-
ప్రతీకారం!
హీరోయిన్ అనుష్కా శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు ‘ఘాటి’ అనే టైటిల్ ఖరారైంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని ఎలా నష్టపరిచారు? ఆ తర్వాత ఆమె ఏ విధంగా వారిపై ప్రతీకారం తీర్చుకుంది? అనే కోణంలో ‘ఘాటి’ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. -
మలయాళంలో ఫస్ట్ మూవీ.. స్వీటీ ఎంత తీసుకుంటుందంటే?
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. మొన్నటివరకు బొద్దుగా, ముద్దుగా కనిపించిన స్వీటీ ఇప్పుడు సన్నబడి క్యూట్గా తయారైంది. అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేసిన స్టార్ హీరోయిన్ అనుష్క చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే మిస్ శ్రీట్టి మిస్టర్ పొలిశెట్టితో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకుగానూ అనుష్క రూ.5-6 కోట్లు డిమాండ్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గతంలో ఒక్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి ఐదారుకోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ లెక్కన మలయాళ సినిమాకు కూడా దాదాపు అంతే తీసుకుని ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. చదవండి: 36 దేశాల్లో ట్రెండ్ అవుతున్న ఇండియన్ సిరీస్.. స్ట్రీమింగ్ అక్కడే! -
ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?
సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా.. అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. కానీ 'బాహుబలి' బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ల గడిచిపోయింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. అయితే అందరూ ఈమెని చూసే షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. అదే టైంలో 'సైజ్ జీరో' అనే సినిమా చేసింది. దీని కోసం నిజంగా బరువు పెరిగింది. అక్కడి నుంచి అనుష్కకు సమస్యలు మొదలయ్యాయి. పెరగడమైతే పెరిగిపోయింది గానీ దాన్ని తగ్గించడం కోసం నానా పాట్లు పడింది. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైపోయింది. అనుష్క హీరోయిన్గా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. అప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. బరువు తగ్గకపోవడం, ఒకవేళ బయటకొస్తే విమర్శలు రావొచ్చేమో అనే భయంతో రాలేదని అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ల పాటు వర్కౌట్స్ చేసిందో ఏమో గానీ ఇప్పుడు స్లిమ్ లుక్లో కనిపించింది. తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఈ క్రమంలోనే అనుష్క లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈమెని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎల్లుండే నిశ్చితార్థం?) -
లేడీ సూపర్ స్టార్స్ కామ్ బ్యాక్
-
అనుష్క- క్రిష్.. ఓ ఒడిశా అమ్మాయి!
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే.. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టానికి అనుష్క, క్రిష్ దూరమయ్యారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులే. కానీ కాలం కలిసిరాకపోవడంతో కెరీర్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనుష్క నటించిన.. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఈ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు కలిని ఓ సినిమా చేయబోతున్నారు.ఎలాంటి గాసిప్ లేకుండా వీరిద్దరి సినిమా పట్టాలెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కని మెయిన్ లీడ్లో పెట్టి ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమానే తెరకెక్కిస్తున్నాడట క్రిష్. పడిపోయిన అనుష్క గ్రాఫ్ని లేపడానికి యూవీ క్రియేషన్స్ ఈ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. లేడి ఓరియెంటెండ్ చిత్రాలు అనుష్కకి కొత్తేమి కాదు. అరుధంతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలెన్నో చేసింది. ఇవన్నీ కెరీర్ పరంగా అనుష్క స్థాయిని పెంచిన చిత్రాలే. అయితే చివరకు అలాంటి లేడి ఓరియెంటెండ్ చిత్రమే అనుష్క గ్రాఫ్ని పడిపోయేలా చేసింది. అదే జీరో సైజ్ మూవీ. ఈ మూవీ కోసం అధిక బరువు పెరిగింది ఈ యోగా టీచర్. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడం కోసం నానాపాట్లు పడినా.. మళ్లీ మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెరపై కాస్త అందంగా కనిపించింది. ఇక క్రిష్ సంగతి కూడా అంతే.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో టాలెంటెండ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణ వరకు క్రిష్కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు క్రిష్ గ్రాఫ్ని కిందకు దించాయి. దీనికి తోడు మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్తో జరిగిన గొడవ క్రిష్కి మైనస్ అయింది. ఆ గొడవ వల్ల క్రిష్ బాలీవుడ్కి దూరమయ్యాయి. 2021లో కొండపొలం అనే సినిమా వచ్చేవరకు క్రిష్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే కొండపొలం కూడా డిజాస్టర్ కావడంతో క్రిష్ ఢీలా పడ్డాడు. హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఇలా కెరీర్ పరంగా ఢీలా పడ్డ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తులు కలిసి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశాకి చెందిన అమ్మాయి కథే కాబట్టి అక్కడ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట క్రిష్. మరి ఈ చిత్రంతో కెరీర్ పరంగా ఇద్దరు సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement