
దిల్లీ తిరిగి సెట్స్కి వస్తున్నాడు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న సినిమా ‘ఖైదీ 2’. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఖైదీ’. 2019లో విడులై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో వెంటనే ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్గా ‘ఖైదీ 2’ ప్రకటించారు లోకేశ్–కార్తీ. కానీ దర్శకుడు లోకేశ్ వరుసగా కమల్హాసన్తో ‘విక్రమ్’, రజనీకాంత్తో ‘కూలీ’ సినిమాలు చేయాల్సి రావడంతో, ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ‘విక్రమ్’ (2022) సినిమా విడుదలై, సూపర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.
‘కూలీ’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం ‘ఖైదీ 2’ సినిమాపై ఫోకస్ పెట్టారు కార్తీ–లోకేశ్. అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ ‘ఖైదీ 2’లో అనుష్కా శెట్టి ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నట్లుగా కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘ఖైదీ’లో కార్తీ కుమార్తె పాత్రను పరిచయం చేశారు. కానీ భార్య పాత్ర గురించి సరైన ప్రస్తావన లేదు. దీంతో ‘ఖైదీ 2’ సినిమాలో ఆ పాత్ర ప్రస్తావన ఎక్కువగా స్క్రీన్పై ఉంటుందని, ఈ పాత్రలోనే అనుష్కా శెట్టి నటించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
అలాగే ‘ఖైదీ’లో పోలీసాఫీసర్ల పాత్రలు ఎక్కువగా ఉంటాయి. మరి... ‘ఖైదీ’ (కార్తీ) భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారా? లేక పోలీసాఫీసర్ రోల్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనిప్లాన్ చేస్తున్నారని సమాచారం.