan) పేరుతో స్వయంగా ఖాతాదారులే మోసానికి పాల్పడటం గురించి విన్నారా? మహరాష్ట్ర నాగ్పూర్లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్లో ఈ మెగా గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఖాతాదారులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు రూ. రూ. 23 కోట్ల విలువైన బంగారు రుణాల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్లోని తమ తొమ్మిది శాఖలలో స్కాం జరిగిందని ICICI బ్యాంక్ అధికారులు అంతర్గత తనిఖీలో గుర్తించారు. 'గోల్డ్ లోన్' పోర్ట్ఫోలియోపై నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఇది బయటపడింది. తొమ్మిది వేర్వేరు శాఖల్లో తాకట్టు పెట్టిన ఆభరణాలను పరిశీలించగా, అవి అసలు బంగారం కాదని, నకిలీ అని తేలింది.మొత్తం 195 మంది ఖాతాదారులు ఈ నకిలీ బంగారాన్ని చూపి రుణాలు పొందారు.ICICI బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఉద్యోగి అయిన ధనంజయ్ రమేష్ థైటే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ధంతోలి పోలీసులు మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసపూరిత పథకం జనవరి 2023 నుండి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?బ్యాంక్ అధికారుల ప్రమేయం?సాధారణంగా గోల్డ్ లోన్ ఇచ్చే ముందు బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి 'వాల్యూయర్స్' (Valuers) ఉంటారు. వారి అనుమతి లేదా క్లియరెన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు కావడం అసాధ్యం. కాబట్టిఈ కుట్రలో బ్యాంక్ ఉద్యోగులు లేదా అధికారులు కూడా భాగస్వాములై ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వాల్యూయర్స్ కావాలనే నకిలీ బంగారాన్ని అసలుదిగా ధృవీకరించారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు వచ్చాయని మెసేజ్ మీకు వచ్చిందా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ లింక్ను క్లిక్ చేసే ముందు ఇది తప్పక చదవండి. లేదంటే మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. భారత తపాలా శాఖ (India Post) పేరుతో ప్రస్తుతం ఒక నకిలీ లక్కీ డ్రా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 170 ఏళ్ల వేడుకల సందర్భంగా ఉచిత బహుమతులు అందిస్తున్నామంటూ యూజర్లను ఈ స్కామ్ ఊరిస్తోంది. బహుమతులు గెలుచుకోవాలంటే కొన్ని వివరాలు నమోదు చేయాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.ప్రభుత్వం ఏమంటోంది?దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇప్పటికే స్పందించింది. ఇదంతా ఒక పెద్ద మోసమని, ఇండియా పోస్ట్ ఇలాంటి లక్కీ డ్రాలు గానీ, బహుమతుల పంపిణీ గానీ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో సంబంధిత అధికారులు.. ‘ఇండియా పోస్ట్ పేరుతో జరుగుతున్న ఈ లక్కీ డ్రా నకిలీది. ఇలాంటి అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోకండి’ అని హెచ్చరించారు. A #fake lucky draw is luring people into providing their personal information by offering free gifts in the name of @IndiaPostOffice#PIBFactCheck⚠️It is a #Scam & is not related to India Post✔️Be cautious! Refrain from clicking on such suspicious links pic.twitter.com/mcmwbx4d22— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2026సురక్షితంగా ఉండటం ఎలా?సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు..అధికారిక సమాచారం: ఏదైనా ఆఫర్ లేదా ప్రమోషన్ గురించి తెలుసుకోవాలంటే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ లేదా వారి వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే నమ్మండి.అజ్ఞాత లింక్లు వద్దు: వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింక్లపై క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఉచిత బహుమతులు అని చెప్పే వాటికి దూరంగా ఉండండి.వ్యక్తిగత డేటా: ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను ఎవరికీ తెలియజేయకండి.యాప్ల పట్ల జాగ్రత్త: గుర్తుతెలియని లింక్ల ద్వారా వచ్చే యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి.సందేహం ఉంటే: ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవడానికి నేరుగా తపాలా శాఖ కస్టమర్ కేర్ను సంప్రదించండి. డిజిటల్ యుగంలో ఆశ చూపి, మోసం చేసే నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అప్రమత్తంగా ఉండటమే ఇందుకు ఏకైక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కువైట్: క్షిపణి దాడిలో భారత కార్మికుడు మృతి -
రేవంత్ పాలనలో 19 ప్రధాన స్కామ్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల మూడు నెలల పాలనలో 19 ప్రధాన కుంభకోణాలు జరిగాయని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా హౌజ్ కమిటీ వేసి విచారణ జరపాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్కు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అక్రమ మైనింగ్పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖను అందజేశారు. తాము ఇచ్చిన లేఖను సీఎం రేవంత్రెడ్డికి పంపాలని కోరారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయింది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దురి్వనియోగం యథేచ్ఛగా సాగుతోంది. వాటిని అడ్డుకోవాల్సిన వారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రులకు ఈ కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఈ కుంభకోణాల ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతోంది. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. అడ్డుకోవడం సీఎంగా మీ బాధ్యత ‘అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జ రుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచా రణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.పౌర సరఫరాలు, అమృత్ టెండర్లు, కేఎల్ఎస్ఆర్, నైనీ కోల్ బ్లాక్, సింగరేణి స్కామ్, సోలార్ పవర్స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సీయూ, లగచర్ల భూ స్కామ్, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా కుంభకోణం, హ్యామ్ రోడ్లు, ఫోర్త్ సిటీ, హిల్ట్–పీ, అక్రమ మైనింగ్ వంటి కుంభకోణాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత విచారణ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్ర జాధనాన్ని రక్షించడం, అవినీతి అక్రమాలను అడ్డు కోవడం రాజ్యాంగబద్ధమైన సీఎంగా మీ బాధ్యత’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. -
కరీంనగర్: ఆర్బీఎల్లో భారీ స్కాం
కరీంనగర్: కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి పదిమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. -
కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం
-
రూ.217 కోట్ల నకిలీ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం
సాక్షి, విశాఖపట్నం: వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖ జోనల్ యూనిట్ అధికారులు ఛేదించారు. ఆధునిక డేటా అనలిటిక్స్ సాయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న రూ.217 కోట్ల భారీ నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కుంభకోణం బట్టబయలైంది. డీజీజీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... వ్యాపారం జరగకపోయినా పలు డమ్మీ కంపెనీల పేరుతో జరిగినట్లుగా రికార్డులు సృష్టించిన దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. ఈయన సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్తో కలిసి అమాయకుల నుంచి ఆధార్, పాన్కార్డులను సేకరించేవారు. ఇలా తీసుకున్న వాటితో ఏకంగా 72 షెల్ కంపెనీలు సృష్టిం చేశారు. ఖాళీగా ఉన్న చిన్న దుకాణాలను అద్దెకు తీసుకుని, నకిలీ అద్దె ఒప్పంద పత్రాలు, యుటిలిటీ డాక్యుమెంట్స్తో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందారు. అనంతరం కేంద్రీకృత డిజిటల్ నియంత్రణ ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఎలాంటి వస్తువుల సరఫరా లేకుండానే రూ.1,472 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్ల ద్వారా అక్రమాలు చేశారు. రామావత్ నాగరాజు నాయక్ క్షేత్ర స్థాయిలో డమ్మీ యజమానులను సృష్టించి.. ఫోర్జరీ పత్రాలు, అద్దె ఒప్పందాలు తయారు చేసేవాడు. సిద్ధగోని ప్రభాకర్ జీఎస్టీ రిజి్రస్టేషన్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియల్ని పూర్తి చేసేవాడు. ఈ లాగిన్ వివరాలను సేకరించి.. ప్రధాన సూత్రధారి అంజిరెడ్డి.. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేసేవాడు. ఇలా ఇప్పటి వరకూ 72 దొంగ కంపెనీల ద్వారా ఏకంగా రూ.217 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కొల్లగొట్టినట్లు డీజీజీఐ డేటా అనలటిక్స్ సాంకేతికతతో గుర్తించి నిందితులను వలపన్ని పట్టుకున్నారు. నాగరాజు నాయక్, ప్రభాకర్లను అరెస్ట్చేశారు. ప్రధాన నిందితుడు అంజిరెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు. నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న అంజిరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతోపాటు ఈ కుంభకోణం ద్వారా లబి్ధపొందిన వారు ఎవరెవరున్నారు.? ఆరి్థక మూలాల్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీజీజీఐ విశాఖ యూనిట్ అధికారులు వెల్లడించారు. -
కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో కొటక్ మహీంద్రా బ్యాంక్లో రూ. 160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయిహర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్డీల్లో జమ చేసిన నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలుగులోకి ఎలా వచ్చింది?రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.తమ ఎఫ్డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని స్టేట్ విజిలెన్స్కు నివేదించారు. బ్యాంక్పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.కాగా గత నెలలోనే చండీగఢ్లోని ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది -
వెలుగుల నిధులపై కమ్ముకున్న చీకట్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఏర్పాటు చేసిన విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ)లో చీకట్లు కమ్ముకున్నాయి. ఈ సొసైటీలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సభ్యులు దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ మోసం మొత్తం విలువ దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.ఏళ్ల తరబడి జీతాల నుంచి పొదుపు చేసి సొసైటీలో డిపాజిట్ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలనే ఆశతో పెట్టుబడులు పెట్టిన వారు ఇలా వందలాది మంది సభ్యులు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు. సభ్యులకు ఇవ్వాల్సిన అప్పులు రూ.35 కోట్లు కాగా, వాయిదా దాటిన అప్పులపై వడ్డీ రూ.10 కోట్లు ఉంది. అంతేకాకుండా సంఘం రూ.6 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో సొసైటీ నిర్వాహకులను నమ్మినందుకు నిండా మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. అయితే సభ్యులు ఎవరూ కంగారు పడవద్దని, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని లేదా ఆస్తులు అమ్మి డిపాజిట్లు వెనక్కు ఇస్తామంటూ సొసైటీ నిర్వాహకులు వారికి సర్ది చెబుతున్నారు. పాతికేళ్లుగా ఆధిపత్యం.. గత పాతికేళ్లుగా ఒకే వ్యక్తి ఆధిపత్యంలో సొసైటీ నడిచిందని, అదే ఇప్పుడు కుంభకోణానికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవస్థపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగినట్లు సభ్యులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సొసైటీ కార్యకలాపాల్లో లోపాలు బయటపడుతున్నాయి. నిధుల గోల్మాల్పై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, సభ్యుల నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, సొసైటీ డబ్బుతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు సభ్యుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టినట్లు వారి విచారణలో తేలినట్లు తెలుస్తోంది.ప్రాథమిక విచారణలో రూ.6 కోట్లు నకిలీ పేర్లతో రుణాల మంజూరు, రూ.1.30 కోట్లు డిపాజిటర్లకు తెలియకుండా విత్డ్రా చేయడం, రూ.76 కోట్లు నాన్–మెంబర్ల నుంచి అక్రమ డిపాజిట్లు, సరైన పత్రాలు లేకుండా మరిన్ని లోన్ విత్డ్రాలు వంటివి వెలుగులోకి వచి్చనట్లు సమాచారం. అయితే దీనంతటికీ సహకార శాఖలోని పలువురు అధికారులు సహకారం అందించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల మళ్లింపు..అక్రమాల తీరుసహకార శాఖ డివిజనల్ ఆఫీసర్ (డీసీఓ) పి.కిరణ్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సంఘం అధ్యక్షుడే స్వయంగా 78 మంది సభ్యుల పేరుతో, వారికి తెలియకుండానే రూ.6.11 కోట్ల రుణాలను తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ. 17.47 కోట్లకు చేరింది.45 మంది డిపాజిటర్లకు తెలియకుండానే వారి ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ. 1.58 కోట్ల అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు. సభ్యులుకాని బయటి వ్యక్తుల నుంచి సుమారు రూ.67.71 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇది మొత్తం డిపాజిట్లలో 89 శాతం కావడం గమనార్హం. ఆడిట్ నివేదికల్లోనూ భారీగా మార్పులు చేసి, రూ.6.86 కోట్ల మేర తగ్గించి చూపినట్లు తేలింది రంగంలోకి సహకార శాఖ.. ఆస్తుల జప్తునిధుల రికవరీ కోసం సహకార శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సెక్షన్ 51, ఏపీసీఎస్ చట్టం 1964 ప్రకారం సమగ్ర విచారణకు ఆదేశాలిచ్చింది. 2017 నుంచి ఇప్పటివరకు పాలక మండలిలో ఉన్న 14 మంది సభ్యులను బాధ్యులుగా గుర్తించింది. వారి ఆస్తులను సెక్షన్ 41(బి) కింద జప్తు (అటాచ్) చేయాలని, వారు ఆ ఆస్తులను విక్రయించకుండా నిరోధించాలని విద్యుత్ శాఖ అధికారులకు సహకార శాఖ అధికారులు లేఖ రాశారు. అంతేకాదు, ఈ 14 మంది సభ్యులపై ఏపీసీఎస్ చట్టం 1964 లోని సెక్షన్ 41(బి) కింద చర్యలు తీసుకోవాలని డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ఆదేశించారు. అలాగే నకిలీ రుణాల ద్వారా డ్రా చేసిన రూ. 17.47 కోట్లు, ఇతర దుర్వీ నియోగమైన నిధులను వీరి నుండే రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు.ఎన్నో ఏళ్లుగా ఉండి ఇలా చేస్తారా ? సంఘం పాలకమండలి ప్రధాన బాధ్యులు విద్యుత్ సంస్థలో ముఖ్యమైన ట్రేడ్ యూనియన్లకు నాయకులుగా ఉండి ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎన్నో ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున మరింత సమర్థవంతంగా, సభ్యులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించాల్సింది పోయి సొసైటీ డబ్బులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించటం దారుణం.’ – ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సి.హెచ్.శ్రీనివాస్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఎనీ్టఆర్ జిల్లా -
కోట్లాది రూపాయల స్కామ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం' 'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ
-
దేశంలో తొలిసారి మిస్టేక్ అఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేశారు
-
జగన్ అధికారంలోకి రాగానే జరిగేది ఇదే.. చుక్కలే
-
షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్ ద్వారా 30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...హెచ్-1బి (H-1B) వీసా స్కాంవీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.మెడికేడ్ (Medicaid) కుంభకోణంభాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘మెడికేడ్’ను ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేతవచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.దారుణమైన వైద్య ప్రయోగాలుఅంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత, భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని కూడా దోషిగా తేల్చింది కోర్టు.శిక్షలు ఇలా ఉండబోతున్నాయిభాస్కర్కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు విధించింది. ఈ ఏడాది జూలో (2026) లో శిక్ష అమలు కానుంది. -
500 కోట్ల మోసం! పోలవరం పనుల్లో అక్రమాలు CBI SP సంచలన లేఖ
-
35 ఉద్యోగాల పేరుతో హెరిటేజ్ భారీ దోపిడీ.. బయటపెట్టిన వెంకటరెడ్డి
-
తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్లు!
సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలోనే స్కామ్లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలోకి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీ నుంచి సరఫరా చేశారు. రూ.200 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్రబాబును తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశారు. నెయ్యి స్కామ్ కోసం చంద్రబాబు అండ్ కో దోపిడీ మందలా (కాటెల్) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు కుట్ర..! తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023లో పరకామణిలో రూ.75వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు. నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్లో నెగిటివ్ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉపయోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండో వైపున దుమారంలోనే స్కామ్లు చేస్తారు. హెరిటేజ్ వెబ్సైట్లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ను వాళ్లే ఫైర్ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాములు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..బాబును సీఎంగానే భరించలేకపోతున్నారుఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. -
కోట్లల్లో స్కాం.. బయటపడ్డ బాబు కల్తీ బాగోతం
-
బైక్ డ్రైవర్ ఖాతాలో రూ.550 కోట్లు..
నెలకు పట్టుమని రూ.పది వేలు సంపాదించలేని ఒక సాధారణ డ్రైవర్.. వందల కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమయ్యాడు. అహ్మదాబాద్కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా రూ.550 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా మార్గాల ద్వారా ఈ భారీ నెట్వర్క్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.రూ.25 వేల ఆశ జూపి..విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్ ఓడే, కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను రూ.25,000కు అద్దెకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను సంతకం చేసిన ప్రతి చెక్కుకు అదనంగా రూ.400 కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రదీప్ పత్రాలను ఉపయోగించి నిందితులు ‘ప్రదీప్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో ఒక డమ్మీ సంస్థను స్థాపించారు.ప్రదీప్ ఎంటర్ప్రైజెస్తో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో రెండు షెల్ కంపెనీలను 2024లో నమోదు చేశారు. ఈ సంస్థలకు వాస్తవంగా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. కానీ, వీటి బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూ.550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. మూడు వేర్వేరు కంపెనీలకు వరుసగా రూ.80.50 కోట్లు, రూ. 52.11 కోట్లు, రూ.22.86 కోట్ల చొప్పున డబ్బు బదిలీ అయినట్లు ఈడీ తేల్చింది.క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ఈ భారీ మొత్తమంతా అక్రమ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం బెట్టింగ్ మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్లో ‘సర్క్యులర్ ట్రేడింగ్’(కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచడం) ద్వారా షేర్ల ధరలను తారుమారు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. ‘సాధారణ పొదుపు ఖాతాగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక వ్యవస్థీకృత సిండికేట్కు సంబంధించిన హవాలా ఛానెల్గా పనిచేస్తోంది’ అని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఇంపాక్ట్ గురు’ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించి వాటిని మనీ లాండరింగ్కు వినియోగించినట్లు తెలుస్తుంది.ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరికి చేరుతోంది? అనే అంశంపై ఈడీ ప్రస్తుతం మనీ ట్రయిల్(డబ్బు వెళ్లిన క్రమం)ను ట్రాక్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఆస్తుల అటాచ్మెంట్, కీలక వ్యక్తుల అరెస్టులు ఉండొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
హైందవ ద్రోహి.. సాక్షాత్తూ ఆ దేవదేవుడే బయటపెట్టిన సాక్ష్యం
-
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 590 కోట్ల కుంభకోణం కేసు.. ఇంటి దొంగలు దొరికారు!
చండీఘడ్: హర్యానా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 590 కోట్ల కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు తీగ లాగితే కుంభకోణం డొంకంత కదులుతోంది. తాజాగా, ఈ కేసులో ఇద్దరు మాజీ ఉద్యోగులు, నలుగురు బయటి వ్యక్తులను హర్యానా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.పంచకులాలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏఎస్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్కి మాస్టర్ మైండ్స్గా మాజీ మేనేజర్లు రిభవ్ రిషి, అభయ్ కుమార్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసిన ఈ కేసులో తాజాగా రిభవ్ రిషి, అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లాలను అదుపులోకి తీసుకున్నారు.బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడిగా రిభవ్ రిషి అనే మాజీ మేనేజర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పటికీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో పనిచేసిన సమయంలోనే ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లా అనే వ్యక్తులు కూడా ఈ మోసంలో భాగమని విచారణలో తేలింది.ఈ ఘటన వెలుగులోకి రావడంతో హర్యానా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ను కూడా ప్రభుత్వ లావాదేవీల నుండి తొలగించింది. అన్ని ప్రభుత్వ నిధులను ఇతర బ్యాంకులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.బ్యాంక్ కుంభకోణం యాజమాన్యానికి తలొంపు కాగా.. బ్యాంక్ షేర్ మార్కెట్పై కూడా తీవ్రంగా పడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఒక్క రోజులోనే 20 శాతం పడిపోయాయి. పెట్టుబడిదారుల సంపదలో రూ.14వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా. -
హెల్త్ ఇన్సూరెన్స్ లో భారీ స్కాంకు కుట్ర
-
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
-
దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!
-
బిల్లింగ్ మెషిన్తో బిర్యానీ స్కామ్
-
రూ. 80 కోట్లకు మంత్రి స్కెచ్
-
జమ్మూకశ్మీర్లో భారీ హవాలా రాకెట్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ హవాలా రాకెట్ వ్యవస్థను అధికారులు ఛేదించారు. ప్రపంచవ్యాప్త స్కామ్ నెట్వర్క్లకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తూ, జమ్మూకశ్మీర్లో విస్తరిస్తున్న ’మ్యూల్ అకౌంట్స్’ దందాను బయటపెట్టారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8 వేలకు పైగా మ్యూల్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. మనీలాండరింగ్ నేరగాళ్లు ఈ వ్యవస్థను మూడేళ్లుగా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా మళ్లించిన నిధులను వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఇతరుల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడమే ’మనీ మ్యూలింగ్’. ఈ ఖాతాలను నిర్వహించే వారిని ’మనీ మ్యూల్స్’ అంటారు. ఖాతాదారులకు తెలియకుండా లేదా వారికి కొంత కమీషన్ ఆశచూపిన నేరగాళ్లు తమ గుర్తింపు బయటపడకుండా ఈ ఖాతాలను నిర్వహిస్తున్నారు. 2017లో ఎన్ఐఏ కశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ నెట్వర్క్ను బట్టబయలు చేయడంతో అక్రమార్కులు ఈ ‘డిజిటల్ హవాలా’మార్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఈ ఖాతాలను సైబర్ నేరాల గొలుసులో అత్యంత బలహీనమైన, అత్యంత కీలకమైన లింక్ అని వారు చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ ఖాతాలు లేకుండా, దోచుకున్న సొమ్మును జాడ దొరకని క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చడం అసాధ్యమని పేర్కొంటున్నారు. డబ్బు ఆశతో నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అప్పగించే వారు బాధితులు మాత్రమే కాదు, నేరగాళ్లకు వంతపాడుతున్నట్లేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
ఫాస్టాగ్ FASTag యాన్యువల్ పాస్కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచు తున్నారని వెల్లడించింది. అధికారిక NHAI ప్లాట్ఫారమ్లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్వినియోగదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలుఈ మోసపూరిత పోర్టల్లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్గా నటిస్తూ, నకిలీ పాస్ను "యాక్టివేట్" చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్ కూడా చేస్తారు.ఈ స్కామ్లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.ఈ మోసం ఎలా జరుగుతుంది?సెర్చ్ ఇంజన్లలో (Google వంటివి) ప్రకటనల ద్వారా మోసపూరిత లింకులు పైన కనిపించేలా చేస్తారు.వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన వివరాలు మరియు పేమెంట్ వివరాలను అడుగుతారు.మీరు చేసే పేమెంట్ నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుంది. చెల్లింపు తర్వాత ఎలాంటి పాస్ రాదు, పైగా మీ బ్యాంక్ వివరాలు కూడా వారి చేతికి చిక్కుతాయి.సేఫ్టీ టిప్స్FASTag-సంబంధిత సేవలను ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు రహదారి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఈ సలహాను పంచుకున్నారు.వినియోగదారులు వెబ్సైట్ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి .ఆన్లైన్లో శోధించేటప్పుడు స్పాన్సర్ చేసిన లింక్లు లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.మోసగాళ్ళు చట్టబద్ధమైన NHAI చెల్లింపు పేజీలను పోలి ఉండేలా వెబ్సైట్లను సృష్టిస్తారు. వినియోగదారులు ఈ లింక్లపై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్లు, వాహన సమాచారం , చెల్లింపు ఆధారాలు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు.చెల్లింపు ఇంటర్ఫేస్ ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనఖాతాలోని సొమ్మును డిజిటల్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ అధికారిక NHAI వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలి.వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి OTP లేదా పిన్ అడిగితే చెప్పకండి.ఒకవేళ మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అనేది బలమైన రక్షణ అని అధికారులు నొక్కిచెప్పారు, భారతదేశం అంతటా ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరుతున్నందున వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంకాగా 2025 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుండి యాన్యువల్ పాస్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికి తోడు జాతీయ రహదారులపై ప్రయాణించే, ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నేత జాబ్ స్కామ్.. లోకేష్ కి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం?


