తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అమ్మవారి బోనాల ఉత్సవాల కోసం వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 4.05 నిమిషాలకు నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు పవన్ ఖేరా దంపతులు తొలిపూజ చేయనున్నారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి, బోనం సమర్పణకు అనుమతిస్తారు. సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది.


