కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏ రేంజ్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయో తెలిసిందే. చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ షాక్కి గురి చేసింది. ఆ కార్పొరేట్ ఉద్యోగం వదిలేశాక హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చేసిన పోస్ట్ అందరిలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తింది.
వివరాల్లోకెళ్తే..33 ఏళ్ల మహిళ మంచి కార్పొరేట్ జీతాన్ని వదిలి వెయిటర్గా మారానంటూ పెట్టిన వీడియో నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఉద్యోగం తన ఆరోగ్యాన్ని ఎలా హరించేసిందో పంచుకుంది. అంతులేని వైద్య పరీక్షలతో ఆస్పత్రులు చుట్టూ ఎలా తిరింగిందో వెల్లడించింది. తన అనారోగ్యానికి మూలం ఆ ఆరు అంకెల జీతం ఆర్జించే ఉద్యోగమే అని అనిపించి తక్షణమే మానేసి వెయిటర్ మారానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
కానీ అంతకమునుపు ఆ కార్పొరేట్ ఉద్యోగం కారణంగా చివరి ఆరు నెలలు తీవ్రమైన ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే వ్యాధితో బాధపడ్డానని, దానికోసం ఆస్పత్రులు చుట్టూ ఎంతలా తిరిగిందో పేర్కొంది. చివరికి ఈ సమస్యకు ప్రధాన కారణం కార్పొరేట్ ఒత్తిడేనని అని తేలడంతో తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పింది. ఎప్పుడైతే ఉద్యగోం మానేసానో ఆ తదనంతరం తన అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది.
అంతేగాదు ఆరు అంకెల జీతాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో ఆ తదనంతరం ఐబీఎస్ సమస్య పూర్తిగా తగ్గిందని పేర్కొది. పైగా ఆ సమస్య మళ్లీ రాకూడదనే.. ఈ ఉద్యోగంలోనే కొనసాగుతానని అంటోంది. అంతేగాదు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని తెలసుకున్నా అంటూ నవ్వుతూ నేలను తుడుస్తూ వీడియోలో కనిపించడం చూడొచ్చు. అయితే నెటిజన్లు..ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా వెయిటర్గా బతకడం అంత సులభం కాదు.
పైగా అక్కడున్న వారికి సర్వ్ చేస్తున్నప్పుడూ కూడా కస్టమర్ల నుంచి వచ్చే చీత్కారాలు, సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయని..అది కూడా ఏమంత ఆరోగ్యదాయకమైన ఉద్యోగం కాదంటూ పోస్టులు పెట్టారు. కానీ కొందరు మాత్రం నచ్చిన ఉద్యోగంలో కొనసాగితే..సంతోషం, ఆరోగ్యం రెండూ ఉంటాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.
(చదవండి: జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్)


