breaking news
Trailer
-
హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. భయపెట్టేలా ట్రైలర్
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన హారర్ థిల్లర్ ఈషా. ఈ మూవీకి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హెవీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈషా మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ హారర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యాలు, ఆత్మల కాన్సెప్ట్తోనే ఈషాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్లో సీన్స్ ఆడియన్స్ను భయపెట్టేలా ఉన్నాయి. మీరు ఇప్పటివరకూ చూడని.. ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అనే డైలాగ్ మరింత భయపెడుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రలు పోషించారు. Four friends, a mysterious house, & lurking spirits ❤️🔥Experience the breathtaking chills and thrills with the haunting #EeshaTrailer 💀💥-- https://t.co/BR0aa4y5osFEAR IS GUARANTEED#Eesha IN CINEMAS ON DEC 12th 💀#EeshaOnDec12th@Thrigun_Aactor @ihebahp… pic.twitter.com/nRswpWgitM— Eluru Sreenu (@IamEluruSreenu) December 8, 2025 -
ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో చాలావరకు థ్రిల్లర్ కంటెంట్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు కూడా ఇదే జానర్లో సినిమాలు, సిరీస్లు తీస్తుంటారు. అలా ఇప్పుడు తెలుగు, తమిళంలో రాబోతున్న మర్డర్ మిస్టరీ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటో చూచాయిగా తెలిసింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా)తమిళ నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు చేశారు. జస్విని దర్శకత్వం వహించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ శుక్రవారం నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలానే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. ధూల్ పేట్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. వీటిని దర్యాప్తు చేసేందుకు ఓ ఏసీపీని అపాయింట్ చేస్తారు. అయినా సరే నిందితుల్ని కనుగొనలేకపోతాడు. దీంతో మరో ఏసీపీని కూడా కేసుని దర్యాప్తు చేసేందుకు నియమిస్తారు. తర్వాత ఏమైంది? ఇంతకీ హత్యలు చేసింది ఎవరనేది పోలీసులు కనుగొన్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) -
యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
యాంకర్ సుమ కొడుకు రోషన్ ఇదివరకే 'బబుల్ గమ్' అనే సినిమా చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని రెండో మూవీతో వస్తున్నాడు. అదే 'మోగ్లీ'. ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'కలర్ ఫోటో'తో మెప్పించిన సందీప్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. వచ్చే వారమే మూవీ రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)టైటిల్కి తగ్గట్లే అడవి నేపథ్యంగా సాగే సన్నివేశాలు, కామెడీ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో పలు బోల్డ్ చిత్రాలతో మెప్పించిన బండి సరోజ్ ఇందులో విలన్గా చేస్తున్నాడు. సాక్షి అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. (ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?) -
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్
ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ఉండొచ్చు. కానీ ఎక్కువమంది చూసేది మాత్రం థ్రిల్లర్ జానరే. మర్డర్ మిస్టరీ, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్.. ఇలా పలు భాషల్లో బోలెడన్ని చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలోనే ఓ తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. మిథున్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఇది వచ్చే నెల 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఇదైతే థ్రిల్లింగ్గానే ఉంది. కానీ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే.. స్టీఫెన్ జబ్రాజ్ అనే సైకో కిల్లర్ 6 నెలల్లో 9 మంది యువతులని చంపేస్తాడు. అది కూడా సినిమాలో ఛాన్స్ అని పిలిచి ఈ హత్యలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా ఓ రోజు పోలీసుల దగ్గరకెళ్లి స్వయంగా ఇతడే లొంగిపోతాడు. పోలీసులు వెతకగా.. సదరు అమ్మాయిల వస్తువులు దొరుకుతాయి గానీ వాళ్ల బాడీలు మాత్రం ఎంతకీ కనిపించవు. స్టీఫెన్ నిజంగానే హత్యలు చేశాడా? ఇతడికి ఎవరైనా సాయం చేశారా?అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్) -
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్ఫ్లిక్స్లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్లో ఉంది.(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
బాలయ్య అఖండ-2.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2 (Akhanda 2 Trailer). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం, జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్ను రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను (Akhanda 2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు. బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అఖండ-2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్, మంచు కొండల్లో ఫైట్ సీన్స్ విపరీతంగా ఆకట్టుంటున్నాయి. కష్టమొస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టమొచ్చనా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్.. అబ్బురపరిచిన డ్రోన్ షో
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఇవాళ ఆంధ్ర కింగ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్నూలులోని ఔట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే 'ఉరి' మూవీ తీసిన ఆదిత్య ధర్తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే 'ధురంధర్'. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్తో నింపేశారు. రణ్వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత) -
పెళ్లి జీవితంపై తీసిన 'ప్రేమంటే' ట్రైలర్ రిలీజ్
కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రేమంటే'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్. యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఫన్నీగా ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. చూడాలి మరి ఆమె నటన ఎలా ఉండబోతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ రిలీజ్
తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ నెలలో ఓటీటీ సినిమా 'చిరంజీవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఒకప్పటితో పోలిస్తే ఇతడి నుంచి వచ్చే మూవీస్ తగ్గిపోయాయి. అలానే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన ఏం రావట్లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు 'పాంచ్ మినార్' అనే చిత్రాన్ని సిద్దం చేశాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)ఈ శుక్రవారం(నవంబరు 21) థియేటర్లలోకి సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం, ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీగా నవ్వించే ప్రయత్నం చేశారు. 'పాంచ్ మినార్' విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే హీరో, ఉద్యోగం చేసుకునే హీరోయిన్ ప్రేమలో పడతాడు. జాబ్ చేస్తేనే పెళ్లి అని చెప్పడంతో ట్యాక్సీ డ్రైవర్గా మారతాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గుండాల మధ్య చిక్కుకున్న హీరో.. ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీంతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?) -
రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా.. ట్రైలర్ ముహుర్తం ఫిక్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ట్రైలర్ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.IT’S TIME!! 💥Get ready to witness Sagar’s Life Story soon.BIOPIC OF A FAN - #AndhraKingTalukaTrailer arrives on 18th November ❤️🔥#Andhrakingtaluka pic.twitter.com/ih8HqokJ7H— RAm POthineni (@ramsayz) November 16, 2025 -
ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే. ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్ మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. Tere ishk mein trailer @aanandlrai @arrahman @kritisanon @TSeries https://t.co/zpdoOh0SIe— Dhanush (@dhanushkraja) November 14, 2025 -
పుష్ప స్టైల్లో సలార్ హీరో మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది
సలార్ మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మలయాళ హీరో దక్షిణాదిలో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వస్తోన్న చిత్రం విలాయత్ బుద్ధా (Vilayath Buddha). ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ సరసన ప్రియంవద కృష్ణన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంతముందెన్నడు చేయని డిఫరెంట్ రోల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా మూవీ మలయాళ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలా స్టోరీ ఉండనున్నట్లు ట్రైలర్ సీన్స్ చూస్తే అర్థమవుతోంది. అడవుల నేపథ్యంలోనే ఈ కథ రూపొందించినట్లు ట్రైలర్ కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. -
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) కీలక పాత్రలో వస్తోన్న చిత్రం మఫ్టీ పోలీస్(Mufti Police Telugu Official Trailer). ఈ మూవీలో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్కు దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం ఓ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, రామ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జీఎస్ ఆర్ట్స్ బ్యానర్లో అరుల్ కుమార్ నిర్మించగా.. భరత్ ఆసీవగన్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
కీర్తి సురేశ్ సీరియస్ కామెడీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించనుంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగానే రివాల్వర్ రీటా ట్రైలను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై నిర్మించారు. మరి రివాల్వర్ రీటా ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. Keerthy with her sense of humour should deftly choose more and more quirky stories like this. 😄Here’s the fun #RevolverRitaTrailer Telugu ▶️ https://t.co/XOgxBac61Q@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute… pic.twitter.com/7feMsfAhL2— Nani (@NameisNani) November 13, 2025 -
విలేజ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి.. ట్రైలర్ వచ్చేసిింది
అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీకి సాయిలు దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్)ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అబ్బాయికి.. కుటుంబానికి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి అని ట్రైలర్లోనే తెలిసిపోతుంది. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. Their hearts beat as one, their love faces every storm ❤️🔥Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️▶️ https://t.co/lrlbW9zT95Launched by The Star of New Age Films @AdiviSesh garu💫#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/RufYYOLkvA— Dolamukhi Subaltern Films (@dsfofficial_) November 13, 2025 -
అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. ఈ సారి మాస్కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
ఆషిక 'గత వైభవం' ట్రైలర్ రిలీజ్
తెలుగులో 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆషికా రంగనాథ్.. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ కథానాయికగా చేసింది. ఈమె నటించిన ఓ కన్నడ మూవీ ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. అదే 'గత వైభవం'. మూడు వేర్వేరు కాలాల్లో జరిగే ఫాంటసీ కథతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ పరంగా బాగానే ఉంది గానీ విజువల్స్, కంటెంట్ మాత్రం ఓకే ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇదే రోజున దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తుతో పాటు పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటితో పాటు పోటీలో నిలిచి 'గత వైభవం' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: బింధుమాధవి వేశ్య పాత్రలో.. 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్) -
కాంత ట్రైలర్ లాంచ్.. ఒకే వేదికపై దుల్కర్, రానా (ఫోటోలు)
-
రానాకు నేను నచ్చలేదు.. భాగ్యశ్రీ బోర్సే షాకింగ్ కామెంట్స్!
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంతా'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించారు. నవంబరు 14న మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ ఆడిషన్ కోసం చెన్నైకి వెళ్లానని తెలిపింది. అయితే రానాకు నా లుక్ టెస్ట్ నచ్చలేదని భాగ్యశ్రీ బోర్సే తెలిపింది. అమ్మాయి భాగ్య చాలా బాగుంది.. కానీ యాక్టింగ్ పరంగా తెలియదు అని రానా అన్నారు. కానీ డైరెక్టర్ సెల్వరాజ్ నాపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారని తెలిపింది. లుక్ టెస్ట్, డైలాగ్స్ చెప్పిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారని భాగ్యశ్రీ బోర్సే వెల్లడించింది. ఈ మాటలు విన్న రానా.. ప్రతిసారీ నెేను విలన్ ఎందుకవుతానో నాకె తెలియదంటూ నవ్వుతూ అన్నారు. -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్) -
దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంత'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా ఇండస్ట్రీ గురించి ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.లెక్క ప్రకారం సెప్టెంబరులోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల నవంబరులో విడుదల చేస్తున్నారు. తొలుత ఇందులో దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. దుల్కర్-రానా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
నాగార్జున ఐకానిక్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న రీ రిలీజ్ ట్రైలర్
అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ 'శివ' రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్లో శివ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్ మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు రాం గోపాల్ వర్మ. -
దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ను డేట్ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. THE FIRST SPARK (Tamil) - OUT NOW!💥TRAILER ON NOV 6th!⚡️https://t.co/FV0u8YSzdkA @SpiritMediaIN and @DQsWayfarerFilmproduction#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14…— Wayfarer Films (@DQsWayfarerFilm) November 4, 2025 -
ఇట్లు మీ ఎదవ.. టైటిల్ నేనే ఇచ్చా: ఆర్పీ పట్నాయక్
‘‘బాపుగారి సినిమాకి పని చేసే అవకాశం నాకు లేకుండా పోయింది. ‘ఇట్లు మీ ఎదవ’ కథ విన్నాక... ఈ సినిమాకి పని చేస్తే బాపుగారి చిత్రం మిస్ అయ్యాననే లోటు తీరుతుందనే అనుభూతి కలిగింది. ఈ చిత్రానికి టైటిల్ సూచించింది నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. యువత తమ తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు.త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ ఆవంచ హీరోయిన్గా నటించారు. సంజీవని ప్రొడక్షన్స్పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, దర్శకుడు త్రినాథ్ కఠారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, ఒక అమ్మాయి, అబ్బాయి కథ. ఈ సినిమా 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బళ్లారి శంకర్. కెమెరామేన్ జగదీష్, డైరెక్టర్ తేజ మార్ని, నటీనటులు మధుమణి, రిషి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, తాగుబోతు రమేశ్ తదితరులు మాట్లాడారు. చదవండి: శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి! -
యూత్ఫుల్ ఎంటర్టైనర్.. ఇట్లు మీ ఎదవ ట్రైలర్ చూశారా?
త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. ఈ మూవీని యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు. వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో విడుదల చేశారు. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చూసే ఆడియెన్స్ కూడా ఉంటారు. వాళ్లలో చాలామందికి నచ్చే సిరీస్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. తొలుత రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. కానీ తర్వాత కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ చివరి సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తేదీలని ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)ఇప్పటికే నాలుగు సీజన్లు రాగా వేటికవే అదరగొట్టేశాయి. 2022లో చివరగా నాలుగో సీజన్ రిలీజైంది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా ఈ సిరీస్ ఫ్యాన్ బాగానే ఎదురుచూస్తున్నారు. వాళ్ల వెయిటింగ్కి తెరదించుతూ కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ తేదీల్ని అధికారికంగా ప్రకటించారు. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31వ తేదీల్లో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఎలెవన్ అనే అమ్మాయి.. ఈ నలుగురి కంట పడుతుంది. కొన్నిరోజులకే వీళ్లంతా స్నేహితులు అయిపోతారు. అయితే తమతో ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి సూపర్ పవర్స్ ఉన్నాయనీ ఈ పిల్లలకు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి తమ ఊరికి ఎదురైన ప్రమాదాల్ని ఎలా ఆపగలిగారు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్) -
కాంతార చాప్టర్-1.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు మేకర్స్. Una saga divina que comenzó en la India… ahora conquista el mundo. Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025 -
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?
ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మహారాణి మళ్లీ వస్తోంది.. ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. తర్వాత మూవీస్ అయితే తీశాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు. గతేడాది 'తిరగబడరా సామీ' అనే చిత్రంతో వచ్చాడు గానీ ఫలితం మారలేదు. ప్రస్తుతం 'చిరంజీవ' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)'జబర్దస్త్' ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు.. ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?) -
ధన్య బాలకృష్ణన్ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీలా . దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.కృష్ణలీల ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ప్రేమకథా చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తన ప్రేమ కోసం హీరో చేసిన ప్రయత్నాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్ అనే డైలాగ్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
'ప్రెడేటర్: బ్యాడ్ల్యాండ్స్' సినిమా నవంబర్ 7న రిలీజ్
సైన్స్ ఫిక్షన్ జానర్లో అత్యంత భయానకమైన పాత్రల్లో 'ప్రెడేటర్' ఒకటి. గత నాలుగు దశాబ్దాలుగా ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.(ఇదీ చదవండి: 'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున)ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న కొత్త సినిమా 'ప్రెడేటర్: బ్యాడ్ల్యాండ్స్'. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 1987లో తొలి మూవీ రిలీజ్ కాగా.. తర్వాత 1990, 2010, 2022ల్లో సినిమాలు వచ్చాయి. మరి ఇప్పుడు రాబోతున్న చిత్రం ఎలా అలరించనుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!) -
'ది గర్ల్ఫ్రెండ్' ట్రైలర్: బ్రేక్ తీసుకుందామా?
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్ (The Girlfriend Movie). హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. శనివారం (అక్టోబర్ 25న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.అదిరిపోయిన ట్రైలర్అందులో 'మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్లా..' అని రష్మిక డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. నువ్వు విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్.. కానీ, వాడు నీకు కరెక్ట్ కాదు అని రష్మికకు సలహా ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఇక మరో సీన్లో.. ఇంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడు అంటూ రావు రమేశ్.. రష్మిక చెంప పగలగొట్టాడు. అలా ఫుల్ ఎమోషనల్గా ట్రైలర్ కొనసాగింది. ఆ ట్రైలర్ మీరూ చూసేయండి.. -
బాహుబలి: ది ఎపిక్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. రన్ టైమ్ ఎంతంటే?బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్.. ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. Two Films, One Epic Experience! Here's the Release Trailer of @ssrajamouli's #BaahubaliTheEpic.Telugu https://t.co/2vVWqhKDVUHindi https://t.co/xgsE1i0CBGIn Cinemas worldwide from 31st October 2025. #BaahubaliTheEpicOn31stOct #Prabhas @RanaDaggubati @MsAnushkaShetty… pic.twitter.com/VqlURRhbpg— Baahubali (@BaahubaliMovie) October 24, 2025 -
పాక్లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది. -
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1.. దీపావళికి బిగ్ బ్లాస్ట్.. అదేంటంటే!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పలు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది. ఇప్పటికే కూలీ, జైలర్, బాహుబలితో పాటు కాంతార రికార్డ్ను సైతం బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది.అయితే ఒకవైపు బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంటే.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంతార చాప్టర్-1 థియేటర్లలో రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ ఏంటని సినీ ప్రియులు పెద్ద డైలమాలో పడ్డారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యాక ట్రైలర్ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. దీపావళి ట్రైలర్ పేరుతో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు 12 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆడియన్స్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులకు ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారేమో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. The divine roar continues to light up screens worldwide 💥#KantaraChapter1 Deepavali Trailer out Tomorrow at 12:07 PM.Experience the ultimate cinematic celebration of Dharma.#BlockbusterKantara running successfully in cinemas near you! 🔥#KantaraInCinemasNow… pic.twitter.com/1R6xFJR2P9— Hombale Films (@hombalefilms) October 15, 2025 -
రకుల్ ప్రీత్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసింది
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా దే దే ప్యార్ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్కు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్ఫ్రెండ్ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్ సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.When your BF is your dad’s age and not yours, you know it’s time for a #PyaarVsParivaar showdown! 🥊#DeDePyaarDe2 Trailer out now 👇https://t.co/y9YQB8wFLmReleasing In cinemas Nov 14 🎟️@ajaydevgn @ActorMadhavan #MeezaanJafri @anshul3112 @luv_ranjan @gargankur #TarunJain… pic.twitter.com/WoFj2WHp21— Rakul Singh (@Rakulpreet) October 14, 2025 -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
చిత్రం శ్రీను , సుష్మ , రామ్ బండారు హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం మేఘన. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమా హీరో చిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ..'మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది. నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉందియ నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది' అని అన్నారు.దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ.. 'చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకట్ రమణ, మౌనిక , సౌమ్య , మల్లేశ్వరి ,,యం.నగేష్ బాబు , రోశిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతమందిస్తున్నారు. -
సిద్ధు 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్
'డీజే టిల్లు' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ట్రైలర్లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు. రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు వినిపించాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం)ట్రైలర్ బట్టి చూస్తే.. కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమెకు సైకలాజికల్ ప్రాబమ్స్ ఉంటాయి. దీంతో తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.చాన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. కానీ గతేడాది దీపావళికి రిలీజైన 'క' చిత్రం మాత్రమే హిట్ అయింది. ఈ ఏడాది మార్చిలో 'దిల్ రుబా' అనే మూవీతో వచ్చాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో యూత్ని టార్గెట్ చేసి 'కె ర్యాంప్' తీశాడు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి? దీపావళికి దీనితో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే 'డ్యూడ్'. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశాడు. 'డ్యూడ్' కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 'డ్యూడ్'తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి 'డ్యూడ్' ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
ఎంటర్టైనింగ్గా 'మిత్రమండలి' ట్రైలర్
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిత్రమండలి'. అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ట్రైలర్ చూస్తుంటే ఫన్నీగా ఉంది. 'జాతిరత్నాలు' తరహాలో నవ్వించడమే మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. వెన్నెల కిశోర్, సత్య తదితరులు కూడా కామెడీతో నవ్వించేలా కనిపిస్తున్నారు. దీపావళి బరిలో 'మిత్రమండలి'తో పాటు కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?) -
'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును'.. అనసూయ లేటేస్ట్ మూవీ ట్రైలర్
అనసూయ ( Anasuya Bharadwaj), సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనే ఉపశీర్షిక. ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిలోని ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాకు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇచ్చట అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా ఓ లైబ్రరీ చుట్టే తిరుగనుందని అనిపిస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కామం అనే పదం చుట్టే హైలెట్ కావడంతో ఆ కోణంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.40 కోట్లు పెడితే రూ.300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులోనూ రీసెంట్గానే 'వాయుపుత్ర' అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం దీని స్ట్రీమింగ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్తో చూస్తే అర్థమైంది. కాకపోతే ట్రైలర్లో యానిమేషన్ ఏమంత గొప్పగా అనిపించలేదు.అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కంటెంట్ని ఎంగేజింగ్గా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో?(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్') -
రాజాసాబ్ ట్రైలర్ బ్లాక్ బస్టర్.. రూ. 1000 కోట్లు పక్కా
-
థామా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసిన రష్మిక.. ఫోటోలు
-
ది రాజా సాబ్ ట్రైలర్..ఈ ఫోటోలు చూశారా?
-
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రష్మిక చేసిన దెయ్యం సినిమా.. ట్రైలర్ రిలీజ్
హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు 'థామా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) విజువల్ వండర్ అవతార్(Avatar). ఆ తర్వాత అవతార్-2 కూడా ఆడియన్స్ను కట్టిపడేసింది. దీంతో ఈ సిరీస్లో మూడో పార్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కామెరూన్. అవతార్: ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ పార్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరోసారి తెలుగులోట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే జేమ్స్ కామెరూన్ విజువల్ మార్క్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచంలోని విషయాలు .. నువ్వు ఊహించిన దానికంటే లోతైనవి అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ఫైట్ సీన్స్ అవతార్ మూవీ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం విజువల్ వండర్ను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ ఛాంపియన్, బెయిలీ బాస్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రల్లో నటించారు. -
'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి
కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్పైన స్పందించాడు.'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నామినేషన్స్లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్గా చేశాడు.ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)"#KantaraChapter1: We haven't slept properly for 3 months because of continuous work🫡👏. Everyone supported it as like their own film♥️. In fact, if I count, I was about to die 4 or 5 times during shoot, the divinity we trust saved me🛐♥️"- #RishabShetty pic.twitter.com/8pufSUj7ZI— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025"#KantaraChapter1: I got shocked when I saw no smoking, no alcohol, and no meat Poster😳. In fact I cross checked with the production too🤝. Someone has fakely posted it to get popularity, we don't even want to react for that fake poster❌"- #RishabShettypic.twitter.com/I89jj7y7GP— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025 -
'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ గురువారమే(సెప్టెంబర్ 25) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్ల రూపంలో పాటలు, స్టిల్స్ వదిలారు. హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రైలర్ ప్లే చేశారు గానీ బయటకు మాత్రం వదల్లేదు. ఇప్పుడు పనంతా పూర్తవడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)ట్రైలర్ చూస్తుంటే ముందునుంచి చెప్పినట్లే యాక్షన్ కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఇమ్రాన్ హష్మీ ప్రెజెన్స్ బాగుంది. ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరుల సీన్స్ కూడా ట్రైలర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్) -
'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్
2022లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకున్న సినిమా 'కాంతార'. దీని ప్రీక్వెల్ని 'కాంతార ఛాప్టర్ 1' పేరుతో తీశారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. అక్టోబరు 02న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి)ట్రైలర్ చూస్తుంటే ఈసారి భారీతనం కనిపిస్తోంది కానీ ఓకే ఓకే అనిపించింది. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునేలా కనిపించాడు. 'కాంతార' తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా అనే డ్రామాని సింపుల్గా చూపించారు. ఈసారి మాత్రం రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమలో పడటం ఇలా అన్ని కూడా భారీగానే సెటప్ చేశారు. మరి 'కాంతార' ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు) -
ట్రైలర్ రెడీ
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించి, ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను ప్రభాస్, హిందీ ట్రైలర్ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్ను పృథ్వీరాజ్ సుకు మారన్లు డిజిటల్గా విడుదల చేయనున్నారు.‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్గా ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ రాజీ పడటం లేదు. ఆడియన్స్కు థియేటర్స్లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
ఆకట్టుకునేలా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబరు 01న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరి గుడిసెలో ఉండే ఓ ఇడ్లీ కొట్టు బ్యాక్ డ్రాప్లో సాగే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. నిత్యామేనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)ట్రైలర్ బట్టి చూస్తే మురళి(ధనుష్) తండ్రికి సొంతూరిలో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. తండ్రిని చూస్తూ పెరిగిన మురళి.. పెరిగి పెద్దయ్యాక ఓ పెద్ద ఫుడ్ కంపెనీలో జాబ్ సాధిస్తాడు. అక్కడ పనైతే చేస్తుంటాడు గానీ మనసంతా ఊరిలో తమ ఇడ్లీ కొట్టుపైనే ఉంటుంది. తండ్రి తదనంతరం దాన్ని మూసేస్తారు. పెద్ద జాబ్ చేసుకునే మురళి.. ఊరికొచ్చి మళ్లీ తమ ఇడ్లీ కొట్టు ఎందుకు తెరిచాడు? ఈ స్టోరీలో విలన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.సెప్టెంబరు 25న తెలుగులో ఓజీ సినిమా రానుంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. అలానే అక్టోబరు 2న పాన్ ఇండియా మూవీ 'కాంతార' సీక్వెల్ రాబోతుంది. ఈ రెండింటికి పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' చిత్రాన్ని బరిలో దింపుతున్నాడు. ఎమోషనే ప్రధానంగా తీసిన ఈ సినిమా.. ట్రైలర్ బట్టి చూస్తుంటే ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తుంది. మరి 'ఇడ్లీ కొట్టు'.. పోటీలో ఉన్న మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో?(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్) -
పవన్ కల్యాణ్ ఓజీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు.ఓజీ ట్రైలర్ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా 1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.భారీగా టికెట్ ధరల పెంపు.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.#OGTrailer on Sept 21st.. pic.twitter.com/2RMr9r1dm5— Sujeeth (@Sujeethsign) September 18, 2025 -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
ఆసక్తికరంగా విజయ్ ఆంటోని 'భద్రకాళి' ట్రైలర్
తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ ఆంటోని వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్తో వచ్చాడు. ఇప్పడు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఓ మూవీ చేశాడు. అదే 'భద్రకాళి'. లెక్క ప్రకారం సెప్టెంబరు 5నే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ 19వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ట్రైలర్ బట్టి చూస్తుంటే థ్రిల్లింగ్, పొలిటికల్ అంశాలు కనిపిస్తున్నాయి. సమాజంలోని దుష్టశక్తుల ఆటకట్టించే శక్తివంతమైన వ్యక్తిగా విజయ్ ఆంటోని పాత్ర ఉండనుందని అర్థమవుతోంది. ఈవారం 'మిరాయ్', 'కిష్కంధపురి' లాంటి తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వచ్చే వారం రాబోతున్న 'భద్రకాళి'కి పెద్దగా పోటీ లేదు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన లేటేస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టన్నెల్. ఈ చిత్రంలో అథర్వ మురళి హీరోగా నటించారు. ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అథర్వ ముపళి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12న తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాలో అశ్విన్ కాకుమాను విలన్గా నటించారు. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని ఇప్పటికే యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
బెల్లంకొండ 'కిష్కింధపురి' ట్రైలర్ రిలీజ్
బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం' సినిమాతో వచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ తేలిపోయింది. ఇప్పుడు హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'కిష్కింధపురి'. సెప్టెంబరు 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా కౌశిక్ పెగళ్ల దర్శకుడు.(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)ట్రైలర్ బట్టి చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఓ దెయ్యాల భవంతికి తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఓ వాకింగ్ చేయిస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లందరూ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. పైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వారిలో కామెడీ కూడా చేయించినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో అనుపమని దెయ్యంలా చూపించడం, దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తిమంతుడిగా హీరోని చూపించడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సిసు. ఈ సిరీస్లో మరో చిత్రం శిశు.. రోడ్ టూ రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శిశు పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఈ యాక్షన్ థ్రిల్లర్ను రిలీజ్ చేయనుంది.కాగా.. జాల్మారి హెలాండర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైక్ గూడ్రిడ్జ్, పెట్రి జోకిరాంటా నిర్మించారు. ఈ చిత్రంలో జోర్మా టొమ్మిలా, రిచర్డ్ బ్రేక్, స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 నవంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. -
మిరాయ్ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు. -
మిరాయ్.. ఓ అద్భుతం!
ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక విజువల్ వండర్ అని.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్తో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతీ ఫ్రేమ్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) ప్రామిసింగ్గా సాగిన ఈ ట్రైలర్.. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్.. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్గా ట్రైలర్ సాగింది. హీరో చేసిన యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్తో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా.. ట్రైలర్ చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన ట్రైలర్ ఇచ్చి, విజువల్ వండర్ సినిమా ఇవ్వబోతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మీడియా ఫ్యాక్టరీ పై విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా.. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ పై పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో పాటు.. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో బడా బడా బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో.. సెప్టెంబర్ 12న మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
ట్రెండ్కు తగ్గట్టు 'కానిస్టేబుల్'.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించగా బలగం జగదీష్ నిర్మించారు. థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఆదివారం జరిగింది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)ఇప్పటివరకు లవర్ బాయ్గా నాకు పేరుంది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మా అంచనాలని 'కానిస్టేబుల్' నిలబెడుతుందని అనుకుంటున్నానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. మా అందరి కెరీర్ మలుపుతిప్పే చిత్రం ఇది అవుతుంది. వరుణ్ సందేశ్కి కూడా కమ్ బ్యాక్ ఇస్తుందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నారు.(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా) -
హీరోయిన్ శ్రియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయి మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మిరాయ్లో విలన్గా మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరిగిన ఈవెంట్కు మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ను ఉద్దేశించి మంచు మనోజ్ మాట్లాడారు. మేమిద్దరం గతంలో కలిసి పనిచేద్దామని అనుకున్నామని అన్నారు. ఆమె నా ఫేవరేట్.. చివరికీ ఈ సినిమాలో మా ఇద్దరికీ కుదిరిందన్నారు. అలాగే సినిమాలో జరిగిన సంఘటనలకు సారీ చెప్తున్నా అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న శ్రియా వేదికపైనే చిరునవ్వులు చిందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అంతేకాకుండా మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్పై మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. కింగ్ ఆఫ్ కంటెంట్ అంటే ఆయనే అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇండస్ట్రీలో బ్రతకడం చాలా కష్టమని తెలిపారు. జీరో సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చారని.. వంద సినిమాలు తీయాలనే ఆశయంతో అడుగుపెట్టారని కొనియాడారు. ఇలాంటి నిర్మాతను తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. మహా మొండి అయితే ఇలా ఉండగలరని ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయని.. ఇక్కడ నిలదొక్కుకోవటం మీలాంటి వారికే సాధ్యమన్నారు మంచు మనోజ్. -
అంచనాలు పెంచేసిన 'మిరాయ్' ట్రైలర్..
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్' ట్రైలర్ వచ్చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ సార్కు కృతజ్ఞతలు. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్" అన్నారు. దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ... "మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ సార్కు మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు" అన్నారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఒక వ్యక్తి మొహమాటంతో తన ఉద్యోగాన్ని.. అలాగే తన జీవితంలోకి వచ్చిన ఉన్నత అధికారితో ఎలా మసులుకుంటాడు అనేది ఎంతో ఫన్నీగా ఉండనుందని అర్థమవుతోంది. అతని క్యారెక్టర్ చూస్తే ఎంతోమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా.. అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. -
తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కొత్త లోక'.. ఆసక్తిగా ట్రైలర్!
ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికర మూవీ రానుంది. మలయాళ చిత్రం కొత్త లోక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫాంటసీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ఫాంటసీ థ్రిల్లర్లో కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతమందించారు. -
ది రాజాసాబ్ బ్యూటీ కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం హృదయపూర్వం. ఈ చిత్రంలో ది రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.ఈ నేపథ్యంలోనే హృదయపూర్వం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలూ అలెక్స్, జనార్దనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
ఆసక్తికరంగా 'లోక' ట్రైలర్.. సూపర్ హీరో కాన్సెప్ట్
తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్.. ఇప్పుడు పూర్తిగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో, 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ మరో కీ రోల్ చేసిన చిత్రం 'లోక'. తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ఇది నా ఊరు సర్'.. ఫుల్ యాక్షన్తో 'మదరాశి' ట్రైలర్)పూర్తిగా సూపర్ హీరో కాన్సెప్ట్తో తీసిన మూవీ అని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటివి హీరోలు చేస్తుంటారు. కానీ యంగ్ హీరోయిన్తో ఈ జానర్ సినిమా చేయడం విశేషం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దీన్ని నిర్మించాడు. డొమినిక్ అరుణ్ దర్శకుడు.తెలుగులో ఈ సినిమా 'కొత్త లోక' పేరుతో ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే.. సూపర్ హీరో లక్షణాలుండే లోక(కల్యాణి ప్రియదర్శన్) అనుకోని పరిస్థితుల్లో ఓ ఊరికి వెళ్తుంది. అక్కడే లో-ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ బతుకుతుంటుంది. అలాంటి ఊరిలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని లోక ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: దర్శకుడు ప్రియదర్శన్) -
'ఇది నా ఊరు సర్'.. ఫుల్ యాక్షన్తో 'మదరాశి' ట్రైలర్
గతేడాది 'అమరన్' సినిమాతో హిట్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ఇప్పుడు కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'మదరాశి'. చాన్నాళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న ఏఆర్ మురుగదాస్ దీనికి దర్శకుడు. సెప్టెంబరు 5న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్తో ఆకట్టుకుంటోంది.ఈ ఏడాది సల్మాన్ ఖాన్తో 'సికిందర్' తీసి ఘోరమైన డిజాస్టర్ అందుకున్న మురుగదాస్.. 'మదరాశి'తో కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో శివకార్తికేయన్ జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. విద్యుత్ జమాల్ విలన్. అనిరుధ్ సంగీత దర్శకుడు.'మదరాశి' సినిమాతో పాటు సెప్టెంబరు 5న అనుష్క లీడ్ రోల్ చేసిన 'ఘాటీ', 'లిటిల్ హార్ట్స్' అనే మరో తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయి. చాలా కాలంగా మురుగదాస్ ఫామ్లో లేడు. దీంతో ఈ చిత్రంపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ట్రైలర్ చూస్తుంటే గన్స్, మాఫియా లాంటి అంశాలు కాస్త ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రిజల్ట్ ఏమవుతుందో? -
ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజజీవిత కథతో తెరకెక్కించారు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది. దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఈ నెల 29న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. స్టాలిన్ ట్రైలర్ వచ్చేసింది!
మెగాస్టార్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడితోనూ చిరంజీవి జతకట్టారు. పుట్టినరోజు ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.Power. Rage. Madness. 💥#Stalin4K Re Release Trailer OUT NOW 🔥▶️https://t.co/so8S9I4W91#StalinOn22Aug #StalinReRelease pic.twitter.com/LDdBimikIj— Anjana Productions (@Anjana_Prod) August 19, 2025 -
ఒక్క మలయాళీ కూడా దొరకలేదా?.. జాన్వీ కపూర్ పాత్రపై సింగర్ సీరియస్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుందగి. ఈ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ నెలఖార్లో విడుదల కానున్న ఈ సినిమా.. ట్రైలర్ వల్లే ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. చర్చిలో రొమాంటిక్ సీన్ పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సీన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో జాన్వీని మలయాళీ అమ్మాయిగా కనిపించనుంది.ఇటీవల ఈ మూవీ ట్రైలర్ చూసిన మలయాళ నటి, సింగర్ పవిత్ర మీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందీ సినిమాలో మలయాళీలను తప్పుగా చిత్రీకరించే ధోరణిని విమర్శించింది. కేరళ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాల్లో మలయాళీ నటులను తీసుకోకపోవడాన్ని పవిత్ర తప్పుపట్టింది. 'మై తెక్కపాటిల్ దామోదరన్ సుందరం పిళ్లై కేరళ సే' అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ను ప్రస్తావించింది. పరమ్ సుందరి మేకర్స్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసింది.వీడియో పవిత్ర మీనన్ మాట్లాడుతూ.. "నేను మలయాళీని. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మూవీ పరమ సుందరి ట్రైలర్ చూశా. కేరళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్ర పోషించింది. ఇలాంటి రోల్కు మలయాళీ హీరోయిన్ను తీసుకోవచ్చు కదా. మలయాళీలను తీసుకోవడం మీకేంటి సమస్య. మాకు టాలెంట్ లేదనుకుంటున్నారా?. కేరళలో అయితే ఇలా జరగదు. నేను హిందీలో ఎలా మాట్లాడుతున్నానో.. మలయాళం కూడా బాగా మాట్లాడగలను. హిందీ సినిమాలో ఆ పాత్ర పోషించడానికి మలయాళీ దొరకడం అంత కష్టందా ఉందా?" అని ప్రశ్నించింది."1990ల్లో మలయాళ చిత్రాల్లో పంజాబీలను చూపించాల్సి వచ్చినప్పుడు మేము అలాంటివి చేశాం. కానీ ఇది 2025. మలయాళీ ఎలా మాట్లాడతాడో.. ఇతరుల మాదిరిగానే ఎలా సాధారణంగా ఉంటారో అందరికీ తెలుసని అనుకుంటున్నా. మేము మల్లెపూలు ధరించడం లేదు. ప్రతిచోటా మోహినియాట్టం కూడా చేస్తాం. జాన్వీ అంటే నాకు ద్వేషం లేదు. కానీ ఇంత కష్టంగా ఎందుకు ప్రయత్నించాలి?" అని పవిత్ర తన క్యాప్షన్లో స్పష్టం చేసింది. పవిత్ర వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాగా.. పరమ్ సుందరి ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by PAVITHRA MENON (@pavithramenon) -
కూలీ థియేటర్లో బ్లాక్బస్టర్ ట్రైలర్.. దద్దరిల్లిపోయేలా అరుపులు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా శివ 4కే ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రజినీకాంత్ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్తో, 4కే విజువల్స్తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నామని నాగార్జున తెలిపారు. నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్ను డాల్బీ అట్మాస్కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్గోపాల్ వర్మ తెలిపారు..pic.twitter.com/tozHy5t1jC— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2025 -
జాన్వీ కపూర్ పరమ్ సుందరి.. అక్కడ రొమాన్స్ ఏంటి?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా కనిపించనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందోట్రైలర్లో చూపించారు.అయితే పరమ్ సుందరి ట్రైలర్తోనే ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్లో చర్చిలో వచ్చే సీన్పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వాచ్డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సన్నివేశాన్ని సినిమా వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని వాచ్డాగ్ ఫౌండేషన్కు చెందిన న్యాయవాది గాడ్ఫ్రే పిమెంటా అన్నారు. చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలమని.. దానిని అసభ్యకరమైన కంటెంట్కు వేదికగా చిత్రీకరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమేనని లేఖలో వివరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
ఉదయభాను అగ్రెసివ్ రోల్.. త్రిభాణధారి బార్బరిక్ ట్రైలర్ చూశారా?
సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో ఉదయభాను ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ కథను డ్రగ్స్ మాఫియా కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉదయభాను రోల్ చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్, వీటీవీ గణేశ్, రాజేంద్రన్ కీలకపాత్రల్లో నటించారు. -
'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025 -
ఇంట్రెస్టింగ్గా అనుపమ 'పరదా' ట్రైలర్
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది చిత్రంపై అంచనాలు పెంచేలా ఉందని చెప్పొచ్చు. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ') ట్రైలర్లో కథ ఏంటనేది చూచాయిగా రివీల్ చేశారు. ఓ ఊరి దురాచారాలకు సంబంధించిన స్టోరీ ఇది. అక్కడ ఆడపిల్లలు మొహానికి పరదా కట్టుకుని బతుకుతుంటారు. అలాంటి చోట మరెలాంటి దురాచారాలా ఉన్నాయి? వాటిని తట్టుకుని సుబ్బు(అనుపమ) ఎలా నిలబడింది ఏం చేసిందనేదే కథలా అనిపిస్తుంది.ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ట్రైలర్తోనే ఓ బలమైన సందేశం ఇవ్వబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. మరి కూలీ, వార్ 2 రిలీజైన వారంలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
'సీతమ్మోరు లంక దహనం చేస్తే'.. అనుష్క 'ఘాటి' ట్రైలర్ చూశారా?
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి మాఫియా నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఘాట్లలో గాటీలు ఉంటారు సార్' అనే డైలాగ్లో ట్రైలర్ను ప్రారంభించారు. ట్రైలర్ చూస్తే అనుష్క మరోసారి అరుంధతి తరహాలో రౌద్రంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో 'సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.కాగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు. -
అనుష్క లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఘాటి ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఘాటి మూవీ పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు.#GhaatiTrailer and release date announcement on August 6th 💥 Thank u all for all the love always 🙏🏻🧿🤗😍#GHAATI Looking forward🙃@iamVikramPrabhu🎥 Directed by the phenomenal @DirKrish🏢 Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent🎶 Music by @NagavelliV🎼… pic.twitter.com/95PLxPTKch— Anushka Shetty (@MsAnushkaShetty) August 4, 2025 -
క్రేజీ హారర్ కామెడీ.. 'సు ఫ్రమ్ సో' ట్రైలర్ రిలీజ్
చిన్న సినిమాగా రిలీజై రీసెంట్గా కన్నడలో 'సు ఫ్రమ్ సో'.. బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీన్ని ఇప్పుడు తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ శుక్రవారమే రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్నీగా ఉంటూనే ఈ హారర్ సినిమా ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు) 'సు ఫ్రమ్ సో' విలేజ్ బ్యాక్డ్రాప్ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉండే ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమేంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి.. ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్ రిలీజ్) -
రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్
సూపర్స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇప్పుడొచ్చిన ట్రైలర్, ఉన్న హైప్ని మరింత పెంచేలా ఉంది. రజనీ మాస్ షాట్స్, అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈసారి మరింత మాస్ మూవీతో రాబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)ఈ సినిమా అంతా వాచీల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇందులో రజినీకి విలన్గా నాగార్జున నటించారు. వీళ్లతో పాటు ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్తో తీసిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి) -
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
థియేటర్లలో మరోసారి అతడు.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్లో ఈ ఏడాది రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్లీ బిగ్ స్క్రీన్పై సందడి చేశాయి. తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా థియేటర్లలో కనువిందు చేయనుంది.ఈ నేపథ్యంలోనే అతడు రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్బాబు- త్రివిక్రమ్ కాంబోలో 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి మహేశ్ బాబు- త్రిష కెమిస్ట్రీని థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది. Gun & Bullet rendu chuddam Super 4K lo...vindham Dolby lo 🤌🔥Here comes the #AthaduSuper4K Trailer ▶️ https://t.co/hJrElS0H5d Releasing in theatres as a Superstar @urstrulyMahesh Birthday Special on Aug 9th♥️#AthaduHomecoming#Athadu4KOnAug9th #Athadu4K pic.twitter.com/piO9jrQGfa— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) July 30, 2025 -
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 ట్రైలర్ చూశారా?
సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న విజువల్ వండర్ అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్ సైతం ప్రేక్షకులను అలరించింది. ఈ అవతార్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. దీంతో ఈ ఏడాదిలో మరో సినిమాతో జేమ్స్ కామెరూన్ రెడీ అయిపోయారు. అవతార్ సిరీస్లో భాగంగా అవతార్.. ఫైర్ అండ్ యాష్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అవతార్ పార్ట్-3 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ట్రైలర్ చూస్తుంటే మరింత మరో అద్భుతమైన విజువల్ వండర్గా రికార్డ్ సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. -
రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. ఇటీవలే విడుదలైన పవర్ హౌస్ సాంగ్ రజినీకాంత్ ఫ్యాన్స్ను, ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL— Sun Pictures (@sunpictures) July 28, 2025 -
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
'మై విలేజ్ షో' పేరుతో యూట్యూబ్లో గుర్తింపు తెచ్చుకున్న టీమ్.. ఇప్పుడు సినీ అరంగేట్రానికి సిద్ధమైంది. అయితే థియేటర్లో కాకుండా ఓటీటీలో సందడి చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: బిగ్బాస్ సోనియా సీమంతం వేడుక)అనిల్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ దర్శకుడు. ఆగస్టు 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో యూట్యూబ్లో 'విలేజ్ షో' టీమ్ అంతా ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే తీశారు. ఇప్పుడు సిరీస్ కోసం ఆ తరహా కథనే ఎంచుకున్నారు.పల్లెటూరిలో ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు.. ఓ అమ్మాయితో లేచిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు ఆ అమ్మాయితో ఒక్కటయ్యాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్, అందున రూరల్ స్టోరీతో తీసిన సిరీస్ కాబట్టి క్లిక్ కావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ) -
కింగ్డమ్ ట్రైలర్.. కాంతార స్టైల్లో ఉన్న స్టార్ హీరో ఎవరు?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 31న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. శనివారం జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు.కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే జూలై 31 వరకు వేచి చూడాల్సిందే.కాగా.. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ట్రైలర్ రిలీజ్
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'. విపిన్ దర్శకత్వం వహించగా ఉమాదేవి కోట నిర్మించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి విజువల్స్తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఆస్ట్రేలియా ప్రజల్ని హడలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్)నరేష్ అగస్త ఇదివరకే కొన్ని తెలుగు సినిమాల్లో హీరో, సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లోనూ ఓ కథానాయకుడిగా చేశాడు. రీసెంట్ టైంలో ప్రేమకథలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్
కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవాడు. 'రాఖీ' సినిమాలో తారక్ రూపంపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి 'యమదొంగ' కోసం పూర్తి సన్నగా మారిపోయాడు. అప్పటినుంచి దాదాపు ఒకేలాంటి లుక్ మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సినీ కెరీర్లో రెండోసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్గన్'.. సడెన్గా తెలుగు స్ట్రీమింగ్)దాదాపు ఏడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా 'అరవింద సమేత'. ఈమూవీ కోసం సిక్స్ ప్యాక్ చూపించాడు. షర్ట్ లేకుండానే తారక్ ఇంట్రో ఫైట్లో కనిపించాడు. అంతకు ముందు 'టెంపర్'లోనూ సిక్స్ ప్యాక్ చూపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి సిక్స్ ప్యాక్ చేశాడు. అదీ బాలీవుడ్ సినిమా కోసం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్.. హిందీలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే 'వార్ 2'.యష్ రాజ్ స్పై యూనివర్స్లో తీసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్-తారక్ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ట్రైలర్లోనే తారక్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు. ఇదే ఫ్యాన్స్కి మంచి ఫీస్ట్ ఇస్తోంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్) -
ఎంటర్టైనింగ్గా 'సూ ఫ్రమ్ సో' ట్రైలర్
ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా సరే ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులోనూ రీసెంట్ టైంలో అలా పలు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు విలేజ్ స్టోరీ హారర్ కామెడీ మిస్ చేసి తీసిన కన్నడ చిత్రం 'సూ ఫ్రమ్ సో'. ఈ నెల 25న అంటే శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతేంటి? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)'కాంతార' సినిమాలో హీరో రిషభ్ శెట్టి ఫ్రెండ్ పాత్రలు చేసిన నటులు ఈ మూవీలోనూ నటించారు. రిషభ్ శెట్టి ఫ్రెండ్ రాజ్ బి శెట్టి దీన్ని నిర్మించారు. 'సూ ఫ్రమ్ సో' విషయానికొస్తే.. కర్ణాటకలోని తీరప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరిలో అందరూ సంతోషంగా బతుకుతుంటారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో ఓ దెయ్యం ఆ ఊరికి వస్తుంది. అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చిందనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.మంగళవారం రాత్రి ఈ సినిమాకు ప్రీమియర్లు పడగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. చూస్తుంటే ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా కనిపించింది. థియేటర్లలో తెలుగు రిలీజ్ లేదు గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీపై లుక్కేయొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
అద్భుత పోరాటం
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. చివరికీ ఈ నెల 31 థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: గమనిక: వైరల్ అవుతున్న 'విజయ్ దేవరకొండ' స్టంట్?)మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కింగ్డమ్ మూవీ ట్రైలర్ తేదీని ప్రకటించారు. ఈ నెల 26న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. తిరుపతిలో ట్రైలర్ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ ఫీవర్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కింగ్డమ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొనున్నారు. #KINGDOMTrailer is coming. JULY 26th - Tirupati 🙏❤️ pic.twitter.com/a5t3mZukeU— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2025 Countless prayers One man’s journey!Watch his destiny unfold. Every step towards his #Kingdom 🔥👑#KingdomTrailer - Out on JULY 26! 💥💥Grand Trailer Launch Event at Tirupati! 🤩@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @dopjomon… pic.twitter.com/weHN7vFA5L— Sithara Entertainments (@SitharaEnts) July 22, 2025 -
ఏఐ ప్రపంచం మన మధ్యకు వస్తే ఏమవుతుంది.. ఆసక్తిగా ట్రైలర్
హలీవుడ్లో వచ్చిన ట్రాన్ సిరీస్ ఇప్పటివరకు అభిమానుల విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్లో మరో చిత్రం అలరించేందుకు వస్తోంది. ఏఐ ప్రోగ్రామ్ మన ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మానవుల మధ్యకు ఏఐ ప్రపంచం వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చిత్రంలో చూపించనున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ట్రాన్ సిరీస్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైన్ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. 1982 సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రాన్, ఆ తర్వాత 2010 సీక్వెల్ను రూపొందించారు. వాల్డ్ డిస్నీ స్డూడియోస్ నిర్మించిన ఈ సిరీస్ చిత్రాలు అభిమానులను అలరించాయి.ఈ సినిమాకు జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. అకాడమీ అవార్డు విన్నర్ జారెడ్ లేటో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, హసన్ మిన్హాజ్, జోడీ టర్నర్-స్మిత్, ఆర్టురో కాస్ట్రో, కామెరాన్ మోనాఘన్, గిలియన్ ఆండర్సన్, జెఫ్ బ్రిడ్జెస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 10న ఇంగ్లీష్తో పాటు ఇండియన్ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.This October, they are coming to our world.Watch the brand-new trailer for Tron: Ares and experience it in theaters, filmed for IMAX, October 10. pic.twitter.com/a2z8Pnn3Ei— Walt Disney Studios (@DisneyStudios) July 17, 2025 -
'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఓటీటీలో కంటెంట్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
సెన్సార్ తేలింది.. టైటిల్ మారింది.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ కేరళ'. లెక్క ప్రకారం జూన్ చివరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ టైటిల్పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం పెట్టింది. సీతాదేవి మరోపేరు జానకి అని, దీని వల్ల రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ ఉండొచ్చని, అందుకే కచ్చితంగా పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టింది. మూవీ టీమ్ తొలుత దీనికి అంగీకారం తెలపలేదు. ఎట్టకేలకు ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)జానకి వర్సెస్ కేరళ అని అనుకున్న టైటిల్ని సెన్సార్ బోర్ట్.. 'జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఈమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకకి న్యాయం దక్కిందా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పగానే క్రేజీ సినిమాలు, డిఫరెంట్ పాత్రలు గుర్తొస్తాయి. 'పుష్ప 2' సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతడు.. ప్రస్తుతం తమిళంలో 'మారీషన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సీనియర్ కమెడియన్ వడివేలు కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. ఇంతకీ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)ఇదో తమిళ సినిమా. దొంగతనాలు చేసిన ఒకడు(ఫహాద్).. డబ్బులతో ఉన్న మతిమరుపు వ్యక్తిని(వడివేలు) చూస్తాడు. అతడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి తిరువణ్ణామలైకి బైక్పై వెళ్తారు. మరోవైపు మతిమరుపు వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తోంది.జూలై 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ చిత్రం చేశాడని అర్థమైంది. ప్రస్తుతానికైతే తమిళ వెర్షన్ మాత్రమే బిగ్ స్క్రీన్పైకి రానుంది. తెలుగు డబ్బింగ్ కోసం ఓటీటీలోకి వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. గతంలో ఫహాద్-వడివేలు కలిసి 'మామన్నన్' మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?) -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్) -
'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
'కొత్తపల్లిలో ఒకప్పుడు'.. ఏం జరిగిందంటే..? (ట్రైలర్)
రానా దగ్గుబాటి నిర్మిస్తున్న 'కొత్తపల్లిలో ఒకప్పుడు'(KOTHAPALLILO OKAPPUDU) చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల భారీ విజయాన్ని అందుకున్న కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. అయితే, గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మరోసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ మూవీని నిర్మించారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. జులై 18న ఈ మూవీ విడుదల కానుంది. -
ఈ సినిమాకు వెళ్తే థియేటర్లలో డబ్బుల వర్షం..
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు. -
ఆర్మీ ఆఫీసర్గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం సర్జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్గా నటించింది.తాజాగా సర్జమీన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial @itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze… pic.twitter.com/qMDDJA19Vq— JioHotstar (@JioHotstar) July 4, 2025 -
హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. -
'గెలాక్టస్తో యుద్ధానికి సిద్ధం'.. ఫెంటాస్టిక్ ఫోర్ తెలుగు ట్రైలర్ చూశారా?
మార్వెల్ అభిమానులకు ఇక పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' అనే హాలీవుడ్ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది.ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది.ఈ చిత్రంలో పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (సూ స్ట్రోమ్/ఇన్విజిబుల్ ఉమెన్), జోసెఫ్ క్విన్ (జానీ స్ట్రోమ్/హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బచ్రాక్ (బెన్ గ్రిమ్/ది థింగ్) నటించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
డబ్బులు పంపిస్తామని యూపీఐ నంబర్ అడిగారు: నవీన్ చంద్ర
టాలీవుడ్ నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ చంద్ర.. షో టైమ్ అంటూ మరోసారి రెడీ అయిపోయారు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నవీన్.. అలాంటి కథతోనే మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్ 13న తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఆ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజని అన్నారు. ఎక్కడో బళ్లారి నుంచి మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపారు. నా కెరీర్లో సక్కెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా ఇండస్ట్రీలోనే ఉంటానని అన్నారు.చాలామంది మీ సినిమాలు థియేటర్లలో మిస్సయ్యాం.. మీ నిర్మాత యూపీఐ నెంబర్ పెట్టమని చాలామంది అడిగారని వెల్లడించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ నవీన్ చంద్ర మాట్లాడారు. షో టైమ్ మూవీని థియేటర్లకు వచ్చి చూడండి.. మిమ్మల్ని డిస్సపాయింట్ చేయదు అంటూ ఆడియన్స్కు రిక్వెస్ట్ చేశారు నవీన్ చంద్ర. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'లోపలికి రా చెప్తా' ట్రైలర్ రిలీజ్
కొండా వెంకట రాజేంద్ర, మనీషా, సుస్మిత, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లోపలికి రా చెప్తా'. లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హారర్ కామెడీ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?)జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో ఈ సినిమా రాబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది. రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని నా బెస్ట్ విషెస్ అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్) -
'పెళ్లి రోజే వధువు మరణిస్తే'.. ఆసక్తిగా టాలీవుడ్ థ్రిల్లర్ ట్రైలర్!
ఓటీటీలు వచ్చాక హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ జోనర్లో ఎక్కువగా చిత్రాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ అలరించేందుకు వస్తోంది. యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్గా నటిస్తున్న ఈ థ్రిల్లర్కి 'విరాటపాలెం'. ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు.ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్కు పొల్లూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే ఓ గ్రామంలో పెళ్లైన వధువు అదే రోజు రాత్రి మరణిస్తుంది. ఇదంతా ఆ ఊరికి ఉన్న శాపం వల్లే గ్రామస్తులు భావిస్తారు. కానీ ఆ ఊరికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ దీని వెనుక ఉన్న గుట్టును బయట పెట్టేందుకు యత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో ఈ కథను ఆసక్తికరంగా తెరెకెక్కించారు. ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
'అశ్వత్థామ'గా గౌతమ్.. ఇదేందయ్యా ఇది.. ఇంకా మర్చిపోలే?
ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అదే చేశాడు. బిగ్బాస్ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్మేట్స్ వెనకడుగు వేస్తుంటే గౌతమ్ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు. అశ్వత్థామ అంటూ నవ్వులపాలు!కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్ కార్డ్గా హౌస్లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ డైలాగ్కు ఓవర్ కాన్ఫిడెన్స్ తోడవడంతో గౌతమ్పై ట్రోలింగ్ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.అశ్వత్థామకు చావు లేదుబిగ్బాస్ 8వ సీజన్లో మరోసారి వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్ వేశాడు. ఇప్పుడదే డైలాగ్ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.పేరు ముందు అదే ట్యాగ్గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో గౌతమ్ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్ను గౌతమ్ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ ట్యాగ్లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు . చదవండి: రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు -
' ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు'.. ఆసక్తిగా 8 వసంతాలు ట్రైలర్
అనంతిక సానిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం '8 వసంతాలు'. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఒక అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్తోనే ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.Directed by #PhanindraNarsettiProduced by @MythriOfficialStarring… pic.twitter.com/8C5x3Noi8V— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025 -
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్తో తీసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కూడా అభిమానులకు నచ్చేలా ఉంది. గతంలో వచ్చిన కంటెంట్పై వచ్చింది. ట్రైలర్ని మాత్రం ట్రోలింగ్కి స్కోప్ లేకుండా బాగానే కట్ చేశారు. అలానే స్టోరీ ఏంటనేది కూడా చూచాయిగా చెప్పేశారు కూడా. సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ట్రైలర్తో శాంపిల్ చూపించేశారు.ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు).. చిన్నప్పటి నుంచి దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల గూడెం నుంచి ఇతడిని వెలివేస్తారు. అదే టైంలో నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. తర్వాత శివుడు(అక్షయ్ కుమార్), రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపిస్తాడు. రుద్ర వల్ల తిన్నడు.. అతిపెద్ద శివభక్తుడు ఎలా అయ్యాడు? ఈ మొత్తం కథలో వాయు లింగం సంగతేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?) -
నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.ఈ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో నితిన్పై ప్రశంసలు కురిపించారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నితిన్ మాత్రమేనని అన్నారు. ఆర్టిస్టులు చాలామంది ఇన్సెక్యూర్గా ఉంటారని.. కానీ అతనిలో ఏమాత్రం అభద్రతాభావం ఉండదని తెలిపారు. నితిన్ సినిమాకు రైటర్గా వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీరామ్ వేణు వెల్లడించారు. ఇంతకుముందే నితిన్తో నేను సినిమా చేయాల్సిందని..కానీ నా వల్లే కాస్తా ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
ఆమిర్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
'లాల్ సింగ్ చద్దా' లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'సితారే జమీన్ పర్' పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)హాలీవుడ్ మూవీ 'ఛాంపియన్స్'కి అనధికారిక రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్.. అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది.ఆమిర్ స్వయంగా కోచ్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్గా పలువురు సెలబ్రిటీల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!) -
'కన్నప్ప' ట్రైలర్ అప్డేట్.. కాస్త త్వరగానే
రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..!
ఇటీవల టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్ అపేడేట్ ఇచ్చేందుకు మరోసారి అదే స్టైల్నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
బాలయ్య బర్త్ డే స్పెషల్.. లక్ష్మీ నరసింహ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ కొద్దికాలంగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ సైతం బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈనెల 10న బాలయ్య బర్త్ డే కావడంతో రెండు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ బ్లాక్బస్టర్ మూవీని జూన్ 8న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారుఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. 200లో వచ్చిన ఈచిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
జూదం కోసం సీక్రెట్ సొసైటీ.. ఆసక్తికరంగా ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్
సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆడడం చేతగానివాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది. ఆడడం తెలిసిన వాడికి జూదం నేరం కాదు’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభం అయింది. సీక్రెట్ సొసైటీలోకి ఆహ్వానించడం.. అక్కడ ఏది నిజం కాదు చెప్పడం.. రూ.100 కోట్ల డైమండ్ మిస్ అయినట్లు ట్రైలర్లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత రాజ్ కుమార్ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్తో తాజాగా 'గ్యాంబ్లర్స్' చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది' అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ''యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం.ఈ సినిమాలో డిఫరెంట్ సంగీత్ శోభన్ను చూడబోతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా పాటలను విడుదల చేశాం' అన్నారు. దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ '' ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ పర్పార్మెన్స్ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు. -
ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్'. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్)'శ్రీశ్రీశ్రీ రాజావారు' పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.విజువల్స్ చూస్తుంటే రిచ్గా ఉన్నాయి గానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీమ్ అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్లకే తెలియాలి. వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి 'రాజావారు' మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
మలయాళంలో హిట్.. తెలుగులోనూ విడుదల (నరివెట్ట ట్రైలర్)
మలయాళ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన 'నరివెట్ట' (Narivetta) తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఐడెంటిటీ' చిత్రంతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న ఆయన నరివెట్ట సినిమాతో మరో హిట్ అందుకున్నారు. మలయాళం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో తెలుగులో కూడా మే 30న విడుదల చేయనున్నారు. 2003 ముతంగ సంఘటన ఆధారంగా అబిన్ జోసెఫ్ కథ రాశారు. ఈ చిత్రంలో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ నటించారు. -
విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ చూశారా?
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా మీ గెటప్ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మార్గన్ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఐదోసారి అలరించేందుకు వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హౌస్ఫుల్-5. గతంలో ఈ సిరీస్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హౌస్ఫుల్ సిరీస్లో ఐదో చిత్రంగా ఈ సినిమా రానుంది. బాలీవుడ్లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా హౌస్ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సిరీస్లో ఐదో భాగంగా హౌస్ఫుల్-5 ట్రైలర్ చూస్తుంటే నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే ఇందులో కామెడీ మరింత అలరించేలా ఉంది. కాగా.. ఈ చిత్రంలో రితేశ్ దేశ్ముఖ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సాజిద్ నడియాద్వాలా నిర్మాతగా వ్యవహరించగా.. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. -
విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ
స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ గత కొన్నేళ్లుగా హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకైతే 'బిచ్చగాడు' హీరోగా మాత్రమే తెలుసు. ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో జనాల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ కూడా క్లారిటీ ఇస్తారేమో. సాధారణంగా మనం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తుంటాం కదా. ఇది ఆ కోవలోకే వస్తుంది. స్విమ్మర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ కుర్రాడు.. అమ్మాయిలకు ఓ రకమైన డ్రగ్ ఇచ్చి చంపుతుంటాడు. దీని వల్ల శరీరమంతా నల్లగా మారి చనిపోతుంటారు.హీరో అయిన పోలీస్ కూడా దీని బారిన సగం పడతాడు. అంటే సగం శరీరం నల్లగా మారి ఉంటుంది. సదరు పోలీసు.. దొంగని ఎలా పట్టుకున్నాడు? అసలు అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాన్ని కనిపెట్టాడా లేదా? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం మంచి క్రేజీగా ఉంది. మరి ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ అవుతుందా? ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి? జూన్ 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో విలన్గా చేసిన అజయ్ దిశాన్.. విజయ్ ఆంటోనికి సొంత మేనల్లుడే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) -
సస్పెన్స్ థ్రిల్లర్గా 'ఘటికాచలం' ట్రైలర్
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అందుకుని అందరి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతాయి. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం 'ఘటికాచలం'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్తో సినిమాను తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా రానున్న ఈ మూవీలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
టాలీవుడ్లో మరో ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
రీతూ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్కు బి.కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ను ఫుల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలోనే విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే దేవిక అండ్ డానీ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరెకెక్కించినట్లు అర్థమవుతోంది. 'ఎవడు భయపెట్టినా.. ఎంత ప్రమాదమైనా రానీ.. వెనకడుగు వేసేదే లేదు'.. అని రీతూ వర్మ చెప్పే డైలాగ్ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేసింది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్లో సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వైవా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనిక రెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు. One holds her hand and the other... her soul. 🤍 https://t.co/zTcVhoqYg3Devika & Danny streaming from 6th June only on #JioHotstar 💌 Directed by @im_kishorudu #DevikaAndDanny #SuryaVashistta @iam_shiva9696 @actorsubbaraju #SoniyaSingh #MounikaReddy #IshwaryaVullingala… pic.twitter.com/OUiWshV7FW— Ritu Varma (@riturv) May 20, 2025 -
ముగ్గురు హీరోల 'భైరవం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా) ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఏస్ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై బి.శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ చూసేయండి. -
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ) -
దెయ్యం కోరికను తీర్చే 'బకాసుర రెస్టారెంట్'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి ఎస్జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్జే మూవీస్ బ్యానర్లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైవా హర్ష, ప్రవీణ్ కామెడీ అభిమానులను ఓ రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో సీన్స్ హారర్ సినిమాను తలపించేలా ఉన్నాయి. ప్రేమకథా చిత్రమ్ పార్వతి కదూ? పదేళ్లయినా అదే దెబ్బ.. నువ్వు ఇంకా పోలేదా? అని ప్రవీణ్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. -
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) #SitareZameenPartrailer देखो मिस्टर परफेक्ट ने कैसे पर्फेक्ट्ली फ्रेम टू फ्रेम कॉपी मारी है 😃😃😃🕋🕋🕋I can’t imagine how much they have made a fool of Bollywood lovers in the Past #AmirKhan #Champions pic.twitter.com/ZeKtJoLQve— Ex Shia Muslim News (@ExShiaMuslim) May 13, 2025 -
చూస్తుంటేనే భయానకం... 14 ఏళ్ల తర్వాత ఆరో భాగం రిలీజ్
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయి అని భయపెట్టారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ముందురోజు 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ చేస్తుండటం విశేషం. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అవుతోంది. ఇదే చివరిది కూడా.కొన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా భయపెట్టేసింది. ఇంటి పెరటిలో ఓ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్లని చావు వెంటాడుతుంది. బీర్ గ్లాస్ ముక్క, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అక్కడున్న ప్రతి వస్తువు వీళ్ల చావుకు కారణమయ్యేలా ఉంటుంది. మరి చావు నుంచి తప్పించుకున్నారా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన హాలీవుడ్ ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?) -
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఏస్ ట్రైలర్ చూస్తే మలేషియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తే జూదం, స్మగ్లింగ్, దోపిడీ నేపథ్యంలో కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అభిమానులను అలరించనున్నారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్లో విజయ్ సేతుపతి యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
'సలార్' సంగీత దర్శకుడి పీరియాడిక్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. ఇప్పుడు ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. వీరచంద్రహాస పేరుతో కన్నడలో తెరకెక్కించాడు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన యక్షగానం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాడు.అంతరించిపోతున్న యక్షగానం కథతో తీసిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. పీరియాడికల్ సెటప్ అయితే ఉంది గానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. ట్రైలర్ చూస్తే సమ్ థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.వీరచంద్రహాస, తెలుగు ట్రైలర్, రవి బస్రూర్, మూవీ న్యూస్ -
'కశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'.. ట్రైలర్ ఈవెంట్లో సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.కశ్మీర్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది.


