breaking news
Ghaati Movie
-
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?
ఈ వీకెండ్ థియేటర్లలోకి మూడు సినిమాలొచ్చాయి. వీటిలో అనుష్క 'ఘాటీ', శివకార్తికేయన్ 'మదరాసి', లిటిల్ హార్ట్స్ అనే చిన్న చిత్రం ఉన్నాయి. అయితే అనుహ్యంగా అనుష్క మూవీకి తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు మదరాసి చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. మరి తొలిరోజు వసూళ్లు ఏ చిత్రానికి ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)తొలుత ఘాటీ విషయానికొస్తే.. చాన్నాళ్ల తర్వాత అనుష్క లీడ్ రోల్లో ఈ మూవీ చేసింది. తూర్పు కనుమల్లో గంజాయి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రిలీజ్కి ముందు వరకు బాగానే హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ మరీ పేలవంగా ఉందనే టాక్ రావడం దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చు. అనుష్క తప్పితే పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోవడం జనాల్ని థియేటర్లలోకి రప్పించలేకపోయింది. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.2.89 కోట్ల కలెక్షన్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు ఏఆర్ మురుగదాస్-శివకార్తికేయన్ కలిసి చేసిన 'మదరాసి'పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే ఈ దర్శకుడు హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. కాస్తోకూస్తో హైప్ హీరో వల్ల ఏర్పడింది. దానికి తోడు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడం దీనికి ప్లస్ అయింది. దీంతో మొదటిరోజు 'మదరాసి' చిత్రానికి రూ.13 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)మరోవైపు మౌళి అనే యూట్యూబర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేశారు. అక్కడి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అలానే రీసెంట్ టైంలో మొదటిరోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగానూ ఇది నిలిచినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఎవరి జాతకం ఏంటనేది పూర్తిగా తేలుతుంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) -
అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ
అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(2023) తర్వాత ఆమె నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Ghaati Movie Review ). కథేంటంటే..శీలావతి.. ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ పండిన గంజాయి పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శీలావతికి బావ దేశిరాజు అంటే చాలా ఇష్టం. అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్ని పట్టుకొని దానికి ఎమోషల్ జోడించి.. ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటి కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాల్లోలాగా ఎమోషన్ని ఇందులో పండించలేకపోయాడు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమి లేవు. కథ నేపథ్యం బాగున్నా..దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంతో క్రిష్ పూర్తిగా సఫలం కాలేదు. ఘాటీలు, వారి వృత్తి నేపథ్యాన్ని వివరిస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల ఎంట్రీ చాలా సహజంగా ఉంటుంది. శీలావతి గంజాయి సరఫరా.. రైల్వే స్టేషన్ నుంచి డబ్బులు తీసుకునేక్రమంలో వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక గంజాయి స్మగ్లింగ్ వెనుక హీరోహీరోయిన్లు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత..కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. తొలి అర్థభాగం మొత్తం ఎలాంటి ట్విస్టులు, హైమూమెంట్స్ లేకుండా కథనం చాలా సింపుల్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ సీన్తో సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ఈజీగా ఊహించొచ్చు. ద్వితియార్థం మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామానే. కథనం మొత్తం అక్కడక్కడే తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది. ఒకదాని వెనుక మరోకటి యాక్షన్ సీన్లు వస్తూ ఉంటాయి. అయితే గుహలో నాయుడు ముఠాతో చేసే యాక్షన్ సీన్, తలనరికే ఎపిసోడ్ తప్ప..మిగతావేవి ఆకట్టుకోలేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అనుష్క కోసం ఇరికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సింపుల్గా, ఉహకందేలా ఉంటుంది. బాధితురాలు నేరస్తురాలిగా మారడం.. ఆ తర్వాత తను ఎంచుకున్న మార్గాన్ని వదిలి.. తన వర్గాన్ని మంచి దారిలో నడిపించడం కోసం ప్రయత్నించడం.. ఇదే ఘటి కథ. అయితే తన వర్గాన్ని మంచి దారిలో తీసుకొచ్చేందుకు శీలావతి చేసే పోరాటం ఆసక్తికరంగా మలిచి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శీలావతి పాత్రకి అనుష్క న్యాయం చేసింది. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీసింది. కానీ ఆ సీన్లను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. చాలా చోట్ల ఇరికించినట్లుగా, కొన్ని చోట్ల అతిగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లను బాగానే నటించింది. కానీ అరుధంతి, బాహుబలి, భాగమతిలో ఉన్న అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. దేశిరాజుగా విక్రమ్ ప్రభు బాగానే నటించాడు. చైతన్యరావు తొలిసారి విలన్గా నటించి మెప్పించాడు. అయితే ప్రతిసారి గట్టిగా అరవడం తప్ప.. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రవీంద్ర విజయ్ విలనిజం కూడా అంతంతమాత్రమే. పోలీసు ఆఫీసర్గా జగపతి బాబు అక్కడక్కడ కనిపిస్తాడు. ఆయన పాత్ర ఎంటర్టైనింగ్గా మలిచారు. కానీ అది తెరపై వర్కౌట్ కాలేదు. జాన్ విజయ్, రాజు సుందరం, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ సంగీతం ఓకే. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి.. ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందంటే?
అనుష్క (Anushka Shetty) నటించిన లేటేస్ట్ యాక్షన్ డ్రామా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ ఇవాళే థియేటర్లలో విడుదలైంది.ఇప్పటికే కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడగా.. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో క్రిష్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. బీజీఎం సూపర్గా ఉందని.. ఫైట్ సీన్స్లో అదరగొట్టేశారని చెబుతున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్తో పాటు క్లైమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫర్ఫెక్ట్ రివేంజ్ డ్రామా అని.. ట్రైన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్లో ఫుల్ మీల్స్ ఖాయమని.. రెబల్ క్వీన్ అనుష్క క్లైమాక్స్లో అదరగొట్టేసిందని అంటున్నారు. విక్రమ్ ప్రభు తన పాత్ర హైలెట్గా ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కను కాటేరమ్మతో పోలుస్తున్నారు. మరికొందరైతే యావరేజ్గా ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం ఉండదు.#Ghaati#GhaatiReviewAnushka acting 🥵 Overall rating : 2.5/3 ONE TIME WATCH pic.twitter.com/JKpQCutoGq— Ch VD (@dhfmvd1109) September 5, 2025 Kaateramma 🔥🔥 🔥 #Ghaati #GhaatiReview pic.twitter.com/H3xFZldsY0— AitheyEnti (@AitheyEntii) September 4, 2025 The second half of #Ghaati is masterfully narrated from #AnushkaShetty's character 🔥🔥Anushka absolutely shines, elevating every moment with her powerhouse performance! 🔥👏🌟 great BGM good moveRating🌟🌟🌟/5#AnushkaShetty #GhaatiOnSept5th #GhaatiReview #VikramPrabhu https://t.co/4PLtqvVsuh pic.twitter.com/63tS5SXAuW— satya krishna (@satyakrish9999) September 4, 2025 #Ghaati #GhaatiReview 2nd half started flat with a backstory but gone high with crazy fight episodes"REBEL QUEEN" 🥳Just #AnushkaShetty Screen Presence is enough🔥 REVOLUTIONARY REVENGE DRAMA✅Pre climax had a little lag but full meals with the climax💯OVERALL: 3️⃣/5️⃣ https://t.co/hB6Zof5Qsz pic.twitter.com/31vCMzHbr3— 🍸𝕍𝕠𝕕𝕜𝕒 𝕎𝕚𝕥𝕙 𝕍𝕒𝕣𝕞𝕒🍸 (@enzoyy_pandagow) September 4, 2025 #Ghaati Neat delivers a stellar first half! 🚀 The stage is perfectly set for an explosive second half. 🎬Anushka Shetty and #VikramPrabhu shine effortlessly in their roles. 👏👏 That train sequence? Pure 🔥🔥🔥!#AnushkaShetty #GhaatiOnSept5th #GhaatiReview https://t.co/LRp2pK1lFk pic.twitter.com/5ZM8bw4QfH— satya krishna (@satyakrish9999) September 4, 2025 #GhaatiReview Amazing First Half 🔥🔥🔥New and interesting story from Krish..He is Back💯💯Loved the concept of Ghaati'sSheelavathi & Desi Raju 👌🏻👌🏻Superb Music and BGM✅Waiting For LadyRebels Rampage in the second half.......... https://t.co/EQt6aza9xR— 🍸𝕍𝕠𝕕𝕜𝕒 𝕎𝕚𝕥𝕙 𝕍𝕒𝕣𝕞𝕒🍸 (@enzoyy_pandagow) September 4, 2025 -
‘శీలావతి’.. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది: అనుష్క
‘‘నేను సినిమాల్లోకి భయం భయంగా వచ్చాను. అయితే రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్ల ప్రయాణాన్ని ఊహించలేదు. ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ని, స్టార్డమ్ని సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఇందుకు ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి కృతజ్ఞతతో ఉంటా’’ అని హీరోయిన్ అనుష్క శెట్టి చెప్పారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానున్న సందర్భంగా అనుష్క పంచుకున్న విశేషాలు. → ‘ఘాటీ’లో నేను చేసిన శీలావతి క్యారెక్టర్లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. నా కంఫర్ట్ జోన్ని దాటి చేసిన సినిమా ఇది. శీలావతి నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సరోజ (‘క్రిష్’ డైరెక్షన్లో చేసిన ‘వేదం’ సినిమాలోని పాత్ర), శీలావతి వంటి అద్భుతమైన పాత్రలు ఇస్తున్న క్రిష్గారికి థ్యాంక్స్. → క్రిష్గారు, చింతకింది శ్రీనివాస్గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. షూటింగ్ లొకేషన్స్కి వెళ్లిన తర్వాత ఒక కొత్త పాత్ర, సంస్కృతి, ఒక కొత్త విజువల్ని ప్రేక్షకులకి చూపించబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ కలిగింది. ప్రతి మహిళ సాధారణంగా, సున్నితంగా కనిపించినప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన స్తంభంలాగా నిలబడుతుంది. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి’ వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేశాను. ‘ఘాటీ’లో చేసిన శీలావతి పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య గంజాయి. క్రిష్గారు సమాజానికి దగ్గరగా ఉండే కథలనే ఎంచుకుంటారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఘాటీ’లో చక్కని సందేశం కూడా ఉంది. → నేను చేసిన చాలా సినిమాలు కష్టంతో కూడుకున్నవే. ‘ఘాటీ’లోనూ ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. షూటింగ్ కోసం పెద్ద పెద్ద కొండలు ఎక్కేవాళ్లం. ఇలాంటి ఒక వైవిధ్యమైన కథని నమ్మి, నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా చేసినందుకు రాజీవ్ రెడ్డి, సాయిబాబుగార్లకు, యూవీ క్రియేషన్స్వారికి ధన్యవాదాలు. క్రిష్గారు రాసిన మూడు ΄ాటల్లో ‘కుందేటి చుక్క...’ అంటూ ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను... పుస్తకాలు చదువుతాను... సినిమాలు చూస్తాను. ప్రస్తుతం క్రిష్గారు ఇచ్చిన ‘మహాభారతం’ చదువుతున్నాను. రెండేళ్లుగా ఎక్కువగా కుటుంబంతోనే సమయం గడుపుతున్నాను. →‘ఘాటీ’ని ఆంధ్ర–ఒరిస్సా సరిహద్దుల్లో షూట్ చేసినప్పుడు నన్ను చూడడానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడం హ్యాపీగా అనిపించింది. రాజమౌళిగారు లాంటి దర్శకుడు ‘బాహుబలి’ లాంటి చిత్రాలని అద్భుతంగా తీయడం వల్లే అన్ని వైపులా రీచ్ అయింది. మంచి సినిమా చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. నేను ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ నన్ను ‘అరుంధతి’గానే గుర్తుపడుతున్నారు. → ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిగా ఉంది. ‘ఛత్రపతి’ సినిమా సమయం నుంచి ప్రభాస్తో నాకు మంచి స్నేహం ఉంది. మేము కలిసి నటించిన సినిమాల్లో మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటే అది ఆయా ΄ాత్రల గొప్పదనం. ఇక బలమైన కథ కుదిరితే ఔట్ అండ్ ఔట్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. మొదటిసారి మలయాళంలో ‘కథ నార్’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. -
అనుష్క కోసం ప్రభాస్ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్ గ్లింప్స్
అనుష్క (Anushka Shetty) నటించిన ఘాటీ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. అనుష్క యాక్షన్ సీన్స్కు సంబంధించిన గ్లింప్స్ను ఆయన విడుదల చేశారు. స్వీటీ సినిమా ప్రమోషన్ కోసం బాహుబలి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.కొన్ని కారణాలవల్ల ఘాటీ సినిమా ప్రమోషన్స్కు అనుష్క దూరంగా ఉన్నారు. అయితే, ఫోన్ ద్వారా ఆమె ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తాజాగా ఘాటీ కోసం సడెన్గా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత బజ్ క్రియేట్ కానుంది. -
కొత్త ప్రపంచాన్ని చూపించాం: క్రిష్ జాగర్లమూడి
‘‘అనుష్కకి దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన బలం ఏంటో మనందరికీ తెలుసు. తన చిత్రం బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించాయి. ‘అరుంధతి’ నుంచి ‘భాగమతి’ వరకు ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారామె. ‘ఘాటీ’ చిత్రంలో తనకి చాలా ఎగ్జయిటింగ్ క్యారెక్టర్ దొరికింది. మేమంతా నమ్మి, ఈప్రాజెక్ట్ని రాజీ పడకుండా రూపొందించాం. బిజినెస్ కూడా బాగుంది. యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం’’ అని క్రిష్ జాగర్లమూడి తెలిపారు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు.⇒ ‘వేదం’ సినిమా తర్వాత స్వీటీతో (అనుష్క) మరో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఆ చిత్రంలో సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలనే ఆలోచన కూడా జరిగింది. అయితే సహజంగా ఉండే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘ఘాటీ’ సరైనప్రాజెక్ట్ అనిపించింది. చింతకింది శ్రీనివాసరావు గొప్ప రచయిత. మా కంపెనీలో ‘అరేబియన్ కడలి’ అనే వెబ్ సిరీస్కి కథ, మాటలు రాశారాయన.వేరే కథల గురించి చర్చించుకుంటున్నప్పుడు ‘ఘాటీ’ గురించి చె΄్పారు. ఆంధ్ర– ఒరిస్సా సరిహద్దులో శీలావతి అనే గంజాయి రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు... వారినే ఘాటీలు అని పిలుస్తారు. లొకేషన్స్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. అక్కడి వారి జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, సంస్కృతిని చూపించే ఆస్కారం ఉండటంతో ‘ఘాటీ’ మొదలుపెట్టాం. ⇒ ‘ఘాటీ’లో శీలావతి క్యారెక్టర్కి అనుష్క గ్రేస్, యాటిట్యూడ్ పర్ఫెక్ట్ యాప్ట్. ఈ చిత్రకథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సామాజిక సమస్య. దాని నిర్మూలనకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తోంది. దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్తో వస్తున్న సినిమా ‘ఘాటీ’. సామాజిక సమస్యల మీద ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఈ చిత్రం మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది. ఇందులో చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ∙ఈ సినిమాలో దేశీరాజు పాత్రని రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభుగారిని ఊహించుకున్నాను. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర తనది. ఆయన అద్భుతంగా నటించారు. చైతన్యా రావు నటించిన ‘30 వెడ్స్ 20’ వెబ్ సిరీస్ నచ్చి, మా సినిమాలో విలన్ పాత్రకి తీసుకున్నాను. రవీంద్ర విజయ్ అద్భుతంగా నటించారు. రాజు సుందరం మాస్టర్ కూడా ఓ పాత్ర చేశారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబాగార్లు, యూవీ క్రియేషన్స్ విక్కీ–వంశీ–ప్రమోద్... కొత్త సినిమాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. ‘ఘాటీ’ని చాలా ΄్యాషన్తో నిర్మించారు.తూర్పు కనుమల్లోని పర్వత శ్రేణి, ప్రకృతి సౌందర్యాన్ని కెమెరామేన్ మనోజ్గారు బాగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ సంగీతం బాగుంటుంది... ప్రేక్షకులు చాలా కొత్త రకమైన సౌండ్ని అనుభూతి చెందుతారు. సాయి మాధవ్గారి మాటలు ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి. ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి దగ్గర చేసిన శిష్యరికం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల కలం విదిలించా (నవ్వుతూ). -
అనుష్క శెట్టి ఘాటి ప్రమోషన్స్.. క్యూట్గా చిట్టి అనుష్క వీడియో!
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అయితే తన సినిమా ప్రమోషన్లకు అనుష్క శెట్టి హాజరు కావడం లేదు. ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారమే అనుష్క ప్రమోషన్స్లో పాల్గొనటం లేదు.అయితే ప్రమోషన్స్ దూరంగా ఉన్న అనుష్క సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఏఐతో రూపొందించిన ఈ వీడియోలో చిట్టి అనుష్క డైలాగ్తో అదరగొట్టేసింది. ఈ వీడియోను అనుష్క శెట్టి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎల్లప్పుడూ మీ అందరి ప్రేమ, మద్దతుకు చాలా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. మా చిన్న శీలవతి క్యూట్ వర్షన్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో అనుష్క శీలావతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, చైతన్యా రావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.And time and time again you all never fail to bring a smile on my face , thank u so much for all the love and support always..and thank you for this cutest version of our little sheelavati …🫠🫠🫠🫠🥰🧿 See you in theatres from September 5th #Ghaati pic.twitter.com/2Ztf6nMU9a— Anushka Shetty (@MsAnushkaShetty) August 31, 2025 -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ చిన్న సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో డబ్బింగ్ చిత్రం 'కొత్త లోక'.. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవి తేలిపోయాయి. మరోవైపు ఈసారి అనుష్క శెట్టి చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన 'ఘాటీ' విడుదలకు సిద్దమైంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ 'మదరాశి' రాబోతుంది. దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే హీరో శివకార్తికేయన్ అయినాసరే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కావడమే దీనికి కారణం. ఇది కాకుండా 'లిటిల్ హార్ట్స్' ఓ తెలుగు మూవీ కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)మరోవైపు ఓటీటీల్లోనూ మరీ ఎక్కువ సినిమాలేం రావట్లేదు. 10కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇన్స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ అయ్యేసరికి కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ఇన్స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05హాట్స్టార్ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 03అమెజాన్ ప్రైమ్ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01సన్ నెక్స్ట్సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీహైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) -
అనుష్క విశ్వరూపం చూస్తారు: దర్శకుడు జాగర్లమూడి క్రిష్
‘‘అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి... ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ను అనుష్క చేసింది. ‘ఘాటీ’ చిత్రంలో శీలావతి పాత్రలో అనుష్క నట విశ్వరూపాన్ని చూపించాం’’ అని అన్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, చైతన్యా రావు, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రిష్ మాట్లాడుతూ– ‘‘నేను, స్వీటీ (అనుష్క) గతంలో ‘వేదం’ సినిమా చేశాం. ఆ సినిమా నుంచి అనుష్క స్టార్డమ్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక ‘ఘాటీ’ కథ చెప్పగానే అడ్వెంచరస్తో కూడుకున్న ఈ సినిమా తప్పకుండా చేద్దామని అనుష్క చెప్పింది. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు... ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి మాకు ఆస్కారం దొరికింది.రచయిత చింతకింది శ్రీనివాసరావుగారు ఈ ‘ఘాటీ’ ప్రపంచం గురించి చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. కని, వినని పాత్రలను ‘ఘాటీ’లో చూస్తారు’’ అని చెప్పారు. ‘‘అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ ‘ఘాటీ’ చిత్రంలో ఆమెను వేరుగా చూస్తారు. ఈ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను’’ అని జగపతి బాబు తెలిపారు. ‘‘ఘాటీ’ చిత్రంలో అనుష్కను రియల్ క్వీన్గా చూస్తారు’’ అని పేర్కొన్నారు రాజీవ్ రెడ్డి. నటులు విక్రమ్ ప్రభు, చైతన్యా రావు పాల్గొన్నారు. -
'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్
గత నెలలో రిలీజైన 'హరిహర వీరమల్లు' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఏమైందో ఏమో గానీ ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా తీశారు. సరే ఫలితం ఏంటనేది పక్కనబెడితే ఇప్పుడు క్రిష్.. ఈ మూవీ గురించి స్పందించాడు.'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత నిర్మాతగా 'అరేబియా కడలి' అనే సిరీస్ తీసిన క్రిష్.. హీరోయిన్ అనుష్కని లీడ్ రోల్లో పెట్టి 'ఘాటీ' అనే యాక్షన్ మూవీ తీశారు. సెప్టెంబరు 5న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన క్రిష్.. 'హరిహర..' వచ్చిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. రిలీజ్ టైంలో ట్వీట్ చేసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు నేరుగా మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)'హరిహర వీరమల్లు కొంత భాగం నేను చిత్రీకరించాను. నా వ్యక్తిగత కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది' అని క్రిష్ చెప్పుకొచ్చాడు. బహుశా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటమే క్రిష్.. సినిమా నుంచి బయటకు రావడానికి కారణం ఏమో అనిపిస్తుంది. అనుష్కతో చేసిన 'ఘాటీ'పై ఓ మాదిరి బజ్ అయితే ఉంది. 'ఘాటీ'లో అనుష్క లీడ్ రోల్ చేయగా.. తమిళ హీరో విక్రమ్ ప్రభు ఈమె సరసన నటించాడు. కొండల్లో స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ నిర్మించింది. రెండేళ్ల క్రితం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో సక్సెస్ అందుకున్న స్వీటీ.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) -
‘గోన గన్నారెడ్డి’ పాత్ర నేనే చేయాల్సింది.. : విక్రమ్ ప్రభు
‘‘తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. నేను దర్శకుడిని అవుదామనుకుంటే నటుణ్ణి అయ్యాను. చిరంజీవి, నాగార్జునగార్లకు నేను పెద్ద అభిమానిని. వాళ్ల సినిమాలను ఎన్నోసార్లు థియేటర్స్లో చూశాను. నా అభిమాన హీరోలు ఉన్న టాలీవుడ్లో నేను డైరెక్ట్గా ‘ఘాటీ’ వంటి తెలుగు సినిమా చేయడం ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది’’ అని అన్నారు నటుడు విక్రమ్ ప్రభు. అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దేశీరాజు అనే పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నేను మాట్లాడే భాష నాకు సవాల్గా అనిపించింది. అనుష్కగారికి నేను పెద్ద అభిమానిని. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలు పలికించగలరు. నిజానికి అనుష్కగారి ‘రుద్రమదేవి’ సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్రను నేనే చేయాల్సింది. కానీ కుదర్లేదు. క్రిష్గారు నా గత సినిమాల్లోని చాలా సన్నివేశాల గురించి చెబుతూ, నన్ను దృష్టిలో పెట్టుకునే దేశీరాజు క్యారెక్టర్ను రాసుకున్నానని చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ని ఎంజాయ్ చేశాను. మా నాన్నతో (తమిళ నటుడు ప్రభు) స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. కానీ, ఇరికించినట్టుగా ఉండకూడదు. మంచి కథ కుదిరితే చేస్తాం’’ అని అన్నారు. -
అల్లు అర్జున్ కంటే ముందు నా దగ్గరకే.. కానీ: తమిళ హీరో
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒకరు చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం పరిపాటే. రీసెంట్ టైంలోనూ అలాంటిదే జరిగింది. లెక్క ప్రకారం త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కారణాలేంటో తెలీదు గానీ అది క్యాన్సిల్ అయింది. ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ వచ్చి చేరాడు. సరే ఈ సంగతి పక్కనబెడితే తమిళ యంగ్ హీరో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను చేయాల్సిన ఓ మూవీలో బన్నీ నటించాడని చెప్పుకొచ్చాడు.తెలుగు సినిమాల్లో తండ్రి క్యారెక్టర్స్ చేసే ప్రభు గుర్తున్నారుగా.. ఆయన కొడుకు విక్రమ్ ప్రభు తమిళంలో హీరోగా చాన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. 'గజరాజు'తో పాటు ఒకటి రెండు చిత్రాలు డబ్ చేసి రిలీజ్ అయ్యాయి. కానీ ఏమంత గుర్తింపు రాలేదు. ఇతడు తొలిసారి తెలుగులో చేసిన మూవీ 'ఘాటీ'. అనుష్క లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో.. ఆమె సరసన విక్రమ్ ప్రభు నటించాడు. సెప్టెంబరు 5న మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల క్రితం నాటి సంగతి బయటపెట్టాడు. 'అనుష్కతో గతంలోనే నేను సినిమా చేయాలి. 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం దర్శకుడు గుణశేఖర్ తొలుత నా దగ్గరికి వచ్చారు. మూడు నెలలు డేట్స్ కావాలని అడిగారు. కానీ నేను అప్పుడు వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో చేయలేకపోయాను. కానీ బన్నీ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డిది అతిథి పాత్ర. కానీ అల్లు అర్జున్ చేయడంతో అప్పట్లో కాస్త క్రేజ్ వచ్చింది. మూవీ మోస్తరుగా ఆడినా సరే ఈ రోల్ బన్నీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ స్లాంగ్లో 'మీ అభిమానం సల్లగుండా' అంటూ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. అల్లు అర్జున్ చేయడం వల్ల ఇంత క్రేజీ వచ్చింది. ఒకవేళ ఇదే పాత్ర విక్రమ్ ప్రభు చేసుంటే ఎలా ఉండేదో మరి?(ఇదీ చదవండి: జాన్వీకి మరో డిజాస్టర్! ఇక ఆశలన్నీ 'పెద్ది' పైనే) -
'ఘాటీ' సెన్సార్ పూర్తి.. సినిమాకు హైలైట్ ఇదేనట
అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఘాటీ.. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అనుష్క నెవర్ బిఫోర్ అనేలా దుమ్మురేపింది అంటూ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి వయొలెన్స్ చిత్రంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.ఘాటీ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ను సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. ఈ మూవీ 2గంటల 37నిమిషాల నిడివి ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఏడుకు పైగా భారీ యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నాయని సమాచారం. అందులో అనుష్క ఇరగదీసిందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకు ఇవే ప్రధాన బలం అంటూ సమాచారం. వాటిని థియేటర్స్లో చూసిన వారు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని టాక్ వస్తుంది. గంజాయి సరఫరా చేసే పాత్రలో అనుష్క రస్టిక్ పర్ఫార్మెన్స్తో ఇరగదీసిందని చెప్పవచ్చు. ట్రైలర్లో వినిపించిన ఒక డైలాగ్ 'సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటాదో చూద్దూగానీ' సోషల్మీడియాలో భారీగా వైరల్ అయింది. సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. -
'ఘాటి' ప్రమోషన్స్కు అనుష్క దూరం: నిర్మాత
అనుష్క శెట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఘాటి'.. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆమె గంజాయి స్మగ్లర్గా కనిపించనున్నారు. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజీవ్రెడ్డి మాట్లాడుతూ.. ఘాటి మూవీ ప్రమోషన్స్కు అనుష్క దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.సినిమా ప్రారంభంలోనే ప్రమోషన్స్ సమయంలో అందుబాటులో ఉండకపోవచ్చని అనుష్క చెప్పినట్లు నిర్మాత రాజీవ్రెడ్డి తెలిపారు. ముందే రాసుకున్న టర్మ్స్ ప్రకారం మాత్రమే అనుష్క రావడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, తాము కూడా దాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఆమె హాజరుకాకపోవచ్చని తెలిపారు. అనుష్క లాంటి నటి మాత్రమే ఘాటిలో నటించగలరని ఆయన అన్నారు. షీలా పాత్రలో అనుష్కను తప్ప మరెవరినీ ఊహించలేమని చెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చే సామర్థ్యం అనుష్కకు మాత్రమే ఉందని తాము నమ్ముతున్నామన్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో చిత్రీకరించామని రాజీవ్రెడ్డి తెలిపారు.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సమయంలో కూడా ప్రమోషన్స్కు అనుష్క దూరంగానే ఉన్నారు. అయితే, ఆ సమయంలో నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో ప్రమోషన్స్ విషయంలో లాగించాడు. అయితే ఘాటిలో విక్రమ్ ప్రభు హీరోగా నటించారు. ఆయన తమిళ నటుడు కాబట్టి తెలుగులో పెద్దగా రీచ్ కావడం కష్టం. దీంతో దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగారు కొన్ని ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఆపై ఆనుష్క ఇమేజ్ ఎటూ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ బాగానే ఉండనున్నాయి. -
'ఘాటి' హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో మదర్
కన్నడ హీరో యష్ మాతృమూర్తి 'పుష్ప' నిర్మాతగా కొద్దిరోజుల క్రితమే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాను కన్నడలో విడుదల చేసేందుకు ఆ చిత్ర హక్కులను పొందారు. పుష్ప తన భర్త అరుణ్ కుమార్తో కలిసి PA (Pushpa Arun Kumar) ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను స్థాపించారు. రీసెంట్గా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఇప్పుడు అనుష్క నటించిన ఘాటీ చిత్రం కర్ణాటక హక్కులను ఆమె పొందారు.అనుష్క ప్రధానపాత్రలో నటించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఘాటీ చిత్రాన్ని కర్ణాటకలో యష్ అమ్మగారు పుష్ప విడుదల చేయనున్నారు. దీంతో కన్నడలో మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయి. -
ఆమెతో నటించడం మరచిపోలేను: నటుడు చైతన్యా రావు
‘‘ఘాటి’ చిత్రంలో నాపాత్ర రెగ్యులర్ విలన్లా ఉండదు. ‘ఈ సినిమాలో నీపాత్రను నేను విలన్లా చూడట్లేదు. ఒక మెయిన్పాత్రగానే చూస్తున్నాను’ అని క్రిష్గారు చెప్పారు. ఈ మూవీలో నాపాత్ర కీలకంగా ఉంటుంది. నా కెరీర్లో ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చైతన్యా రావు చెప్పారు. అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన చైతన్యా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత రాజీవ్గారు క్రిష్గారిని కలవమన్నారు. ఆయన ‘ఘాటీ’ కథ, నాపాత్ర గురించి చెప్పారు. ఆపాత్రలో నన్ను ఎలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. సీరియస్ అండ్ వైలెంట్ రోల్ నాది. అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం ఒక జలపాతం వద్ద సీన్ తీయాలి.అది ప్రమాదకరమైనా అనుష్కగారు చేశారు. ఈ సీన్ చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. నేను అనుష్కగారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఆమెతో నటించడం మరచిపోలేను. యూవీ క్రియేషన్స్లో పని చేయడం గొప్ప అనుభూతి. సత్యదేవ్, ఫాహద్ ఫాజిల్లా నేను కూడా అన్ని రకాలపాత్రలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం క్రాంతి మాధవ్గారితో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
అనుష్క 'ఘాటి' మూవీ HD స్టిల్స్
-
'సీతమ్మోరు లంక దహనం చేస్తే'.. అనుష్క 'ఘాటి' ట్రైలర్ చూశారా?
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి మాఫియా నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఘాట్లలో గాటీలు ఉంటారు సార్' అనే డైలాగ్లో ట్రైలర్ను ప్రారంభించారు. ట్రైలర్ చూస్తే అనుష్క మరోసారి అరుంధతి తరహాలో రౌద్రంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో 'సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.కాగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు. -
అనుష్క లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఘాటి ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఘాటి మూవీ పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు.#GhaatiTrailer and release date announcement on August 6th 💥 Thank u all for all the love always 🙏🏻🧿🤗😍#GHAATI Looking forward🙃@iamVikramPrabhu🎥 Directed by the phenomenal @DirKrish🏢 Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent🎶 Music by @NagavelliV🎼… pic.twitter.com/95PLxPTKch— Anushka Shetty (@MsAnushkaShetty) August 4, 2025 -
అనుష్కా శెట్టి ‘ఘాటి’ రిలీజ్ అప్పుడేనా?
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. వీఎఫ్ఎక్స్ వర్క్స్పై మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్. దీంతో ఓ దశలో సెప్టెంబరులో రిలీజ్ అనుకున్నప్పటికీ నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలోచిస్తోందట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్.