warning
-
కంటికి తల తీస్తాం.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధం చర్చలతో ముగుస్తుందన్న వేళ ఇరాన్ ట్రంప్నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయీ అన్నారు. కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని హెచ్చరించారు.అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని 'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం ట్రంప్ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. -
ట్రంప్ చర్చల బూటకం అందుకే? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
ఇరాన్పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ప్రకటనపై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి బూటకమన్నారు. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నకిలీ వార్తలు సృష్టిస్తున్నారన్నారు.నిన్న( సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేస్తూ " అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో చర్చలు జరిపాడనేది పూర్తిగా అవాస్తవం దీని వెనుక రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ధరలు తగ్గించడం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులనుంచి ప్రజల దృష్టి మళ్లించడం"అని తెలిపారు.తమ దేశంపై జరిగిన దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని గాలిబాఫ్ తెలిపారు. ఇరాన్ అంతా ఏకంగా ఉందని తామనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. -
గూగుల్ లో ఈ 4 సెర్చ్ చేశారో ఇక జైలే..
-
కూటమికి మేకు దించుతాం.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ఎమ్మెల్యే వి అని కూడా చూడను: జక్కంపూడి గణేష్
-
2 రోజులే టైం.. తర్వాత ఇరాన్ ఉండదు.. ట్రంప్ సంచలన వార్నింగ్
-
ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్లైన్.. లేకపోతే ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరాయం కలగకుండా చూడాలన్నారు. లేకపోతే యుఎస్ఏ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కాదు కదా మరింత పెరుగుతున్నాయి. నిన్న( శనివారం) ఇరాన్ తన ప్రాంతానికి 4వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరిని షాక్కు గురిచేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. " 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లపై దాడికి తెగబడుతుంది. వాటిలో అతిపెద్దదానిపై మెుదటగా దాడి చేస్తుంది". అని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు.అయితే నిన్న ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించారు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకే తన లక్షాలను చేరుకుందని కనుక సైనిక చర్యను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. కాగా ఈ రోజు మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. -
ఒక రోజు వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త.. పిన్నెల్లి మాస్ వార్నింగ్
-
పిల్లలను చంపే నేరస్థున్ని లేపేస్తాం: ఇరాన్
టెహ్రాన్: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
టైం ఇస్తున్న కేసులు క్లోజ్ చేయాలి.. పోలీసులకు లోకేష్ వార్నింగ్
-
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కనెక్షన్ ఉన్న ఇళ్లలో డొమెస్టిక్ ఎల్పీజీ (ఎల్పీజీ)సిలిండర్లను ఉంచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరాలో తలెత్తుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా, జాతీయ ఇంధన నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.సవరించిన కొత్త నిబంధనలివేలిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లను రీఫిల్ చేయడంపై కూడా నిషేధం విధించారు. పీఎన్జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సంబంధిత కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది.ఎందుకీ కఠిన నిర్ణయం?మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద తలెత్తిన అడ్డంకులు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పెట్రోల్, డీజిల్ నిల్వలపై నిఘామరోవైపు పెట్రోల్ లేదా డీజిల్ను బాటిళ్లు, డబ్బాలు వంటి అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన భద్రతా ముప్పులు పొంచి ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విడి డబ్బాల్లో పెట్రోల్ పోసిన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.ఆందోళన వద్దు.. నిల్వలు పుష్కలం!దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. గృహ అవసరాలకు, రవాణా రంగానికి 100 శాతం గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తూ ‘నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్’ జారీ చేశారు. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం దేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్లెట్లలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా? -
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు.ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని అతడు (ట్రంప్) నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు.కానీ ఇరాన్ నిజంగా అనుకుంటే, అది అమెరికాపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయగలదు. ఇది చాలా పెద్ద సంఖ్యలో అమెరికన్ పౌరుల మరణానికి కారణమవుతుందని వారు భయపడుతున్నారు. బెదిరింపులు శక్తిని నిరూపించవు. ఒక దేశం నిజమైన గొప్పతనం శాంతి, న్యాయం, మానవ జీవితం పట్ల గౌరవంలో కనిపిస్తుంది’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లుగా ఆయా వార్తల్లో ఉంది.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి ధ్రువీకరణలు లేవు. అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) కానీ, ఇటు ఇతర ప్రామాణిక అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి దీని గురించి ప్రస్తావన లేదు. -
యూఏఈ పోర్టులపై ఇరాన్ హెచ్చరిక.. భారీ దాడుల ముప్పు
గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. యూఏఈలో ఉన్న అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలు, పోర్టులు భవిష్యత్ దాడుల్లో లక్ష్యాలుగా మారవచ్చని హెచ్చరించింది.ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా సైన్యం వినియోగిస్తున్న ప్రదేశాలు “న్యాయమైన లక్ష్యాలు” కావచ్చని పేర్కొంది. అందువల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.దాడులకు ముందు హెచ్చరికఇరాన్ ప్రకారం యూఏఈలోని కింది ప్రాంతాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అవి.. * ప్రధాన పోర్టులు, డాక్లు* అమెరికా సైన్యం ఉపయోగించే స్థావరాలు* అమెరికా ప్రయోజనాలు ఉన్న ఆయిల్ టర్మినల్స్* వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రాలుఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సైన్యం సూచించింది.ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడిఈ ఉద్రిక్తతల మధ్య ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడి జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘటనతో అక్కడి ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ఆయిల్ నిల్వ ట్యాంకుల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించగా, భారీగా పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి.ప్రపంచానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాలలో ఫుజైరా పోర్ట్ ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ చమురు ఎగుమతి అవుతుందని అంచనా.ఉద్రిక్తతలకు కారణం ఇదే..ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్లోని కీలక ఆయిల్ టర్మినల్ అయిన ఖార్గ్ ద్వీఈపంపై దాడులు జరిపిందని వార్తలు వచ్చాయి. ఈ చర్యలకు ప్రతీకారంగానే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. -
అమెరికాకు వార్నింగ్ ఇస్తూ.. ఇరాన్ సంచలన వీడియో విడుదల
-
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్పై యుద్దాన్ని మొదలు పెట్టిన తరువాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. אתמול במסיבת העיתונאים עמדתי על היעדים הברורים של המערכה: פגיעה במשטר הטרור באיראן, המשך המאבק מול שלוחותיו, והבטחת ביטחונה ועתידה של ישראל.אנחנו לא מחכים. אנחנו יוזמים, אנחנו תוקפים ואנחנו עושים זאת בעוצמה.צפו בדברים המלאים >> pic.twitter.com/hubJWVdiKQ— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 13, 2026 (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్) ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.ఇదీ చదవండి: లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం! -
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు, 14వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై స్పందిస్తూ, పరిస్థితి "చాలా వేగంగా మారుతోంది" అని, అతి త్వరలో ఇరాన్మాకు లొంగిపోనుందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ కొత్త బెదిరింపు తర్వాత ఇరాన్, లెబనాన్లో కొత్త దాడులు జరిగినట్లు తెలుస్తోంది.యుద్ధంలో తన పక్షం గెలిచిందని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఉత్పన్నమైన సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు పెరగడం ద్వారా అమెరికా గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉందని గురువారం అన్నారు. ఇరాన్ ఇంధన బెదిరింపులు చేస్తున్నప్పటికీ, అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "అమెరికా ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, కాబట్టి చమురు ధరలు పెరిగినప్పుడు, మేము చాలా డబ్బు సంపాదిస్తాము." ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. ఇరాక్లో విమాన ప్రమాదం: అమెరికా విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే శత్రుదాడిలో కాకుండా ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానం ప్రమాదానికి గురైంది. మరో విమానంతో జరిగిన ఢీకొనడం వల్ల జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాక్లోని కుర్దిస్తాన్ రీజియన్లో జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.UAE పై ఇరాన్ దాడులుమార్చి 12న ఇరాన్ నుండి ప్రయోగించిన 10 బాలిస్టిక్ క్షిపణులు మరియు 26 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విజయవంతంగా అడ్డుకుంది.దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు UAE మొత్తం 278 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు మరియు 1,540 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసింది. దుబాయ్ మధ్య భాగంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఇది ఇలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రవాసులకు యూఏఈ భారీ ఊరట కల్పించింది. ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత వీసా గడువు ముగిసిన వారు, కొత్త ఎంట్రీ పర్మిట్ అవసరం లేకుండానే మార్చి 31 వరకు ఉండేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధ పరిణామాలపై తొలిసారి స్పందించిన ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ పోరాడుతూనే ఉంటామన , హోర్ముజ్ జలసంధిని మూసివేస్తానని గురువారం నాటి ఒక టెలివిజన్ ప్రెజెంటర్ చదివిన సందేశంలో స్పష్టం చేశారు. రక్తం ధారబోసిన తమ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చు కుంటామని ప్రకటించాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెడుతుండగా ఇరు పక్షాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం. ఈ అనూహ్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2వేలకు పైగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది ఇరాన్లోనే ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఇరు పక్షాల భీకర దాడుల మధ్య కొనసాగుతున్న యుద్ధం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. -
'బ్యారెల్ ధర అంతకు చేరుతుంది'
టెహ్రాన్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, జీ-7 దేశాలు ప్రత్యేక సమావేశం జరిపి అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలు చమురు ధరలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెట్లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ అత్యవసర నిల్వల నుండి 4 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావాలని 32 సభ్య దేశాలు నేడు ఏకగ్రీవంగా నిర్ణయుంచినట్లు సమాచారం.EA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు సంక్షోభం ఉందని కనుకటి IEA సభ్య దేశాలు తక్షణమే స్పందించి అధిక మెుత్తంతో చమురు నిల్వలువిడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. అయితే మరోవైపు ఇరాన్ చమరు ధరల పెరుగుదలపై ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చింది." బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు చెల్లించడానికి ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలి. 1970 తర్వాత ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి (IEA) పెద్ద మెుత్తంలో చమురు నిల్వలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని తెలిపింది. ప్రస్తుతం చమురు బ్యారెల్ ధర 90 -110 డాలర్లుగా ఉంది. అదే విధంగా హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులిచ్చేది లేదని ఒక వేళ తమని కాదని వెళితే నౌకలను పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మూడుకు పైగా నౌకలను పేల్చివేసింది.కాగా ఇంత సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్ వెళ్లే నౌకలకు ఇరాన్ అనుమతిచ్చింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించి భారత నౌకలకు హార్మూజ్ జలసంధిలో రవాణాకు పచ్చ జెండా ఊపింది.. కాగా పశ్చిమాసియా యుద్దం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకూ 2వేలకు పైగా ప్రజలు మృతిచెందారు. అయితే అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు తగ్గకపోవడంతో యుద్దం ఇంకా కొనసాగుతోంది. -
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్ను కొట్టివేశారు.పంజాబ్లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్లో ఉన్న పిటిషన్ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ ఉపయోగించి ఈ పిటిషన్ను రూపొందించానని అంగీకరించాడు.సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్తో సహా ఐదు ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు -
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి "
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు. అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్ భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్ వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ToThe President of the United States of America @POTUSDear Mr. President, We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.Please mind your own business to the best of your abilities.Mutual respect…— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026 -
కొత్త సుప్రీం లీడర్ ను ఖతం చేస్తాం- ఇజ్రాయెల్ వార్నింగ్
-
వేట్లపాలెం ఘటనపై బాబు, పవన్ కు శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
-
బహిరంగ సభలో ప్రజలపై రెచ్చిపోయిన బాబు..
-
జగన్ కు ఎదురు రావాలని చూడకు.. తట్టుకోలేవు
-
‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్ వార్నింగ్!
బేరూత్: ఇజ్రాయెల్పై హెజ్బుల్లా జరిపిన రాకెట్ దాడులపై లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. హెజ్బుల్లా చర్యలు బాధ్యతారహితమైనవని,అనుమానాస్పదమైనవని అన్నారు. ఇటువంటి విచక్షణారహిత దాడులు తమ దేశాన్ని ప్రాంతీయ యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పెద్ద ఎత్తున రాకెట్లు, డ్రోన్లతో లెబనాన్పై విరుచుకుపడిన దరిమిలా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. أياً كانت الجهة التي تقف وراءها، فإنّ عملية إطلاق الصواريخ من جنوب لبنان عمل غير مسؤول ومشبوه، ويعرّض امن لبنان وسلامته للخطر ويمنح اسرائيل الذرائع لمواصلة اعتداءاتها عليه.لن نسمح بجر البلاد إلى مغامرات جديدة، وسنتخذ كل الإجراءات اللازمة لتوقيف الفاعلين وحماية اللبنانيين.— Nawaf Salam نواف سلام (@nawafsalam) March 2, 2026ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బుల్లా.. లెబనాన్ భద్రతను, సుస్థిరతను ప్రమాదంలో పడేస్తోందని ప్రధాని నవాఫ్ సలామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బుల్లా చేస్తున్న ఇటువంటి దాడులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ తన దురాక్రమణను కొనసాగించడానికి అవకాశం కల్పిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లోకి తమ దేశాన్ని లాగడాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.దేశ ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఇటువంటి ‘కొత్త సాహసాల’కు దేశం బలికాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హెజ్బుల్లా దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి. లెబనాన్ భూభాగంలోని హెజ్బుల్లా మౌలిక సదుపాయాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని సలామ్ శాంతిని కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు లెబనాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు.. -
ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్ అణు కార్యక్రమ పునరుద్ధరణ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆ దేశంపై మెరుపు దాడులు జరిపాయి. ఈ దాడిని ధృవీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ పాలకులకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తక్షణమే ఆయుధాలను వీడాలని, లేనిపక్షంలో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్ఛరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదన్నదే తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణు కేంద్రాలను అమెరికా సర్వనాశనం చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేపట్టిందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు చేశామని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే దాడులు తీవ్రతరం చేశామన్నారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని ట్రంప్ హెచ్చరించారు.టెహ్రాన్ లోని దుష్ట నియంతృత్వ పాలనను అంతమొందించే లక్ష్యంతో భారీ పోరాట కార్యకలాపాలు ప్రారంభమైనట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ట్రంప్ తన వ్యూహాన్ని స్పష్టం చేస్తూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏ పరిస్థితుల్లోనూ ఆ దేశాన్ని అణ్వాయుధాలు సాధించనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులకు ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, లేనిపక్షంలో ఖచ్చితమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, ఆ పరిశ్రమను సమూలంగా నాశనం చేస్తామని, వారి నౌకాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న ఉగ్రవాద ప్రాక్సీ ముఠాలను ఇకపై ఉపేక్షించబోమని, వేలాది మంది అమెరికన్ల మరణానికి కారణమైన ఐఈడీ దాడులకు చరమగీతం పాడుతా మన్నారు.మరోవైపు ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ముందస్తుగా అడ్డుకునే క్రమంలో ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను చేపట్టినట్లు టీపీఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు తప్పలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ నుంచి ప్రతిదాడి వచ్చే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దేశవ్యాప్తంగా సైరన్లను మోగించి, పౌరులను అప్రమత్తం చేశాయి. ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ దేశాలు ఉత్కంఠగా పరిస్థితులను గమనిస్తున్నాయి. pic.twitter.com/BZuJDudLej— Donald J. Trump (@realDonaldTrump) February 28, 2026 -
‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ, చాలామంది ఎంతో ఇష్టంగా అరటిపండ్లను తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యం పాలిట ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మార్కెట్లో పసుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ అరటిపళ్లు ప్రకృతి ప్రసాదించినవి కావు.. అవి ల్యాబొరేటరీలో తయారైన కెమికల్ ఫలాలు.. వ్యాపార దాహంతో కొందరు చేస్తున్న ఈ ‘స్లో పాయిజనింగ్’ కారణంగా జనం తమకు తెలియకుండానే ప్రాణాంతక వ్యాధుల కోరల్లో చిక్కుకుంటున్నారు’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మెరుపు వెనుక దాగున్న నిజం తెలిస్తే ఎవరైనాసరే మరోమారు అరటి పండును ముట్టుకునేందుకు కూడా భయపడతారని నిపుణులు అంటున్నారు.కృత్రిమ మెరుపు.. ఆరోగ్యానికి ఎసరు!కొందరు వ్యాపారులు పచ్చి అరటి గెలలను గంటల వ్యవధిలో పండించేందుకు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ డాక్టర్ మనన్ వోరా తెలిపిన వివరాల ప్రకారం ఈ రసాయనాలు పండు రంగును కృత్రిమంగా మారుస్తాయి. బయటకు పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించినా, లోపల పండు సహజంగా పక్వానికి రాదు. ఇలాంటి పండ్లను తింటే మనం పండును కాదు, విషాన్ని తింటున్నామని అర్థం.సహజమైన పండును గుర్తించడం ఎలా?సహజంగా పండిన అరటిపండు ఎప్పుడూ ఏకరీతి రంగులో ఉండదు. దానిపై అక్కడక్కడా చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. పండు చూడటానికి కొంచెం వడలినట్లు అనిపించినా, లోపల మాత్రం అత్యంత తీయగా, మెత్తగా ఉంటుంది. అయితే కెమికల్స్తో పండించిన పండు పసుపు రంగులో మెరిసిపోతుంటుంది. ముఖ్యంగా తొడిమ భాగం ఆకుపచ్చగా ఉండి, పండు మాత్రం పసుపుగా ఉంటే అది కచ్చితంగా కృత్రిమంగా పండించిదరి గుర్తించవ్చని నిపుణులు చెబుతున్నారు.లోపల గట్టిగా.. చప్పగా ఉందా?కార్బైడ్ వేసి మగ్గబెట్టిన పళ్లను గుర్తించడానికి మరో సులువైన మార్గం ఉంది. ఇవి బయటకు పసుపుగా ఉన్నా, లోపల గుజ్జు గట్టిగా, చప్పగా ఉంటుంది. సాధారణంగా అరటిపండు క్రీమ్ రంగులో ఉండి మంచి సువాసన వస్తుంది. కానీ రసాయనాల ప్రభావంతో పండిన పండులో ఆ సహజమైన రుచి, వాసన ఉండవు. ఇలాంటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రెట్టింపు అవుతాయి.కాల్షియం కార్బైడ్.. ఒక నిశ్శబ్ద హంతకికాల్షియం కార్బైడ్ రసాయనంలో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరినప్పుడు కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసిడిటీ, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రంగును చూసి పండ్లనును ఎంచుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామని గుర్తించాలి.అప్రమత్తతే అసలైన రక్షణమనం కొనే పండు అందంగా ఉండటం కంటే, ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం. కొంచెం మచ్చలు ఉన్నా, సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడమే శ్రేయస్కరం. పండ్లను తినే ముందు కనీసం గంట సేపు నీటిలో ఉంచి, బాగా కడిగిన తరువాత తినడం వల్ల రసాయనాల ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: 70 శాతం భారతీయులు చేస్తున్న తప్పు! -
టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు
-
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. ఇక మీరు తప్పయించుకోలేరు..
-
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శించారు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు (SCOTUS) ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వేదికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు.కోర్టు తీర్పును పక్కనపెట్టి, తక్షణమే 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఆ సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి తన పంతాన్ని చాటుకున్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) ఆసరాగా చేసుకుని ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.యూరోపియన్ యూనియన్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకుంటున్న తరుణంలో ట్రంప్ వాటిపై స్పందిస్తూ ‘కొనేవాడు జాగ్రత్త’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వాముల విషయంలోనూ ఈ సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో భారత్పై విధించిన 50 శాతం భారీ సుంకం, చర్చల అనంతరం 18 శాతానికి తగ్గినప్పటికీ, తాజా పరిణామాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Venezuela: మిన్నంటిన రాజకీయ ఖైదీల నిరసనలు -
గుర్తుపెట్టుకో.. చెంపలేసుకొని సారీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
-
రియల్ ఎస్టేట్ సంస్థలకు రెరా వార్నింగ్.. నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇళ్లు/ఫ్లాట్/యూనిట్ విక్రయాల కోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లతో పాటు ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేస్తుందని తెలియజేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన తర్వాతే విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రమోటర్లు/డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను కోరింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందకుండానే చట్టవిరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిన పలు సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.నోటీసులు అందుకున్న సంస్థల్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్ తదితర సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ పొందుపరిచినప్పటికీ.. ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. స్వర్గసీమ కన్స్ట్రక్షన్ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిమాణం, ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్గా రిజిస్టర్ చేసినట్టు గుర్తించింది. ప్రకటనలో మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే.. -
ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
దేశంలో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గుప్పిస్తున్న ‘ఉచితాల’ సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అసలైన లబ్ధిదారులకు, సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఇలాంటి విధానాలు పాటిస్తారా అని ప్రశ్నించింది.ఖజానా ఖాళీ అవుతున్నా ఆగని కానుకలుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం (జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి) ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలైనా, లోటు బడ్జెట్తో నడుస్తున్న రాష్ట్రాలైనా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు సైతం ఎన్నికల ముందు స్కూటీలు, బట్టలు, ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయడానికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాయి?’ అని ధర్మాసనం నిలదీసింది.ఈ ప్రస్తావనకు సందర్భం ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎన్పీడీసీఎల్) దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ మొదలైంది. విద్యుత్ (సవరణ) చట్టం-2024లోని రూల్ 23 రాజ్యాంగ బద్ధతను తమిళనాడు ప్రభుత్వం సవాలు చేసింది. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘విద్యుత్ రంగంలో సంపన్నుల నుంచి వసూలు చేసి లాభాలు గడించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయడం లేదు? హరియాణా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏదైనా కావచ్చు.. ఎన్నికలు రాగానే పథకాల వెల్లువ ఎందుకు వస్తోంది?’ అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు, సిద్ధాంతకర్తలు ఈ సంస్కృతిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.కోర్టు పరిమితులుఒక దశలో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు భావించింది. అయితే న్యాయవ్యవస్థ పరిమితులను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించుకుంది. కానీ, సంక్షేమానికి, విచ్చలవిడి ఖర్చుకు మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.టీఎన్పీడీసీఎల్ వాదన ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రధానంగా విద్యుత్ (సవరణ) నియమావళి, 2024లోని రూల్ 23 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైంది.రూల్ 23 అంటే..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) తాము సరఫరా చేసే విద్యుత్తుకు అయ్యే ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వర్గానికి (ఉదాహరణకు రైతులకు లేదా గృహ వినియోగదారులకు) ఉచిత విద్యుత్ లేదా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే డిస్కమ్ సంస్థలకు చెల్లించాలి.తమిళనాడు ప్రభుత్వం ఏమంటుంది?తమిళనాడు ప్రభుత్వం ఈ నిబంధనను కొన్ని కారణాలతో వ్యతిరేకిస్తోంది. విద్యుత్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా సబ్సిడీలు ఇచ్చే స్వతంత్ర అధికారం ఉంటుంది. కేంద్రం ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టడం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని వారి వాదన. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తక్షణమే వినియోగదారులపై వేయడం సాధ్యం కాదని, అది సామాన్యులపై భారం చూపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది దశాబ్దాలుగా వస్తున్న విధానం. రూల్ 23 వల్ల ఈ సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించినప్పుడు ఉచితాల అంశాన్ని లేవనెత్తింది. ఒకవైపు డిస్కమ్లు భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్తూ, మరోవైపు సంపన్నులకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది. సంపన్నుల నుంచి సరైన ధర వసూలు చేస్తే ఆ ఆదాయాన్ని పేదలకు మెరుగైన విద్యుత్ అందించడానికి లేదా మౌలిక సదుపాయాల కల్పనకు వాడవచ్చు కదా అని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
ఫాస్టాగ్ FASTag యాన్యువల్ పాస్కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచు తున్నారని వెల్లడించింది. అధికారిక NHAI ప్లాట్ఫారమ్లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్వినియోగదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలుఈ మోసపూరిత పోర్టల్లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్గా నటిస్తూ, నకిలీ పాస్ను "యాక్టివేట్" చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్ కూడా చేస్తారు.ఈ స్కామ్లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.ఈ మోసం ఎలా జరుగుతుంది?సెర్చ్ ఇంజన్లలో (Google వంటివి) ప్రకటనల ద్వారా మోసపూరిత లింకులు పైన కనిపించేలా చేస్తారు.వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన వివరాలు మరియు పేమెంట్ వివరాలను అడుగుతారు.మీరు చేసే పేమెంట్ నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుంది. చెల్లింపు తర్వాత ఎలాంటి పాస్ రాదు, పైగా మీ బ్యాంక్ వివరాలు కూడా వారి చేతికి చిక్కుతాయి.సేఫ్టీ టిప్స్FASTag-సంబంధిత సేవలను ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు రహదారి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఈ సలహాను పంచుకున్నారు.వినియోగదారులు వెబ్సైట్ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి .ఆన్లైన్లో శోధించేటప్పుడు స్పాన్సర్ చేసిన లింక్లు లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.మోసగాళ్ళు చట్టబద్ధమైన NHAI చెల్లింపు పేజీలను పోలి ఉండేలా వెబ్సైట్లను సృష్టిస్తారు. వినియోగదారులు ఈ లింక్లపై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్లు, వాహన సమాచారం , చెల్లింపు ఆధారాలు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు.చెల్లింపు ఇంటర్ఫేస్ ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనఖాతాలోని సొమ్మును డిజిటల్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ అధికారిక NHAI వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలి.వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి OTP లేదా పిన్ అడిగితే చెప్పకండి.ఒకవేళ మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అనేది బలమైన రక్షణ అని అధికారులు నొక్కిచెప్పారు, భారతదేశం అంతటా ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరుతున్నందున వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంకాగా 2025 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుండి యాన్యువల్ పాస్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికి తోడు జాతీయ రహదారులపై ప్రయాణించే, ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
-
దమ్ముంటే రా.. నేను రెడీ.. నువ్వు రెడీనా?
-
మీరు పొలిమేరలు దాటే లోపే.. జడ శ్రవణ్ వార్నింగ్
-
పొగరు తగ్గించుకో... మౌనిక వార్నింగ్
-
చంపేస్తారా..? రోజా ఉగ్రరూపం!
-
మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేసుంటే.. బాబ, పవన్ పై రోజా ఫైర్
-
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్
-
జంగిల్ రాజ్ కు జనం వార్నింగ్
-
జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా
చైనా విషయంలో భారత్కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్కు హెచ్చరిక జారీ చేశారు.అరుణాచల్ విషయంలో డ్రాగన్ కంట్రీ తరచుగా భారత్పై కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు. అయితే భవిష్యత్తులో చైనా, భారత్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్ను హెచ్చరించారు.2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్ పవర్గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మీరెన్ని కుట్రలు చేసిన జగన్ ను, జనాన్ని ఎవరూ ఆపలేరు
-
చీప్ పాలిటిక్స్ మానుకో.. లేదంటే వెంకన్న గురించి తెలుసు కదా..
-
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే.. ఇరాన్ వార్నింగ్
-
అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్
-
ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..
-
మాపై దాడి చేస్తే అంతే.. ట్రంప్కు ఖమేనీ తీవ్ర హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ట్రంప్ ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అణుఒప్పందం విషయంలో ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా సీన్ను మించి రిపీట్ అవుతుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సుప్రీం ఖమేనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ట్రంప్ను హెచ్చరించారు.ఇటీవల ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందిచారు. ప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా నావిక దళం వెళుతుందని అది ఇంతకు ముందు వెనిజువెలా వెళ్లన దాని కంటే పెద్దదన్నారు. సమయం మించిపోతుందని అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగిరాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. దానికి ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. కాగా తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్ను తీవ్రంగా హెచ్చరించారు.ఆదివారం ఇరాన్ శాసనసభలో ఆదేశ సుప్రీం లీడర్ ఖమేనీ మాట్లాడారు. " టంప్ వాక్చతుర్యానికి ఇరానీయులు భయపడవద్దు.మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మాపై దాడి చేస్తే గట్టిగా బదులిస్తాం. ఒకవేళ మాపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి" అని అన్నారు. అంతేకాకుంగా ఇరాన్లో జరిగిన నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతోనే జరిగాయని ఖమేని అభివర్ణించారు.అల్లర్లు జరిపిన వారు ప్రభుత్వ కార్యాలయాలపై, మసీదులపై, బ్యాంకులపై దాడిచేశారని అది ఇరాన్పై జరిగిన తిరుగుబాటన్నారు. దానిని భద్రతా బలగాలు విజయవంతంగా అణిచివేశాయని తెలిపారు ఇరాన్లో జరిగిన నిరసనల్లో మూడు వేల మంది పౌరులు మరణించినట్లు ఆ దేశం అంగీకరించింది. ఇటు ట్రంప్ హెచ్చరికలు.. అటు ఖమేనీ తగ్గేదేలే అనడంతో ప్రస్తుతం ఏం జరగనుందా అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. -
మేం అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంటే ఊహించుకో..
-
గాజులు తొడుక్కొని లేము.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాం.. ఎమ్మెల్యే గల్లా మాధవికి వార్నింగ్
-
అడుగు పెడితే.. అంతు చూస్తా.. ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్
-
ఉపేయ్.. కుదిపేయ్ అంట.. వీళ్లు ఎమ్మెల్యేలా..?
-
అడిగింది చెప్పు.. ఎక్స్ట్రాలు చెయ్యకు.. క్లాస్ పీకిన చంద్రబాబు
-
విశాఖ కలెక్టర్ కు మేయర్ వార్నింగ్
-
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
-
ఒక్కొక్కడినీ ఒంగోపెట్టి తన్నుతా.. కార్యకర్తలపై రెచ్చిపోయిన చింతకాయల విజయ్
-
వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. లోకేష్ కు జోగి రమేష్ మాస్ వార్నింగ్
-
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
‘‘నన్ను చంపేస్తే.. ఇరాన్ను భూస్థాపితం చేస్తాం’’ అంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. 'న్యూస్ నేషన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్లో అశాంతి ఇలాగే కొనసాగితే దేశం మొత్తం పేలిపోతుందంటూ మరో వార్నింగ్ ఇచ్చారు. కాగా, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇటీవల పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే..@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026 మరోవైపు, ట్రంప్.. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు. -
వైన్ షాపుల విషయంలో తగ్గేదేలే.. కోమటిరెడ్డి వార్నింగ్
-
ప్రపంచ క్రెడిట్ మార్కెట్లో ‘హీట్’
ప్రపంచ క్రెడిట్ మార్కెట్లు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో కార్పొరేట్ బాండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదే సమయంలో రిస్క్కు లభించే ప్రతిఫలం (ప్రీమియం) కనిష్ట స్థాయికి పడిపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రెడిట్ మార్కెట్లలో కనిపిస్తున్న ‘ఆత్మసంతృప్తి’ (Complacency) భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.రికార్డు స్థాయిలో తగ్గిన ప్రీమియం రాబడిబ్లూమ్బెర్గ్ గణాంకాల ప్రకారం, కార్పొరేట్ రుణాలపై ప్రీమియం నుంచి లభించే మార్జిన్ కేవలం ఒక శాతానికి పడిపోయింది. ఇది జూన్ 2007 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. ఆర్థిక స్థిరత్వంపై నమ్మకం, రేటింగ్లు, కరెన్సీలో మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో క్రెడిట్ కంపెనీలకు తగిన పరిహారం లభించడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా రిస్క్ ఉన్న విభాగాల్లో క్రెడిట్ జోలికి వెళ్లకపోవడమే సరైన వ్యూహమని అబెర్డీన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ ల్యూక్ హిక్మోర్ పేర్కొన్నారు.బార్క్లెస్ పీఎల్సీ (Barclays PLC) విశ్లేషణ ప్రకారం, యూఎస్ రుణ మార్కెట్లో రిస్క్ పట్ల అశ్రద్ధ లేదా క్రెడిట్ కంపెనీల్లో ఆత్మసంతృప్తి స్థాయి 93 శాతానికి చేరింది. ఇది డిసెంబర్ 2024 తర్వాత గరిష్ట స్థాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు పుట్టడం చాలా సులభమైంది. కొత్త కార్పొరేట్ బాండ్లపై చెల్లించాల్సిన అదనపు వ్యయం కేవలం 1.3 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంది. ఇది గత ఏడాది సగటు (3 బేసిస్ పాయింట్లు) కంటే చాలా తక్కువ. ఈ ఏడాది జారీ చేసిన బాండ్లకు విక్రయ పరిమాణం కంటే ఇన్వెస్టర్ల నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం మార్కెట్ జోరుకు నిదర్శనం.ముంచుకొస్తున్న సవాళ్లుమార్కెట్లు ఇంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభాలు ఇంకా కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ వాణిజ్యంపై చూపే ప్రభావాన్ని తేలికగా తీసుకోలేం. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ చిన్న పొరపాటు జరిగితే క్రెడిట్ కంపెనీలు ఏమేరకు తట్టుకుంటాయనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.రికార్డు స్థాయిలో బాండ్ల జారీఈ ఏడాది జనవరి తొలి పదిహేను రోజుల్లోనే కంపెనీలు సుమారు 435 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేశాయి. ఇది ఒక రికార్డు. గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ వంటి దిగ్గజాలు కూడా 16 బిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించాయి. పెట్టుబడిదారుల వద్ద నగదు లభ్యత ఎక్కువగా ఉండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశలు మార్కెట్ను నడిపిస్తున్నాయి. అయితే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని దిగ్గజ సంస్థలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: మీరు యాక్టివా.. పాసివా? -
దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్
-
CBS న్యూస్ యాంకర్ కు ట్రంప్ టీమ్ వార్నింగ్
-
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఫిబ్రవరి ఒకటి నుండి సిగరెట్లపై పన్నులు పెరగనున్న తరుణంలో, అక్రమ పొగాకు విక్రయాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్లలో ఒకటిగా ఉందని, ఈ నేపథ్యంలో పన్నుల పెరుగుదల అక్రమ ముఠాలకు మరింత ఊతమిచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దక్షిణాఫ్రికా, అజర్బైజాన్ తదితర దేశాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు భారత్కు హెచ్చరికగా మారుతున్నాయని వారు తమ వాదన వినిపిస్తున్నారు.దక్షిణాఫ్రికాలో ఏం జరిగింది?దక్షిణాఫ్రికాలో అక్రమ సిగరెట్ల వ్యాపారం మరింతగా మితిమీరిపోవడంతో, ఆ దేశానికి చెందిన సిగరెట్ల తయారీ సంస్థ ‘బ్రిటిష్ అమెరికన్ టొబాకో’ (బీఏటీ)తమ ప్లాంట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పన్నులు చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ ధరకు విక్రయించే నకిలీ సిగరెట్ల కారణంగా ఈ సంస్థ తన చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా దక్షిణాఫ్రికాలో సిగరెట్ల తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది.అజర్బైజాన్లోనూ..అజర్బైజాన్లో పొగాకు స్మగ్లింగ్లో ఒక మాజీ కస్టమ్స్ అధికారి హస్తం ఉండటం, ఆపై అతను అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. దేశంలో పొగాకు అక్రమ నెట్వర్క్లు ఎంత శక్తివంతంగా మారాయంటే, అవి ప్రభుత్వ వ్యవస్థల్లోకి కూడా చొచ్చుకుపోయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒకసారి ఈ అక్రమ ముఠాలు వేళ్లూనుకుంటే, వాటిని అదుపు చేయడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటాభారతదేశంలో గతంలో పన్నులు భారీగా పెంచినప్పుడు, చట్టబద్ధమైన, అక్రమ సిగరెట్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా కనిపించింది. ఇది స్మగ్లర్లను ప్రోత్సహించేదిగా పరిణమించింది. ప్రస్తుతం దేశంలో అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటా 26.1% వరకు ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 23 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. ఈ నిధులు ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగానికి అందకుండా పోతున్నాయి.సరైన పన్ను విధానంతో..ప్రజారోగ్యం దృష్ట్యా పొగాకుపై పన్నులు అవసరమైనప్పటికీ, అవి హేతుబద్ధంగా లేకపోతే అక్రమ మార్కెట్ వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. పన్నుల భారం మితిమీరినప్పుడు లీగల్ మార్కెట్ కుంచించుకుపోయి, స్మగ్లింగ్ మాఫియా బలపడుతుందనే వాదన వినిపిస్తోంది. అందుకే, పటిష్టమైన నిఘా, సరైన పన్ను విధానం ద్వారానే అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: మౌని అమావాస్య : ధార్మికమే కాదు.. ఆరోగ్యానికి ‘సూపర్ ఫుడ్’ -
డిజిటల్ బుక్ లో ఎక్కించండి.. తర్వాత చూసుకుందాం
-
JC నా వెంట్రుకతో సమానం.. పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
-
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది. అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఇరాన్కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా. అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. -
మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్
-
24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా
-
కొంచమైనా సిగ్గుండాలి... బాబుకు CPI రామకృష్ణ మాస్ వార్నింగ్
-
మీడియా హౌసా.. బ్రోకర్ హౌసా.. ABN రాధాకృష్ణకు మాస్ వార్నింగ్
-
బాబు అవినీతి, క్రెడిట్ చోరీపై దుమ్ముదులిపిన జగన్
-
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కు పాదం
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్కు ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు.. గుజరాత్, రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
నీ శిష్యుడి కోసం రాయలసీమ గొంతు కోస్తే.. మేము ఊరుకోం!
-
నెక్స్ట్ నువ్వే.. జాగ్రత్త! కొలంబియాకు ట్రంప్ మాస్ వార్నింగ్
-
ఇక కొలంబియా వంతు!
వాషింగ్టన్: లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. ‘తర్వాత నీ వంతే కావచ్చు, జాగ్రత్త!’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ ఓ బూతు మాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తున్నారు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘ పలు నేరగాళ్ల ముఠాలకూ ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోకుంటే వాటికీ వెనిజువెలా గతే పడుతుంది’’ అంటూ అల్టిమేటమిచ్చారు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్పై దాడులకు వెనుకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపేందుకు కూడా వీల్లేకుండా చేస్తామన్నారు. ‘‘మా చుట్టూ మంచి మిత్రులుండాలి. స్థిరత్వం, శక్తియుక్తులుండాలి. వెనిజువెలాలో అమితమైన శక్తిసామర్థ్యాలున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరముంది. మా ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి’’ అంటూ కుండబద్దలు కొట్టారు. వెనెజువెలాలో మా సైన్యం..వెనిజువెలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ‘‘వెనిజువెలాలో మా సైనిక మోహరింపులు కొనసాగుతాయి. అక్కడ మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా, మేం పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కణ్నుంచి వైదొలగేదే లేదు’’ అని స్పష్టం చేశారు.సైన్యంతో మేం సిద్ధం: పెట్రోట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది కచ్చితంగా మానవతా సంక్షోభానికి దారి తీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేమిప్పటికే అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. మదురోకు పెట్రో అత్యంత సన్నిహితుడు.క్యూబా పని పడతాంరూబియో సంకేతంవెనిజువెలా తర్వాత ఇక క్యూబాయే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ‘నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరతా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమా నాలు బలపడుతున్నాయి. మెక్సికోకు ట్రంప్ శనివారం హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ‘‘మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. అధ్యక్షురాలు క్లాడియా షేన్బాం మంచి వ్యక్తే. కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయి’’ అని ఆరోపించారు. -
వేలు చూపిస్తూ వార్నింగ్.. ఏరా.. నీ అంతు చూస్తా.. CIకి టీడీపీ నేత బెదిరింపు
-
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..
-
ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..
-
రెండు నెలలు చాలు.. జగన్ వచ్చాక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు
-
లోకేష్ జాగ్రత్త.. ఎక్కువ చించుకోకు..!
-
YSRCP నేతలపై ఎవడైతే దాడి చేసాడో గుర్తుపెట్టుకోండి.. మిథున్ రెడ్డి మాస్ వార్నింగ్
-
ఢిల్లీలో హై టెన్షన్.. బంగ్లాకు హిందూ సంఘాల వార్నింగ్
-
సోషల్ మీడియాలో పోస్టులా.. అయితే ఇది మీకోసమే?
సోషల్ మీడియా ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రూపకంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే న్యూస్ చూస్తుంటాం. కొన్ని సార్లు మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తుంటాం. అయితే మనం ఫార్వడ్ చేసే సమాచారం వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రచారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజనిర్ధారణతో సంబంధం లేకపోవడం,ఎటువంచి ఖర్చు లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఇష్ఠారీతిన సోషల్ మీడియా ప్రచారం చేపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలలో జరిగే అసత్య ప్రచారాల వల్ల మహిళలు, పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే వాటిపై సరైన అవగాహాన లేకపోవడంతో కొంతమంది అటువంటి మెసేజ్లను గమనించకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి మెసేజ్లపై జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెసేజ్లు ఫార్వర్డ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చేసే మేసేజ్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకూడదు. తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ తప్పుడు వార్తలు సష్టించవద్దు.ఏదైనా మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు అది సరైందా కాదా దానివల్ల ఏవరి మనోభావాలైనా దెబ్బతింటాయా అనే విషయం గుర్తుంచుకోవాలని పోలిీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
బాబుకు జగన్ దబిడి దిబిడి.. మీకు చేతకాకపోతే వదిలేయండి
-
బాబు, లోకేష్ ను రఫ్ఫాడించిన వైఎస్ జగన్
-
"సెవన్ సిస్టర్స్ చీలిపోతుంది"
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై కారు కూతలు కూశారు. భారత్ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్సిస్టర్స్ అని అంటారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు. -
ఇకపై ఉపేక్షించేది లేదు : సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మరో కీలక అంశంపై స్పందించారు. బెట్టింగ్ యాప్స్ లాంటి తీవ్రమైన అంశాలపై స్పందించిన సజ్జనార్ బిడ్డల అనాదరణకు గురై రోడ్డు పాలువుతున్న వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమంపై దృష్టి సారించారు. ఈ మేరకు వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలివేస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అని సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో హెచ్చరిక కనిపెంచిన అమ్మానాన్నల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చు. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించ వచ్చని తన ట్వీట్లో సూచించిన వైనం నెట్టింట పలువురిని ఆకట్టుకుటోంది.ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలుతుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్ఆర్టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో… pic.twitter.com/sBDOllJA1G— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 16, 2025 -
బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
హైదరాబాద్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: చారుసిన్హా.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశామని, సీఐడీ, మహిళా భద్రత విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్ను ఆశ్రయించవచ్చన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. ట్రాన్స్జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కలి్పంచేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తప్సీర్ ఇకుబాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రత విభాగ డీసీపీ లావన్యనాయక్ జాదవ్, సైబరాబాద డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కూటమికి YS జగన్ దబిడి దిబిడి
-
మమ్మల్ని రాక్షసులు అంటావా.. నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా
-
తాట తీస్తాం..! పవన్ కు వార్నింగ్
-
వారం రోజులు టైం ఇస్తున్న.. లోకేష్ కు నాగార్జున యాదవ్ వార్నింగ్
-
ఆ రోజులు పోయాయి.. దేశం వదిలి పారిపోయినా వదిలిపెట్టం..
-
జెన్ Z : బొటాక్స్, ఫిల్లర్లు, కెమికల్ పీల్స్ మీదే దృష్టి!
ముఖం మీద ఒక్క చిన్నమచ్చ కూడా ఉండకూడదు. ముడతలు అస్సలు రాకూడదు. ఫిల్టర్ ఫోటో కాపీ అంత అందంగా ఫేస్ వెలిగిపోవాలి. ఇదే నేటి మిలీనియల్స్ , జెన్ Z ఆరాటం. సౌందర్యానికి కొత్త అర్థం చెబుతూ తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. హైపర్-విజిబిలిటీ, సోషల్ మీడియా ఫిల్టర్ల యుగంలో, అందానికి అర్థం, పరమార్థం మారిపోతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. అందాన్ని రక్షించుకునేందుకుగా మిలీనియల్స్ , జెన్ Z లు బొటాక్స్, ఫిల్లర్లు, కెమికల్ పీల్స్ , లేజర్ టోనింగ్ మైక్రోనీడ్లింగ్ లాంటి ట్రీట్మెంట్స్ వైపు పరుగులు పెడుతున్నారు. వృద్ధాప్యం సంకేతాలను ఆలస్యం చేయడానికి సూక్ష్మమైన, సైన్స్-ఆధారిత చికిత్సలను ఉపయోగించే చర్మ సంరక్షణకు ఒక చురుకైన విధానంగా ఉంటోంది. ముడతలొచ్చేదాకా ఆగకుండా, అవి రాకుండా ఏం చేయాలి అనేది తపన. కొల్లాజెన్ను రక్షించడం, ఆకృతిని మెరుగుపర్చుకోవడం, గ్లోను పెంచుకోవడమే లక్ష్యం. ప్రీవెంటివ్ ఈస్తటిక్స్ అంటే వృద్ధాప్య చాయలను ఆలస్యం చేయడానికి సూక్ష్మమైన, ముందస్తు జోక్యాలను ఉపయోగించడం. గతంలో 40-50వ పడిలో ఉన్నవారు ఇలాంటి చికిత్సలను కోరుకున్నారు. కానీ ఇపుడు 20- 30లలో ఉన్నవారే స్కిన్ హెల్త్కోసం, ముడతలు లేదా పిగ్మెంటేషన్ను నివారించడానికి బోటాక్స్, ఫిల్లర్లు, కెమికల్ పీల్స్ లేదా లేజర్ టోనింగ్ వంటి ఎంపికలను ఎంచుకుంటున్నారని గోవాలోని మణిపాల్ హాస్పిటల్లోని కన్సల్టెంట్-ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అమీ పెడ్నేకర్ వివరించారు. చదవండి: ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ఎంతవరకు సేఫ్, ఎలా బుక్ చేసుకోవాలి?అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ బాధ్యతాయుతంగా ,వైద్య పర్యవేక్షణలో చేసినప్పుడు, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. “మెడికల్-గ్రేడ్ స్కిన్కేర్, సన్స్క్రీన్ , మినిమల్లీ ఇన్వాసివ్ విధానాలు సురక్షితమైన, ప్రభావవంతమైన నివారణ సంరక్షణకు పునాదిని ఏర్పరుస్తాయి. అవి సాధ్యమైనంత ఎక్కువ కాలం దాని సహజ సౌందర్యాన్ని నిర్వహించడానికి సహాయ పడతాయంటారు. చదవండి: నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస: మాజీ మిస్ ఇండియాసమస్య ఎక్కడ వస్తుంది అంటే?కానీ డిమాండ్ పెరిగేకొద్దీ, నిపుణులు అభివృద్ధి చెందుతున్న ప్రతికూలతలపై డాక్టర్ అమీ హెచ్చరిస్తున్నారు . అర్హత లేని ప్రొవైడర్లచే ఇంజెక్షన్లు ,పవర్ ఆధారిత చికిత్సలను అధికంగా ఉపయోగించడం హానికరమంటున్నారు.“అధిక ఫిల్లర్లు లేదా అశాస్త్రీయ పరికరాల కలయికలు అసహజ ఫలితాలకు లేదా శాశ్వత సమస్యలకు దారితీయవచ్చు. అందుకే శరీర నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రంపై లోతైన అవగాహన చాలా అవసరం అంటారాయన. బెంగళూరులోని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్లోని ప్లాస్టిక్, పునర్నిర్మాణ మరియు సౌందర్య శస్త్రచికిత్స విభాగం HOD డాక్టర్ అశోక్ బి.సి. కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "నివారణ సౌందర్యశాస్త్రం, సరిగ్గా చేసినప్పుడు, దుష్ప్రభావాలను తగ్గించవచ్చు . ఇన్వాసివ్ విధానాల అవసరాన్ని ఆలస్యం చేస్తుంది. కానీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగాలి. లేదంటే ఏదైనా పొరబాటు జరిగితే ఇన్ఫెక్షన్, అలెర్జీ లేదా మచ్చలు వంటి సమస్యలొస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!గమనించాల్సిన అంశాలునివారణ సౌందర్యశాస్త్రం అనేది ఒకే పరిమాణానికి సరిపోయేది కాదని ఇద్దరు నిపుణులు నొక్కి చెప్పారు. ఏదైనా సౌందర్య చికిత్సను ప్రారంభించే ముందు స్వీయ-అవగాహన మానసిక పరీక్షల అవసరాన్ని డాక్టర్ అశోక్ నొక్కి చెప్పారు. కొంతమంది వ్యక్తులు శారీరక సమస్యల కంటే భావోద్వేగ లేదా విశ్వాస సమస్యలను పరిష్కరించడానికి సౌందర్య విధానాలను కోరుకుంటారు. నిపుణులు తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశాలివి అంటారు.గర్భిణీలు, పాలిస్తున్న తల్లులు లేదా చురుకైన చర్మ వ్యాధులు లేదా కెలాయిడ్-ప్రోన్ స్కిన్ ఉన్నవారు వారు కొన్ని సౌందర్య ప్రక్రియలకు దూరంగా ఉండాలి. అర్హత కలిగిన, అనుభవజ్ఞుడైన సౌందర్య వైద్యుడుఎల్లప్పుడూ వివరణాత్మక వైద్య చరిత్రను తీసుకొని రోగులకు తదను గుణంగా మార్గనిర్దేశం చేస్తాడు.అంతిమంగా, నివారణ సౌందర్యశాస్త్రం ధోరణులను గురించి ఆందోళన కంటే దీన్ని ఎలా వాడుతున్నామనేదే ముఖ్యం. భయంగా కాకుండా ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆహ్వానించాలి. ఆధునికతను ఆపాదించుకోవడంతోపాటు, మొత్తం ఆరోగ్యంపై శ్రద్ద, నిబద్ధత ముఖ్యం. నిజమైన, శాశ్వతమైన అందం ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆలోచనలు, నిబద్ధతత, విశ్వాసంతోనే వస్తుంది. t -
అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి సీపీ సజ్జనార్ వార్నింగ్
-
పిచ్చి రాతలు ఆపు.. RK గాలి తీసిన పొన్నవోలు
-
సీఎం పదవి ఇవ్వకపోతే.. DK వార్నింగ్
-
జనసేన ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్
-
"నీ సంగతి చూస్తా.. అని సోనియా అన్నప్పుడు.. జగన్ రియాక్షన్..గూస్ బంప్స్..
-
బారికేడ్లు బద్దలు కొడుతూ.. పోలీసులపై అంబటి ఉగ్రరూపం
-
షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..
-
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తమాషాలు చేస్తే.. తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. ‘‘విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకుతెలుసు’’ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి?. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? అంటూ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రేవంత్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.‘‘గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్గా మారింది. మెట్రో,ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇలా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. నేడు ఉన్న అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే. కొడుకు భవిష్యత్ కోసం, వాస్తు కారణంగానే కేసీఆర్ సచివాలయం కూలగొట్టారు.’’ అని రేవంత్ మండిపడ్డారు.‘‘వరదల్లో హైదరాబాద్ ముగినిపోతే కేంద్రం నుంచి కిషన్రెడ్డి చిల్లి గవ్వ తీసుకురాలేదు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది. హైదరాబాద్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచన చేయండి. ఆనాడు మిగుల బడ్జెట్తో కేసీఆర్కు రాష్ట్రాన్ని అప్పగించాం. సచివాలయం కారణంగా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?. కొత్త సచివాలయం నిర్మాణం వల్ల ప్రజలకు అణా పైసా మేలు జరిగిందా?. హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ కాదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
జోగి రమేష్ అరెస్ట్ పై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్
-
పాపంపేట భూముల జోలికొస్తే.. పరిటాల సునీత, శ్రీరామ్ కు తోపుదుర్తి వార్నింగ్
-
తుఫాన్ హెచ్చరిక.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
-
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
-
చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన అయస్కాంత లోహాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.అరుదైన అయస్కాంత లోహాల ఉపయోగాలుఅరుదైన అయస్కాంత లోహాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంత లోహాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.ఎంఆర్ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్మేకర్లు, హియరింగ్ ఎక్విప్మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. మంత్రి సంధ్యారాణికి పుష్ప శ్రీవాణి వార్నింగ్
-
ఆపరేషన్ సిందూర్ ఓ ట్రైలర్ మాత్రమే.. పాక్ కు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్
-
పాక్కు రాజ్నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. పాక్ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు. .. బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు ఇక అసాధ్యం. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్నే చూసి పాకిస్తాన్కి అర్థమై ఉంటుంది. భారత్ పాకిస్తాన్ను సృష్టించగలిగితే, ఇంకేమి చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విజయం మనకు అలవాటైపోయింది. బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని.. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగు’’ అని ఆయన అభివర్ణించారు. బ్రహ్మోస్ మిస్సైల్స్ను భారత్ ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రయోగించింది. Fire and Forget టెక్నాలజీతో పని చేయడం దీని ప్రత్యేకత. అంటే.. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది.భారత్ డీఆర్డీవో-రష్యా ఎన్పీఓఎం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట సంయుక్తంగా వీటిని డెవలప్ చేస్తున్నాయి. త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాద్, తిరువనంతపురం, నాగ్పూర్లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. తాజాగా లక్నోలోనూ ఓ యూనిట్ను ప్రారంభించారు. తాజా వివరాల ప్రకారం.. బ్రహ్మోస్కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజ్నాథ్ దీనిని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. -
ఆఫ్ఘాన్ క్రికెటర్లను చంపిన పాక్.. తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్
-
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
మరోసారి చర్చలు.. తాడో పేడో తేలాల్సిందే..
-
రాజకీయ సమాధి చేస్తాం.. మంత్రి సవితకు ఉషశ్రీ చరణ్ వార్నింగ్
-
నోటికొచ్చినట్లు మాట్లాడకు.. మంత్రి అనితకు వార్నింగ్
-
జగన్ పర్యటనకు రావొద్దు..! ప్రజలకు, పార్టీ నేతలకు పోలీసుల బెదిరింపులు
-
మీరేంటి మాకు చెప్పేది.. జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తాం
-
టీడీపీ నేతపై జేసీ ప్రభాకర్ రెడ్డి బండబూతులు..
-
'ఐ' బొమ్మ చూపిస్తాం! TFI, పోలీసులకు స్వీట్ వార్నింగ్..
-
‘సర్ క్రీక్ను టచ్ చేస్తే చుక్కలే’.. పాక్కు రాజ్నాథ్ తీవ్ర హెచ్చరిక
భుజ్: నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకస్తాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే, తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు స్పష్టం చేశారు.‘పాక్తో యుద్ధం భారత్ లక్క్ష్యం కాదు’గుజరాత్లోని భుజ్ సమీపంలోగల సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటంపాకిస్తాన్లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, భారత సరిహద్దులను కాపాడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు.సర్ క్రీక్ వివాదం ఏమిటి?ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ మీదుగా భారత్లోకి ప్రవేశించేందుకు విఫల ప్రయత్నం చేసిందని, అయితే ప్రతీకార చర్యలో భాగంగా భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలని రక్షణ మంత్రి అభివర్ణించారు. కాగా సర్ క్రీక్ అనేది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్- పాకిస్తాన్ మధ్య 96 కి.మీ పొడవైన టైడల్ నదీముఖద్వారం. సముద్ర సరిహద్దు రేఖలపై ఇరు దేశాలు వేర్వేరు వివరణలు ఇవ్వడం కారణంగా దీనిని వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తున్నారు. -
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
సముద్ర తీరంలో హై టెన్షన్.. అనితను అడ్డుకుని వార్నింగ్
-
ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు
-
లెక్కలో ఏంటి ఈ వ్యత్యాసం.. బాబుకు APERC షాక్
-
విశాఖలో ఎలా అడుగుపెడతావో చూస్తాం.. తోపుడు బండి కార్మికుల హెచ్చరిక
-
తాలిబాన్లకు ట్రంప్ వార్నింగ్
-
పవన్ కు వినుత వార్నింగ్
-
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్
-
తన కారు ఆపిన పోలీసులకు పెద్దారెడ్డి వార్నింగ్
-
మీరు ఎంత అణగదొక్కలని చూస్తే అంత తిరగబడతారు..
-
ర్యాలీలు చేస్తే కేసులు పెడ్తావా?.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
జనసేన ఎమ్మెల్యేకు MRPS మాస్ వార్నింగ్.. క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్
-
‘బందీ ఒప్పందం’పై హమాస్కు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో రాశారు.‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు. .@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు. -
నిన్ను దించేవరకు మా పోరాటం ఆగదు.. బాబుకు ఆటో డ్రైవర్లు వార్నింగ్
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా.. ఇది జగనన్న సైన్యం..
-
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక కోసేస్తా.. టీడీపీ నేత వ్యాఖ్యలకు YSRCP నేతలు వార్నింగ్
-
Jr NTR Fans: దగ్గుపాటి ప్రసాద్.. నిన్ను వదలం
-
ఫ్యాన్స్ కు భయపడి.. ఎమ్మెల్యే దగ్గుపాటి పరార్..!
-
ఎమ్మెల్యే దగ్గుపాటి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే మేమేంటో చూపిస్తాం..
-
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లపై ఎఫ్పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నమ్మొద్దని సూచించింది. భారత్లో నివసించే పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
శ్రీకాకుళం జిల్లా పలాసలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు
-
క్షమాపణ చెప్పించకపోతే? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక
-
జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు


