బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భారత్ భాగ్యవిధాత’. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో మణికర్ణిక ఫిల్మ్స్– పరమహంస్ క్రియేషన్స్ పై రూపొందిన ఈ మూవీ జూన్ 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మంటల్లో చిక్కుకున్న వారిని కంగనా కాపాడుతున్నట్లు ఈ పోస్టర్లో ఉంది. భారతదేశ చరిత్రలో 2008లో జరిగిన విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హెడ్ నర్స్ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. ఉగ్రదాడుల సమయంలో ఆసుపత్రిలోని సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఎలా రక్షించారు... అనేది ఆమె పాత్ర ద్వారా చూపించబోతున్నారు మనోజ్ తపాడియా.


