హైదరాబాద్ : చార్మినార్ ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.
భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు లాల్ దర్వాజా చౌరస్తాకు చేరుకుంది.
బాజా భజంత్రీల నడుమ పోతురాజుల నృత్యాలు, కళాకారుల విన్యాసాలు దారి పొడవునా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్తో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఊరేగింపులో పాల్గొని స్వాగత వేదికపై నుంచి అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు.


