'సీతమ్మోరు లంక దహనం చేస్తే'.. అనుష్క 'ఘాటి' ట్రైలర్‌ చూశారా? | Anushka Shetty Latest Movie GHAATI Trailer Out Now | Sakshi
Sakshi News home page

Ghaati Trailer: అనుష్క శెట్టి 'ఘాటి'.. ట్రైలర్‌ వచ్చేసింది!

Aug 6 2025 5:15 PM | Updated on Aug 6 2025 5:43 PM

Anushka Shetty Latest Movie GHAATI Trailer Out Now

అనుష్క శెట్టి లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్‌ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి మాఫియా నేపథ్యంలో కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఘాట్లలో గాటీలు ఉంటారు సార్‌' అనే డైలాగ్లో ట్రైలర్ను ప్రారంభించారు. ట్రైలర్చూస్తే అనుష్క మరోసారి అరుంధతి తరహాలో రౌద్రంగా కనిపించింది. ట్రైలర్చివర్లో 'సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ' అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్‌ సంగీతమందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement