రియాలిటీ షోలంటే జనాలకు భలే ఇష్టం. రీల్ లైఫ్లో సెలబ్రిటీలను చూసి ఆరాధించే ప్రేక్షకులు వారు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని తెగ తహతహలాడుతుంటారు. అందుకేగా బిగ్బాస్ షో అనేక భాషల్లో ఫేమస్ అయింది. బిగ్బాస్ తరహాలోనే హిందీలో ఇటీవల ద 50 అనే షో కూడా మొదలైంది. ఇప్పుడు తెలుగులో ఒక కపుల్ షో రాబోతోంది. అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అనేది క్యాప్షన్.
10 జంటలు - 70 రోజులు
ఈ షోలో సెలబ్రిటీ జంటలు మాత్రమే పాల్గొననున్నారు. అందులో పెళ్లయినవాళ్లున్నారు. పెళ్లి చేసుకోకుండా డేటింగ్లో ఉన్నవారూ ఉన్నారు. 10 సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజులపాటు ఉండనున్నారు. ఈ జంటల మధ్య ప్రేమ, రొమాన్స్, డ్రామా.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించనున్నారు. షో నిర్వాహకులు పెట్టే ప్రేమ పరీక్షలను వీరు ఎలా దాటుతారు? అన్నది ఆసక్తికరంగా ఉండనుంది.
ఆ జంటలెవరంటే?
ప్రస్తుతం సోషల్మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆ 10 జంటలెవరో ఓసారి చూసేద్దాం.. అమర్దీప్- తేజు, హరిత- హరీశ్, ప్రియాంక- శివకుమార్, అంజలి - పవన్ సంతోష్, నటరాజ్ మాస్టర్- నీతూ, సోనియా సింగ్- సిద్ధు, జబర్దస్త్ నూకరాజు- ఆసియా, సాండ్రా- మహేశ్బాబు, వాసంతి - పవన్ కల్యాణ్, శుభశ్రీ రాయగురు- అజయ్.
అప్పుడే ప్రారంభం?
వీరిలో అమర్దీప్, హరీశ్ (మాస్క్ మ్యాన్), ప్రియాంక జైన్, నటరాజ్ మాస్టర్, వాసంతి కృష్ణన్, శుభశ్రీ.. వీళ్లందరూ బిగ్బాస్ ద్వారా బుల్లితెర ఆడియన్స్కు దగ్గరైనవారే! మార్చి 2వ వారంలో ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఈ షో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చిన బిగ్బాస్ అగ్నిపరీక్ష బాగానే హిట్టయింది. మరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి!


