breaking news
warning
-
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
-
చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన అయస్కాంత లోహాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.అరుదైన అయస్కాంత లోహాల ఉపయోగాలుఅరుదైన అయస్కాంత లోహాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంత లోహాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.ఎంఆర్ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్మేకర్లు, హియరింగ్ ఎక్విప్మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. మంత్రి సంధ్యారాణికి పుష్ప శ్రీవాణి వార్నింగ్
-
ఆపరేషన్ సిందూర్ ఓ ట్రైలర్ మాత్రమే.. పాక్ కు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్
-
పాక్కు రాజ్నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. పాక్ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు. .. బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు ఇక అసాధ్యం. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్నే చూసి పాకిస్తాన్కి అర్థమై ఉంటుంది. భారత్ పాకిస్తాన్ను సృష్టించగలిగితే, ఇంకేమి చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విజయం మనకు అలవాటైపోయింది. బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని.. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగు’’ అని ఆయన అభివర్ణించారు. బ్రహ్మోస్ మిస్సైల్స్ను భారత్ ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రయోగించింది. Fire and Forget టెక్నాలజీతో పని చేయడం దీని ప్రత్యేకత. అంటే.. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది.భారత్ డీఆర్డీవో-రష్యా ఎన్పీఓఎం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట సంయుక్తంగా వీటిని డెవలప్ చేస్తున్నాయి. త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాద్, తిరువనంతపురం, నాగ్పూర్లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. తాజాగా లక్నోలోనూ ఓ యూనిట్ను ప్రారంభించారు. తాజా వివరాల ప్రకారం.. బ్రహ్మోస్కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజ్నాథ్ దీనిని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. -
ఆఫ్ఘాన్ క్రికెటర్లను చంపిన పాక్.. తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్
-
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
మరోసారి చర్చలు.. తాడో పేడో తేలాల్సిందే..
-
రాజకీయ సమాధి చేస్తాం.. మంత్రి సవితకు ఉషశ్రీ చరణ్ వార్నింగ్
-
నోటికొచ్చినట్లు మాట్లాడకు.. మంత్రి అనితకు వార్నింగ్
-
జగన్ పర్యటనకు రావొద్దు..! ప్రజలకు, పార్టీ నేతలకు పోలీసుల బెదిరింపులు
-
మీరేంటి మాకు చెప్పేది.. జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తాం
-
టీడీపీ నేతపై జేసీ ప్రభాకర్ రెడ్డి బండబూతులు..
-
'ఐ' బొమ్మ చూపిస్తాం! TFI, పోలీసులకు స్వీట్ వార్నింగ్..
-
‘సర్ క్రీక్ను టచ్ చేస్తే చుక్కలే’.. పాక్కు రాజ్నాథ్ తీవ్ర హెచ్చరిక
భుజ్: నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకస్తాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే, తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు స్పష్టం చేశారు.‘పాక్తో యుద్ధం భారత్ లక్క్ష్యం కాదు’గుజరాత్లోని భుజ్ సమీపంలోగల సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటంపాకిస్తాన్లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, భారత సరిహద్దులను కాపాడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు.సర్ క్రీక్ వివాదం ఏమిటి?ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ మీదుగా భారత్లోకి ప్రవేశించేందుకు విఫల ప్రయత్నం చేసిందని, అయితే ప్రతీకార చర్యలో భాగంగా భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలని రక్షణ మంత్రి అభివర్ణించారు. కాగా సర్ క్రీక్ అనేది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్- పాకిస్తాన్ మధ్య 96 కి.మీ పొడవైన టైడల్ నదీముఖద్వారం. సముద్ర సరిహద్దు రేఖలపై ఇరు దేశాలు వేర్వేరు వివరణలు ఇవ్వడం కారణంగా దీనిని వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తున్నారు. -
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
సముద్ర తీరంలో హై టెన్షన్.. అనితను అడ్డుకుని వార్నింగ్
-
ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు
-
లెక్కలో ఏంటి ఈ వ్యత్యాసం.. బాబుకు APERC షాక్
-
విశాఖలో ఎలా అడుగుపెడతావో చూస్తాం.. తోపుడు బండి కార్మికుల హెచ్చరిక
-
తాలిబాన్లకు ట్రంప్ వార్నింగ్
-
పవన్ కు వినుత వార్నింగ్
-
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్
-
తన కారు ఆపిన పోలీసులకు పెద్దారెడ్డి వార్నింగ్
-
మీరు ఎంత అణగదొక్కలని చూస్తే అంత తిరగబడతారు..
-
ర్యాలీలు చేస్తే కేసులు పెడ్తావా?.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
జనసేన ఎమ్మెల్యేకు MRPS మాస్ వార్నింగ్.. క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్
-
‘బందీ ఒప్పందం’పై హమాస్కు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో రాశారు.‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు. .@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు. -
నిన్ను దించేవరకు మా పోరాటం ఆగదు.. బాబుకు ఆటో డ్రైవర్లు వార్నింగ్
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా.. ఇది జగనన్న సైన్యం..
-
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక కోసేస్తా.. టీడీపీ నేత వ్యాఖ్యలకు YSRCP నేతలు వార్నింగ్
-
Jr NTR Fans: దగ్గుపాటి ప్రసాద్.. నిన్ను వదలం
-
ఫ్యాన్స్ కు భయపడి.. ఎమ్మెల్యే దగ్గుపాటి పరార్..!
-
ఎమ్మెల్యే దగ్గుపాటి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే మేమేంటో చూపిస్తాం..
-
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లపై ఎఫ్పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నమ్మొద్దని సూచించింది. భారత్లో నివసించే పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
శ్రీకాకుళం జిల్లా పలాసలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు
-
క్షమాపణ చెప్పించకపోతే? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక
-
జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు
-
ఎన్ని దాడులైనా చేసుకో.. జగన్ కోసం ప్రణాలివ్వడానికైనా సిద్ధం
-
నువ్వు పోలీస్.. ఫ్యాక్షనిస్ట్ కాదు.! DIGకి కేతిరెడ్డి మాస్ వార్నింగ్
-
KSR Live Show: చంద్రబాబుకు మాస్ వార్నింగ్.. మీ పిచ్చి వేషాలకు జగన్ భయపడడు
-
ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..
-
చెప్పు తెగుద్ది.. యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ
-
Jakkampudi Vijayalakshmi: ఒకసారి తిరగబడటం మొదలు పెడితే... మీ ఊహకే వదిలేస్తున్నా
-
దమ్ముంటే ఆపు.. పోలీసులకి ఇచ్చిపడేసిన ప్రసన్నకుమార్ రెడ్డి
-
మా అమ్మాయిని చాటింగ్ నుంచి బయట పడేయగలరా
మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ మధ్య ఎంతసేపు ఫోన్లోనే ఉంటోంది. చికాకుగా ఉండటం, అందరితో సరిగ్గా మాట్లాడక΄ోవడంతోపాటు తిండి కూడా బాగా తగ్గించేసింది. చదువు మీద బొత్తిగా ధ్యాస లేదు. ఈ మధ్య నేను అనుకోకుండా తన ఫోన్ చూస్తే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వేరే దేశంలోని వ్యక్తితో చాటింగ్, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గమనించాను. ఇంకా తన పర్సనల్ ఫొటోలు కూడా ఆ వ్యక్తికి పంపినట్లు చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. తన నుంచి ఫోన్ తీసుకుంటే చనిపోతానని చెదిరిస్తుంది. చాకుతో చేతిమీద కోసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎవ్వరితోను చెప్పుకోలేని పరిస్థితి నాది! మా వారితో కూడా చెప్పే ధైర్యం లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఉత్తరం రాస్తున్నాను! దయచేసి సలహా చెప్పగలరు. – ఒక సోదరి, హైదరాబాద్ఇది మీరొక్కరే కాదు, ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య కాలంలో టీనేజీ పిల్లలో ఫో, ఇంటర్నెట్ వాడటం చాలా ఎక్కువ అయింది. సోషల్ మీడియా ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మాయి విషయానికి వస్తే ఫోన్ వాడకంతో పాటు, క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు, తొందరపాటుతనం, అంతర్గత భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం కనిపిస్తోంది. కౌన్సెలింగ్ ‘బిహేవియరల్ థెరపీ’ బాగా ఉపయోగ పడుతుంది. అయితే మీరు మీ భర్తతో కూడా దీని గురించి చర్చించడం మంచిది. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్’ ద్వారా మీరు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ వలన వచ్చే నష్టాలను వివరించండి. అదే విధంగా ఫోన్ సమయాన్ని ఎలా నిర్దేశించాలో చెప్పండి. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి తనతో ప్రశాంతంగా మాట్లాడటం, వినడం మొదలు పెడితే, ఆమె కోర్కెలు, బాధలు బయటపడతాయి. మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి మానసిక వైద్య నిపుణల సహాయంతో ఈ సమస్య నుంచి మీ అమ్మాయిని తప్పకుండా పూర్తిగా బయటికి తీసుకు రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
రాష్ట్రం నుండి పరుగులు తీస్తున్న జనం
-
భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 🚨 BREAKING: Tsunami waves from the 8.7 magnitude earthquake have begun slamming RussiaBuildings are already being swept awayTsunami waves are also heading to Hawaii, expected to arrives within hours pic.twitter.com/dPg72zln9N— Nick Sortor (@nicksortor) July 30, 2025భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్మెంట్లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు. Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y— RT (@RT_com) July 30, 2025రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.#BREAKING Yuzhno-Sakhalinsk, Russia 8.7 Earthquake - 46 Miles deep in the Ocean ALL OF THE WEST COAST IS UNDER TSUNAMI WARNING - We will know soon if the bouys pick up the TSUNAMI level soon hereMillions of people could end up evacuating depending how this goes.Hard to… pic.twitter.com/w54KXkE3If— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) July 30, 2025Breaking right now..Earthquake near Russia 8.7 magnitude and a tsunami alert has been spread to Alaska, Japan, and Russia..Developing story here as information is just coming out now..Prayers for all in its wake..🙏🙏🙏pic.twitter.com/aaTokSE7OQ— Chris from Massachusetts AKA TommyboyTrader (@autumnsdad1) July 30, 2025ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్కు చెందిన ఎన్హెచ్కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపం జపాన్ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఇది రెడ్ బుక్ కి మించి.. ఎవడైతే మన కార్యకర్తలపై చేయి వేశాడో..
-
ఈ సారి ప్రాణం పెట్టైనా.. టీడీపీకి బైరెడ్డి మాస్ వార్నింగ్
-
దేనికైనా రెడీ.. ఇక కాసుకో
-
మిథున్ అరెస్ట్ పై అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
నా ఫ్యామిలీ జోలికొస్తారా.. ఏ ఒక్కరిని వదలను
-
‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. #WATCH | US President Donald Trump says, "... This (The Genius Act) is really strengthening the US Dollar and giving the Dollar a great prominence. There is a little group called BRICS, and it is fading out fast. But BRICS tried and wanted to take over the Dollar and the… pic.twitter.com/wG6GEe8OOs— ANI (@ANI) July 18, 2025తమ ‘జీనియస్ చట్టం’ అమెరికా డాలర్ను బలోపేతం చేస్తుందని, డాలర్కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు. బ్రిక్స్లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆయా దేశాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. -
అధికారిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
Big Question: సైకోలను ఇక సహించం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరిక
-
ఉప్పల హారిక కారుపై టీడీపీ గుండాలు.. సజ్జల సీరియస్ రియాక్షన్..
-
హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు..!
హెల్త్ వార్నింగ్ మెసేజ్లు సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై ఉండటం చూసే ఉంటాం. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలా కనిపిస్తున్నా..ఎలా పొగరాయళ్లు వీటికి అలవాటు పడతారా అని తెగ అనుకునేవాళ్లు చాలామంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు దాదాపుగా అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి జాబితాలోకి నోరూరించే ఈ చిరుతిండ్ల ఇప్పుడు చేరిపోనున్నాయి. తలుచుకుంటేనే తినాలనిపిచే ఆ స్నాక్స్ ఐటెంపై ఇలా వార్నింగ్ మెసెజ్లు ఉంటే ఆహారప్రియుల పరిస్థితి ఊహకందనిది..పొగాకు ఉత్పత్తులపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ఇదేంటి ఎంతో ఇష్టంగా ఆ చిరుతిండ్ల అని అవాక్కవ్వకండి. ఎందుకంటే వాటిని తినే మనం చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా ఈ హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసిందట. త్వరలో ఇది అమలు కానుందట కూడా. నిజానికి మనదేశంలో ప్రతి నలుగులో ఒకరు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇలా సిగరెట్ ప్యాకట్లపై ఉన్నట్లుగానే సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్ఫ్రై చేసే ఇతర స్నాక్స్పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్లు ఉండాలని ఆరోగ్య మత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేగాదు కేంద్ర ఆరోగ్య సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆ ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని హైలట్ చేస్తారట. కాబట్టి ఇది అచ్చం సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక లేబుల్ వలే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిశాఖ పేర్కొంది. ఇది అవసరమా..ఇటీవల కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి, ఉద్ధృతమవుతున్న వ్యాధుల ఆందోళనల నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలా ఆదేశాలు జారి చేసింది. ప్రస్తుతం, ఊబకాయం, చక్కెర, అధిర రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యల బారిన ఏటా వేలాది మంది పడుతున్నారని, అందుకు ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలే అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు 2050 నాటికి సుమారు 449 మిలియన్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బ్యాన్ కాదు...ఇలా హెల్త్ వార్నింగ్ మెసేజ్ల పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయా చిరుతిండ్లను పూర్తిగా నిషేధించడం కాదని స్ఫష్టం చేసింది ప్రభుత్వం. కేవలం ప్రజలకు ఆయా ఆహారపదార్థాలపై అవగాహన కల్పించి ఆరోగ్యంగా జీవించేలా చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ చొరవ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా" ఉద్యమం నుంచి వచ్చిందట. ఆయన పిలుపునిచ్చిన 10% నూనెని తగ్గించి ఆరోగ్యంగా ఉందాం..అలాగే భారతదేశాన్ని మరింత బలోపేతంగా మారుద్దాం అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది కేవలం ఆరోగ్య సలహా మాత్రమే గానీ ప్రత్యేకంగా పలాన వంటకాలని పేర్లను ప్రస్తావించలేదని, హెచ్చరిక బోర్డు పెట్టాలని గానీ ఆదేశించలేదని స్పష్టం చేసింది కేంద్రం. (చదవండి: దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!) -
ఎవడొస్తాడో రండిరా.. కొడాలి నాని వస్తున్నాడు.. లోకేష్ కు పేర్ని నాని వార్నింగ్
-
శశిథరూర్ కు కాంగ్రెస్ వార్నింగ్
-
టీటీడీ కి బండి సంజయ్ వార్నింగ్
-
జగన్ ను ఎదుర్కోకపోతే.. పదవులు పీకేస్తా..!
-
అమెరికా ప్రెసిడెంట్ ను చంపేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
కూటమి సర్కార్ కు వైఎస్ జగన్ హెచ్చరిక
-
రౌడీ షీట్ పెడతావా..? ఎస్పీకి అంబటి మాస్ వార్నింగ్
-
ఖాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై హైకోర్టు కన్నెర్ర
-
‘ఇతరుల జోక్యం లేకుండా’.. దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: ఈరోజు (జూలై 6) టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే అమెరికా దలైలామాకు ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం.90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ‘ఇతరుల జోక్యం లేకుండా’ ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు. తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు తమకే ఉందని చైనా చెబుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా టిబెట్పై చైనా చారిత్రక అధికారాన్ని డిమాండ్ చేస్తోంది. సామ్రాజ్య యుగం నాటి సంప్రదాయాలను గుర్తుచేస్తూ, తదుపరి దలైలామాను ఆమోదించే హక్కు తమకే ఉందని బీజింగ్ తరచూ చెబుతోంది. టిబెట్లో అనుసరించే మతపరమైన ఆచారాలపై కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. -
వచ్చే 4 రోజులు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికుంది.. పేర్ని నాని మాస్ వార్నింగ్
-
రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తా.. జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్
-
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్
-
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
జగన్ ఇంటిపై దాడి.. పోలీసులకి నారాయణమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్..
-
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. బుచ్చయ్య చౌదరికి మహిళలు వార్నింగ్
-
నా కూతురి జోలికొస్తే.. కాజోల్ మాస్ వార్నింగ్..!
-
అధికార మదంతో పిచ్చి కూతలు కూస్తే.. పళ్లు రాలగొడతా..!
-
మీరు నరుకుతుంటే చూస్తూ ఉంటామా.. బాబు, బుచ్చయ్యకు వార్నింగ్
-
నీ పోలీస్ వ్యవస్థ ఏమైందో చూసావా.. అది వైఎస్ జగన్ అంటే..
-
అక్రమ కేసులకు భయపడం: కేటీఆర్
-
కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్
-
అడిగితే కోస్తా..! ప్రజలకు బాబు వార్నింగ్
-
ఇక్కడే ధర్నా చేస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేసుకో.. సీఐకి చెవిరెడ్డి వార్నింగ్
-
మూర్తి.. నిన్ను వదలను.. లక్ష్మి పార్వతి వార్నింగ్
-
లోకేష్ కు నాగార్జున యాదవ్ మాస్ వార్నింగ్..
-
కదం తొక్కిన టీచర్లు.. బాబుకు డెడ్ లైన్..
-
సిగ్గు లేదు మీకు! కౌంట్ డౌన్ మొదలైంది.. గుర్తు పెట్టుకో చంద్రబాబు
-
నిన్ను వదిలిపెట్టం.. సోమిరెడ్డికి వార్నింగ్
-
Social Media లైక్.. కామెంట్.. షేర్.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లే!
‘కరీంనగర్కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ ఇంట్లో మారాం చేశాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు కొనిస్తామంటే వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పారిపోయిన కొడుకు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తెచ్చి ఫోన్ఇచ్చారు. చాలా కుటుంబాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తప్పుతోందని చెబుతున్నారు’రీల్స్పై తాపత్రయం.. ప్రాణాపాయం‘జిల్లాలోని ఓ పట్టణప్రాంతానికి చెందిన తొమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవల క్లాస్రూమ్లో పరీక్ష రాస్తూ నిద్ర పోయాడు. ఉపాధ్యాయుడు గమనించి అతడి ముఖంపై నీళ్లు చల్లినా.. స్పందన కరువైంది. సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్య సమస్య తలెత్తినట్టు డాక్టర్లు తెలిపారు. రెండురోజులు మిత్రులతో కలిసి రీల్స్ చేసేందుకు ఇతర ప్రాంతానికెళ్లడమే కారణమని తేలింది. చదువుకునే వయసులో ఎందుకీ పనులని టీచర్లు ప్రశ్నించగా.. తనకు నెలకు రూ.10 వేలు వస్తాయని బదులివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.’ప్రస్తుత ప్రపంచమంతా ‘లైక్’, ‘కామెంట్’, ‘షేర్’ రూపంలో మారిపోయింది. ఈ వర్చువల్ ప్రపంచపు చిరునవ్వుల కోసం యువత, విద్యార్థులు అనర్థాల బాట పడుతున్నారు. ఒక్క చిన్న రీల్, కొద్ది సెకన్ల వీడియో, ఒక్క ఫేమ్ కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల కో సం అందించిన ఫోన్లు, ఇప్పుడు వారి జీవితాన్ని ని యంత్రించే ఆయుధాలుగా మారాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, రీల్స్ యువతకు ఆత్మలుగా మారిపోయాయి. ఇటీవల కరీంనగర్ మానేరు వాగులో ఓ యువకుడు రీల్స్ కోసం వెళ్లి మునిగిపోయాడు. మరో యువకుడు రైలుపై రీల్ తీయడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇలా రోజురోజుకు రీల్స్ పిచ్చి అనార్థాలకు దారీతీస్తోంది.యువత మారాలి..రీల్స్ను కట్టడి చేయాలంటే యువత ముందుగా పద్ధతి మార్చుకోవాలని, ప్రాణాంతక రీల్స్తో జీవితాలే కోల్పోతామని గుర్తుంచుకోవాలని సైక్రియాటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే రీల్స్ వెనక దాగి ఉన్న ప్రమాదాలు ఊహించకుండా వీడియోలు చూస్తున్నవారు అనేక రకాల యాడ్స్ రూపంలో మోసాలకు గురువుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ద్వారా ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్వయోభేదం లేకుండా..సామాజిక మాధ్యమాలు బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయోభేదం లేకుండా పావులారిటీ కోసం ఫొటోలు, వీడియోలు, ప్రదర్శనలకు వాటిని వేదికగా మలచుకుంటున్నారు. వారించాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపకరిస్తున్నా, చదువుపై నిర్లక్ష్యం పెరుగుతోందని కన్నవారు గుర్తించలేకపోతున్నారు.రీల్స్తో అనర్థాలురీల్స్ కోసం చేసే బైక్ విన్యాసాలతో చాలా మంది యువతకు అనర్థాలు జరిగాయి. కరీంనగర్ మానేరు, బైపాస్, మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట తదితర ప్రాంతాల్లో యువత బైకులు తిప్పుతూ, రోడ్లపై హుషారుగా రీల్స్ తీసే ప్రయత్నాల్లో బలవుతున్నారు. డివైడర్లకు తగిలి, ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రీల్స్ వెనక నిజజీవితంలో జరుగుతున్న విషాదాలు ఎవరిదృష్టిలో పడడం లేదు. కరీంనగర్ జిల్లాలో రీల్స్ తీసే యత్నంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండగా తాజాగా అర్బాజ్ అనే యువకుడు మానేరువాగులో రీల్ తీసేక్రమంలో నీటమునిగి మృతిచెందాడు. అతడితో ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా కాపాడలేకపోయారు. ఇదే జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుపై రీల్ తీయబోతూ కరెంట్షాక్కు గురై మృత్యువాతపడ్డాడు.చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దురీల్స్కు యువత ఆకర్షితులవడంతో అది వ్యసనంగా మారడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస లోపంతోనే సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా వీటి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యువత భవిష్యత్తు మీద దృష్టి పెట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.– డాక్టర్ అట్ల శ్రీనివాస్రెడ్డి, సైక్రియాటిస్టు -
బూట్ కాలితో తొక్కి లాఠీలతో ఆ కొట్టడం ఏంటి.. మీరు అసలు పోలీసులా, రౌడీలా
-
నా ఇంటిపై టీడీపీ జెండా కట్టే మొగోడెవడైనా ఉన్నాడా
-
కమల్ హాసన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పకపోతే!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడంపై కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థగ్ లైఫ్ రిలీజ్ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ కామెంట్స్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కమల్ సినిమాను కర్ణాటకలో పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి.కమల్ హసన్ కామెంట్స్పై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఘాటుగా స్పందించింది. ఈనెల 30లోగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ స్పష్టం చేసింది. కమల్ హాసన్పై తమకు ఎలాంటి సానుభూతి లేదని.. కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు రేపటిలోగా కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. థగ్ లైఫ్ సినిమాను విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వార్నింగ్ ఇచ్చారు.కర్ణాటక కేఎఫ్సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ..' కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కన్నడ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పటికే సమావేశమై చర్చించాం. కమల్ తప్పు చేశారని నిర్ధారించాం. తన వ్యాఖ్యలపై కమల్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే అంశంపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ విషయాన్ని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. -
‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్కు రాజ్నాథ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘చేయాలనుకుంటే మనం ఇంకా ఎక్కువే చేయగలం. అయితే ప్రపంచానికి సంయమనం అనే సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వెనుకకు తగ్గాం. ఒక ఉదాహరణగా నిలిచాం’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోమారు పాకిస్తాన్ను హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ, భారతదేశం సంయమనంలో మెలిగిందని, మన సైన్యం ప్రపంచం ఎదుట వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు (గురువారం) న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భద్రత, స్వావలంబనలోని ద్వంద్వ లక్ష్యాలను నొక్కిచెప్పారు, భారతదేశ రక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను ఆయన ప్రశంసించారు. తాము మొదట ఉగ్రవాద స్థావరాలను, ఆపై శత్రువుల సైనిక స్థావరాలను, వైమానిక స్థావరాలను ఎలా నాశనం చేశామనేది అందరూ చూశారన్నారు. మనం ఇంకా ఎక్కువ చేయగలిగినప్పటికీ సంయమనం పాటించామని రాజ్నాథ్ పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారతదేశం నుంచి వచ్చిన సైనిక ప్రతిస్పందన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక కొలత కలిగిన నిర్ణయాత్మక దాడి రాజ్నాథ్ అన్నారు.భవిష్యత్లో పాక్తో ఎప్పుడు చర్చలు జరిగినా అవి ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(Pakistan-occupied Kashmir) గురించి మాత్రమే ఉంటాయి. పాకిస్తాన్తో మరే ఇతర అంశంపై చర్చ ఉండదని రాజ్నాథ్ ప్రకటించారు. పీఓకే ప్రజలు మన కుటుంబ సభ్యులు. భౌగోళికంగా, రాజకీయంగా మన నుండి వేరయిన మన సోదరులు, ఏదో ఒక రోజు వారు ఖచ్చితంగా భారత ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని గట్టిగా నమ్ముతున్నామని రాజ్నాథ్ అన్నారు. దశాబ్దాలుగా విడిగా ఉంటున్నప్పటికీ, పీఓకే-భారత ప్రజల మధ్య భావోద్వేగ , సాంస్కృతిక బంధం బలంగా ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు. -
ఏపీ పోలీస్, చంద్రబాబు కు విడదల రజిని వార్నింగ్
-
అది ఒక ఫ్లాప్ సినిమా.. ఎందుకంత హంగామా? పవన్ కు YSRCP నేతలు కౌంటర్
-
పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్
-
మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ
-
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ
-
నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!
-
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి -
తోక జాడిస్తే.. కార్గిల్ సీన్ రిపీట్ అవుద్ది
-
అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!
-
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్ డేటాను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంతోపాటు వారి డివైజ్లను పూర్తిగా నిరుపయోగంగా మార్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఈమేరకు యాపిల్ డివైజ్ యూజర్లకు హై-ఇంటెన్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.పాత, కొత్త మోడళ్లతో సహా వివిధ యాపిల్ పరికరాలపై ఈ లోపాలు ప్రభావం చూపుతాయని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. ఐఓఎస్ 18.3కు ముందు వెర్షన్లతో పనిచేసే ఐఫోన్లు, మోడల్ను బట్టి 17.7.3 లేదా 18.3 కంటే ముందు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లతో పనిచేసే ఐప్యాడ్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. యాపిల్ అంతర్గత మెసేజింగ్ ఫ్రేమ్వర్క్లో కీలకమైన డార్విన్ నోటిఫికేషన్ సిస్టమ్లో ప్రధాన లోపాన్ని ఒకటి గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకపోయినా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ స్థాయి నోటిఫికేషన్లను పంపేందుకు అది అనుమతిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తే డివైజ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.పరిణామాలు ఇలా..ఈ లోపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత, ఆర్థిక సమాచారంతో సహా గోప్యమైన డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నల్ భద్రతా యంత్రాంగాలను ఇది కట్టడి చేయవచ్చు. లేదా అనధికార కోడ్ను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ల డివైజ్లు పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ లోపాలను అధిగమించేందుకు సత్వర చర్యలు అవసరమని సీఈఆర్టీ-ఇన్ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులువెంటనే యూజర్లు ఏం చేయాలంటే..ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ లోపాలను సరిదిద్దడానికి సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసింది. యూజర్లందరూ తమ డివైజ్లను వెంటనే లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేటెస్ట్గా అందుబాటులో ఉన్న ఐఓఎస్ లేదా ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్కు అప్డేట్ అవ్వాలని తెలిపింది. వినియోగదారులు ధ్రువీకరించని మొబైల్ అప్లేకేషన్లను ఇన్స్టాల్ చేసుకోకూడదని పేర్కొంది. ఏపీకే ఫైల్ ద్వారా ఎలాంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకోరాదని చెప్పింది. హానికరమైన కార్యకలాపాలను సూచించే పాప్అప్ సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. -
ఉగ్రవాదులతోనే మా పోరాటం
-
జాగ్రత్త చంద్రబాబు.. ఇది మంచిది కాదు.. శైలజానాథ్ వార్నింగ్
-
తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తామని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరిక
-
విడదల రజిని ఘటనపై పేర్ని నాని వార్నింగ్
-
పాక్ కు భారత్ వార్నింగ్.. ఇక కాస్కోండి
-
ఏపీ పోలీసులకు అంబటి రాంబాబు వార్నింగ్
-
మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి!
-
మా సహనాన్ని పరీక్షించొద్దు
న్యూఢిల్లీ: భారత్ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. రెచ్చగొడితే తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్కు బదులుగా భారత్లోని 15 సైనిక లక్ష్యాలపై పాక్ దాడికి యత్నించడం బదులుగా గురువారం పాక్ వ్యాప్తంగా ఉన్న మిలటరీ రాడార్లతోపాటు లాహోర్లోని రాడార్ వ్యవస్థను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన నేపథ్యంలో రాజ్నాథ్ పైవిధంగా స్పందించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ..‘మనం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే నమ్ముతున్నాం. దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దీటుగా బదులిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన వీర సైనికులను ఆయన అభినందించారు. దాడుల సమయంలో సామాన్యులకు హాని వాటిల్లకుండా అనితర సాధ్యమైన కచ్చితత్వంతో దాడులు జరిపామన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో ఏ శక్తీ ఆపజాలదన్నారు. పాక్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారని వెల్లడించారు. -
భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ ప్రకటించిన పాక్ దౌత్యవేత్త
-
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
స్టార్టప్ బూమ్లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
Pahalgam Incident: పాకిస్థాన్కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్
-
కూటమికి కొమ్ము కాస్తే ఇబ్బందులు తప్పవు.. అధికారులకు వైఎస్సార్ సీపీ హెచ్చరిక
-
అమ్మా అనితా ఎందుకా అబద్ధాలు.. అంబటి మాస్ వార్నింగ్
-
నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్.. జనసేన నేతపై సంచలన వ్యాఖ్యలు
-
కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్
-
పహల్గామ్ ఉగ్రదాడి స్పాట్ కు అమిత్ షా.. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక
-
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్సాగర్రావు, రాజగోపాల్రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అమెరికాలో ఉంటున్న విదేశీయులకు షాక్
-
iTDP సైకోల లిస్ట్ తీశాం.. అందరి లెక్కలు తేలుస్తాం
-
70 మంది లిస్ట్ తీశాం.. ఎవ్వరినీ వదలం
-
ఏపీ పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్..
-
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్మెన్లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి -
ఎవర్ని వదిలిపెట్టం..మా స్థలాలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు
-
జగన్ కోసం దేనికైనా సిద్ధం.. ఎల్లో మీడియాకి వార్నింగ్
-
పరిధి దాటొద్దని పోలీసులను హెచ్చరించిన సుప్రీం కోర్టు
-
ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్స్టాప్లో, రైళ్లలో, పార్క్ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్టైమ్తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రీల్స్ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
న్యూఢిల్లీ: భవిష్యత్లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్లో సంభవించిన భూకంపం థాయిలాండ్లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్పీ నివేదిక ప్రకారం జపాన్లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్నాథ్లో కొత్త రూల్ -
విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు
-
గిట్టబాటు ధరల్లేక, ప్రభుత్వం పట్టించుకోక రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగేకొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు. -
ఏపీ పోలీసులకి పొన్నవోలు సీరియస్ వార్నింగ్..
-
చంద్రబాబుకు పేర్నినాని వార్నింగ్
-
ఏపీ పోలీసులకు హైకోర్టు వార్నింగ్
-
SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా : రఘునందన్ రావు
-
బారువడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.. అయ్యన్నకు మాస్ వార్నింగ్
-
చంద్రబాబుకి లక్ష్మి పార్వతి వార్నింగ్
-
రాసిపెట్టుకో.. కూటమికి గోరంట్ల మాస్ వార్నింగ్
-
అంతకంత తిరిగిస్తాం.. పోసాని అరెస్ట్ పై పేర్ని కిట్టు రియాక్షన్..
-
బంగ్లాదేశ్కు జైశంకర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పట్ల వారి వైఖరి స్థిరంగా ఉండడం లేదన్నారు. అక్కడి మధ్యంతర ప్రభుత్వం భారత్ను రోజుకో విధంగా అపఖ్యాతి పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. భారత్పై రోజుకు ఒక రకంగా మాట్లాడుతూ మంచి సంబంధాలు కావాలంటే కుదరదన్నారు. ఏది కావాలో బంగ్లాదేశ్ ముందు తేల్చుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు, ఆ దేశ అంతర్గత రాజీకీయాలు భారత్తో సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు. భారత్తో శత్రుభావం పెంచుకోవాలనుకునే సంకేతాలివ్వడం బంగ్లాదేశ్కు మంచిది కావన్నారు. ఇటీవలే జైశంకర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హుస్సేన్తో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదంపై మెతక వైఖరితో వ్యవహరించకూడదని ఈ భేటీలో జైశంకర్ స్పష్టం చేశారు.కాగా, బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు జరిగిన షేక్హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మద్యంతర ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. మహ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం భారత్పై శత్రుభావంతో వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. -
ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లు..పాక్ ఇంటెలిజెన్స్ వార్నింగ్
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్లకు సంబంధించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సమాచారమందించినట్లు తెలుస్తోంది. ట్రోఫీలో మ్యాచ్లకు హాజరయ్యే విదేశీయులను ముఖ్యంగా చైనా,అరబ్ దేశస్తులను ‘ఐఎస్కేపీ’ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసే ప్రమాదముందని హెచ్చరించింది. చైనా,అరబ్ దేశస్తులు ఎక్కువగా సందర్శించే హోటళ్లు, ఇతర ప్రదేశాలపై ఐఎస్కేపీ ఉగ్రవాదులు నిఘా ఉంచినట్లు తెలిపింది. కిడ్నాప్ చేసిన వారిని ఉంచేందుకు మ్యాచ్లు జరుగుతున్న ఆయా నగరాల శివార్లలో ఐఎస్కేపీ ప్రత్యేక గదులు అద్దెకు తీసుకున్నట్లు సమాచారమిచ్చింది. అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించే విషయంలో పాకిస్తాన్ సామర్థ్యాన్ని తాజా ఇంటెలిజెన్స్ నివేదిక మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ఐఎస్కేపీ దాడులపై ఒకే తరహా సమాచారం అందించించడం గమనార్హం. -
నెతన్యాహు వార్నింగ్..దిగొచ్చిన హమాస్
టెల్అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా వేరే మృతదేహాన్ని హమాస్ పంపడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని, దీనికి ప్రతిగా హమాస్ను మొత్తమే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉగ్రవాద సంస్థ హమాస్ వెంటనే మెట్టుదిగి వచ్చింది. బందీ షిరి బిబాస్ మృతదేహాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది.తాము షిరిబిబాస్ మృతదేహాన్ని గుర్తుపట్టామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.కాగా, హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ తీసుకెళ్లిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్,అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్ది కాదని వెల్లడించింది.మహిళ మృతదేహం ఇతర బందీల పోలికలతో కూడా సరిపోలడం లేదని తెలిపింది. -
మా ప్రభుత్వం వస్తే మీకు ఇదే గతి పడుతుంది గుర్తుపెట్టుకోండి
-
దళిత సంఘం నేత రాంపుల్లయ్యను బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్
-
Big Question: గుంటూరు మిర్చి యార్డు సాక్షిగా బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
ఎవరిని వదలను.. సోషల్ మీడియా ట్రోల్ పై వంశీ భార్య వార్నింగ్


