ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | Ghaati Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Ghaati OTT Release Date: రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి అనుష్క మూవీ

Sep 24 2025 4:44 PM | Updated on Sep 24 2025 6:35 PM

Ghaati Movie OTT Release Date Out

అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రంఘాటి’(Ghaati Movie). క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం చిత్రం సెప్టెంబర్‌ 5 విడుదలై మిక్స్డ్టాక్సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్డేట్ని అమెజాన్ప్రైమ్(Amazon prime Video)రిలీజ్చేసింది.

స్ట్రీమింగ్ఎప్పుడంటే..
ఘాటిఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ప్రైమ్వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్‌ 26 నుంచి చిత్రం అమెజాన్ప్రైమ్వీడియోలో స్ట్రీమింగ్కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్కానుంది.

ఘాటి కథేంటంటే..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్‌ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

కట్‌ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్‌ శీలావతి గంజాయిని లిక్విడ్‌గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్‌గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ.

Advertisement
 
Advertisement
Advertisement