breaking news
viral
-
'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
-
ఆ పిల్లల్ని చూస్తే..కన్నీళ్లు వచ్చేశాయ్!
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ మన దేశంలోని పిల్లల బాల్యంపై దృష్టి సారించేలా చేసింది. కేరింతలు కొడుతూ సాగాల్సిన బాల్యం మన దేశంలో బ్యాగులు మోస్తూ..చదవడం, రాయడంతో బిజీబిజీగా సాగిపోతుంది. అదికాదు బాల్యం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. బాల్యం ఎలా సాగితే ప్రయోజకులవ్వుతారో అవగాహన కల్పించేలా ఉండటం విశేషం. ఆ పోస్ట్ని వినోద్ అనే యూజర్ పంచుకున్నారు. కేవలం మూడేళ్ల వయసున్న చాలామంది పిల్లలు అప్పటికే స్కూల్ బ్యాగులు మోస్తూ..అక్షరాలు గీస్తూ..అంకెలు లెక్కిస్తూ..వర్క్షీట్లను పూర్తి చేస్తుండటం చూస్తుంటాం. కానీ నార్వేలో అలా కాదు అంటూ పోల్చి చెప్పుకొచ్చారు. నార్వేలో నివశించడం వల్ల పిలల్లు పెంపకం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. నార్వేలో, కిండర్ గార్టెన్ను పిల్లలు విద్యాపరంగా ముందుకు సాగే ప్రదేశంగా పరిగణించరని పోస్ట్లో రాశారు. అది పిల్లలు పిల్లల్లా ఉండటం నేర్చుకునే ప్రదేశమని అన్నారు. అక్కడ పిల్లలు ఏడాది పొడవునా గంటల తరబడి ఆరుబయట గడుపుతూ, అడవులు, పర్వతాలు, ఇతర సహజ ప్రదేశాలను అన్వేషిస్తారని ఆయన పంచుకున్నారు. వాళ్లు రాళ్లు ఎక్కడం, బురదలో ఆడటం, చేతులతో వస్తువులు నిర్మించడం, ప్రకృతిని సంరక్షించడం, విభేదాలను పరిష్కరించుకోవడం, స్వతంత్రంగా ఉండటం వంటి ఆచరణాత్మక జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారని అన్నారు. అదే భారత్లో కేవలం మూడేళ్ళ వయసున్న ఎంతోమంది అప్పటికే స్కూల్ బ్యాగులు మోస్తూ, అక్షరాలను గీస్తూ, అంకెలను లెక్కిస్తూ, వర్క్షీట్లను పూర్తి చేస్తున్నారని అన్నారు. పిల్లలు కేవలం పిల్లల్లా ఉండటానికి బదులుగా, వారిని అప్పుడే తర్వాతి తరగతికి సిద్ధం చేస్తున్నట్లుగా ఉంటుందని అన్నారు. తనకు అక్కడి పిల్లల ఆరుబయట కూర్చొని నేర్చుకునే దృశ్యాలను చూస్తూ..కళ్లు చెమ్మగిల్లాయని అన్నారు. చివరగా ఆయన తన పోస్ట్ని ముగిస్తూ..జీవితంలో మొదటి పాఠాలు.. అక్షరాలు, అంకెలు అవ్వాలా, లేక ఆత్మవిశ్వాసం, దయ, పట్టుదల, ఉత్సుకత, ఇంకా కేవలం పిల్లల్లా ఉండటంలోని ఆనందం అవ్వాలా అని అడిగారు. అంతేగాదు ప్రతి బిడ్డకు ఎలాంటి బాల్యం దక్కాలని ప్రశ్నించారు. బ్రో మనసును తాకింది..పిల్లల్లా పెరిగితేనే బాగుటుందంటూ పోస్ట్లు పెట్టారు.Living in Norway 🇳🇴 has quietly changed the way I think about children and their wellbeing.In Norway, kindergarten isn’t seen as a place to get ahead academically. It’s where children learn to become… children.They spend hours outdoors in every season - through snow,…— Vinod (@turiyatman) July 13, 2026 (చదవండి: వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ డ్రైవింగ్ ..) -
మంటల్లో కారు.. ఢిల్లీ టన్నెల్లో టెక్నాలజీతో తప్పిన ముప్పు!
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు
-
సింగిల్ మూవీ బ్యూటీ ఇవానా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
-
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్లో వైరల్ అయ్యే "షుగర్కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
డిఫరెంట్ అవుట్ఫిట్లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు
-
‘జీవన్రెడ్డి మనుషులా?..’ ఎస్సై లాఠీ చార్జ్ వైరల్
సాక్షి, జగిత్యాల: బీర్పూర్ మండలం నర్సింహులపల్లిలో అంగన్వాడీ కేంద్ర స్థల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయగా.. ఆ సమయంలో ఎస్సై చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారి తీశాయి. అంగన్వాడీకి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందంటూ గ్రామస్థులు తాజాగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్థుల ఆందోళనను అదుపు చేసే క్రమంలో బీర్పూర్ ఎస్సై రాజు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఎస్సైపై గ్రామస్థుల ఆరోపణలుఆందోళన సమయంలో ఎస్సై రాజు తమపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. “జీవన్ రెడ్డి మనుషులా?” అంటూ ఎస్సై వ్యాఖ్యలు చేశారని కొందరు గ్రామస్థులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల వివరణ వెలువడాల్సి ఉంది.అంగన్వాడీ స్థలాన్ని పరిరక్షించాల్సిన అధికారులు.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లాఠీచార్జ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.వైరల్ వీడియోలతో చర్చబీర్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ స్థల వివాదం, పోలీసుల చర్యలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
-
వైజాగ్లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
-
ఉద్యోగం పోతే జీవితం ఎలా మారుతుందో ఇదే నిదర్శనం
ఉద్యోగాల కోతల ప్రభావం అన్ని రంగాల ఉద్యోగులపైనా పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసిన ఉద్యోగి కూడా ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. వయసు పెరిగితే ఉద్యోగం దొరకడం కష్టమే. ఎంతో అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగాలు రావడం లేదు. చాలా మంది కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత పోర్టర్, స్విగ్గీ, జొమాటో, ఉబెర్ లాంటి గిగ్ పనులపై ఆధారపడుతున్నారు.ఇటువంటి విషయాన్నే సోషల్ ఎంట్రప్రెన్యూర్ కిరణ్ వర్మ లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ భావోద్వేగ చర్చకు దారితీసింది. ఉద్యోగాల కోతలు, వయసు పైబడిన ఉద్యోగులు, భారతదేశ గిగ్ ఎకానమీ వాస్తవాలపై చర్చ మొదలైంది. 56 ఏళ్ల పోర్టర్ డెలివరీ భాగస్వామిని కలిసిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత గిగ్ పని చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.లాభాపేక్ష లేని కార్యక్రమం చేంజ్ విత్ వన్ మీల్లో చీఫ్ సర్వింగ్ ఆఫీసర్గా ఉన్న వర్మ.. నోయిడాలో నగరంలోనే అత్యవసర లేఖ పంపేందుకు పోర్టర్ డెలివరీ బుక్ చేసినట్టు చెప్పారు. ఇందుకు కేవలం రూ.40 ఖర్చయిందని వెల్లడించారు. వర్మ లింక్డ్ఇన్ పోస్ట్ ప్రకారం.. వయసు పైబడిన డెలివరీ రైడర్ కవర్ తీసుకునేందుకు వచ్చారు. వర్మ మొదటి అంతస్తులో ఉండటం, పూర్తిగా సిద్ధంగా లేకపోవడం వల్ల పైకి రావాలని కోరారు. రైడర్ కొంత ఇబ్బందిగా మెట్లు ఎక్కారు. చిరునవ్వుతో ప్యాకెట్ తీసుకున్నారు."ఆజ్ కామ్ హీ నహీ థా, వెయిట్ కర్ రహా థా కామ్ కే లియే" (ఈ రోజు పని లేదు. పని కోసం ఎదురు చూస్తున్నాను) అని రైడర్ చెప్పినట్టు వర్మ వెల్లడించారు. ఆయన మాట్లాడే తీరు, దుస్తులు చూసి తిరిగి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినట్టు తెలిపారు.ఇన్సూరెన్స్ ఉద్యోగి నుంచి గిగ్ వర్కర్గామాట్లాడిన సమయంలో తన పేరు 56 ఏళ్ల మనోజ్ అని రైడర్ పరిచయం చేసుకున్నట్టు వర్మ తెలిపారు. నోయిడాకు చెందిన మనోజ్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 14 ఏళ్లు పని చేసి 2023లో ఉద్యోగాల కోతల సమయంలో ఉద్యోగం కోల్పోయినట్టు చెప్పారు. వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా మరో ఉద్యోగం దొరకలేదని మనోజ్ చెప్పినట్టు వర్మ వెల్లడించారు. ఉద్యోగం పోయిన విషయం గురించి అడగగా మనోజ్ చెప్పిన పోలిక చాలామందిని ఆలోచింపజేసిందని పోస్ట్ తెలిపింది.ఈ మాటల్లో అనుభవం ఉన్న ఉద్యోగులను కరివేపాకుతో పోల్చారు. ‘‘వంట చేసేటప్పుడు అవసరం అవుతారు. తినే సమయంలో ముందుగా పక్కన పెట్టేస్తారు’’ అన్న భావన వ్యక్తమైంది.కృతజ్ఞతగా పారితోషికంమనోజ్తో కొన్ని నిమిషాలు మాట్లాడానని, తన జీవిత అనుభవాలు, సూచనలు తనపై గాఢమైన ముద్ర వేసాయని వర్మ చెప్పారు. వెళ్లే ముందు డెలివరీ ఛార్జీ కంటే ఎక్కువ డబ్బు కృతజ్ఞతగా ఇచ్చినట్టు తెలిపారు."జీవితం కఠినంగా ఉంటుంది. నిజ జీవిత పరిస్థితులు ఇంకా కఠినంగా ఉంటాయి. మనలో పని చేయాలనే ఆసక్తి, సామర్థ్యం ఉన్నా... సమాజం లేదా ఉద్యోగ మార్కెట్ మనకు అవకాశం ఇవ్వకపోవడం, మన విలువను గుర్తించకపోవడం అత్యంత బాధాకరం" అని ఆయన రాశారు. తన బాల్కనీ నుంచి రైడర్ వెళ్లడాన్ని, తెలిసిన వ్యక్తికి వీడ్కోలు చెబుతున్నట్టుగా చూస్తూ నిలిచిపోయానని పేర్కొన్నారు.స్పందించిన పోర్టర్ఈ పోస్ట్ లింక్డ్ఇన్లో వైరల్ అయింది. ఉద్యోగులు, నియామక నిపుణులు, స్టార్టప్ వర్గాల సభ్యులు స్పందించారు. లాజిస్టిక్స్, నగర పరిధిలో డెలివరీ సేవలు అందించే పోర్టర్ కూడా స్పందించింది. "హృదయాన్ని తాకిన ఈ పోస్ట్ పంచుకున్నందుకు, మా బృందం చూపించిన కృషిని అభినందించినందుకు ధన్యవాదాలు" అని తెలిపింది. అయితే రైడర్ వ్యక్తిగత పరిస్థితులపై స్పందించలేదు. -
దాదా బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
-
భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు)
-
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు)
-
ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..
మధ్యతరగతి కుటుంబంలో పిల్లల చదువులు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంటుంది. అయితే వాళ్లు చేసిన త్యాగాలకు అనుగుణంగా ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఉండదు. అలాంటి కథే నెట్టింట వైరల్గా మారింది. మైక్రోసాప్ట్ ఉద్యోగి లిక్డ్ఇన్లో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో ఆయన తన కాలేజీ ఫీజు చెల్లించడం కోసం తన తల్లి బంగారు గాజులు అమ్మిన భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు. తాను బీసీఏ చదువుతున్నప్పుడూ తన సెమిస్టర్ ఫీజుల కట్టడం కోసం పేరెంట్స్ ఎంతగా ఇబ్బందిపడ్డారో గుర్తుచేసుకున్నారు. ఆ ఫీజు కోసం ఒకరోజు అమ్మ బంగారు గాజులు తీసి ఇచ్చిన ఘటన ఇప్పటికీ మర్చిపోనన్నారు. ఆ రోజు అమ్మ ఏ మాత్రం బాధపడకుండా అమ్మడానికి ఆభరణాలు ఇచ్చింది. ఆ రోజు అమ్మ చేసిన త్యాగం కారణంగా తాను మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సంపాదించగలిగానని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేసి ఐటీ రంగంలో పనిచేస్తూ..వార్షిక ఆదాయం రూ .1.9 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నాని చెప్పారు. ఆ రోజు అమ్మ అలా బంగారపు గాజులు తీసిస్తున్నప్పుడు ఆమె బాధపడలేదు గానీ తనకు మాత్రం ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన పొజిషన్ మంచి స్థాయిలో ఉన్నాక..అమ్మ నీకు కావల్సిన బంగారం కొనుక్కోమని చెప్పగా..అరే బేటా నువ్వు వచ్చాక నాకు అన్ని తిరిగి దక్కాయి. అప్పులనే ఆర్థికపరమైనవి మాత్రమే అని తేలిగ్గా కొట్టిపారేసిందన్నారు. తన కథలా చదువు కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ఈ పోస్ట్ అంకితం అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసును తాకింది. ఎన్నో కార్పొరేట్ ఉద్యోగుల విజయగాధ వెనుక తలిదండ్రుల నిశబ్ద త్యాగం ఉంటుందంటూ పోస్టులు పెట్టారు.కాగా అతడి లిక్డ్ఇన్ ప్రొఫెల్ ప్రకారం..అగర్వాల్ 2016లో హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్లో సమ్మర్ ఇంటర్న్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2017లో మైక్రోసాఫ్ట్లో పూర్తిస్థాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా చేరడానికి ముందు, ఆయన బెంగళూరులోని GE హెల్త్కేర్లో కూడా ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ రెడ్మండ్ (వాషింగ్టన్) కార్యాలయానికి మారారు, అక్కడ 2020 వరకు పనిచేశారు. బెంగళూరులోని గూగుల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన తర్వాత, 2025లో బెంగళూరులోని మైక్రోసాఫ్ట్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తిరిగి చేరారు. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!) -
నాన్నకు ప్రేమతో..! వైరల్గా కూమార్తె పోస్ట్..
అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్ ఇది. ఆమె పోస్ట్లో నాన్న త్యాగాలు గురించి రాసిన విధం చూడగానే ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలోనిఏ కష్టమేదురోచ్చినాకన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం అనే పాట గుర్తుకొస్తుంది. అంత భావోద్వేగంగా నాన్న గురించి రాసుకొచ్చిందామె పోస్ట్లో.ఇన్స్టాగ్రామ్ 'Growing with Artha' అనే ఖాతాలో షేర్ చేసిన వీడియలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ వీడియో వేలాదిమంది మనసులను తాకింది. ఆ కూతురు పోస్ట్లో తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చింది. " మా నాన్న 35 ఏళ్లకు పైగా ఆటో రిక్షాని నడుపుతున్నారు. అందువల్లే తనకు తనకు మంచి విద్య, స్వతంత్ర, మంచి కెరీర్ లభించాయని అంటోంది. నర్సరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు నా చదువు ఆయన కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. మా చుట్టుపక్కల చాలా మంది తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకుంటున్న సమయంలో, మా నాన్న మాత్రం మా చదువుపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి విద్య కాదు, స్వతంత్రత. నాకు ఒక ఒక సోదరి కూడా ఉంది. ఆడపిల్లలమని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒంటిరిగా ప్రయాణించడం నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవడం వంటి విషయాల వరకు ప్రతిదాంట్లో మాపై నమ్మకం ఉంచారు. తాను తన సోదరి ఇద్దరం కెరీర్లో బాగా రాణించాం. కోవిడ్ మహమ్మారి సమయంలో, తమ తల్లిదండ్రులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక వ్యవసాయ క్షేత్రాన్ని (ఫామ్) ప్రారంభించాం అప్పటి నుంచి, ఆయన దాని బాగోగులు స్వయంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు పెళ్లై తల్లిగా మారాక ఉద్యోగం కొనసాగించాలా వద్ద అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా నాకు అండగా నిలిచారు. పైగా నా కెరీర్ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. బిడ్డ పెంపకంలో మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం మానేయకు' అని చెప్పారు. అంతేకాకుండా, నాతో ఉండటానికి మా అమ్మను పంపించారు. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు నా కూతురిని చూసుకోవడానికి మా అమ్మ ప్రతి వారం బెంగళూరుకు వస్తుంటారు. ఆమె తల్లి బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తుండగా, ఆమె తండ్రి ఇంట్లో అన్ని పనులూ ఒంటరిగా చూసుకుంటారని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణాన్ని నడుపుతారు, పొలాన్ని చూసుకుంటారు, వంట చేస్తారు, దాంతోపాటు పగటిపూట తన ఆటో నడుపుతూ సాయంత్రం తిరిగి వచ్చి దుకాణాన్ని తెరుస్తారు. దీన్ని బట్టి నాకో విషయం అర్థమైది. తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఒక బిడ్డను స్వతంత్రంగా పెంచి తర్వాత వారికి అండగా నిలబడటమే. నాకు మాత్రం ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు అందుకు మా నాన్న సదా ధన్యావాదాలు. అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్ల సైతం ఆమె పోస్ట్ మద్దతిస్తూ..నిజమైన హీరో నాన్నే అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Growing with Artha (@arthasfirstbites) (చదవండి: యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!) -
యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!
సాంకేతిక అనేది ఎప్పటికైనా ప్రమాదకరమేనని, దీని వల్ల ఉద్యోగాలు కోల్పోతాం, టెక్నాలజీలకు బానిసలమైపోతాం అని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇది కొందరికీ..గొప్ప అపురూప క్షణాలు, అలానాటి జ్ఞాపకాలను అందించగలదు. కోల్పోయింది కనులముందే సాక్షాత్కరించేలా చేసి, కళ్లల్లో నీళ్లు జాలువారేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 93 ఏళ్ల బామ్మ కథ. అసలేం జరిగిందటే..చైనాలోని లియుయాంగ్కు అనే ప్రాంతానికి చెందిన 93 ఏళ్ల ఝావో కుయిఫెన్ అనే మహిళ 70 ఏళ్ల క్రిత యుద్ధంలో భర్తను కోల్పోయింది. అదికూడా పెళ్లి అయిన కొద్దికాలానికే. ఆమె సరిగ్గా 1950ల ప్రారంభంలో ఝాంగ్ జిక్సిన్ను వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగిన కొద్దికాలనికే ఝాంగ్ చైనీస్ పీపుల్స్ వాలంటీర్ ఆర్మీలో చేరాడు. కొరియాతో చైనా భీకర యుద్ధం చేస్తున్న సమయం అది. సరిగ్గా యుద్ధ విరమణ చర్చలు విఫలమవ్వడంతో కువోమింటాంగ్ దళాలు డాంగ్షాన్ ద్వీపంపై పెద్ద దాడి ప్రారంభించగా, అదనపు బలగాలను చైనా ఆర్మీ పంపించింది. ఆ సైనికుల్లో ఝాంగ్ కూడా ఒకడు. ఈ యుద్ధంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) విజయం సాధించింది, కానీ 1,200 మందికి పైగా సైనికుల్లో కొందరు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అలా ఝూంగ్ 20 ఏళ్ల వయసులో మరణించాడు. అతనికి పిల్లలు కూడా లేరు. అయితే ఆ సమయంలో అతడి తాలుకా ఒక్క ఫోటో కూడా కుటుంబ సభ్యుల వద్ద లేదు. దాంతో అతడి భార్య ఝావో ఒంటరిగా జీవించింది. అయితే ఝూంగ్ తల్లిదండ్రులు ఆమెను ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఆమెకు ఐదుగురు పిల్లలు కలిగారు. అయితే హునాన్ అధికారుల మద్దతుతో, నాన్జింగ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీకి చెందిన వాలంటీర్లు, నాటి యుద్ధకాలపు జ్ఞాపకాలను నమోదు చేసే ప్రాజెక్టు నిమిత్తం ఆయా మరణించిన సైనికుల కుటుంబాలను సందర్శించారు. వృద్ధాప్యంలో ఉన్న బాధిత కుటుంబాల నుంచి నాడు అసువులు బాసిన ఆయా సైనికులతో ముడిపడి ఉన్న కుటుంబ జ్ఞాపకాలను, వారి ముఖ లక్షణాలను సేకరించారు. వాటి ఆధారంగా నాటి యుద్ధంలో వీరమరణం పొందిన లియుయాంగ్ ప్రాంత సైనికులు ఫోటోలను చిత్రించారు. వాటిని చూసి జాంగ్తో సహా ఆయా కుటుంబాలు విస్తుపోయాయి. తన దివంగత భర్తను యువకుడిగా ఉన్నప్పటి ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఝావో. నాడు యుద్ధం తన భర్తను దూరం చేసిందేమో గానీ అతడిపై ఉన్న ప్రేమ, జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. ఈ అద్భుతమైన సాంకేతికత తన భర్తను మళ్లీ ఈ చిత్రం రూపంలో మరోసారి కలుసుకునే అవకాశం ఇచ్చిందంటూ కన్నీటిపర్యంతమైందామె. అంతేగాదు ఆమె కుమార్తె సైతం ఫాదర్ ఝూంగ్ గోడలపై ఉండే వీరుడు కాదు..మా హృదయంలో సదా గౌరవించి గుర్తించుకునే ఆత్మీయ బంధువు అని గద్గద హృదయంతో అంది. ఈ కథనం సోషల్మీడియాలో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు సైతం చరిత్ర పుస్తకాలలో అమరవీరుల జీవితాలు బహుశా కొన్ని పంక్తులకు మాత్రమే పరిమితం కావచ్చు, కానీ వారి కుటుంబాలు..ముఖ్యంగా భర్తలు కోల్పోయినవారు, కుమారులను పోగొట్టుకున్నవారి హృదయంలో ఎన్నటికీ పదిలంగానే ఉంటారు. యుద్ధం జస్ట్ ఈ లోకం నుంచే దూరం చేసిందే తప్ప ప్రేమించిన వారి హృదయాల నుంచి కాదు. (చదవండి: "బాల్పాయింట్ పెన్" రూపొందించింది ఓ 'జర్నలిస్ట్’ అని తెలుసా..?) -
కదిలొచ్చిన దేవతలు
రోడ్డంతా ట్రాఫిక్ జామ్. వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆ సమయంలో ఓ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నంలోనే ఆయన స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్నవారికి ఏం చేయాలో అర్థం కాక అయోమయం నెలకొంది. కారులో ఉన్నవాళ్ల కేకలు.. ఆర్తనాదాలు. ఏ దేవుళ్లను తల్చుకున్నారో.. ఏమో ఇద్దరు యువతులు హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చారు. ఆ వ్యక్తిని రక్షించారు.హృదయాన్ని కదిలించే ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థన్నిపుజ సమీపంలోని ఒక్కల్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల సినోజ్ కారులో కుటుంబంతో వెళ్తుండగా.. తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. అలా తానే నడిపించుకుంటూ కారులోనే ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే కలాడి వంతెన సమీపంలో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. నొప్పి మరింత పెరగడంతో కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అదే సమయంలో పక్కనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు ఆ పరిస్థితిని గమనించారు. వెంటనే బస్సు దిగి కారువద్దకు పరుగెత్తారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సినోజ్కు సీపీఆర్ ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. సినోజ్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న కారులోనే నిరంతరం సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆస్పత్రికి చేరేసరికి ఆయనలో మళ్లీ కదలిక వచ్చింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని పూర్తిగా బ్లాక్ కావడంతో.. వెంటనే అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి వైద్యులు రక్షించారు. సకాలంలో సీపీఆర్ చేసి సినోజ్ ప్రాణాలు కాపాడినందుకు వైద్యులు ఆ ఇద్దరినీ అభినందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల పేర్లు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్. అంజలి అంగమాలిలోని ఎల్ఎఫ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. ఆర్ధ్రరాజ్ ఏమో బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి. ఈ మొత్తం ఎపిసోడ్లో.. స్థానికుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. సినోజ్కు గుండెనొప్పి వచ్చిందని తెలుసుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ కారు స్టీరింగ్ చేపట్టి ఆస్పత్రి వైపు నడిపించాడు. మరికొందరు ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో సహకరించగా, ఇంకొందరు అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేశారు. అందరి సమిష్టి సహకారంతో విలువైన సమయం ఆదా కావడంతో ఒక ప్రాణం నిలిచింది. వైద్య వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అని అంజలి, ఆర్ద్ర మరోసారి నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన సమయంలో అందించిన సీపీఆర్ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలదో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది. -
ప్చ్.. మూడు నెలలైనా గడవకముందే!
న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్ప్రెస్వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.👋Hello @narendramodi Ji,This is the Delhi–Dehradun Expressway, inaugurated by you just a couple of months ago.It took around 5 years to build, yet it hasn't even seen its first monsoon. Look at the pathetic condition. People are forced to stand in the middle of the… pic.twitter.com/4GZF84Hgia— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 2, 2026వైరల్ వీడియోలో ఎక్స్ప్రెస్వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.This is the video..😰 pic.twitter.com/rbTwggZLbC— bindasspahadi (@bindasspahadi) July 2, 2026ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
లక్షల జీతం వదులుకుని వెయిటర్గా..! ఎందుకంటే..
కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏ రేంజ్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయో తెలిసిందే. చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ షాక్కి గురి చేసింది. ఆ కార్పొరేట్ ఉద్యోగం వదిలేశాక హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చేసిన పోస్ట్ అందరిలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తింది. వివరాల్లోకెళ్తే..33 ఏళ్ల మహిళ మంచి కార్పొరేట్ జీతాన్ని వదిలి వెయిటర్గా మారానంటూ పెట్టిన వీడియో నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఉద్యోగం తన ఆరోగ్యాన్ని ఎలా హరించేసిందో పంచుకుంది. అంతులేని వైద్య పరీక్షలతో ఆస్పత్రులు చుట్టూ ఎలా తిరింగిందో వెల్లడించింది. తన అనారోగ్యానికి మూలం ఆ ఆరు అంకెల జీతం ఆర్జించే ఉద్యోగమే అని అనిపించి తక్షణమే మానేసి వెయిటర్ మారానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ అంతకమునుపు ఆ కార్పొరేట్ ఉద్యోగం కారణంగా చివరి ఆరు నెలలు తీవ్రమైన ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే వ్యాధితో బాధపడ్డానని, దానికోసం ఆస్పత్రులు చుట్టూ ఎంతలా తిరిగిందో పేర్కొంది. చివరికి ఈ సమస్యకు ప్రధాన కారణం కార్పొరేట్ ఒత్తిడేనని అని తేలడంతో తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పింది. ఎప్పుడైతే ఉద్యగోం మానేసానో ఆ తదనంతరం తన అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. అంతేగాదు ఆరు అంకెల జీతాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో ఆ తదనంతరం ఐబీఎస్ సమస్య పూర్తిగా తగ్గిందని పేర్కొది. పైగా ఆ సమస్య మళ్లీ రాకూడదనే.. ఈ ఉద్యోగంలోనే కొనసాగుతానని అంటోంది. అంతేగాదు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని తెలసుకున్నా అంటూ నవ్వుతూ నేలను తుడుస్తూ వీడియోలో కనిపించడం చూడొచ్చు. అయితే నెటిజన్లు..ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా వెయిటర్గా బతకడం అంత సులభం కాదు. పైగా అక్కడున్న వారికి సర్వ్ చేస్తున్నప్పుడూ కూడా కస్టమర్ల నుంచి వచ్చే చీత్కారాలు, సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయని..అది కూడా ఏమంత ఆరోగ్యదాయకమైన ఉద్యోగం కాదంటూ పోస్టులు పెట్టారు. కానీ కొందరు మాత్రం నచ్చిన ఉద్యోగంలో కొనసాగితే..సంతోషం, ఆరోగ్యం రెండూ ఉంటాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Sarame Cornish (@girlswhodetach) (చదవండి: జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్) -
భార్య కోసం ఉద్యోగం వదిలేసి..!
గృహిణి అన్న మాట విన్నంతగా గృహస్థుడు అన్న మాట చాలా తక్కువ, అరుదు. పైగా పిల్లలు పుడితే చాలామటుకు భార్యలే తమ కెరీర్ని వదులకుంటారు. కొందరు మహిళలు పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ తమ కెరీర్ని మొదలుపెడతారు. కానీ ఈ భర్త స్త్రీ పురుషులు సమానం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ప్రతీ మగాడి విజయం వెనకాలే కాదు ఓ మహిళ విజయం వెనకాల కూడా ఓ మగాడు ఉంటాడు. అది సాధ్యమే అని నిరూపించాడు ఈ వ్యక్తి. బిహార్లోని మోతిహారి జిల్లా చంపారన్కు చెందిన అమిత్ కుమార్ దూబే వైవాహిక జీవితంలో భర్త పాత్రకు కొత్త నిర్వచనం చెప్పాడు. అతడు గృహిణి మాదిరిగా ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. అమిత్ డిప్లోమా మెకానిక్ ఇంజనీర్. అతడు ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం 2015 డిసెంబర్లో అయ్యింది. తన భార్య ప్రీతి ఉద్యోగం కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నిజానికి అమిత్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసేవాడు. అతడి భార్య మరొక చోట బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం చేస్తుండేది. ఇలా ఇరువుకి మధ్య ఉద్యోగ రీత్యా ఉన్న ఎడబాటుని భరించలేక ఆమె పనిచేసే చోటే ఉద్యోగం చూసుకున్నాడు కూడా. అయితే ఆమెకు గర్భస్రావం అవ్వడంతో ఆమె బాగోగులు కోసం కొన్నేళ్లు సెలవు పెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో లాంగ్ లీవ్ పెట్టడానికి ప్రైవేట్ కంపెనీ అనుమతించకపోవడంతో జాబ్ వదులుకోక తప్పలేదన్నారు. ఆ తర్వాత ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో తానే దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకోండం కోసం మళ్లీ తిరిగి జాబ్లో జాయిన్ అవ్వలేకపోయానన్నారు. తమకు ఒక పాప అని అన్నారు. అయితే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం తోపాటు బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడం కష్టంగా మారడంతో ఇక తానే ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలను తీసుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పుకొచ్చారు. రోజంతా ఇంటి పనులు చూసుకోవడం, కూతురికి హోం వర్క్లో సహయం చేయడం వంటివి చేస్తుంటానని అన్నారు. అప్పుడప్పుడూ ఒంటరిగా ఉంటే..మాత్రం తానేమి చేయలేకపోతున్నాననే బాధ అయితే వస్తుంటుందని అన్నాడు. తనే ఇంటికి పెద్ద వాడినని, చెల్లెళ్లు లేరని అన్నారు. అయితే పెద్దవాడిగా తన కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఖాళీ సమయంలో ఫుడ్ బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉందని, అందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఉద్యోగక కెరీర్ కోల్పోయానన్న బాధ ఉన్నా..తను చేస్తున్న పనిని చాలామంది అభినందిస్తున్నారని, అందుకు చాలా సంతోషం ఉంటుందని అంటున్నాడు. నిజంగా అమిత్ చాలా గ్రేట్ కదూ..మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ..తన గురించి అభద్రతా భావానికి లోనుకాకుండా..తన భార్యకు అండగా నిలుస్తూ..కూతురు బాగోగులు చూసుకోవడం కోసం తన కెరీర్ని వదులుకున్నాడు. అంతేగాదు గృహనిర్వహణ గౌరవప్రదమైనదే అని, మగవాళ్లు కూడా నిర్వర్తించొచ్చు అని నిరూపించాడు. View this post on Instagram A post shared by House husband | Amit Kumar Dubey (@househusbandamit) (చదవండి: Upasana Konidela: స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్ ఇంతలా ఉంటాయా?
ఏళ్ల తరబడి దూరమైన ఇద్దరు స్కూల్ స్నేహితులు మళ్లీ కలుసుకున్న క్షణం... ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యం. సాధారణంగా హృదయాలను తాకాల్సిన ఆ 42 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చకు తెరలేపింది. కొందరు దాన్ని స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా కొనియాడితే.. మరికొందరు అనుమానాల కోణంలో చూడడంతో రచ్చ రచ్చగా మారింది..సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది. వీడియోలో ఓ మహిళ 14 ఏళ్ల తర్వాత తన పాత స్కూల్ స్నేహితుడిని కలుస్తుంది. అతను విదేశాల్లో సెటిల్ అయ్యాడట. తన వివాహానికి కూడా రాలేదట. తనకంటే తన కూతురు ఆ అంకుల్ను కలవడానికి ఎగ్జయిటింగ్గా ఉందని వీడియో షేర్ చేసింది. పైగా తనను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ.. తన కూతురితో పాటు తనకూ లాలీపాప్ ఇచ్చాడని సంబురంగా చెప్పింది. ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరూ ఆనందంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపిస్తుంది. చివర్లో.. ఆనాడు.. ఈనాడు అంటూ ఓ ఫొటోను ఉంచిందామె. ఆ వీడియో ఎక్కడిది? అందులో ఉంది ఎవరు? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ వివాహిత మహిళ ఇలా ఒంటరిగా కలవడం సరైందేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు.ఇంజినీర్ ఆదిత్య అనే ఎక్స్ (X) యూజర్ ఈ 42 సెకన్ల వీడియోను.. మీ ఆయన్ని తల్చుకుంటే బాధగా ఉంది "Feeling sad for her husband" అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. మిలియన్ పైగా వ్యూస్.. వేలాది లైక్లను సొంతం చేసుకోవడమే కాకుండా, కామెంట్ల రూపంలో పెద్ద చర్చకు దారితీసింది.అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ప్రతి పురుషుడు–మహిళ మధ్య ఉండే బంధాన్ని ప్రేమగా చూడాల్సిన అవసరం లేదు", "14 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిస్తే అలాంటి ఆనందం సహజమే", "ఇది ఎంతో స్వచ్ఛమైన స్నేహం" అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కూడా బిడ్డను తీసుకెళ్లడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.Feeling sad for her husband pic.twitter.com/rCsgNH95Og— Aditya (@adityacasm_) June 29, 2026కొందరు నేరుగా వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తినే విమర్శించారు. "నీ తల్లిని తల్చుకుంటే బాధగా ఉంది.. ఎలాంటి కొడుకును కన్నదో ఆమె", "నీ భార్యను తల్చుకుంటేనే బాధగా ఉంది", "అరేయ్.. అసలు నీ ఆలోచనా విధానమే బాగోలేదురా", "స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా తప్పుగా చూడొద్దు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మరికొందరు "ద్వేషపూరిత క్యాప్షన్ను పక్కన పెడితే వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది" అంటూ స్పందించారు.ఈ ఘటనతో మరోసారి పెళ్లైన ఓ మహిళ, ఓ పురుషుడి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉండగలదా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక వర్గం ప్రతి బంధాన్ని అనుమానంతో చూడకూడదని వాదిస్తుంటే, మరొక వర్గం సామాజిక పరిమితుల గురించి మాట్లాడుతోంది. మొత్తానికి, ఇద్దరు పాత స్నేహితుల భావోద్వేగ కలయికగా మొదలైన ఈ వీడియో... ఇప్పుడు స్నేహం, నమ్మకం, సామాజిక దృక్పథం గురించి దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు కేంద్రబిందువుగా మారింది. -
విధి లోయలోకి లాగితే... అదృష్టం వెనక్కి తీసుకొచ్చింది!
ఒక్క క్షణం ముందు వరకు అదొక సాధారణ ప్రయాణం.. మరుసటి క్షణమే మృత్యువుతో పోరాటం. కళ్లముందే కొండచరియలు విరిగిపడి బైక్తో సహా అతడిని లోయవైపు ఈడ్చుకెళ్లాయి. ‘అరే పాపం..’ అని అంతా అనుకునేలోపే.. ఏదో అద్భుతం జరిగినట్లు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చావును కళ్లారా చూసి తిరిగి వచ్చిన ఈ ఉత్కంఠభరిత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈశాన్య భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా.. తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 28న ఓ బైకర్ అత్యంత ఇరుకైన కొండ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే రహదారిపై బురద పేరుకుపోయి, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నెమ్మదిగా ముందుకు సాగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియ విరిగిపడింది.ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే.. భారీ మట్టి, రాళ్లతో పాటు బైక్, బైకర్ కూడా లోయవైపు జారిపోయారు. కొన్ని క్షణాల పాటు అతడు మట్టిపెళ్లల మధ్య కనిపించకుండా పోవడంతో అక్కడున్నవారంతా ప్రాణాలు దక్కడం అసాధ్యమేనని భావించారు. కొండచరియలు కిందకు దూసుకెళ్లి అక్కడే ఓ నదిలో చేరడంతో భారీగా దుమ్ము, మట్టి మేఘాలు ఎగిసిపడ్డాయి.అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అరుణాచల్ప్రదేశ్లోని లోయర్ సియాంగ్ జిల్లాలోని సీజీ లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది.🇮🇳 Absolutely terrifying footage from India shows a biker being swept away as a massive landslide tears down a mountainside after relentless rain in Arunachal Pradesh.The landslide also blocked the Siji River.Against all odds, the biker survived without injuries. A miracle…— Mario Nawfal (@MarioNawfal) June 29, 2026వీడియో చూసిన నెటిజన్లు "ఇది రెండో జన్మ", "అతడి అదృష్టం అసాధారణం", "లాటరీ టికెట్ కొనాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధి తన పని చేయాలనుకుంది... అదృష్టం అడ్డొచ్చింది. క్షణాల్లో లోయలోకి జారిపోయిన ఆ బైకర్.. చివరి క్షణంలో చావునే మోసం చేసి సురక్షితంగా బయటపడ్డాడు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల ప్రమాదాల తీవ్రతను గుర్తు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. -
ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్ చేసుకుంది.అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది. తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో చేరిందని. నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. అంతేగాదు నిట్లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్షిప్లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్ ఫీజులను ప్రతి సెమిస్టర్కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్టాప్ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది. అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa) (చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..) -
నెయిల్ ఆర్టిస్ట్గా నెలకు రూ. 10 లక్షలు..! కట్చేస్తే కొద్ది నెలల్లోనే..
ఏ వ్యక్తి కెరీర్ అయినా.. చిన్న ఉద్యోగిగా మొదలవ్వుతుంది. కానీ కొందరే ఉన్నత స్థాయికి చేరేలా కష్టపడతారు, విజయం సాధిస్తారు. మరికొందరు అక్కడితే ఆగిపోతే.. కొందరు ఇంకో అడుగు ముందుకేసి..పదవీ విరమణ జీవితాన్ని కూడా అందంగా ప్లాన్ చేసే పనిలో ఉంటారు. ఇక్కడ ఈ మహిళ కూడా అలానే చేస్తోంది. ఆ విషయాన్నే ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేగాదు నచ్చినట్లు మన తలరాతను మనమే రాయాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎవరామె అంటే..వియత్నాంకు చెందిన 32 ఏళ్ల న్గుయెన్ ఫుయోంగ్ అన్హికి అపారమైన నెయిల్ ఆర్ట్ నైపుణ్యం ఉంది ఆ నేపథ్యంలోనే ఆరేళ్ల క్రితం దుబాయ్కి వచ్చి..నెయిల్ టెక్నీషియన్గా పనిచేశారు. ఆమె పువ్వులు, జంతువులు, చార్మ్స్ వంటి త్రీడీ నెయిల్ డిజైన్లలో మంచి నైపుణ్యం గల మహిళ. మొదట రూ. 89 వేలకు చిన్న సెలూన్లో రెండేళ్లు కాంట్రాక్ట్పై పనిచేసింది. ఆ తర్వాతర ఫ్రీలాన్సర్గా మారిది. ఆమె క్లయింట్లలో యువతలే ఉండేవారు. ఆమె ధరలను అందుబాటులో ఉంచుతూనే క్లిష్టమైన డిజైన్లపై దృష్టి సారించింది. దాంతో ఆమె ఆదాయం ఏకంగా నెలకు రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు సంపాదించే రేంజ్కు చేరింది. ఆ తర్వాత 2026లో, ఫుల్లా అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 'బ్యూటీ బై ఫుల్లా'అనే సెలూన్ను ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి జీతం తీసుకోకుండా సంపాదించిన మొత్తం తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడి పెడుతూ లాభాల బాట పట్టించింది. అందేగాదు ఇతరులకు ఉపాధి కల్పిస్తూ..మునుపటి ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తన ఖర్చులను తగ్గించుకుంటూ తన వ్యాపార విజయం కోసం ఆహర్నిశలు కష్టపడేది. నెల ఖర్చులు లక్షలోపే ఉండేలా చూసుకుంటూ..కొత సొమ్ముని వియత్నాంకు పంపించి..అక్కడ రెండిళ్లు కొనుగోలు చేసింది. మిగిలిన మొత్తం తన సెలూన్ మెయింటైనింగ్ ఖర్చుపెడుతుంది. తాను ఈ పనిని 2012 నుంచి చేస్తున్నానని, అలాగే తన సెలూన్ వ్యాపారాన్ని విస్తరించేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది. తద్వారా 20 ఏళ్లలోనే రిటైర్మెంట్ తీసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. తన 50 ఏళ్ల ప్రారంభంలోనే పదవీ విరమణ చేయడానికి సరిపడా నిష్క్రియాత్మక ఆదాయాన్ని సంపాదించాలని చూస్తున్నట్లు పేర్కొంది. తన సెలూన్ బ్రాంచ్లు కేవలం దుబాయ్లోనే కాకుండా అబుదాబి లేదా ఫుజారా వంటి ఇతర ఎమిరేట్స్లో కూడా ఐదు బ్రాంచ్లు పెట్టేలా పెట్టుబడు పెట్టాలని చూస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొంత పొలం కొనుగోలు చేసి..తన శేష జీవితాన్ని వ్యవసాయం చేస్తూ గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈమె కథ..మన నైపుణ్యానికి పదును పెట్టి..అనతి కాలంలోనే వ్యాపారంగా మార్చుకోవడం..దాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగా చీకు చింత లేని వృద్ధాప్య జీవితాన్ని గడిపేలా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెబుతోంది. అలాగే సక్సెస్ అంటే పులిస్టాప్ కాదు..కామ అని తన సక్సెస్తో నిరూపించింది. !.(చదవండి: బస్స్టాపే పాఠశాలగా..! జస్ట్ నాలుగు గోడల మధ్యే కాదు..) -
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
-
జెన్జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్!
టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తుంటే.. అనవసరంగా ఎందుకు కష్టపడాలి?. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ పోస్ట్.. దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యంగా జెన్జీ (Gen Z) యువత జీవితం, పని, విజయం, కష్టం గురించి ఎలా ఆలోచిస్తోందనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.ఈ చర్చకు కారణమైనది ఎక్స్ (X) వేదికపై ప్రేమ్ సోని అనే యూజర్ చేసిన ఓ పోస్ట్. పాతతరం కష్టాన్నే విజయానికి కొలమానంగా భావిస్తుంటే.. జెన్జీ మాత్రం సమయం, సామర్థ్యం, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తోందని ఆ యూజర్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఒక పనిని సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంటే.. అదే పనిని అనవసరంగా కష్టపడి చేయడంలో అర్థం లేదనేదే జెన్జీ ఆలోచనగా వివరించారు.దీనికి ఉదాహరణగా.. కూరగాయలు కొనడానికి ట్రాఫిక్, దుమ్ము, బేరసారాలతో గంటసేపు గడపడం కంటే.. మొబైల్ యాప్లో కొన్ని నిమిషాల్లో ఆర్డర్ చేయడాన్నే జెన్జీ తెలివైన నిర్ణయంగా భావిస్తోందని చెప్పారు. అలాగే రద్దీ బస్సుల్లో ప్రయాణించడం కంటే క్యాబ్ లేదంటే రైడ్-హైలింగ్ యాప్ను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసే మార్గమని యువత చూస్తోందని పేర్కొన్నారు.అంతేకాదు, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకునే తల్లిదండ్రులే.. అదే పిల్లలు టెక్నాలజీ సాయంతో సమయం ఆదా చేసుకుంటే వారిని బద్ధకస్తులుగా చూడడం ఒక వైరుధ్యమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కష్టాన్ని, పొదుపును గొప్పగా చెప్పిన పెద్దలే.. ఇప్పుడు తమ స్మార్ట్ఫోన్లలో క్విక్ కామర్స్ యాప్ల ద్వారా వచ్చే డెలివరీలను ట్రాక్ చేయడం కూడా ప్రస్తావించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.Indian parents are facing a massive existential crisis because Gen Z refuses to suffer for no logical reason.It is deeply offensive to our culture that a 24 year old will order groceries on Blinkit instead of spending 45 minutes inhaling road dust and fighting a vendor to save…— Prem Soni (@ValueWithPrem) June 28, 2026సమయానికి విలువ ఇవ్వడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం బద్ధకం కాదని, అదే ఆధునిక జీవనశైలి అని చాలామంది జెన్జీకి మద్దతు తెలిపారు. మరోవైపు, జీవితంలో కొంత కష్టాన్ని అనుభవించడం వల్లే సహనం, క్రమశిక్షణ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని మరికొందరు వాదించారు.మొత్తానికి.. ఈ చర్చ కేవలం ఆన్లైన్లో కూరగాయలు కొనడం, క్యాబ్లో ప్రయాణించడం గురించి మాత్రమే కాదు. కాలం మారుతున్న కొద్దీ 'కష్టం' అనే పదానికి అర్థం కూడా మారుతోందా? సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవడం తెలివా? లేదంటే కష్టపడటమే జీవిత విలువను నేర్పుతుందా?అనే ప్రశ్నలను మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందుకే.. జెన్జీ కొత్త ఫార్ములాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి మీరేమంటారు?.. ఈ వాదనతో ఏకీభవిస్తారా??. -
మలుపు మిస్సైంది.. కళ్లు మూసి తెరిచేలోపే!
గమ్యం చేరాల్సిన కారు... క్షణాల్లో మృత్యువుకు చిరునామాగా మారింది. హైవేపై జరిగిన ఒక్క చిన్న పొరపాటు.. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో బండి.. వెరసి ఒకే కుటుంబాన్ని విషాదంలో ముంచేశాయి. కళ్లుమూసి తెరిచేలోపే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక ప్రమాదం సీసీటీవీలో రికార్డవడంతో ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ వద్ద జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. హైవేపై మలుపు మిస్సవడంతో కారును రివర్స్ తీస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో ఎస్యూవీ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. सहारनपुर में दिल्ली-देहरादून इकोनॉमिक कॉरिडोर पर रामपुर मनिहारान थाना क्षेत्र के गांव हलगोया कट के पास हुए भीषण सड़क हादसे का सीसीटीवी वीडियो..इस दर्दनाक हादसे में हरियाणा के बहादुरगढ़ से हरिद्वार गंगा स्नान और दर्शन के लिए जा रहे एक ही परिवार के चार लोगों की मौत हो गई थी, जबकि… pic.twitter.com/2kSbiJyKH5— Kishor Joshi (@KishorJoshi02) June 28, 2026హర్యానాలోని సోనీపట్ జిల్లా బహదూర్గఢ్కు చెందిన చరణ్సింగ్, ఆయన కుటుంబ సభ్యులు హరిద్వార్కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మలుపు దాటిపోవడంతో వారి టాటా టియాగో కారును హైవేపైనే రివర్స్ తీసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో ఎస్యూవీ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు రోడ్డుపై ఉన్న డివైడర్ను బలంగా ఢీకొని మరోవైపు ఎగిరిపడింది. ఎస్యూవీ కూడా అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం డెహ్రాడూన్–పంచకులా హైవేపై రాంపూర్ మనిహరన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భయానక ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.ప్రమాదంలో చరణ్సింగ్, ఆయన భార్య సుదేశ్, కోడలు ప్రీతి, మనవడు శివాంశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో పాటు హైవేపై రివర్స్ తీసేందుకు చేసిన ప్రయత్నమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. -
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026అయితే ఈ ట్రెండ్కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్లు విస్తృతంగా వినిపించాయి.అంతేకాదు, కేజీఎఫ్, జైలర్లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్లా అన్న సందేహం కలగడం సహజమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.అయితే ఈ ట్రెండ్పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!".. -
ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!
చదువులో రాణించలేకోపోయాడు..అడగడుగునా అవమానం, వైఫల్యమే. ఛీ ఈ బతుకు వద్దనుకున్నాడు..చివరికి దేవుడి స్రిప్ట్ మరోలా ఉంది. పాటే నీగమ్యం అంటూ అందులో రాణించేలా చేసింది. అక్కడితో ఆగక ప్రపంచ పర్యాటకుడిలా మారి మొత్తం ప్రపంచాన్నే చుట్టేశాడు. అది కూడా జస్ట్ ఆరేళ్లలోనే ఈ ఘనత సృష్టించిన తొలి పర్యాటకుడిగా నిలిచాడు. మనం ఒకటనుకుంటే..జీవితం మరోలా నడిపించి..విజేతగా నిలుపుతుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ సంగీత కారుడు. బెంగళూరుకి చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్ తన జీవితకాలంలోనే ఒక గొప్ప ప్రయాణ రికార్డుని ప్రదర్శించి నెట్టింట వైరల్గా మారాడు. మొత్తం 245 దేశాలు సందర్శించాడు. అందుకు నిదర్శనంగా ఆయా దేశాల స్టాంపులు, వీసాలతో సహా మొత్తం 16 భారతీయ పాస్పోర్ట్లను చూపించడం విశేషం. అందుకు సంబంధించిన సేకరణను రికార్డు చేసి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో తన పాస్పోర్ట్ల జాబితా, అంటార్కిటికాతో సహా ఆరు ఖండాల ప్రవేశ స్టాంపులు, వాటిలోని వీసాల ముద్రలతో నిండిన పేజీలతో సహా విపులంగా చూపించాడు. తాను భారత దేశానికి చెందిన వాడినని, అతి తక్కువ సమయంలోనే ప్రతి దేశానికి వెళ్లానని చెబుతుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. కేవలం ఆరేళ్ల, ఆరు నెలల, 22 రోజుల అంటార్కిటికాతో సహా సార్వభౌమ ఆధారిత 245 దేశాలకు వెళ్లాను అని వీడియో క్లిప్లో వెల్లడించాడు ప్రసాద్. అంతేగాదు కొన్ని దేశాలకు వీసా తోపాటు ఇతర పత్రాలు, అందుకోసం ఎదురైన సవాళ్ల గురించి కూడా సవివరంగా వివరించారు ప్రసాద్. స్వతహాగా సంగీతకారుడు కావడంతో సంగీత ప్రదర్శనలు ఇస్తూ మొత్తం 16 పాస్పోర్ట్లను వీసాలు, స్టాంపులు సునాయాసంగా సంపాదించాడు. అయితే ఇందుకు కొంత ఓపిక కూడా అవసరమని అన్నారు. నెటిజన్లు కూడా ఆ 16 పాస్పోర్ట్ల కట్టను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇందుకు ఎన్ని పత్రాలు అవసరమయ్యాయో అని తలుచుకుంటేనే గుండెల్లో వణుకుపుడుతోందంటూ కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు.ఎవరీ బెన్నీ ప్రసాద్..బెన్నీ ప్రసాద్ గిటారిస్ట్ కమ్ ప్రపంచ యాత్రికుడు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. తాను 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించినట్లు పేర్కొన్నారు. కుటుంబంలో తన తరంలో అతనే మొదటివాడు కావడంతో, అతని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుందట అతడి ఫ్యామిలీ. అయితే తన జీవితారంభం అంత బాగాలేదని, తను తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డానని, అందుకోసం కార్టిసోన్ స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాని కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, 60% ఊపిరితిత్తుల నష్టం, నిరంతరం బలహీనపడే రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య సమస్యలు ఎదర్కొన్నానని అన్నారు. ఆ సమస్యలు ఇప్పటికీ తన ప్రాణానికి ముప్పుగానే ఉన్నాయన్నారు. అతడి పేరెంట్స్ తనను చదువులో బాగా రాణించాలని ఆశించారు. ఆ నేపథ్యంలోనే తనకు గణితం, సైన్సు నేర్పించే ప్రయత్నం చేశారని, కానీ అవన్నీ వృధా అయ్యాయని తెలిపారు. దాంతో అవమానం తట్టుకోలేక 16 ఏళ్ల వయసులో చనిపోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాను సంగీతం వైపుకి మళ్లడంతో తన జీవితమే మారిపోయిందన్నారు. అలా బెన్నీ సంగీత ద్వారా ప్రతి ఏడాది మొత్తం 40 నుంచి 50 దేశాలకు ప్రయాణిస్తూ వేలాది మందికి జీవితంపై ఆశను కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు. అంతేగాదు నాలాంటి వాడినే ఉపయోగపడేలా జీవితం మారేస్తే..మీ జీవితాలు ఎందుకు మారవు అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడే మార్చలేనంత చెడ్డవారు లేదా పాపాత్ములు కూడా ఎప్పటికీ ఉండరు అని గుర్తించుకోండి అని చెబుతుంటాడు బెన్నీ ప్రసాద్. View this post on Instagram A post shared by MTP - Most Traveled People (@mosttraveledpeople) (చదవండి: రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..) -
అడవిలో ఆగిన ట్రాఫిక్… సైరన్లేకుండా వీఐపీ ఎంట్రీ!
అడవులు తగ్గిపోతున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి… ఈ రెండు ప్రపంచాలు కలిసిన చోట తరచూ కనిపించేది ఘర్షణే. కానీ అప్పుడప్పుడూ అలాంటి చోటే మనసును తాకే చిన్న మానవత్వపు క్షణాలు కూడా పుట్టుకొస్తాయి. అలాంటి ఓ దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అడవి అంచున ఉన్న ఓ రహదారిపై సాధారణంగా వాహనాలు రద్దీగా వెళ్తున్నాయి. ఆ రోజు కూడా అలాగే ట్రాఫిక్ సహజంగానే సాగుతోంది. కానీ ఒక్కసారిగా అడవి వైపు నుంచి ఓ భారీ దంతం కలిగిన ఏనుగు దాగుడు మూతలాడుతోంది. అది రోడ్డు దాటాల్సిన సమయం. అందుకే అలా!. ఆ క్షణంలో వాహనాల వేగం ఆగిపోయింది… కానీ అది ట్రాఫిక్ జామ్ కాదు, ఒక బాధ్యత ఆగిన క్షణం.అక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డ్ వెంటనే స్పందించాడు. ఎలాంటి ఆలస్యం లేకుండా రోడ్డుమధ్యకు వచ్చి చేతులతో సంకేతాలు ఇస్తూ వాహనాలను నిలిపివేశాడు. సాధారణంగా ఇలాంటి ఆపడం వీఐపీ కాన్వాయ్ల కోసం చూస్తాం. కానీ ఇక్కడ కారణం వేరే. ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి మనిషికి అతను ఒకే సందేశం ఇచ్చాడు.వాహనాలు నిలిచిపోయాయి. ఇంజిన్ల శబ్దం కొద్దిసేపు తగ్గిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఏనుగు ఎలాంటి భయమూ లేకుండా మామూలుగానే రోడ్డుపైకి వచ్చింది. ఎటువంటి ఆందోళన లేకుండా అది ఒక్క అడుగు తర్వాత ఒక్క అడుగు వేస్తూ మరో వైపు అడవిలోకి సాగిపోయింది. మనుషుల ప్రపంచం ఆ క్షణం కోసం పూర్తిగా ఆగిపోయింది.. కానీ ప్రకృతి మాత్రం తన మార్గంలో ప్రశాంతంగా సాగిపోయింది.A forest guard halts traffic, not for a VIP convoy, but for a wild elephant to cross the road.Sometimes the road belongs to those who were here long before us.This is how humans and wildlife can coexist. pic.twitter.com/Dc1aNZWnfU— Manas Muduli (@manas_muduli) June 25, 2026ఈ మొత్తం దృశ్యాన్ని ఒక వాహనంలో నుంచి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను మానస్ ముదులి అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్య కూడా అందరి హృదయాలను తాకింది. “ఇది వీఐపీ కోసం ఆపిన ట్రాఫిక్ కాదు… మన కంటే ముందే ఇక్కడ ఉన్న జీవి కోసం ఇచ్చిన గౌరవం” అన్న భావం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ వైరల్ వీడియో ఎప్పుడు? ఎక్కడ? చిత్రీకరించారనే దానిపై క్లారిటీ లేదు. వీడియోను షేర్ చేసిన మానస్ ముదులి సాధారణంగా ఒడిశా, తూర్పు భారతదేశంలోని వన్యప్రాణుల అంశాలపై పోస్టులు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో.. యూనిఫాం, రహదారి, అడవి వాతావరణం చూస్తే ఇది ఏనుగుల కారిడార్ ప్రాంతాల్లో తీసిన వీడియోగా తెలుస్తోంది. నెటిజన్లను మాత్రం ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు ఇది నిజమైన మానవత్వం అన్నారు. మరికొందరు మనిషి–ప్రకృతి సహజీవనానికి ఇది చిన్న కానీ బలమైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. ఫారెస్ట్ గార్డ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ధైర్యంగా, సరైన చర్యగా అభినందించారు. అభివృద్ధి పేరుతో అడవులు కుంచించుకుపోతున్న ఈ రోజుల్లో.. వన్యప్రాణులు తమ సహజ మార్గాల్లో ప్రయాణించడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న జాగ్రత్తలే కదా పెద్ద ప్రమాదాలను నివారించేది!. -
గోల్డెన్ అనార్కలీ డ్రెస్లో రాకుమారిలా షెహనాజ్ గిల్
-
సక్సెస్ అంటే సంపాదన, పెళ్లి, మాృతత్వం కాదు..!
సాధరణంగా అమ్మాయిలు చక్కగా పెళ్లి చేసుకోవడం, మాతృత్వం స్వీకరించడం, ధనవంతుడైన భర్త రావడం, మంచి ఉద్యోగం సంపాదించడం తదితరాలను సక్సెస్గా భావిస్తారు. కానీ అది కాదు విజయం అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ పోషకాహార నిపుణురాలు. ప్రతి మహిళ తనను తాను ఎలా అనుకుంటుందో..ఎప్పటి నుంచో మనపై రుద్దినట్టుగా మనం ఎలా జీవిస్తూ ఉండిపోతున్నామో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమే కాదు అమ్మాయిల దృక్పథం ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉండటంతో అందరు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుండటం విశేషం.దుబాయ్కు చెందిన పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ని షేర్ చేశారు. "మనం విజయం అనగానే మంచి ఉద్యోగం, మంచి జీతం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి ప్లాన్లు వేసేసుకుంటాం. కానీ జీవితం మన ప్రణాళికలను చెత్తబుట్టలో పడేసి వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసేలా విచిత్ర మార్గాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇలానే తనకు జరిగిందంటూ తన కథను పంచుకుంది. తాను 21 ఏళ్ల వయసున్నప్పుడూ ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని, అందమైన గృహిణిగా ఉండాలని, ఇద్దరు పిల్లలను కనాలని అనుకున్నాను. కానీ అవేమి జరగలేదు ప్రస్తుతం తనకు 41 ఏళ్లు అని, సుమారు 40 మందికి పైగా ఉద్యోగులతో రెండు వేర్వేరు వ్యాపారాలను నడుపుతున్నా. అయితే ఈ జర్నీలో నేనే ధనవంతురాలినయ్యానని, తన కెరీర్ ప్లాన్ ప్రకారం ఒకటి నిజమైంది. ఎందుకంటే 25 ఏళ్ల వయసు వచ్చేసరికి, ధనవంతురాలినయ్యా, అలాగే దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. బంధువులకు అసూయ కలిగించే విలాసవంతమైన జీవితం నాది. అయినా ఇది నాజీవితంలో ఎందుకు అనిపించడం లేదు. అసలు నా విజయాలను నేను ఎందుకు ఆస్వాదించలేకపోతున్నా. ఎందుకంటే అందరి అమ్మాయిల్లానే నన్ను ఎవరో శక్తిమంతమైన వ్యక్తి ఎంపిక చేసుకునే వ్యక్తిగా భావించడం లేదా నాకు ఏ శక్తిమంతమైన వ్యక్తి అవసరం రానంతగా సక్సెస్ అదుకోవడం. అనే రెండు ఆలోచనలతో పోరాడుతూ ఉండిపోయా. ఈ సందిగ్ధంలో అస్సలు మనకేం కావాలన్నిది మర్చిపోతాం అందువల్ల మన సాధించిన విజయాలను ఆస్వాదించడం మర్చిపోతుంటాం. ఇప్పుడు సక్సెస్ పట్ల నా దృక్పథం మారింది. నీకు ఏం కావాలో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండటమే అతి పెద్ద గెలుపు. అదే స్వేచ్ఛకు అసలైన అర్థం. కేవలం కెరీర్లో సక్సెస్ లేదా డబ్బు సంపాదన విజయం కాదని, అది అసలైన స్వేచ్ఛ కూడా కాదని చెప్పుకొచ్చింది రాశి చౌదరి." నెటిజన్లు కూడా నిజం మేడం మీరు చెప్పేది ముమ్మాటికీ కరెక్ట్ అంటూ మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rashi Chowdhary (@rashichowdhary) (చదవండి: ఆమె దృఢ సంకల్పం ముందు అనారోగ్యమే చిన్నబోయింది!) -
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ఫీల్డ్తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
వహ్! స్మార్ట్ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్ నేరాలకు సమాధి కట్టారు!!
స్మార్ట్ఫోన్.. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ అదే.. కొన్నిసార్లు వ్యసనంగా మారి కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వ్యసనాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ పల్లెటూరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సైబర్ నేరాలకు దూరంగా ఉంటాం.. వాటి బారిన పడబోం.. అంటూ ఖరీదైన స్మార్ట్ఫోన్లను పగలగొట్టారు ఇక్కడో ఊరి ప్రజలు. పైగా సామూహికంగా వాళ్లంతా ప్రతిజ్ఞ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఉన్న సుఖ్పురి గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో పలువురు యువకులు తమ ఖరీదైన స్మార్ట్ఫోన్లను నేలకేసి కొడుతూ ధ్వంసం చేస్తూ కనిపించారు. మొత్తం 55 ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామంలో స్మార్ట్ఫోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇకపై కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగించాలని నిర్ణయించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా చూడటం, స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తగ్గించడం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రామ పెద్దలు చెబుతున్నారు.నుహ్ జిల్లా ఎస్పీ డాక్టర్ అర్పిత్ జైన్ ఇటీవల నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులు మార్పు దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రభావంతో గ్రామ యువకులు ఈ ప్రతీకాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా హాజరయ్యారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, మార్పు కోరుకునే వారికి అవకాశాలు కల్పించడం కూడా తమ బాధ్యతేనని వారు పేర్కొన్నారు. సాధారణ జీవితంలోకి తిరిగి రావాలనుకునే వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువతలో తప్పుదోవ పట్టే ధోరణి పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు అయితే మొబైల్ ఫోన్ల కారణంగా కుటుంబాల్లో విభేదాలు పెరిగాయని, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని కూడా పేర్కొన్నారు. అందుకే నేర ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని గ్రామం నిర్ణయించింది.నుహ్ జిల్లా గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో గణనీయమైన కేసులు ఈ ప్రాంతంతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కారణంగా కొందరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫిషింగ్ కాల్స్, ఆన్లైన్ మోసాల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.అయితే అదే జిల్లాకు చెందిన సుఖ్పురి గ్రామం మాత్రం వేరే దారి ఎంచుకుంది. స్మార్ట్ఫోన్ను పగలగొట్టడం ద్వారా సమస్య అంతమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే... యువతను నేరాల నుంచి దూరం పెట్టాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచింది. సాంకేతికతతో వస్తున్న సవాళ్లకు తమదైన పరిష్కారం వెతికిన ఓ ఊరు తీసుకున్న నిర్ణయంగా ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. -
భార్యకు సర్ప్రైజ్.. భర్తకేమో బిగ్ షాక్!
ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్ హాల్లో గానీ కాకుండా నగరంలోని కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్కార్పెట్ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.భార్యను ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్ను పార్టీ హాల్గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.14 మంది అదుపులోకిదర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Businessman Gautam Baruah was detained by Bharalumukh Police on Monday after a video showing a birthday celebration atop the Kumar Bhaskar Varma Flyover in Guwahati went viral on social media.According to police officials, Baruah was summoned for questioning in connection with… pic.twitter.com/TSRHU8nZ2t— Hate Detector 🔍 (@HateDetectors) June 23, 2026కేసులు నమోదుగౌతమ్ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి. -
37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Dr Dhivya Dhyana (@drdhivyadhyana)జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు. -
అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
సాక్షి, విశాఖపట్నం: ముసోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదైన వేళ.. ఇప్పుడు రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఉత్తరాఖండ్లోని ముసోరీ హిల్ స్టేషన్లో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.ఆడియోలో రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతూ.. “నా మనసు పూర్తిగా విరిగిపోయింది.. నా మీద అనుమానం పెంచుకుంటూ, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో కూడా చెప్పాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని ఆమెతో అన్నాను. ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను.. కానీ అన్ని హద్దులు దాటిపోయాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది.తల్లి సంచలన ఆరోపణలురాధా గాయత్రి తల్లి సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె మరణానికి భర్త శ్రీచరణ్నే కారణమని ఆమె మరోసారి ఆరోపించారు. పెళ్లైనప్పటి నుంచి రాధా గాయత్రిపై తీవ్ర అనుమానం పెంచుకున్న శ్రీచరణ్.. ఆమె బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడికి వెళ్తుందో గమనించేవాడని తెలిపారు. ఆఫీస్కు వెళ్లినప్పటికీ తరచూ వీడియో కాల్స్ చేస్తూ నిఘా పెట్టేవాడన్నారు. “బెడ్పై ఎవరు పడుకున్నారో చూపించు” అంటూ వీడియో కాల్స్ చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అయినప్పటికీ ఆమె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలిసి మద్యం సేవించినట్లు అసత్య కథనాలు సృష్టించి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫొటోలను అర్ధరాత్రిళ్లు తమకు పంపడం ఏమిటని ప్రశ్నించిన సత్యవతి.. తన కుమార్తెను శ్రీచరణ్ హత్య చేశాడని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.తండ్రి అనుమానాలుఇదిలా ఉండగా, తన కుమార్తె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైనప్పటి నుంచి శ్రీచరణ్ మానసిక వేధింపులకు గురిచేసేవాడని, ఆమెపై నిఘా పెట్టేందుకు బ్యాగులో ట్రాకర్ కూడా అమర్చాడని ఆరోపించారు. భర్త వేధింపుల గురించి గాయత్రి గతంలో పలుమార్లు తమకు చెప్పిందని వివరించారు.అంతేకాకుండా, రాధకు లోబీపీ సమస్య ఉందంటూ ప్రచారం చేస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున శ్రీచరణ్ రక్త నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించిన ఆయన.. హోటల్లో మత్తు పదార్థాలు కలిపిన మద్యం ఇచ్చారా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఘటనకు ముందు 48 గంటల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కోరిన కుటుంబ సభ్యులు.. కేసును ఫోరెన్సిక్ ఆధారాలతో పూర్తిస్థాయిలో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన భార్య మృతికి..తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీచరణ్, అతని కుటుంబం వాదిస్తోంది.రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు, తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా..!
భారత్ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు. తాజాగా మరో మహిళ భారత్ నుంచి ఆ నాలుగు పేరెంటింగ్ పాఠాలు నేర్చుకున్నానంటూ షేర్ చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో ఆ నాలుగు విధానాలు తనకు ఎంతగానో నచ్చాయని, అమ్మ పెంపకం ఇంత గొప్పగా ఉంటుందని తెలుసుకున్నా అంటూ వాటి గురించి పూసగుచ్చినట్లు వివరించింది. మరి ఆ విదేశీ మహిళ మెచ్చిన ఆ పేరెంటింగ్ పాఠాలేంటో చూద్దామా!.భారతదేశం నుంచి పిల్లల పెంపకానికి సంబంధించి ఆ నాలుగు అలవాట్లను తనలో భాగం చేసుకున్నాననంటూ యూరోపియన్ మహిళ క్సేనియా ఇన్స్టాగ్రామ్ వేదిక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో భారత్ నుంచి నేర్చుకున్న పెంపకపు అలవాట్లు తన పిల్లలను పెంచే విధానంను ఎలా మార్చాయో తెలిపింది. మొదట్లో తనకు మాతృత్వం చాలా కొత్తగా ఏదో అపరిచితంగా అనిపించింది. కానీ భారత్కు వచ్చాక అది ఇష్టమైన కుటుంబ బాధ్యతలుగా అనిపించాయని అంటోంది. కొత్త దేశంలో స్థానిక సంప్రదాయలకు అనుగుణంగా పిల్లలను పెంచడం కాస్తా సవాలుగా ఉంటుందని కానీ, భారతీయ సంస్కృతి మాతృత్వాన్ని మధురంగా మార్చి సులభంగా మమేకమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించి తను మెచ్చిన భారత మాతృత్వ విధానాలు ఏంటంటే..పిల్లలతో కలిసి నిద్రపోవడం..పిల్లల చెంత పడుకోవడం తల్లి బిడ్డల మధ్య అనుబంధానికి వేదిక అని అంటోంది. బెడ్ షేర్ చేసుకోవడంలో భద్రంగా ఉన్నాననే భరోసా పిల్లల్లో కలుగుతుంది..తన బిడ్డతో పూర్తిగా గడుపుతున్నా అనే భావన తల్లిలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య గాఢంగా పెనవేసుకునే బంధానికి ఇదే ప్రధానం అంటోంది. రోజువారీ నూనె మర్దనలు..భారత్ నుంచి స్వీకరించిన సంప్రదాయం..రోజువారి నూనె మర్దన. దీనిని మాలిష్ అని పిలుస్తారు. శిశు సంరక్షణకు సంబంధించింది..ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడే అంశం కూడా. ఇదొక అందమైన ఆచారంగా అభివర్ణించింది. ముఖ్యంగా తాతమయ్య నానమ్మలు ఈ పనిచేస్తూ తల్లికి చేదుడువాదోడుగా ఉంటారని అంటోంది. ఇది కుటుంబ అనుబంధానికి దోహదపడే అంశం కూడా అంటోందామె. అర్థవంతమైన పేర్లుభారత్లో పిల్లల పేర్లు అర్థం, ఉద్దేశ్యం, గుర్తింపుని దృష్టిలో ఉంచుకుని ఎంచుకుంటారని అంటోంది. ఒక పేరును ఎంచుకోవడంలో ఎంతో ఆలోచన ఉంటుందో..అలాగే ఆ పేరు వెనుక సంస్కృతి, చరిత్ర విలువలతో లోతుగా ముడిపడి ఉంటుందని..అది తనకెంతో నచ్చిందని పేర్కొంది. మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడంభారత్లో పిల్లల పుట్టిన రోజున తల్లి ఎంతో అందంగా రెడీ అవుతుంది. నిజానికి ఇది తల్లిగా మారడానికి సంబంధించిన వేడుక కూడా. అందుకే ఇక్కడ పిల్లల పుట్టిన రోజు వేడుకలకు తల్లులు చక్కటి చీర కట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తారు. తాను కూడా అలానే అందమైన చీర కట్టుకుని పిల్లల పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు.."అమ్మ మనకు ఎన్నో విషయాలను అందిస్తుంది... మా దేశంలో(భారత్) ఒక స్త్రీ తల్లి అయ్యాక, ఆమెకు తన బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదు. భర్తను కూడా పక్కన పెట్టేంతగా ఆమె బిడ్డపై శ్రద్ధ చూపిస్తుంది... మనకు అమ్మే సర్వస్వం. ఆమె దేవుడి కంటే గొప్పది, ఆమె ఒక సూపర్ ఉమెన్, జీవితంలో మనకు లభించే అంతులేని ప్రేమకు నిదర్శనం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ksenia | Family & Ambition (@kseniakala) (చదవండి: ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!) -
డిఫరెంట్ పోజుల్లో శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తపించడం అంటే..మాటలకందని గొప్ప విషయం. అలా చేయాలంటే ఎంతో స్థైర్యం కావాలి. అంతేగాదు అతడు ఆ వ్యాధి చివరిదశలో ఉండి కూడా.. తనలా మరొకరు ఈ వ్యాధికి బలి కాకూడదని తపిస్తుండటం విశేషం. చిన్నపాటి కదలికలకు కూడా నలుగురు వ్యక్తులపై ఆధారపడాల్సిందే..ఐనా 12 గంటలు పనిచేస్తున్నాడు. అంతలా తగ్గేదేలా అంటూ మనోధైర్యంతో సాగుతున్న అతడి గుండె ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. అతడెవరంటే..ఆ వ్యక్తే ఈ కామర్స్ దిగ్గజం JD.com లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన 48 ఏళ్ల కైలే. చైనాకు చెందిన కైలే ఏడేళ్లుగా మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) తో పోరాడుతున్నాడు. నయంకాని ఈ వ్యాధి అతడిని పూర్తిగా కదలలేని, మాట్లాడలేని స్థితికి తీసుకువచ్చింది. ప్రస్తుతం టైప్ చేయడానికి, మాట్లాడటానికి పూర్తిగా కంటి ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కై, రోజుకు దాదాపు 12 గంటలు పనిచేస్తూ..ఏఎల్ఎస్ ఔషధాల తయారీకి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు. తనలా మరెవ్వరూ ఈ వ్యాధికి బలికాకూడదని.. శాస్త్రవేత్తలు, వైద్యులతో కలసి నిర్విరామంగా పనిచేస్తున్నాడుమరణం ఒక్కటే నన్ను ఆపగలదు ఇంకేది కాదంటూ..ఆ స్థితిలో కూడా ఓపికతో పరిశోధనకు తన వంతు సహకారం అందిస్తున్న అతడిని శెభాష్ అని అభినందించకుండా ఉండలేరెవ్వరూ. కై ఇప్పుడు బీజింగ్ ఐసికాంగ్ మెడికల్ టెక్నాలజీకి ఛైర్మన్గా ఉన్నారు. ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) పరిశోధన కోసం దాదాపు రూ. 13 కోట్లు వరకు విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఈ వ్యాధికి అంకితమైన నాలుగు స్వచ్ఛంద సంస్థలను కూడా స్థాపించారు. అలాగే అనేక ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. బాధకరం ఏంటంటే ఏఎల్ఎస్ను తొలిసారి గుర్తించిన దాదాపు రెండు శతాబ్దాల తర్వాత కూడా ఏ ఔషధం కూడా దాని పురోగతిని ఆపలేకపోయింది. ఆయన బృందం ప్రస్తుతం 300కు పైగా ఔషధ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది. ఒక జన్యు-లక్షిత చికిత్స అనేక మంది రోగులను కాపాడినప్పటికీ, కైకిలా స్పోరాడిక్ ALS ఉన్న చాలా మందికి సహాయం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో RAG-17 అనే ప్రయోగాత్మక ఔషధంతో ఒక పురోగతిని ప్రకటించారు. ట్రయల్స్లో కూడా చక్కటి ఫలితాలు వచ్చాయి. కాగా కై లే బృందం ఏజెన్సీ రుసుములు లేకుండా రోగులను నేరుగా సంరక్షకులతో అనుసంధానించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సృష్టించింది. స్వతహాగా ఫార్మసీ గ్రాడ్యుయేట్లు అయిన కై , అతని భార్య డువాన్ రుయ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య డువాన్ తన "బ్రేకింగ్ ది ఐస్ స్టేషన్" అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా పరిశోధన కోసం నిధులను సేకరిస్తుంది. కైకి ALS వ్యాధిపై పోరాటంలో సహాయం చేయడం కేవలం కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అని, అతనితో గడిపే ప్రతి క్షణాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తానని కై భార్య చెప్పడం విశేషం. అంతేగాదు కై దృఢ సంకల్పానికి ఫిదా అవ్వతూ ప్రశంసలు వెల్లువెత్తాయి.(చదవండి: 25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!) -
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని.. -
జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్లోని ఎవియాన్ లే బైన్స్లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు సదస్సులో పాల్గొననున్నాయి. అదీగాక ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సదస్సుకి ఓ తొమ్మిదేళ్ల చిన్నారి రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాపం అమె కెమెరా కంట పడకుండా ఉండేందుకు పడుతున్న తపన అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..ఆ ముద్దలొలికే పాప ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూమార్తె. ఫ్రాన్స్లో ఇటీవల జరుగుతున్న G7 సదస్సులో ప్రధాన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ఒక రసవత్తరమైన క్షణం ఎదురైంది. అందుకు సబంధించిన వీడియో అందరి హృదయాలను తాకింది. అంతేగాదు కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి రాకకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యి ఎవరా అమ్మాయ్ అని చర్చలు మొదలయ్యాయి. రాజకీయ చర్చలకు అతీతంగా ఆ చిన్నారే హాట్టాపిక్గా మారడం విశేషం. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని మెలోని రాగానే అధికారులకు, స్వాగత ప్రతినిధి బృంద సభ్యులకు అభివాదం చేశారు. ఆమె వెనుక నిశబ్దంగా ఉన్న గినెవ్రా జియాంబ్రూనె కెమెరాల ముందు సిగ్గుపడుతూ..తల్లి చెంత ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అయితే నెటిజన్లు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమార్తెను వెంటబెట్టుకుని అమ్మగా రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు మెలోనిపై ప్రశంసలపై వర్షం కురిపించారు. తల్లిదండ్రులుగా మారిన ప్రపంచనాయకులంతా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారు కదా అంటూ పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉంది. ఆమెకు సురక్షితమైన ప్రదేశం ఏదో బాగా తెలుసు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Giorgia Meloni's daughter steals the spotlight by avoiding itItaly's PM's shy sidekick goes viral for hiding behind her mom as they arrive at the G7 summit in Geneva pic.twitter.com/n8gmg93Cfi— RT (@RT_com) June 17, 2026 (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది. -
‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..
ఓ అమ్మాయి కెరీర్, అభిరుచుల పరంగా సక్సెస్ అయినా ఆమె అమ్మమ్మ మాత్రం తన కారణంగా ఏదో కోల్పోయానంటూ బాధపడిపోయిందంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాపం ఆ అమ్మమ్మ చెప్పిన కారణం విని ఆమెకు చాలా హాస్యస్పదంగా ఉండటమే కాదు ఆ రెండు అక్షరాల పదం మందు ఆ అమ్మాయ్ విజయాలన్ని వృధాగా మారిపోవడం విచిత్రం. ఒక రకంగా ఈ పోస్ట్ మహిళల వ్యక్తిగత గుర్తింపుకి ఏ మాత్రం విలువ ఉండదా అనే విషయం తెరపైకి తీసుకొచ్చింది. అంతేగాదు ఆడపిల్లకు వివాహ బంధమే ముఖ్యమా అనే దానిపై ఆలోచింపచేసేలా క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో సంభాషణ. ఆ అమ్మాయే భారత సంతతి మహిళ హేమాక్షి మోట్కా. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.ఆ వీడియోలో హేమాక్షి భారత దేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ తన గురించి వివరించారామె. భారత్లో ఒక కార్యక్రమానికి తన అమ్మమ్మ హాజరైందని అక్కడ కేవలం "పెళ్లైన కుమార్తెలకు" మాత్రమే సాంప్రదాయ బహుమతులుగా దుప్పట్లు లభించడంతో ఆమె అమ్మమ్మ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. ఇదంతా ఎందుకంటే తనకింక పెళ్లికాకపోవడంతో అమ్మమ్మ ఆ దుప్పటి అందుకోలేకపోయానంటూ తన ఆవేదన వెలిబుచ్చిందని తెలిపింది. తనకు పెళ్లి కాలేదన్న కారణంగానే ఒక్క దుప్పటి కూడా అందుకోలేకపోయానని బాధపడుతోందామె. కానీ నాకు అది ఎంతో సిల్లీగా అనిపించింది. తాను అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో కోట్లాది రూపాయ కంపెనీ నిర్మించాను, సీఈవోని, పైగా 42 కిలోమీటర్ల మారథాన్ని విజయవంతంగా పూర్తి చేశా. ఇంత సక్సెస్ని అందుకున్నా.. కానీ జస్ట్ ఒక లాంఛనప్రాయమైన దుప్పటి కోసం కోల్పోయాను కాబోలు అంటూ నవ్వేసిందామె. అంతేగాదు ఇది తనపై అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధే కావొచ్చు..కానీ మహిళలకు వ్యక్తిగత గుర్తింపును త్యాగం చేయొద్దని హెచ్చరిస్తూ ఇలా పేర్కొంది. నాకు మా అమ్మమ్మ మాటలు నవ్వు తెప్పించినా.. మహిళలుగా మనం ఎంచుకున్న రంగంలోని విజయాలను జరుపుకోవాలి. పెళ్లి అనేది ఒక ప్రతిపాద, ఆమోదం అంతే. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని..మంచి కెరీర్ని నిర్మించుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, స్వంతంగా డబ్బు సముపార్జించాలి. గర్వపడే జీవితాన్ని సృష్టించుకోవాలి. అందుకు తగ్గట్టుగా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ న్యూయార్క్ కంపెనీ సీఈవో అంటూ తన సంభాషణను ముగించింది. అంతేగాదు ఆ వీడియోలో మన హోదాకి విలువలేకపోవచ్చు, ఇతరుల అభిప్రాయాలు మారవచ్చు.. కానీ మీపై మీకు సడలని ఆత్మవిశ్వాసం ఉండాలి, దుప్పటి బాగుంటుందేమో..కానీ మీ వెంట వచ్చేది, మిమ్మల్ని నిలబెట్టేది ఆత్మవిశ్వాసమే. అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దదతిస్తూ.. ఆట మార్చేయండి. మీకు నచ్చిన పనులను మీ పద్ధతిలో చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hemakshi Motka (@hemakshi126) (చదవండి: 90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..) -
అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష
ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది. దేశంల నిరుద్యోగులు, గిగ్ ఎకానమీపై పెద్ద చర్చకు దారితీసింది. 'జిప్ ఎలక్ట్రిక్' (Zypp Electric) ఫౌండర్, సీఈఓ ఆకాష్ గుప్తా, తాజాగా తాను ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్తో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.ఆకాష్ గుప్తా షేర్ చేసిన వివరాల ప్రకారం ఆ క్యాబ్ డ్రైవర్ గతంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగం చేస్తూ నెలకు కేవలం పాతికవేల రూపాయలు సంపాదించేవాడు. అది ఏ మూలకు రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయి క్యాబ్ డ్రైవర్గా మారిపోయాడు. ఫలితంగా ఇప్పుడు నెలకు రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు. అలాగే తాను చేసే పని మీద తనకు పూర్తి నియంత్రణ లభించిందని అతను ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత పని చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ తన జీవితాన్ని మార్చేసింద న్నాడు. రోజుకు 10 గంటలు పనిచేస్తూ రూ.3 నుంచి రూ.4 వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పాడు ఈ పరిణామాన్ని ఆకాష్ గుప్తా దేశంలో ఎదుగుతున్న "గిగ్ ఎంట్రప్రెన్యూర్స్" (భారత్ కా నయా మిడిల్ క్లాస్) కు ఉదాహరణగా అభివర్ణించారు. అంతేకాదు సొంతంగా వాహనాన్ని, సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ సంపాదిస్తున్నందున, ఇకపై ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు తనను తాను ఒక బిజినెస్మ్యాన్గా చెప్పుకోవాలని ఆకాష్ గుప్తా ఆ డ్రైవర్కు సూచించారు. గిగ్ వర్కర్లు కేవలం డెలివరీ పార్టనర్లు మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకునే మైక్రో-ఎంట్రప్రెన్యూర్స్. వీరే తదుపరి మధ్యతరగతి వర్గం అని గుప్తా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash)ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?నెటిజన్ల స్పందన ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. గిగ్ వర్కర్లందరినీ గౌరవించాలి ఒకరు, అతని స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకం అని మరొకరు కమెంట్ చేశారు. గతంలో ఉద్యోగం ద్వారా నెలకు రూ. 70 వేలు సంపాదించే తాను, ఇపుడా ఉద్యోగం వదిలేసి కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఉద్యోగం కంటే ఎక్కువే సంపాదిస్తున్నాను, అన్ని ఒత్తిళ్ల నుంచి దూరంగా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.కాగా జిప్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడైన ఆకాష్ గుప్తా, ఆన్లైన్లో కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందారు. ఆయన తరచూ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇదీ చదవండి: మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
ఇన్స్టాగ్రామ్లో ‘మనదే’ అంతా!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది.Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN— Jash (@jeetcasm) June 16, 2026మీమ్ నుంచి గ్లోబల్ క్రేజ్ దాకా.. మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Melodi అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్ట్యాగ్ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.మెలోనీకి టాఫీలు!ఈ మెలోడీ ఫినామినన్ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.వైరల్ కెమిస్ట్రీఅంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ కపుల్" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్ అయ్యింది. -
కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా?
తరాలు మారినా.. టీవీ సీరియళ్ల సాగదీతలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైపెచ్చు.. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రేక్షకుల అభిరుచులను మార్చేసినా, కొన్ని సీరియళ్లలో మాత్రం అదే అతి, అదే అసహజ మలుపులు, అదే విషపూరిత సంబంధాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కన్నీళ్లు, కుట్రలు, కుటుంబ కలహాలతో నిండిపోయిన కథలు.. ఇప్పుడు హింస, అవమానాలు, మానసిక వేధింపులను కూడా "ప్రేమ"గా చూపించే స్థాయికి చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి విమర్శలకు తాజాగా మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్ కేంద్రబిందువైంది. కుటుంబ కథ పేరుతో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో భర్త చేతిలో భార్యకు జరిగే శారీరక, మానసిక హింసను రొమాంటిక్గా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ప్రేమ కాదు.. గృహహింస" అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.వివాదానికి కారణమైన సీన్కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్లో.. ఇటీవల ప్రసారమైన ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కథానాయకుడు ధీరజ్.. కథానాయిక రాజ్జీని తోసేయడం, చెంపదెబ్బ కొట్టడం, ఆమెను మంచంపై బలవంతంగా అదిమిపట్టడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్జీ చేయి వేడిగా ఉన్న ఇస్త్రీకి తగిలి కాలిపోతుంది. నొప్పితో ఆమె కేకలు వేస్తుండగా, ధీరజ్ ఆమె నోరు మూసేస్తూ తనకు ఆమెపై ప్రేమ కాదని, ద్వేషమే ఉందని చెబుతాడు.సాధారణంగా చూస్తే ఇది ఇద్దరి మధ్య ఘర్షణను చూపించే సన్నివేశంలా కనిపించవచ్చు. కానీ దాన్ని చిత్రీకరించిన తీరు, పాత్రల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.నెట్టింట రియాక్షన్లు.. సన్నివేశం ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది.ఇది ప్రేమ కాదు.. హింసఆమెను తోశాడు.. కొట్టాడు.. నీళ్ల బకెట్ పోశాడు.. ఇప్పుడు ఇస్త్రీతో కాల్చేశాడు. ఇదంతా చేసి దాన్ని ప్రేమగా చూపిస్తున్నారా? They’re romanticizing abuse 🙂- pushed her around- slapped her- dumped a bucket of water on her- now burned her with an iron and he’s covering her screams in the name of romance??? End this crap !!! #MahadevandSons pic.twitter.com/qzNy2z4sQT— anj (@cokerantx) June 16, 2026గృహహింసను రొమాన్స్గా చూపించడం అత్యంత బాధ్యతారాహిత్యం మరికొందరు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. భర్త ఎంత హింసించినా భార్య భరించాలి.. చివరకు అతడిని క్షమించాలి అనే సందేశాన్ని ఇలాంటి సీరియళ్లు ఇస్తున్నాయి అంటూ విమర్శించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా ఈ కార్యక్రమాలను చూస్తారని, ఇలాంటి సన్నివేశాలు సంబంధాలపై తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అసలు సమస్య ఇదే!ఈ వివాదం కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లలో "టాక్సిక్ రొమాన్స్" అనే ధోరణిపై విమర్శలు పెరుగుతున్నాయి. కోపం, అధికారం చెలాయించడం, మానసిక వేధింపులు, అవమానించడం, కొన్నిసార్లు శారీరక హింసను కూడా ప్రేమలో భాగంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.సామాజిక వర్గాల అభిప్రాయం ప్రకారం, హింసను హింసగానే చూపించాలి. కానీ దాన్ని ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం పేరుతో సమర్థించేలా చూపించడం ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి కథనాలు విషపూరిత సంబంధాలను కూడా సాధారణం అనే భావనను కలిగించే అవకాశం ఉంటుంది.మరోవైపు వాదనఅయితే ఈ విమర్శలతో అందరూ ఏకీభవించడం లేదు. కొందరు ప్రేక్షకులు మాత్రం సన్నివేశాన్ని సందర్భం నుంచి వేరు చేసి చూస్తున్నారని వాదిస్తున్నారు. ధీరజ్ ఉద్దేశపూర్వకంగా రాజ్జీని కాల్చలేదని, కథలోని సంక్లిష్టమైన భావోద్వేగ సంఘర్షణను చూపించడానికే ఆ సన్నివేశాన్ని ఉపయోగించారని చెబుతున్నారు.సీరియళ్లకు హద్దులుండాలా?టీఆర్పీల కోసం సంచలన సన్నివేశాలు చూపించడం కొత్త విషయం కాదు. కానీ గృహహింస, మానసిక వేధింపులు, విషపూరిత సంబంధాలను ప్రేమగా లేదా కుటుంబ బంధాల పేరుతో సమర్థించేలా చూపిస్తే అది కేవలం వినోదం పరిధిలోనే మిగిలిపోదని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత సాధారణంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం మహాదేవ్ అండ్ సన్స్పై జరుగుతున్న వివాదం ఒక సీరియల్ను దాటి పెద్ద చర్చకు దారి తీసింది. ప్రేక్షకులు నిజంగానే ఈ "టాక్సిక్ రొమాన్స్" కథలతో విసిగిపోయారా? లేక ఇది మరో సోషల్ మీడియా తుఫానుగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ యుగంలోనూ టెలివిజన్ సీరియళ్ల కథన శైలి, వాటి సామాజిక బాధ్యతపై మరోసారి ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. -
పవన్.. మీరా యువతకు ప్రతినిధి?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ పార్టీల వైఫల్యాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తికి ప్రతీకగా రూపుదిద్దుకున్న కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విమర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సుమతీ శతకంలోని ఉదాహరణను చెబుతూ చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపగలవని, అలాగే చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆలోచనలతో దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి విభజనవాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘కాక్రోచ్’కు దేశవ్యాప్తంగా మద్దతిస్తే పవన్కు తప్పుగా కనిపిస్తోందా..? నీట్ అక్రమాలపై నిరసనగా మే 16న అభిజీత్ డిప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ‘ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు. వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలక వర్గాల వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా, ఆ ఉద్యమాన్ని అవమానకర పదజాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వైఖరి కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, నిరసనలు సహజమని, వాటిని వినిపించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పవన్కు వారు గుర్తు చేస్తున్నారు. ఒక ఉద్యమంతో ఏకీభవించకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న భావజాలాన్ని, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా పవన్కు ఉన్నప్పటికీ తెర వెనుక అజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. యువతకు మీరా ప్రతినిధి...?? యువతకు ప్రతినిధిగా, మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలా జెన్జీ యువతను, వారు ఆదరిస్తున్న సీజేపీని ఎగతాళిగా మాట్లాడటంపై యువతరం మండిపడుతోంది. యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని దేశద్రోహంగా లేదా సమాజ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం సమస్యల మూలాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా మారుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యువత నిరుద్యోగం, అవకాశాల కొరత, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు వారి ఆలోచనలను కొట్టిపారేస్తూ పవన్ మాట్లాడటం యువతను పవన్కు మరింత దూరం చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీపై వచ్చిన స్పందనను పవన్ చెప్పినట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్గా కాకుండా, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పట్టే సామాజిక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. యువత స్వరాన్ని వినేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందా? లేక తమకు నచ్చని అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ చిన్నచూపు చూస్తుందా? అనే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, జెన్ జీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్లు, రీల్స్, వార్తా కథనాలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి. ‘నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని పవన్ సమర్థిస్తున్నారా’ అని పలువురు నిలదీశారు. ‘నిలకడ లేదు.. విలువలు లేవు’ అంటూ పవన్ ద్వంద్వ వైఖరిని మరికొందరు తప్పుబట్టారు. ‘విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తే విభజనవాదం ఎలా అవుతుంది’ అంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు. ప్రధానంగా ‘నేషన్ ఫస్ట్ అనేది వాస్తవమేగానీ, యువత లేకుండా దేశం ఎక్కడుంది’ అని పవన్ కళ్యాణ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపైన, విద్యార్థుల భవిష్యత్తుపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా యువత పవన్ను డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని, అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగే ఏ తప్పునూ ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ కాక్రోచ్ జనతాపార్టీ, జెన్ జీ యువతని కించపరుచ్తూ మాట్లాడి సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. -
చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు అదుర్స్..!
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే ఇష్టపడని వారుండరూ. ఆయనలా ఫాస్ట్గా మ్యూజిక్కి అనుగుణంగా స్టెప్లు వేసేందుకు తహతహలాడుతుంటారు. ఎందరో ఆయనకు శిష్యులుగా మారి ఎంతలా ప్రయత్నించేవారో కథలుకథలుగా విన్నాం. ఇప్పుడా మహానుభావుడు మన మధ్య లేకపోయినా..ఆయన ఆల్బమ్స్, పాటలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయ్. ఇదంతా ఎందుకంటే..ఓ మహిళ అచ్చం మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆ వీడియోలో కంటెంట్ క్రియేటర్ కోమల్ సాంప్రదాయ చీర కట్టులో మైఖేల్ జాక్సన్లా అద్భుతమైన డ్యాన్స్ చేసింది. మైఖేల్ జాక్సన్ ఐకానిక్ హిట్ అయిన 'బిల్లీ జీన్' పాటకు కాళ్లు కదిపింది. ఆమె చీర కట్టుకుని మరీ.. మేఖేల్ జాక్సన్కి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా డ్యాన్స్ చేయడం విశేషం. పాట ప్రారంభకాగానే సునాయాసంగా స్టెప్పులు వేసిందామె. అందులో పదునైన బాడీ ఐసోలేషన్స్, రోబోటిక్ పాపింగ్ సీక్వెన్సులు, లెజెండరీ మూన్వాక్ కూడా ఉన్నాయి. ప్రతి స్టెప్పు చాలా కచ్చితత్వంతో ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం విశేషం. ఆ వీడియోలో ఒక అమ్మ మేఖేల్ జాక్సన్ ఆల్బమ్స్ చూసి అభిమానిగా మారితే ఎలా ఉంటుందో అంటూ.. కంటెంట్ క్రియేటర్ కోమల్ అలా సంప్రదాయ చీర కట్టులో డ్యాన్స్ చేసి చూపిందంటూ ఇచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది. నిజానికి ఆ స్టెప్లు చీరకకట్టులో వేయడం అంత ఈజీ కాదు. కానీ కోమల్ మాత్రం అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా అమ్మా మీ స్టెప్స్ అదుర్స్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Komal kumari (@komal__aadya) (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..!
ఇంతవరకు పలు డ్రైవర్లు తమ ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై నుంచి పుస్తకాలు, స్నాక్స్ వంటి ఏర్పాట్లతో ఫిదా చేశారు. కానీ ఈ డ్రైవర్ ఒక అడుగు ముందుకేసి ప్రయాణికులు నచ్చినట్లు జర్నీ చేసే అనుభవాన్ని అందించాడు. అది కూడా వాళ్లకు వాళ్లుగా ఎలాంటి రైడ్ చేయలనుకుంటున్నారో ఎంచుకునే మెనూతో ఇప్రెస్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది.ఒక మహిళ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ అదరి మనసులను తాకింది. ఆ పోస్ట్లో ఆ మహిళ తానొక అద్భుతమైన ప్రశాంతమైన రైడ్ చేశానంటూ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు విదేశీ వ్యాపార పర్యటన అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు రాశారు. ఇంటికి వెళ్లేందుకు 45 నిమిషాల ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నారు. పైగా బాగా మూడు రోజులు పర్యటన కారణంగా బాగా అలిసిపోయి ఉండటంతో అస్సలు మాట్లాడే ఓపిక లేదని రాసుకొచ్చింది. ఆ డ్రైవర్ పేరు కబీర్ అని తన హెడ్రెస్ట్ వెనుకభాగంలో అంటించిన లామినేటెడ్ కార్డుని ఆమెకు అందించాడని చెప్పారు. దాన్ని ఆమె "రైడ్ మెనూ"గా వర్ణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తాము ఇష్టపడే సంభాషణను ఎంచుకునే వీలు కల్పించేలా రూపొందించాడు. ఆ కార్డులో నిశబ్దం కోసం "ది సైలెంట్ రైడ్", తమ రోజు విశేషాలు పంచుకోవాలనుకునేవారికి "ది థెరపిస్ట్ రైడ్", నగరం గురించిన వాస్తవాలు, కథలు చెప్పే "ది టూరిస్ట్ రైడ్", ప్రయాణికులు కేవలం విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినగలిగే "ది రేడియో రైడ్" వంటి ఆప్షన్లు ఉన్నాయని చెప్పారామె. అయితే తాను సైలెంట్ రైడ్ ఎంపికను ఎంచుకుని, డ్రైవర్కు నిశ్శబ్దంగా ధన్యవాదాలు తెలిపానని చెప్పింది. వెంటనే కబీర్ తల ఊపి ఎయిర్ కండిషనింగ్ సర్దుబాటు చేసి, మొత్తం ప్రయాణాన్ని నిశబ్దంగా చేశాడు. ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే అద్భుతంగా అనిపిస్తుందన్నారామె. ఈ ఏడాది తాను ఆస్వాదించిన ప్రశాంతబైన రైడ్ ఇదేనని చెప్పారామె. పైగా తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోగలిగానని పేర్కొందామె. ఆ తర్వాత తాను ఉదారంగా టిప్ ఇచ్చి, కబీర్ వ్యాపార ఆలోచనను ప్రశసించానని చెప్పారామె. అయితే డ్రైవర్ ఆ మెనూ ఏర్పాటు వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ..ఇది మెరుగైన టిప్స్ లేదా రేటింగ్లు సంపాదించడం కోసం ఈ కార్డుని తయారు చేయలేదని చెప్పడం విశేషం. తన కుమార్తె ప్రేరణతో ఈ కార్డుని రూపొందించినట్లు తెలిపాడు. ఆమె కూడి అలిసిపోయినప్పుడు..అపరిచితులతో మాములు సంభాషణ ఎంత విసుగ్గా, నీరసం తెప్పించినట్లు ఉంటుందో పంచుకుందని, దాన్ని ఆమె "మారథాన్ పరుగు"తో పోల్చిందని, చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలోనే ప్రయాణికులు విమర్శల భయం లేకుండా తమ ఇష్టపూర్వంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా వ్యక్తపరిచే మెనూని రూపొందించానని తెలిపాడు. ఆ వివరణ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చింది. ఆధునిక జీవతం ప్రజలను నిరంతరం ఎలా ఒత్తిడికి గురిచేస్తోందో కదూ అనుకుంటూ..ఔను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేయడంకు మించిన గొప దయ ఇంకొకటి లేదంటూ తన పోస్టుని ముగించారామె. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..ఇది మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. i took a 45-minute uber ride home from the airport last night after a brutal, three-day business trip. i was completely emotionally and physically drained, and my social battery was at absolute zero.when i got into the car, the driver.. an older guy named kabir.. didn't say…— noor୨୧ (@wottheberry) June 6, 2026 (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
సహారాలోనూ తప్పని డెడ్లైన్స్! ఒంటెపై ల్యాప్టాప్తో..
సహారా ఎడారికి పోయినా.. బాస్ వదలడం లేదా?. మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్లు తప్పలేదా? అన్నట్టుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఒంటెపై ప్రయాణిస్తూ, ల్యాప్టాప్ తెరిచి జూమ్ కాల్లో బిజీగా కనిపించిన దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.ఎడారి మధ్యలో అనంతమైన ఇసుక దిబ్బలపై ఒంటె హంప్పై ల్యాప్టాప్ పెట్టుకుని, జూమ్ కాల్లో పూర్తి ఫోకస్తో పని చేస్తున్నట్లుగా కనిపించిన ఆ వ్యక్తి దృశ్యం ఒక్కసారిగా వైరల్గా మారింది. ఆ వీడియోలో.. వీడు వీడి బాస్కు వర్క్ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పాడు అని క్యాప్షన్ జోడించడంతో నవ్వులు పూస్తున్నాయి. ఈ వీడియోను న్యూయార్క్కు చెందిన కంటెంట్ క్రియేటర్ షాద్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ అసాధారణ దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతూ.. రిమోట్ వర్క్ కల్చర్పై సరదా చర్చలకు దారితీసింది. కొందరు దీన్ని వర్క్ఫ్రమ్ ఎనీవేర్ ట్రెండ్కు పరాకాష్టగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు ఆధునిక ఉద్యోగ జీవనశైలి ఎక్కడికైనా వెళ్లగలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే, ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకర్షించిన విషయం.. “ఎడారి మధ్యలో కూడా జూమ్ కాల్ ఎలా సాధ్యం?” అనే కుతూహలం. “వైఫై ఎంత స్ట్రాంగ్!” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఇది టెక్నాలజీ సాధ్యాలను చూపించే ఉదాహరణగా పేర్కొన్నారు.“వర్క్ ఫ్రమ్ హోం కాదు, వేర్ ఫీల్స్ హోం అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ వైరల్గా మారింది. మరోవైపు “ఇలాంటి జీవితం మాకూ కావాలి” అంటూ సరదా కోరికలు కూడా వ్యక్తమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న “work from anywhere” ట్రెండ్లో ఇది మరో వైరల్ ఎపిసోడ్గా నిలిచింది. ఇటీవల దక్షిణ కొరియాలో రోలర్కోస్టర్పై మీటింగ్లో పాల్గొన్న వీడియో తర్వాత.. మొన్నీమధ్యే మన హైదరాబాద్లో బండి పెట్రోల్ ట్యాంకర్ మీద ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చేసిన ప్రయాణం.. ఇప్పుడు ఎడారిలో ఒంటెపై Zoom కాల్ వీడియో కూడా అదే జాబితాలో చేరింది. -
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో నైస్ ట్విస్ట్!
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది. అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది.ఫ్రాన్స్లో మాక్రాన్తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎవియన్, పారిస్లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు.ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది. ఇంగ్లిష్లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం.Nice to have met you in Nice. A productive first leg indeed. The India-France partnership will keep scaling new heights. See you in Evian and Paris…@EmmanuelMacron https://t.co/N84iSN7aDQ— Narendra Modi (@narendramodi) June 14, 2026మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నైస్ ప్రత్యేకత ఏంటంటే..నైస్(Nice City) ఫ్రాన్స్కు ఆగ్నేయ తీరంలో మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. ఫ్రెంచ్ రివేరా ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా భావిస్తారు. అందమైన బీచ్లు, సముద్రతీర విహార మార్గాలు, చారిత్రక నిర్మాణాలు, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రసిద్ధి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్లో పారిస్ తర్వాత అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే నగరాల్లో నైస్ కూడా ఒకటి.ధురంధర్ ట్విస్ట్ ఇచ్చిన మాక్రాన్మోదీ పర్యటనకు బాలీవుడ్ టచ్ ఇస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ధురంధర్ సినిమాలోని ‘ఆరి ఆరి’ పాటతో జతచేసి వీడియోను రూపొందించారు. మోదీ-మాక్రాన్ భేటీ, భారత్ ఇన్నోవేట్స్-2026 సదస్సు ప్రారంభోత్సవం, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలపై జరిగిన చర్చలను ఇందులో చూపించారు. ఈ వీడియోకు స్పందించిన ప్రధాని మోదీ.. భారత్, ఫ్రాన్స్లు సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల రంగాల్లో కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026ఇదిలా ఉండగా, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చర్చల కంటే ముందే మోదీ-మాక్రాన్ల సెల్ఫీ, దానికిచ్చిన ‘నైస్’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, నీతా అంబానీ కాలాతీమైన చేనేత వస్త్రాలతో సదా ఆకట్టుకుంటారు. మన భారతీయ వారసత్వాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని తన ఫ్యాషన్ శైలితో ప్రపంచానికి చాటుతుంటారు. ఈసారి అలానే అంతర్జాతీయ వైద్యుల సమావేశంలో అత్యద్భుతమైన బనారసి చీరలో మెరిశారామె.విలాసవంతమైన కటన్ సిల్క్తో నేసిన ఈ చీరలో, టీల్-ఆక్వా రంగుల మనోహరమైన కలయిక నీతాకు రాజసమైన ఆకర్షణను అందించింది. ప్రకృతిని తలపించే బంగారు జరీ పూల డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బనారస్ నేతలో అత్యంత క్లిష్టమైన కడ్వానేత ఇది. ఈ చీరలో ప్రతి డిజైన్ను వస్త్రం ఉపరితలంపై ఎబ్రాయిడరీ చేయకుండా విడివిడిగా వస్త్రంలోనే నేస్తారు. దీని తయారీకి మూడు నెలలు పైనే పట్టిందట. ఈ చీరను మహమ్మద్ యాసిన్, ఇక్బాల్ అహ్మద్ రూపొందించారు. ఆ చీరల కళాకారులు దశాబ్దాల తరబడి నైపుణ్యం, ప్రతి దారంలో స్పష్టంగా కనిపిస్తుంది. చీరపై అడ్డంగా ఉన్న బంగారు జరీ పూల అల్లిక, మొఘల్ తోటల డిజైన్లో రూపొందించారు. ఒకరకంగా ఇది నాటి వైభవాన్ని కళముందు ప్రతిబింబించేలా చారిత్రక వైభవాన్ని జోడించారు. ఈ చీరకు సరిపోయే మెరిసే వజ్రాల చెవిపోగులు, గాజులు, ఉంగరాలు ఎంచుకున్నారామె. జుట్టు తాజా తెల్లని పువ్వులతో అలకరించి చక్కగా ముడిలా తీర్చిదిద్దారు. అలాగే నీతా తన రూపం హుందాగా కనిపించేలా లైట్ మేకప్ని ఎంచుకున్నారు. ఇక్కడ నీతా చీర చేనేత కళాకారుల అసామాన్య నైపుణ్యాన్ని చాటడమే కాకుండా సందర్భోచితంగా హుందాగా ఎలా దుస్తులు ధరించాలో చెబుతున్నట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! చివరికి విజయ్ సైతం..జ) -
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్పూర్కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
జనాల ప్రాణాలతో చెలగాటమా?.. నిలదీసిన బైకర్
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. కాసేపు ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. చేసేది లేక బస్సు డ్రైవర్ వెనక్కి తగ్గినట్లే కనిపించాడు. అయితే ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఓ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.నగరంలోని 195W రూట్కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఓ బైకర్ ధైర్యంగా బస్సును అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బైకర్, అక్కడే ఉన్న ట్రాఫిక్ వాలంటీర్ గట్టిగా నిలదీయగా, డ్రైవర్ తీవ్ర ఆగ్రహంతో వాళ్లపై అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బైకర్ను తప్పించి ముందుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ బైకర్ మాత్రం అస్సలు తగ్గలేదు. రైట్ రూట్లోనే వెళ్లాలంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆ బైకర్ను, ముందు ఉన్న ఓ కారును, ఆ రూట్లో వచ్చిపోయే వాహనాలను బస్సు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్తో భయపెట్టే ప్రయత్నం చేశాఉడ. ఆ తర్వాత బస్సు ముందుకు కదులుతూ ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళం నెలకొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. కొందరు డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ బస్సు నెంబర్ TG 10 T 1469 మీద చలాన్లు ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడం, ట్యాగులు చేయడంతో ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. తక్షణ విచారణ చేపట్టామని చెబుతూ రీ ట్వీట్లు చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. నగరంలో ఇలా ప్రవర్తించే ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఉన్నారని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వైఖరిని ప్రదర్శించరని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ బైకర్ను వెల్డన్ బ్రో అని అభినందిస్తున్నారు. హైదరాబాద్లో RTC డ్రైవర్ బరితెగింపు: రాంగ్ రూట్లో వచ్చి హల్చల్**195W రూట్కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్… pic.twitter.com/4KVWSidsop— AVM (@AvmNews7) June 13, 2026 -
నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..
ఇటీవల కాలంలో లేఆఫ్స్ ఎంత కామన్గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్ చేసి..సులభంగా మన కెరీర్ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. అప్పుడే అర్థమైంది జాబ్ పోవడం అంతం కాదు, కెరీర్లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి స్టార్టప్ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్ లైప్ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్ని ముగించాడు హిమాన్షు. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.(చదవండి: ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే.) -
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. -
ఆ అమ్మకు ఆ జర్నీ అత్యంత స్పెషల్..!
కొన్ని చిత్రాలు చెప్పే కథ ఎంతో అపురూపంగా మనసుని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చిత్ర చెప్పే కథే. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట వైరల్గా మారింది. పైగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అంటూ అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇంతకీ ఏంటా కథా చిత్రం అంటే..ఒక తల్లి ప్రయాణి ఇద్దరు కుమారుల కారణంగా అత్యంత ప్రత్యేకంగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వుతూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఒక కుమారుడు ఆమెను విమానం ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి రాగ, మరోక కుమారుడు ఆమెను పైలట్గా గమ్యస్థానానికి చేర్చడానికి వేచి ఉన్నాడు. అందుకు సంబంధించిన భావోద్వేగ క్షణాన్ని పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తన పులులతో గర్వపడే తల్లి అనే క్యాప్షన్ జోడిస్తూ ఇలా పేర్కొన్నారు. అమ్మను నా తమ్ముడికి అప్పగిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా తమ్ముడి కెప్టన్ అమన్ సక్సేనా సారథ్యంలో అమ్మ తన గూటికి తిరిగి వెళ్తోంది. అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన రెండు ఫోటోలు ఎంతో అందంగా రెండు విషయాలను వివరించాయి. మొదటి పోటో.. ఆ తల్లి తన పెద్దకొడుకు అక్షత్తో కలిసి విమానాశ్రయంలో దిగిన చిత్రం . అక్కడ అతను ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాడు. ఇక రెండో ఫోటోలో విమానం దిగిన తర్వాత దిగిన ఫోటో. అందులో ఆ విమానాన్ని నడిపిన చిన్న కొడుకు కెప్టెన్ అమన్ సక్సేనాతో దిగిన చిత్రం. ఓ అమ్మకు ఇంతకు మించిన ధైర్యం ఇంకే కావలంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తు పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Akshat (@captain_akshat) (చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా?
పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అన్నారో సినీకవి. బతికి ఉన్నప్పుడు దక్కని గౌరవం.. మనిషికి చనిపోయాకైనా దక్కుతుందని చెబుతుంటారు. కానీ, ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. మృతదేహాలపై చేసిన ఓ డాక్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు తన మాటల తీవ్రత గ్రహించిన ఆమె క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన మరణానంతరం కూడా మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు సీజల్ పవార్.. మెడికల్ కాలేజీ రోజుల్లో శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి డాక్టర్లు జోకులు వేసుకునేవాళ్లమని ఆమె మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్ ప్రణీత్ మోర్తో సహా అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాట్లాడింది అమ్మాయి కావడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే..Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026మృతదేహాల శరీర భాగాలపై వల్గర్ కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసే వారి పట్ల ఇది అవమానకరమని పలువురు అభిప్రాయపడ్డారు. సరిగ్గా.. ఇదే సమయంలో జర్మనీలో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావించారు..ష్లైడ్ అనే చిన్న పట్టణంలో ఉన్న జోహానెస్-స్టుర్మియస్ జిమ్నాసియం స్కూల్ విద్యార్థులు.. కొన్ని దశాబ్దాలుగా తమకు అనాటమీ పాఠాలు అర్థం కావడంలో సహకరించిన అస్థిపంజరానికి అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది భారత్కు చెందిన ఓ మహిళ అస్థిపంజరం కావడం.అప్పటిదాకా అదొక ప్రతీకాత్మక నమునా(ప్లాస్టిక్)గా భావించిన విద్యార్థులు.. అసలు విషయం అర్థమయ్యాక తెగ బాధపడిపోయారు. దశాబ్దాలుగా ప్రయోగశాలలో వేలాడుతున్న ఆ అస్థిపంజరం బ్రిటిష్ పాలనా కాలంలో యూరప్కు తరలించిన వేలాది భారతీయ మృతదేహాల్లో ఒకటిగా గుర్తించారు. ఆ మహిళ అస్థిపంజరానికి "నిరాన్" అని పేరు పెట్టారు. అక్కడితో వాళ్లు ఆగలేదు..ఆ మృతదేహం కేవలం బోధనా సామాగ్రి కాదని.. ఒకప్పుడు ప్రాణం ఉన్న మనిషే కదా అనుకున్నారు. స్కూల్ నిర్వాహకుల్ని ఒప్పించి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది సహకారంతో ఓ శవపేటికలో ఆ అస్తికలు ఉంచి గౌరవప్రదంగా సమాధి ఏర్పాటు చేశారు. 2022లో జరిగిందీ ఘటన.అయితే ఒకే సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఘటనలు.. "మరణించిన వారికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం?" అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి.అదొక చీకటి వ్యాపారంజర్మనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరో చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసింది. బ్రిటిష్ పాలనలో భారతదేశం నుంచి వేలాది అస్థిపంజరాలు, మృతదేహాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. పేదలు, అనాథలు, గుర్తింపు లేని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వైద్య విద్య, పరిశోధనల పేరుతో సాగిన ఈ వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగి, 1985లోనే పూర్తిగా నిషేధించబడింది.ఆ గౌరవం ఎక్కడ?..ఈ చర్చ మధ్య మరో విషాద ఘటనను కూడా చాలామంది గుర్తుచేస్తున్నారు. ఒడిశాలో తన సోదరి మరణాన్ని నిరూపించడానికి బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో.. ఓ వ్యక్తి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే.. ఆస్పత్రి మార్చురీల్లో నెలల తరబడి గుర్తింపు లేకుండా ఉండిపోయే మృతదేహాలు, అంబులెన్స్ లేక భుజాలపై మృతదేహాలను మోసుకెళ్లే పేద కుటుంబాలు, శరీరదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు.. ఈ ఘటనలు అన్నీ ఒకే ప్రశ్నను మిగులుస్తున్నాయి. మనం నిజంగా మరణించిన వారిని గౌరవిస్తున్నామా? లేక వారి గుర్తింపును, మానవత్వాన్ని కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామా?.. జీవించి ఉన్న సమాజం, మరణించినవారికి ఇచ్చే గౌరవంలోనే తన నాగరికతను ప్రతిబింబిస్తుంది. ఆ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ మానవత్వం కూడా మెల్లగా మాయమవుతుంది. -
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్టాపిక్గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్లైన్లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!) -
కామెడీ షోలో లేడీ డాక్టర్ వల్గర్ కామెంట్లు
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026 -
10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
కార్పొరేట్ కంపెనీల్లో ఓ పదిరోజులు సెలవు తీసుకోవడం, వెకేషన్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరిపోవడం చాలా కామన్. కానీ వచ్చిన వెంటనే ఆఫీస్ పనిలో పడిపోవడం ఎందుకు, ఇంకో రోజు రెస్ట్ తీసుకొని హ్యాపీగా రా అని మేనేజర్ చెప్పడం ఎక్కడైనా విన్నారా? వినలేదు కదా. అలా గొప్పమనసు చాటుకున్న ఒక మేనేజర్ను బాస్ విత్ హార్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. తన అనుభవాన్ని ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాని ప్రకారం 10 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తిరిగి వచ్చిన సదరు ఉద్యోగి, తాను మరుసటి రోజు నుండి విధుల్లో చేరుతున్నట్లు మెసేజ్ చేశాడు. దానికి ఆయన స్పందిస్తే.. వెరీ గుడ్.. రేపు కూడా సెలవు తీసుకో, కాస్త కుదురుకో. బుధవారం నుంచి ఆఫీసుకు రావచ్చులే అని రిప్లై రావడంతో ఆశ్యర్యం పోయాడు. అందుకే తన సంతోషాన్ని నెటిజనులతో పంచకున్నాడు. తన మేనేజర్తో వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను రెడ్డిట్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎంతో కఠినమైన వాతావరణంలో పనిచేసి వచ్చిన తనకు, మేనేజర్ చేసిన ఈ చిన్న సాయం ఎంతో సంతోషాన్ని, సంస్థలో తన విలువను తెలియజేసిందని పేర్కొన్నాడు.ఆశ్చర్యపోతున్న నెటిజన్లుసాధారణంగా కార్పొరేట్ రంగంలో ఇంతటి దయాగుణాన్ని ఊహించలేమని, ఇది నమ్మశక్యంగా లేదని పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. మానవీయ కోణంలో ఆలోచించే లీడర్షిప్కు ఇదొ అరుదైన ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్ఇదే మెసేజ్ మా బాస్ పెడితే సెటైరిక్గా అంటున్నాడేమో అని భయపడతా, ఎందుకంటే అంత టాక్సిక్ వాతావరణం ఉంటుంది అని ఒకరు, మరొకరైతే ఉద్యోగం నుంచి తీసేయడానికి ఇదొక సంకేతమేమోనని భయపడతా అని వెల్లడించారు."ఒక రోజు సెలవు అడిగితేనే మా మేనేజర్ తన సొంత ఆస్తి అడిగినట్లు ముఖం పెడతాడు" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నువ్వు చాలా లక్కీ బ్రో అంటూ మేనేజర్పై ప్రశంసల జల్లు కురిసింది.ఇదీ చదవండి : 51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
‘ఈ సిటీలో రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నా చాలడం లేదు’
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?రెడ్డిట్లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారంబట్టలు, వాచ్లు, పర్ఫ్యూమ్లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.“సిప్ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలుఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది. -
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు) -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!
భారత సైన్యానికి చెందిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్లో ప్రపోజ్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్కు సపోర్ట్ చేశారు. అయితే ఆ రొమాంటిక్ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.కెప్టెన్ భరత్ భరద్వాజ్ భారత సైన్యంలో యంగ్ ఆర్మీ ఏవియేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్లో ఫ్రంట్లైన్ సర్వీస్కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్కు కూడా దారితీసింది.భరద్వాజ్ ప్రపోజల్ కోసం ఉపయోగించిన హెలికాప్టర్ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పటియల్ సంస్థ డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 1970ల నుంచి భారత్లో తయారు చేస్తోంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్లోని టాంగ్స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్ ‘చేతక్’ హెలికాప్టర్ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్ కాఫిన్స్” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ జీఎస్ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒకవైపు వైరల్ ప్రపోజల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్ నుంచి లడఖ్ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్..!కట్చేస్తే..
గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్ రాజీనామా లెటర్ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్గా రిజైన్ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్ని తిర్కస్కరించాడని చెప్పారు. అప్పుడు వెంటనే అంకిత్ పాండే డోంట్.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు. ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్ బాక్స్తో ఆ అకౌంటెంట్ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్ పంచిపెట్టాడు. పైగా జాబ్లో మళ్లా జాయిన్ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్ అభ్యర్థించాడని అన్నారు. అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్ పాండే పోస్ట్లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!) -
హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్,స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను ఆమె పంచుకున్నారు. తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది. అనుష్కకు సపోర్ట్గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.నమిత థాపర్తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్ను అనుష్క ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆరోగ్యం , హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని, డా. రాజన్ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది. దీంతో నెట్టింట సందడి మొదలైంది.Virat Kohli’s wife, Anushka Sharma is recommending homeopathy to Indians.Fraud babas are not enough, she is now promoting unscientific fraud medicine to IndiansGive them enough money and they might one day tell people, “Just visit Premanand Maharaj to cure all your diseases.” pic.twitter.com/5L6y8Wcxa6— Mohit Chauhan (@mohitlaws) June 2, 2026దుమ్మెత్తిపోసిన నెటిజన్లుఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడిఅనుష్కకు మద్దతుగా మరికొందరు మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. నన్ను ట్రోల్ చేశారుదీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం. హోమియోపతి డాక్టర్ని అని చెప్తేనే ఎక్స్లో తనను చాలా ట్రోల్ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం! -
ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..!
చాలా సక్సెస్ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.ముంబైలో జన్మించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్ మీడియా పోస్ట్ని షేర్ చేస్తూ..తన కథను పంచుకున్నారు. సంతోష్ యాదవ్ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ (GDE), గిట్హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. I lived in slum in Mumbai for 29 years, decided to move after my daughter was born, next week we will be moving to multi storied apartment on rent, pic.twitter.com/QIgX3igafc— Santosh Yadav (@SantoshYadavDev) August 21, 2020 తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. తన క్లాస్మేట్ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుదామంలే కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ్నారు. కోడింగ్ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు 50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. అలా చివరకు కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్, పీఎఫ్ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్ కోసం గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్గా అధికారికంగా ప్రకటించబడ్డారు. ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్ చేయడంతో భారతదేశపు తొలి గిట్హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫెల్ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.We celebrated our 17th wedding anniversary together in Hamburg, this is the first time we decided to spend it with Hiya, she will be 14 soon.This weekend was all about us 😅.Thank you for everything ❣️ and staying by my side, when we married I was not able to afford anything,… pic.twitter.com/EkmgWLKk7N— Santosh Yadav (@SantoshYadavDev) May 31, 2026 (చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..) -
ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
బిహార్లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది. ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్ రాహుల్ని వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్గా మారాడు. రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ సర్జరీ కోసం నయన్శ్రీ రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది. అన్నీ సవ్యంగా ముగిసిన తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీపూర్లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.कल तक बहन, आज जीवनसाथी ! बिहार के जमुई में एक BPSC शिक्षिका ने अपनी फुफेरी बहन से शादी कर ली। शादी से पहले बहन ने जेंडर ट्रांजिशन कराया और दोनों ने हिंदू रीति-रिवाज से विवाह किया। मामला चर्चा का विषय बना हुआ है। pic.twitter.com/xSv0NNMsFD— Yash Ahmad (@YashAhmad8) June 2, 2026 ఐదేళ్ల లవ్నయన్శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్/రాఖీ తండ్రి కోల్కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.కుటుంబంలో గొడవలురాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు. -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..
చదవాలన్న కోరిక బలంగా ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. అయితే ఓ మహిళ కుటుంబ బాధ్యతలతో తలమునకలులవ్వుతూ ఐదుపదుల వయసులో చదవాలనుకోవడం అంటే.. అంత ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత సులువు కూడా కాదు. కానీ ఓ మహిళా దాన్ని సాధ్యం చేసి చూపించింది అది కూడా 52 ఏళ్ల వయసులో. కష్టపడి చదవడానికి భయపడే యువతరానికి ఆమె కథ ఓ స్ఫూర్తి.గుజరాత్కు చెందిన, కామర్స్ గ్రాడ్యుయేట్ అనితా కప్డి 23 ఏళ్ల పాటు విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బోధించారు. అయితే, ఆమెకు గణితం, అకౌంటెన్సీలో మంచి అభిరుచి, నైపుణ్యం ఉన్నాయామెకు. పూర్తికాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఎంకామ్, బీఎడ్ పూర్తి చేశారామె. అలాగే ఆమెకు సీఏ చేయాలనే జీవితకాల డ్రీమ్ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే 48 ఏళ్ల వయసులో, పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు ఎలాగైనా సీఏ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. పైగా ఆ సీఏ డిగ్రీని తన సీఏ తండ్రి (ఒక కంపెనీ సెక్రటరీ) 75వ పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇవ్వాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. అలా ఆమె 2012లో, ఆమె ICAI డైరెక్ట్ ఎంట్రీ మార్గం ద్వారా సీఏ(CA) కోసం నమోదు చేసుకున్నారామె. అలా అని హాయిగా కూర్చొని చదువుకునే తీరిక మాత్రం లేదు. ఆమె చదవుకోవాలనే జర్నీ ఎంతో సవాలుతో మొదలైంది. ఒక పక్క కుమార్తె వివాహ సన్నహాలు, మరోవైపు కుమారుడి బోర్డు పరీక్షలకు మద్దతివ్వడం, వంటి కుటుంబ బాధ్యతలతో సతమతమవ్వుతూనే సీఏకి ప్రిపరయ్యారామె. పైగా కోచింగ్ లేకుండా సీఏ రెండో దశ ఐపీసీసీ(IPCC)ని క్లియర్ చేసింది. ఆ తర్వాత కూడా సరిగ్గా చదువుకునే అవకాశం చిక్కలేదు అనితకు. సరిగ్గా సీఏ ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవ్వుతుండగా అత్తగారిని కోల్పోవడం, ఆ బంధువుల హడావిడి మధ్య అలానే నిశబ్దంగా చదువు కొనసాగించి అనుకున్నట్లుగా క్లియర్ చేసి సీఏ అయ్యారామె. అలాగే అనిత తను కోరుకున్నట్లుగానే తండ్రి 75వ పుట్టినరోజు నాడు సీఏ డిగ్రీని గిఫ్ట్గా ఇచ్చింది. అలా అనిత 52 ఏళ్ల వయసులో సీఏ అయ్యింది. (చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపునులు సైతం..) -
మా ఐటీ కంపెనీ ఎందుకిలా చేసింది?
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగులను వదిలించుకనేందుకు కంపెనీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ సంస్థ తీసుకున్న “వర్క్ ఫ్రమ్ ఆఫీస్” (WFO) నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ టెక్కీ, ఐదు రోజుల తప్పనిసరి కార్యాలయ హాజరు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిమోట్ వర్క్ విధానాన్ని అకస్మాత్తుగా ముగించడం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావం చూపుతుందని అతడు పేర్కొన్నాడు.దాదాపు పదేళ్ల అనుభవం కలిగిన ఫుల్-స్టాక్ ఇంజనీర్ అయిన ఆ ఉద్యోగి, కంపెనీ గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతి ఇవ్వడంతో తాను స్వగ్రామంలోనే స్థిరపడ్డానని వెల్లడించాడు. అయితే ఇటీవల డిసెంబర్ నుంచి ప్రతి ఉద్యోగి వారంలో ఐదు రోజులు కార్యాలయానికి హాజరుకావాలని యాజమాన్యం ఆదేశించిందని తెలిపాడు.రిమోట్ విధానంలో పనిచేసినా ప్రాజెక్టుల డెలివరీ, జట్టు సమన్వయం, పనితీరు ఎక్కడా దెబ్బతినలేదని అతడు వివరించాడు. అయినప్పటికీ “టీమ్ కొలాబరేషన్” పేరుతో కార్యాలయానికి రావాలని ఒత్తిడి తెస్తుండటం అసలు అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తాడు.అమ్మో మళ్లీ బెంగళూరుకా?కోవిడ్కు ముందు బెంగళూరులో నివసించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న టెక్కీ, అక్కడి ట్రాఫిక్, అధిక అద్దెలు, గంటల కొద్దీ ప్రయాణాలు, పెరిగిన జీవన వ్యయాలు మళ్లీ అదే పరిస్థితుల్లోకి వెళ్లాలనే ఆలోచనకే నిరాశ కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు. మంచి జీతం ఉన్నప్పటికీ నగర జీవితం, అధిక వ్యయాల కారణంగా సేవింగ్స్ అనేవి దాదాపు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.ఇంటినుంచే ప్రశాంతంగా, సమర్థవంతంగా పని చేసే వాతావరణాన్ని తాను ఏర్పరుచుకున్నానని, అనవసర సమావేశాలు, ఫార్మాలిటీ చర్చలు లేకుండా పని మరింత ఫోకస్తో సాగుతుందని తెలిపాడు. పూర్తిగా డిజిటల్ విధానంలో నడిచే ఉద్యోగానికి కార్యాలయ హాజరు తప్పనిసరి చేయడం వెనుక అసలు ఉద్దేశం ఉత్పాదకత కాదని, ఉద్యోగులపై నియంత్రణ సాధించడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.శాశ్వతంగా ఇంటికి పంపేందుకే..ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొన్ని సంస్థలు ప్రత్యక్షంగా ఉద్యోగులను తొలగించకుండా, ఇలాంటి కఠిన WFO విధానాల ద్వారా ఉద్యోగులే స్వయంగా రాజీనామా చేసే పరిస్థితి సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు బెంగళూరులో ట్రాఫిక్, జీవన వ్యయాలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.“ఉదయం గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన తర్వాత ఉద్యోగి కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేయగలడా?” అంటూ ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది.కోవిడ్ తర్వాత ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి బలపడగా, ఇప్పుడు అనేక కంపెనీలు మళ్లీ కార్యాలయ హాజరుపై దృష్టి పెట్టడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఐటీ రంగ ఉద్యోగ విధానాలపై మరింత చర్చకు దారి తీసే అవకాశముంది.Mandatory 5-Day Office Feels Like a Massive Step Backby u/web_dev__ in developersIndia -
మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!
ప్రతి వ్యక్తి కెరీర్లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్మేట్ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో వికాస్..తన ఫ్లాట్మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్ పడి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక నాల్గో ప్రయత్నంలో లవ్ బ్రేకప్ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్నెస్తో ప్రిపేర్ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. అతడు ఆన్లైన్ సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.There is a guy in my flat who completed his https://t.co/Ws1j7hoGgc in Chemical Engineering from IIT Madras in 2012. After graduation, he got a campus placement offer of 10 LPA, but he rejected it and started preparing for UPSC. He belongs to the general category.In the first…— Vikas Alwys (@VikasAlwys) May 27, 2026 (చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..) -
అమ్మో లక్ష! బెంగళూరు ఇంటి అద్దె వైరల్
బెంగళూరు ఐటీ కారిడార్లో ఇండ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగుల మాట దేవుడెరుగు... నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే టెక్కీలు సైతం ఇక్కడి అద్దెలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలో ఓ 3బీహెచ్కే (3BHK) ఫ్లాట్కు సంబంధించిన అద్దె వివరాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, నగరంలో నివాస వ్యయంపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది.రూ. 1.1 లక్షల అద్దె.. 4 లక్షల డిపాజిట్!నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ ‘ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ పార్క్’కు అత్యంత సమీపంలో, డోమ్లూర్ - ఇందిరానగర్ పరిసరాల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ అద్దెకు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. సుమారు 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ సెమీ-ఫర్నిష్డ్ కార్నర్ ఫ్లాట్ నెలవారీ అద్దె అక్షరాలా రూ. 1.1 లక్షలు. ఇది చాలదన్నట్టు దీనికి రూ. 4 లక్షల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు, ప్రతి నెలా అదనంగా రూ. 6,000 మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెర్రస్, పూజా గది, మాడ్యులర్ కిచెన్, ఉచిత స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ ఫ్లాట్లో ఉన్నాయట.వామ్మో అంటున్న నెటిజన్లుఈ అద్దె వివరాల స్క్రీన్షాట్లు నెట్టింట వైరల్ కావడంతో ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బెంగళూరులో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె రూ. 1.1 లక్షలా? నిజానికి ఇది ఒక సగటు ఉద్యోగి నెలవారీ జీతం" అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతాన్నంతా అద్దెలకే తగలేయాలి, లేదా ట్రాఫిక్లో గంటల తరబడి నరకం చూడాలి.. ఐటీ నిపుణుల పరిస్థితి ‘ముందు నయ్యం.. వెనుక గొయ్యి’లా తయారైందని పలువురు వాపోతున్నారు.ఇటువంటి పిచ్చి అద్దెలను డిమాండ్ చేసినా చెల్లించేందుకు కొందరు సిద్ధపడటం వల్లే యజమానులు మరింతగా రెచ్చిపోతున్నారని, ఒకే ఫ్లాట్ను నలుగురైదుగురు కలిసి పంచుకోవడం వల్లే ఈ ధరలు అదుపు తప్పాయనే విమర్శలు వస్తున్నాయి.అయితే, ఈ స్థాయి అద్దె ధరలు మార్కెట్ పరంగా సమర్థనీయమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ముంబై లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పోల్చదగ్గ ఇందిరానగర్ వంటి లొకేషన్లలో ఈ మాత్రం రేట్లు ఉండటం సహజమేనని వాదిస్తున్నారు. ఇక్కడ నివసించే వారి వార్షిక ఆదాయాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల పైమాటేనని గుర్తు చేస్తున్నారు.మరోవైపు రియల్ ఎస్టేట్ సమీకరణాలను తెరపైకి తెస్తూ.. "ప్రస్తుతం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే అద్దె, కనీసం బ్యాంక్ వడ్డీ రేటులో సగం కూడా ఉండదు. అలాంటప్పుడు యజమానులు అద్దెలు పెంచడంలో తప్పు లేదు" అని ఇన్వెస్టర్ల కోణాన్ని కొందరు విశ్లేషించారు.మొత్తానికి బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గృహాల కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐటీ కారిడార్లలో అద్దెలు సామాన్యుల నియంత్రణ తప్పుతున్నాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి! -
ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..
ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్ ప్లాన్ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.రేమండ్ జెంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్ రెండేళ్లపాటు డల్లాస్లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్లు, స్టాక్లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు. అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు. అయితే జెంగ్ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్ స్పెడ్షీట్ని మెయింటైన్ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్ చేసుకుంటాడట. అంటే జాంగ్ అనుకున్న ప్రకారం.. ప్లాన్ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్ స్ట్రాటజీ.(చదవండి: టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!) -
‘కాక్రోచ్’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!
క్విక్ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్ పవర్పాయింట్ ప్రజంటేషన్గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్ఆర్ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది.గుర్గావ్కు చెందిన అమెజాన్ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన.ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్ కాల్?” అనే మాటను అధికారికంగా వర్క్ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్లు ఉన్నాయి.ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్ఆర్ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో లింక్టిన్, ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు ఈ అంశాలు తమ రోజువారీ అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని కామెంట్లు చేశారు. కొందరు అయితే ఇది జోక్ అయినప్పటికీ “చాలా నిజంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.అయితే ఆశ్చర్యకరంగా.. “Corporate Majdoor Janta Party” అనే పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రత్యక్షమవ్వడం ఈ ట్రెండ్ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆ సైట్లో జాయిన్ ద మూమెంట్ అనే ఆహ్వానం ఉండటంతో ఇది సాధారణ పోస్ట్ నుంచి ఒక పెద్ద ఇంటర్నెట్ క్యాంపెయిన్గా మారినట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ LinkedIn వ్యంగ్య పోస్ట్గా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని హాస్యరూపంలో బయటపెడుతున్న ఒక వైరల్ సోషల్ మీడియా ఉద్యమంగా మార్చేయడం గమనార్హం.అది ఇది కాదు.. ఇదిలా ఉంటే.. ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. కార్పొరేట్ జనతా పార్టీ (Corporate Janata Party - CJP) పేరుతో కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్లు, వేధింపులు, తక్కువ హైక్లు, టాక్సిక్ వర్క్ కల్చర్లపై నిరసనగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించారాయన. అయితే దీనికంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. లేఆఫ్ ఇన్సూరెన్స్: ఉద్యోగం నుండి తొలగిస్తే ప్రభుత్వాలు లేదంటే కంపెనీలు భద్రత కల్పించడం. మూన్లైటింగ్ (Moonlighting): ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతి. పని వేళలు: కార్యాలయ వేళల తర్వాత ఫోన్ కాల్స్, మెయిల్స్ బంద్ చేయడం. జీతాల పెంపు: ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతంలో హైక్ ఇవ్వడం.. ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక వర్క్ఫోర్స్ ఉద్యమంగా వైరల్ అయింది. అయితే, కొన్ని ప్లాట్ఫారమ్లలో దీని ఖాతాలు బ్యాన్ కావడంతో ఉద్యోగుల సంఘీభావంతో ఇది మరింత చర్చనీయాంశమైంది కూడా. -
రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య..
కొన్ని కథలు డేరింగ్ నిర్ణయాలు ఎలా తెసుకోవాలో తెలియజేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి చాలా కంగారుపడిపోతాం. కానీ మనలాంటి వారెందరో అదే బాటలో పయనించి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కథలు వింటే ధైర్యంగా అడుగు వేసే ప్రయత్నం చేయడమే కాదు..ఏనాటికైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంతో తనతో ఎలా ప్రవర్తించిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అశ్వనీ కుమార్ అనే పారిశ్రామిక వేత్త 40 ఏళ్ల వయసులో ఏకంగా రూ. 300 కోట్ల కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేసున్నాడు. అధికజీతం, విదేశీ పర్యటను, ఏసీ క్యాబిన్లతో బిందాస్గా సాగిపోతోంది లైఫ్. ఏ చీకు చింత లేదు అయినా సరే మనోడు మానసిక ప్రశాంతతే ప్రధానం అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తత్ క్షణమే తన తల్లి తనతో మాట్లాడటే మానేసిందని, భార్య తనకు పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా చూసిన చూపుని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. ఆయన సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. అనుకున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడిగా మారి విజయవంతంగా సొంతంగా బ్రాండ్ని నిర్మించే రేంజ్కు చేరుకున్నాడు. సొంతంగా వ్యాపారం లేదా ఇంకేదైనా ప్రారంభించాలనుకునేవారికి తన కథ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నా అంటూ తన వ్యక్తిగత సాహసోపేతమైన జర్నీ గురించి వివరించాడు. నెటిజన్లు ఇది నిజంగా ప్రేరణకు పరాకాష్ట అని కొందరు, మరికొంతమంది మీ కథ అసలైన స్ఫూర్తి అంటూ అశ్విని కుమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashwani kumar (@thedhandhaguru) (చదవండి: వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..) -
రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి
అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం.. “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. -
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026 -
చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..!
మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికీ ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. దాంతో ఒక్కసారిగా యుజెన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్ సకోల్స్కీ అనే అమెరికన్ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూల్లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్ను చూసి అబ్బురపడ్డారు. కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా? లేక నిరర్థకం అవుతుందో? తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన. కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్) -
ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ : ఆ ముగ్గురి సెల్ఫీ వైరల్
లదాఖ్లోని లేహ్ సమీపంలో గల తంగ్స్తే ప్రాంతంలో మే 20న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుండి ముగ్గురు భారత ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. మే 20న జరిగిన ఈ ఘటనను అధికారులు ఈ ఉదయం ధృవీకరించారు.అయితే ప్రమాదం తర్వాత మేజర్ జనరల్ మెహతా మిగతా ఇద్దరు అధికారులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.చీతా రకానికి చెందిన ఆ హెలికాప్టర్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్, 3వ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ను నడుపుతుండగా, మేజర్ జనరల్ మెహతా ప్రయాణికుడిగా అందులో ఉన్నారని ఒక సైనికాధికారి తెలిపారు. ఈ ప్రమాదం సందర్భంగా వీటి సెల్పీ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.ఇదీ చదవండి: చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్ : హై ప్రొటీన్ కోసం ఏది బెటర్తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ పక్కన అధికారులు రాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యం ఆ చిత్రంలో కనిపిస్తోంది. అక్కడి కఠినమైన పర్వత ప్రాంతం కాలం చెల్లిన చీతా హెలికాప్టర్ల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, వారు ప్రాణాలతో బయటపడటం ఒక "అద్భుతం" అని అభివర్ణించారు.కాగా ఈ ప్రమాదంపై అధికారిక విచారణకు ఆదేశించారు. అలాగే, 1970లలో ప్రవేశపెట్టిన చీతా హెలికాప్టర్ల భద్రతపై ఈ సంఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. 1984లో సియాచిన్ గ్లేసియర్లో పాకిస్తాన్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన 'ఆపరేషన్ మేఘదూత్' లో ఈ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇటీవల కాలంలో జరిగిన పలు ప్రమాదాల వల్ల అనేకమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం ఆర్మీ ఈ చీతా హెలికాప్టర్లను దశలవారీగా తొలగిస్తూ, వాటి స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్వదేశీంగా తయారు చేసిన 'లైట్ యుటిలిటీ హెలికాప్టర్' (LUH) ను ప్రవేశపెడుతోంది. ఆర్మీ ఇప్పటికే ఆరు పరిమిత సిరీస్ ప్రొడక్షన్ LUHల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ హెలికాప్టర్లు గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు, 6.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు మరియు 350 కిలోమీటర్ల కార్యాచరణ పరిధిని కలిగి ఉంటాయి. ఐదుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న చీతా హెలికాప్టర్.. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో పనిచేయగల ప్రపంచంలోని అత్యుత్తమ హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, తాజా ప్రమాదం పాతబడుతున్న హెలికాప్టర్ల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ! -
ట్రంప్లా కనిపించిన గేదె.. పాపం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్గంజ్లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. బక్రీద్ సందర్భంగా ట్రంప్ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్ మృధా మాట్లాడుతూ.. ఈద్ అల్ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు.తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్ స్టార్గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్ అల్ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్మీడియాలో వైరల్ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..!:
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ చేరిపోయారు. ఏకంగా తమ దేశీయలు భారత్నుంచి ఈ విలవలు నేర్చుకోవాలంటూ ఓ లిస్ట్ చెప్పారామె. ఏంటా విలువలంటే..ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న లిథువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అందులో మోనికా కుంజేశ్వరి దాసి భారత్లో నివశించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాలు గురించి మాట్లాడారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టిపారేస్తారు. కానీ భారత్లోని చిన్న చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల్లో ఉన్న విలువలు యూరప్ చాలా వేగంగా కోల్పోతోందని అన్నారామె. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ ఇదే ముమ్మాటికీ నిజం అని అంటున్నారామె. "ఏళ్ల తరబడి భారత్లో నివసించాక తెలుసొచ్చిందేంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి నుంచి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి" అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్లో ఆ విలువల జాబితాను పంచుకున్నారామెయూరోపియన్లు తప్పక నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు..ఆతిథ్యం: 'అతిథి దేవో భవ' అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు దాసి. దీని అర్థం 'అతిథి దేవుడితో సమానం'. భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారామె.కమ్యూనిటీ: యూరప్లో కమ్యూనిటీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువ ఇస్తారని దాసి అన్నారు. "ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగుపొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే, సహాయం చేయడానికి సాధారణంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారామె.ఆహారం, వంట: ఆహారం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడమే సర్వసాధారణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఇష్టపడతారు.పరిశుభ్రత: భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారని ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, పైగా చుట్టపక్కల వారిపట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామె.ఆనందం: భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక కారణం ఏదీ అవసరం లేదని ఆ లిథువేనియన్ మహిళ నొక్కి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్ వేని, యూరప్ అది పూర్తిగా మర్చిపోయి.. గంభీరంగా అయిపోయిందని అన్నారు. కాగా, నెటిజన్లు ఆమె పోస్టుని చూసి భారతదేశంలోని సానుకూల అంశాలను అందంగా చెప్పినందుకు ధన్యవాదాలు. మా విలువల పట్ల మీ సూక్ష్మమైన పరీశీలనకు గౌరవాభినందనలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Monika Kunjeswari Dasi (@monika_kunjeswari)(చదవండి: -
ఉద్యోగం పోయినా సంబరమే..!
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్ అనే యువతి ఇటీవల లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్ వర్క్తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే.. View this post on Instagram A post shared by Asha | Maximalist Fashion (@ashamode_)ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది. -
'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా?
మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. Twisha's death is proof that many Indian parents think their daughter is a commodity that is delivered to the in-laws and has no return policy. The girl can die at the In-laws. That is only honorable after Kanya Daan. Ok?— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2026 అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె. View this post on Instagram A post shared by Bollywood Bubble (@bollywoodbubble) (చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..) -
ఎడ్యుకేషన్పై ఐఏఎస్ అధికారి ఆసక్తికర పోస్ట్..!
మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్లో ఏం రాశారంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..) -
ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..
ఒక్కోసారి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేం. మనం అంతగా పట్టించుకోకపోయినా..ఎవరో అపరిచిత వ్యక్తలు ద్వారా అయినా అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. మనం మర్చిపోయినా..రేయి ఈ సొమ్ము నీదే రా అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే యూఎస్లో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన వ్యక్తి గతేడాది మే నెలలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ విషయాన్ని ఒక ఏడాది పాటు పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఒక రోజు తరుచుగా వెళ్లే గ్యాస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడ ఒక లాటరీ టికెట్ జాక్పాట్ గెలుచుకున్నా..ఎవరు క్లైయిమ్ చేసుకోలేదని, గడవు ముగియనుందంటూ ఓ ప్రకటన కనిపించింది అది ఈ వ్యక్తి కంట పడింది. దాని గురించి అక్కడి లాటరీ అధికారులను ఆరా తీయగా. అది పిక్ -6 లాటరీ టికెట్ అని రెగ్యులర్ కస్టమర్లు మాత్రమే దీన్ని ఎంచుకుంటారని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఆ విషయం ఈ వ్యక్తికి గుర్తొచ్చి వెంటనే ఇంట్లోని ప్రతి అణువు గాలించాడు. అప్పుడే పాత ఫ్యాంటు జేబులో నలిగిపోయిన లాటరీ టికెట్ అతడి కంటపడింది. జాక్పాట్ గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్తో సరిపోల్చుకుంటే ఆ టికెట్ అదే అని తేలడంతో ఏకంగా రూ. 57 కోట్లు డబ్బు దక్కించుకున్నాడు. ఒక వేళ్ల తేలిగ్గా తీసుకుంటే అంత భారీ సోమ్ము త్రటిలో చేజారిపోయేది. ఇది మాములు లక్కు కాదు కదా..!. అదృష్టం ఉంటే అది ఎలాగైన మన తలుపు తడుతుందంటే ఇదే కదూ.!. చాలామంది విజేతలు ఇలానే తమ లాటరీ టికెట్ల గురించి మర్చిపోవడం వల్ల చాలామటుకు అలానే క్లైయిమ్ చేసుకోకుండా ఉండిపోతాయని చెబుతున్నారు అధికారులు.(చదవండి: బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!) -
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్ని రిస్క్లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్ని రిస్క్లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..) -
కేన్స్లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్తో కేన్స్లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !) -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్షీట్లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్గా ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు) -
బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో ఊహించని సంఘటనలను ముందే పసిగట్టిన బల్గేరియా అంధురాలు, ‘నొస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరుగాంచిన బాబా వంగ పేరు ఇప్పుడు వార్తల్లో మరోమారు మార్మోగుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె వెల్లడించిన కొన్ని భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు తెరతీస్తున్నాయి.అంతుచిక్కని రోగాల ముప్పుప్రిన్సెస్ డయానా మరణం నుండి కోవిడ్-19 మహమ్మారి వరకు అనేక ప్రధాన ప్రపంచ పరిణామాలను కచ్చితంగా అంచనా వేసిన ఘనత బాబా వంగకు దక్కుతుంది. కొందరు నెటిజన్లు తాజాగా ఉదహరిస్తున్న వివరాల ప్రకారం.. 2025 మరియు 2027 మధ్యకాలంలో మానవాళి ‘ పూర్తిగా అంతుచిక్కని వైద్య పరిస్థితులను’ ఎదుర్కొంటుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ, ఎలాంటి మందులు లేదా చికిత్సకు లొంగకుండా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకరమైన వైరస్లు దాడి చేస్తాయని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు.హంటా, నోరో వైరస్లతో లింక్?బాబా వంగ హెచ్చరించిన ఈ ‘కల్లోల సమయం’ ఇప్పుడు నిజంగానే మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అకస్మాత్తుగా వెలుగుచూస్తున్న ‘హంటా వైరస్’ ‘నోరో వైరస్’ వ్యాప్తిని ప్రజలు ఆమె అంచనాలతో ముడిపెడుతున్నారు. అప్పట్లో ఆమె చెప్పిన చికిత్సకు లొంగని భయంకరమైన వైరస్లు ఇవేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.నిజానిజాలు ఏంటి?అయితే నెట్టింట పెరుగుతున్న ఈ తీవ్ర ఆందోళనల మధ్య ఒక ముఖ్యమైన వాస్తవాన్ని అందరూ గమనించాలి. బాబా వంగ తన భవిష్యవాణిలో ఎక్కడా ‘హంటా వైరస్’ లేదా ‘నోరో వైరస్’ పేర్లను నిర్దిష్టంగా ప్రస్తావించినట్లు ఎలాంటి అధికారిక లేదా ప్రామాణిక రికార్డులు లేవు. ఆగస్టు 11, 1996న బల్గేరియాలో మరణించిన ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలకు, ప్రస్తుత వ్యాధుల వ్యాప్తికి ప్రజలే స్వయంగా పోలికలు తెస్తున్నారు తప్ప, ఇందులో కచ్చితమైన ఆధారాలు లేవని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిరియా టు గల్ఫ్.. ఇండియా మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
వచ్చే 6 నెలలు ఎలా ఉంటుందంటే.. భయంకర ఆందోళన
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే నెలల్లో వ్యాపార రంగాలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక ప్రముఖ టెక్స్టైల్ ఫౌండర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, కంపెనీలలో సామూహిక లేఆఫ్లపై ఆయన చేసిన హెచ్చరికలు నెట్టింట వైరల్గా మారాయి.‘రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకం’టెక్స్టైల్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అక్షయ్ జైన్ తన 'ఎక్స్' పోస్ట్లో వ్యాపారాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతిని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల రాబోయే ఆరు నెలలు కంపెనీలకు అత్యంత బాధాకరంగా మారబోతున్నాయి. ఖర్చులు గనుక ఇదే వేగంతో పెరిగితే, పలు రంగాలలో సామూహిక ఉద్యోగాల తొలగింపులతో పాటు వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది," అని జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా తక్కువ మార్జిన్లతో నడిచే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ముడి పదార్థాల ధరల పెరుగుదల "అస్సలు భరించలేనిది" గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మందగమనం రెండేళ్లు ఉండొచ్చుఅక్షయ్ జైన్ పోస్ట్పై స్పందిస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఆర్థిక మందగమనం కేవలం ఆరు నెలలతో ముగిసేది కాదని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఒక వినియోగదారుడు అంచనా వేశారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయం, కార్మికుల కొరత, మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ తగ్గడం వంటి అంశాలు యువ పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని సవాలును విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రభావం కేవలం టెక్స్టైల్ రంగానికే పరిమితం కాదని.. వ్యవసాయం, ఉత్పాదక రంగం, ఐటీ, ముడిసరుకు ఆధారిత పరిశ్రమలన్నింటిపై పడుతుందని మరో నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, ఆ ప్రభావాన్ని తట్టుకోవడం భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు.ధరలు పెంచలేక.. నష్టాలు భరించలేక..ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, కస్టమర్ల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు 20% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, మార్కెట్లో డిమాండ్ పడిపోతుందనే భయంతో ఉత్పత్తుల ధరలను పెంచలేకపోతున్నామని ఒక పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో వ్యాపారాన్ని విస్తరించడం అసాధ్యంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి!ట్రావెల్ ఎసెన్షియల్స్ రంగానికి చెందిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రయాణాలు తగ్గడం వల్ల తమ అమ్మకాలు అప్పుడే పడిపోయాయని తెలిపారు. "కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాస్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి మా కంపెనీని గట్టెక్కించాం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా, మరింత సవాలుగా ఉంది. ఇప్పుడు మాకు పెద్ద ఫ్యాక్టరీ సెటప్, వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి అనిశ్చిత సమయంలో ఏ వస్తువులను తయారు చేయాలో, వేటిని విక్రయించాలో అర్థం కావడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేరుగా సామాన్య వ్యాపారాలపై చూపిస్తున్న ప్రభావంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.The next 6 months are going to be very painful for businesses due to rising costs. We might be looking at mass layoffs and companies closing down in many sectors. Current rates of raw materials due to war are absolutely unsustainable.— Akshay G Jain (@Ajain112) May 16, 2026 -
ఆ ఒక్క మాటతో.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు
జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు.. 2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్ఆర్ నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ.. అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్చుప్గా వెళ్లిపోయారట. ఈ సంఘటన రెడ్డిట్లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్బ్యాక్లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!. -
బెంగళూరు టెక్కీ ఐడియాపై నెటిజన్ల డిబేట్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో జీవన వ్యయం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, నిత్యావసరాలు.. ఇలా చాలా వాటికి అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ ఉద్యోగాలు చేసే వారి కోసం ఓ బెంగళూరు యువకుడు కొత్త ఆలోచన ప్రతిపాదించాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. ఉచిత వైఫై, ఫుల్ ఏసీ, మొబైల్/ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లతో మాల్స్లోనే రోజంతా ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకోవచ్చంటూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది.సీక్రెట్ స్పాట్స్ఇన్స్టాగ్రామ్లో అమోల్ నారంగ్ అనే కంటెంట్ క్రియేటర్ ‘బెంగళూరులో ఉచితంగా ల్యాప్టాప్పై కూర్చుని పని చేయండి - పార్ట్ 1’ అనే శీర్షికతో ఒక వీడియోను పంచుకున్నాడు. వైట్ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ మాల్ను ఎంచుకున్న అతడు, అక్కడ చట్టబద్ధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా పని చేయవచ్చో ఐదు లొకేషన్లతో సహా వివరించాడు. ‘వైట్ఫీల్డ్లో ఉచిత వైఫై, ఏసీ ఎలాంటి ఛార్జీ లేకుండా రోజంతా పని చేయవచ్చు’ అంటూ ఆ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఐటీ కారిడార్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Amol Narang (@amol_narang)నెటిజన్ల స్పందనఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఐడియా భలే ఉందే అని మెచ్చుకుంటుంటే, మెజారిటీ ఐటీ నిపుణులు, నెటిజన్లు మాత్రం ఇందులోని ఇబ్బందులను, భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్ఫారమ్కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ను ఫన్గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
అచ్చం భారతీయ స్త్రీలా రష్యన్ మహిళ..!
ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది. ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.నేర్చుకున్న ఐదు అలవాట్లు..1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్లో రాసింది.2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝑫𝒆𝒔𝒊𝒍𝒊𝒇𝒆 |𝑩𝒆𝒂𝒖𝒕𝒚 |𝑰𝒏𝒅𝒊𝒂 (@sofia_desilife) (చదవండి: కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్) -
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..
మెట్గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్గా మారింది. ఈ అమ్మాయి లుక్ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్కార్పెట్పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్చైర్కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
అవార్డుల వేడుకలో హాట్టాపిక్గా టీవీ స్టార్ 'బ్రెడ్ డ్రెస్'..!
"వెర్రి వేయి రకాలు - పిచ్చి పలు రకాలు" అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. క్రియేటివిటీ ఉండోచ్చు మరి అధ్వాన్నమైన సృజనాత్మకతను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడో ఓ టీవీ స్టార్ క్రియేటివిటీ కూడా అలానే ఉంది. వెరైటిగా కనపడాలని అనుకుందో లేక కొత్తగా ఆలోచించాలనుకుందో గానీ ఆమె ధరించిన డ్రెస్ మాత్రం ఒక్కసారిగా అందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేసింది. అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు సంక్షోభం, తోపాటు తర్వలో ఆహార సంక్షోభం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఆ స్టార్ డ్రెస్ అందరికి కోపం తెప్పించడమే కాదు..ఏమనుకుంటున్నావ్ అంటూ తింట్ల దండకం అందుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) వేడుకలో, రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మెర్సీ అటాంగ్ సుమారు 500 బ్రెడ్లతో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చింది. ఆమె రెడ్కార్పెట్ పైకి రావడంతో ఒక్కసారిగా నెట్టింట హాట్టాపిక్గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ దుస్తులను డిజైన్ చేసింది టియానాస్ ఎంపైర్కు చెందిన డిజైనర్ టోయిన్ లవానీ. ఆ టీవీ స్టార్ అటాంగ్ బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసే నిమిత్తం వాళ్లు ఇలా రూపొందించారట. అంతేగాదు సదరు టీవీ స్టార్ అటాంగ్ సైతం తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఇంతకన్న మంచి ప్రదేశం ఏముంటుంది అని ప్రశ్నించడం శేషం. బ్రెడ్ డ్రెస్పై వెల్లువెత్తిన వ్యతిరేకత..ఆ లుక్ సృజనాత్మకతకు నిదర్శనంగా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహారాన్ని ఫ్యాషన్గా ఉపయోగిస్తారా..?, కనీసం నైతికత కూడా లేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇది చాలా అసభ్యకరం, అసలు ఆ దుస్తులు రూపొందించిన డిజైనర్లు నిజంగా ఫ్యాషన్ డిజైనర్లేనా? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.This is so crass.Honestly, this is the kind of thing people should actually be fixating on tonight and asking real questions about.Is that real bread? Is it dummy bread? Because even if it turns out to be fake, the visual alone is still deeply tone deaf.Bread is one of the… pic.twitter.com/3NxxfwjJOp— AFTER HOW MANY CHILDREN (@tomisin_ms) May 9, 2026 (చదవండి: Tara Sutaria: బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!) -
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్కు చెందిన డా. శివరంజని ఇన్స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్కు కౌంటర్గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్కు చెందిన మఖన్లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్గా మఖన్లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
ఆ రేంజ్లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!
నిజంగా స్టేట్ ర్యాంక్ వస్తేనే సంబరాలు చేసుకుంటాం. అలాంటిది జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధిస్తే ఎగిరిగంతేస్తాం. తల్లిదండ్రలు ఇంట్లో ఓ పండుగలా వేడుక జరిపిస్తారు అలాంటిది ఈ తల్లి మాత్రం ఆ ఒక్క మార్కు అంటూ బాధుపడుతున్న తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. పైగా మరీ ఇంతలా పేరెంట్స్ ఉండకూడదు అంటూ తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్కి చెందిన దిబ్యేందు ప్రమణిక్ పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఐసీఎస్ఈ సిలబస్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంత పెద్ద ఘనత సాధించినందుకు ఏ తల్లిదండ్రలకైన పట్టరాని సంతోషం కలుగుతుంది. కానీ అతడి తల్లి ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకోవచ్చు కదా అంటూ విచారం వ్యక్తం చేసింది. అతడికి 500కి ఒక్క మార్కు తేడాతో 499 మార్కులు సాధించాడు. కానీ ఆ తల్లి బాగానే తెచ్చుకున్నాడు గానీ, ఇంకా కొంచెం కష్టపడితే ఆ ఒక్క మార్కు కూడా మిస్ అయ్యేది కాదు కదా అంటూ ఉసురుమనిపించేలా మాట్లాడింది. ఒక దిబ్యేందు కూడా తన తల్లిలా మాట్లాడాడు. ఆ ఒక్క మార్కు కోల్పోయినందుకు బాధగా ఉంది, కానీ పర్వాలేదు తన వరకు చాలా బాగా రాశానంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఇంజనీర్ కావాలనుకుంటున్నానని, ఐఐటీ వంటి అగ్రశ్రేణి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు వామ్మో ఇలాంటి తల్లిదండ్రులు నాకు లేనందుకు సంతోషం అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కొందరు ఆమె మాటలను చూస్తుంటే ఆ అబ్బాయిపై ఎంత ఒత్తిడి పెంచారో ఊహించగలను అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Noiseless News (@noiselessnews) (చదవండి: ఎవరీ ర్యాన్ కోహెన్..? కాలేజీ డ్రాపౌట్ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..) -
35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..
ప్రస్తుత కాలంలో యువత ఒత్తిడి, ఆర్థిక భద్రత మధ్య నలిగిపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ లైఫ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసి ఒత్తిడిలో కూరుకుపోయేలో చేసిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. అంతేగాదు ఆ కారణంగా ఆ లైఫ్కి స్వస్తి పలుకుతున్నా అంటూ..తన చివరి రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ..ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు. ఇంతకీ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే..బిస్వజిత్ మొహంతి 35 ఏళ్ల వయసులో కార్పొరేట్ కెరీర్కు విరమణ పలుకుతున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మొహంతి కార్పొరేట్ ప్రపంచంలో తన లాస్ట్ వర్కిగ్ డేని జరుపుకున్నట్లు ప్రకటించారు. ఈ క్షణం వరకు కార్పొరేట్ లైఫ్లో సాగిన తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులో సవంత్సరాల పాఠశాల విద్య, లోన్ తీసుకుని మరి చదువుకున్న ఉన్నత విద్య, దాదాపు 11 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం తదితరాలు ఉన్నాయి. ఇవన్నీ చివరకు కార్పొరేట్ లైఫ్ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయానికి దారితీశాయి. పదవీవిరమణ వరకు అదే వృత్తిలో కొనసాగకూడదని సుమారు మూడేళ్ల క్రితం అనుకున్నట్లు తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తన మనసులోకి వచ్చిందని, అన్నారు. అయితే ఆర్థిక భద్రత నేపథ్యంలో కొనసాగించాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయాన్నారు. ఇక్కడ నుంచి బయటపడ్డాక..నెక్స్ట్ ఏంటీ అన్న భయం కారణంగా కార్యరూపంలోకి తీసుకురాలేకపోయానన్నారు. గత మూడేళ్లలో ఏం కోల్పోయానో గ్రహించా, పాతవాటిని మర్చిపోవడం, తన బలాలను గుర్తించడం వంటివే అసలైన సంపదలుగా గ్రహించా, దాంతో తన శక్తిని, సమయం వంటి వాటిని సరైన దానిపై పెట్టబడి పెట్టడంపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై సైతం స్పష్టత ఉందన్నారు. ఈ కార్పొరేట్ లైఫ్ని వదిలేసే ముందు వరకు కష్టంగా అనిపించింది. కానీ వైదొలగడం మాత్రం చాలా ప్రశాంతతనిచ్చిందన్నారు. అంతేగాదు సాంప్రదాయ వృత్తి మార్గం కంటే వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలసుకున్నా అంటూ తన పోస్ట్ని ముగించారు. నెటిజన్లు సైతం ఆయన పోస్ట్కి మద్దతు పలుకుతూ..నిజంగానే "కార్పొరేట్ ఉద్యోగం ఒక పెద్ద ఉచ్చు..! ఉద్యోగం మిమ్మల్ని ఎప్పటికీ ధనవంతులను చేయదు. అది ఎల్లప్పుడూ మన కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించే వారి కింద మనల్ని ఉంచుతుందంటూ తమ అనుభవాన్ని షేర్ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. (చదవండి: శాకాహార బాడీబిల్డర్గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్ఓ..) -
పానీ పూరీపై మనసు పారేసుకున్న జపాన్ చిన్నది..!
నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. తాజాగా ఓ జపనీస్ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్ అనే జపనీస్ మహిళ ఎక్స్ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్ స్నాక్కు జపాన్లో కూడా క్రేజ్ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. パニプリにハマりすぎて、気軽に食べ歩きできるパニプリ屋でも起業しようかなって真剣に思うくらいハマってる。エキゾチック料理NGな夫すら、「俺ハマったかもしれん、パニプリのことをすぐ考えてしまう」と言うくらい中毒性ある、、週2くらいで食べてるし、パニプリキットも買った笑 pic.twitter.com/LXqtiklwS6— エルメス (@hermes_ooo) April 20, 2026 (చదవండి: Met Gala 2026: గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..) -
స్ట్రాను ఎంగిలి చేసి, వెండింగ్ మెషీన్లో పెట్టి..
సింగపూర్లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతడు వెండింగ్ మెషీన్ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్ జ్యూస్ తాగే అవకాశం ఉంది.వెండింగ్ మెషీన్ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్ అయింది.అతడు క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్ మెషీన్ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది. -
దీప్వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్తో దీప్వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్కు దువా తన టాలెంట్తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
ఎరుపు రంగు డ్రెస్లో ఇషా అంబానీ స్టన్నింగ్ లుక్..!
అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్వేర్ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 కౌచర్ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్వేర్. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది. అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్ లుక్ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక అండ్ వైట్ మేరీ జేన్స్ స్లిప్పర్స్, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది. ఆ డ్రెస్కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్ రేంజ్లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.(చదవండి: జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!) -
144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్ధామ్ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్నాథ్ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఎలా ఉందంటే..1882లో తీసిన కేదార్నాథ్ ధామ్కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్ చేశారు మహీంద్రా. కాగా, కేదార్నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.Apparently, this is one of the earliest known photographs of the sacred Kedarnath Dham, taken in 1882.Couldn’t take my eyes off it. No roads. No railheads. No helicopters.Just the abode of Lord Shiva, cradled by the HimalayasBack then, the yatra demanded time, endurance,… pic.twitter.com/UfvWVsmLnf— anand mahindra (@anandmahindra) April 26, 2026 (చదవండి: పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...) -
సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!
చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింపచేసేలా చేస్తుంది కూడా. కొన్ని నినాదాలు మాటలకే పరిమితమైపోతాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..గుజరాత్లోని నార్నౌల్లోని ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచారం అందర్నీ ఆకర్షించడమే కాదు లింగ సమానత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచింది. బీకామ్ పట్టభద్రురాలైన నేహా జాంగ్రా, తన పెళ్లికి ఒక రోజు ముందు, శనివారం రాత్రి తన పరిసర ప్రాంతాల్లో ఆడ గుర్రంపై ఊరేగుతూ కనిపించింది. సంగీతం, ఉత్సవ నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనందం, గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి హరిరామ్ జాంగ్రా చిన్న కిరాణ దుకాణం నడుపుతుంటారు.2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి, అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తాను కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు.‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార స్ఫూర్తికి అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. "ఇది కేవలం ప్రతీకాత్మకం కాదు; ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి," అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహా తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెల మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పుకు స్ఫూర్తినిస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.పెళ్లికి ముందు బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో, ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కాగావడోదరలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్కు చెందిన నిలేష్ కుమార్తో నేహా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. (చదవండి: అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..! ఎందుకో తెలుసా..) -
ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!
ఎన్నో పర్యాటనలకు వెళ్తుంటాం. కొన్ని ప్రదేశాలు, అక్కడ చూసిన బ్యూటీఫుల్ స్పాట్లు మదిలో అలా నిలిచిపోతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ పర్యాటక ప్రదేశంలోని బేకరీ స్టాల్. ఇక్కడకు వెళ్తే..ఎవ్వరైన నిశబ్దంగా మారి..చిరునవ్వులు చిందిస్తుంటారు. ఎందుకంటే..నేపాల్లో ఒక బదిర దంపతులు నడుపుతున్న బేకరీ ఇది. అక్కడ నేపాల్లో అందమైన ప్రదేశాలన్ని తిలకించాక లాంట్టాంగ్ లోయ వద్దకు చేరుకునే యాత్రికులకు మధుమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఈ బేకరి. అక్కడే ఈ బదిర దంపడుతు 'పీస్ఫుల్ బేకరీ', ఉంది. పర్వతాల మధ్య నెలకొన్న ఈ బేకరీ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కంటే ఇంత అందమైన జ్ఞాపకంగా మార్చిన దంపతులకే క్రెడిట్ మొత్తం ఇవ్వలి. సైగలతో మాట్లాడే ఆతిధ్యం మనల్ని కట్టిపడేయేగా, అక్కడ మనం చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. ఎక్కడకు వెళ్లినా ఇంతలా నవ్వే ఛాన్స్ లేదన్నట్లుగా ఆ దంపతులు తమ ఆప్యాయత, ప్రేమతో నవ్విస్తుంటారు. ఈ బేకరీలో ఆపిల్ మోమో(ఆపిల్ పైస్) అత్యంత రుచికరమైన వంటకంగా గూగుల్ రివ్యూలు చెబుతున్నాయి. చాలామంది సందర్శకులు పర్వత ట్రెక్కింగ్ తర్వాత తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈ వంటకాన్ని రుచిచూసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాక దీనికి మరింత క్రేజ్ వచ్చింది. ఎలా చేరుకోవాలంటే..నేపాల్లో ఈ బేకరీని సందర్శించాలనుకుంటే.. కాఠ్మండు నుంచి ఏడు గంటల బస్సు ప్రయాణం, ఆ తర్వాత పర్వతాలలో రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడకు వెళ్లడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. రైలు పట్టాల పక్కన ఉన్న ఒక మనోహరమైన చిన్న ప్రదేశం వద్ద ఈ బేకరీ ఉంటుంది. వారు సైగ భాషలోనే అద్భుతమైన ఆతిథ్యం అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అస్సలు మిస్ కాకండి మరి..అయినా ఏ పర్యాటకంలోనైనా అత్యంత మధురమైన స్మృతులు అక్కడ కలిసిన వ్యక్తులేనని ఈ బేకరీ సందర్శన గుర్తు చేస్తుంది అని చెబుతున్నారు చాలామంది పర్యాటకులు. View this post on Instagram A post shared by Travis Fein (@travisfeintravel) (చదవండి: పెరుగు అన్నం vs లెమన్ రైస్: ఈ సమ్మర్లో డయాబెటిస్ రోగులకు ఏది మంచిదంటే..) -
చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!
మూగజీవులు మనుషులకు మించి ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే గాదు..అలా రక్షించిన ఘటనలు కోకొల్లలు. తనకు ఎలాంటి ప్రమాదం లేదంటేనే రక్షించేందుకు ముందొకస్తాడు మనిషి. కానీ ఈ శునకం తనకు అపాయం అని తెలిసి చిన్నారుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది .అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో,కాళి అనే వీధి కుక్క చేసిన సాహసం అక్కుడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ పాఠశాల సమీపంలో ఆరుబయట సుమారు 30 మందికి పైగా చిన్నారులు ఆడుకుంటారు. తమ వైపు బుస్సు బుస్సు మని నిశబ్దంగా వస్తున్న ప్రమాదం గురించి వారికి ఏ మాత్రం తెలియదు. దాన్ని తత్క్షణమే పసికట్టిన కాళీ అనే వీధి కుక్క ఆ చిన్నారులందర్నీ కాపాడేందుకు ఆ విషసర్పంతో పోరాడేందుకు ముందుకు దూకింది. ఆ పాము వైపుకి దూసుకెళ్లి మరి నిర్విరామంగా పోరాటం చేసింది. చిన్నారుల వైపుకి ఆ పాముని రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది. చెప్పాలంటే ప్రమాదానికి పిల్లలకు మధ్య నిలబడి ఆ కాళి అనే కుక్కతో అపరకాళిలా పోరాడింది. పామును చంపేంత వరకు పోరాటం చేయడం విశేషం. అయితే ఆ పోరాటంలో ఆ పాము ఆ కుక్క ముఖం, నోటిపై కాటేసినా.. లెక్కచేయకుండా పోరాడి దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది ఆ శునకం. అప్పటికే ఆ కుక్కకి తక్షణ సహాయం అందడంలో ఆలస్యమైపోయింది. ఆ విషం అప్పటికే దాని ప్రాణాలను బలిగొంది. ఒక్క బిడ్డకు కూడా హానికలగకుండా వీరోచితంగా పోరాడి యావత్తు గ్రామం మనసుని దోచుకుంది. నిజానికి ఆ కాళి అనే కుక్క వీది కుక్క కాదు, తమ రక్షకురాలు అని భావోద్వేగంగా అంటున్నారు స్థానికులు. దాని త్యాగానికి గుర్తుగా మొత్తం గ్రామమే కదిలివచ్చి మరి వీడ్కోలు పలికారు. దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలమాలతో అలంకరించి, గ్రామం గుండా అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకువెళ్తూ..ఆ శునకానికి నివాళులు అర్పించారు. విశ్వాసంలో కుక్కకు మించిన వారు లేరని రుజువు చేసే ఘటన ఇది. (చదవండి: జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!) -
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల రాజీనామాలు, నోటీసు పీరియడ్ల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటజిస్ట్ నిషాంత్ జోషి పంచుకున్న ఒక ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. తన సహోద్యోగికి కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, 90 రోజుల నోటీసు పీరియడ్ తగ్గించాలని కోరగా.. అది ‘వృత్తిపరమైన నైతికత’ (Professional Ethics) అని హెచ్ఆర్ విభాగం బదులిచ్చింది. దీనికి ఆ ఉద్యోగి స్పందిస్తూ.. ‘గత నెలలో కంపెనీ మొత్తం డిజైన్ టీమ్ను ఉన్నపళంగా తొలగించినప్పుడు ఈ నైతికత ఏమైంది?’ అని ప్రశ్నించడంతో హెచ్ఆర్ నోట మాట రాలేదని జోషి పేర్కొన్నారు.ద్వంద్వ నీతిపై ఆగ్రహంఉద్యోగులు వెళ్లేటప్పుడు మూడు నెలల సమయం కావాలని కోరే కంపెనీలు, వారిని తొలగించేటప్పుడు మాత్రం కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై నిషాంత్ జోషి విమర్శలు గుప్పించారు. ‘సంస్థ మిమ్మల్ని తీసివేయాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే మీ ఆఫీస్ అకౌంట్లు అన్నీ డిసేబుల్ అవుతాయి.. అక్కడ అప్పగింతలు (Handover) ఉండవు, గౌరవం ఉండదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది పని సజావుగా సాగడం కోసం కంటే, ఉద్యోగి వేరే అవకాశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల మద్దతుఈ పోస్ట్పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అనేకమంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా చేర్చుకునే అభ్యర్థి వెంటనే రావాలని కోరుకునే సంస్థలు, పాత ఉద్యోగిని మాత్రం 90 రోజులు వదలకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఐటీ కన్సల్టింగ్ రంగంలో మొదలైన ఈ 90 రోజుల నిబంధన ఇప్పుడు అన్ని రంగాలకు పాకి ఉద్యోగులను వేధించే సాధనంగా మారిందని మరికొందరు విమర్శించారు. వృత్తిపరమైన నైతికత అనేది కేవలం ఉద్యోగులకే కాదు, సంస్థలకు కూడా వర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మార్పు అవసరంఈ చర్చ ద్వారా కార్పొరేట్ నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది కాలం చెల్లిన పద్ధతి అని, ఇది ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా ఉద్యోగి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు తమ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల కెరీర్ వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకృతం చేయాలని, పరస్పర అవగాహనతో కూడిన పని వాతావరణం ఉండాలని ఈ చర్చ సారాంశం.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. -
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్లో రాకీభాయ్లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!
భోపాల్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన మధ్యప్రదేశ్లోని భోపాల్ ‘90-డిగ్రీల వంతెన’ గుర్తుంది కదా? ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వింత డిజైన్ పై అటు స్థానికుల నుంచి, ఇటు నెటిజన్ల వరకూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), రైల్వే శాఖల కొనసాగుతున్న వివాదానికి ముగింపు దొరికింది. ‘సిమెంట్ తో కట్టిన మృత్యుద్వారం’గా ముద్రపడిన ఈ వంతెన డిజైన్ను పూర్తిగా మార్చివేసి, త్వరలోనే సురక్షితంగా తీర్చిదిద్ది, ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.భోపాల్ లోని ఐష్బాగ్ ప్రాంతంలో సుమారు 18 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 2025, జూన్ నాటికే పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలకు నోచుకోలేదు. ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు, ఈ వంతెన మలుపు ఏకంగా 90 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ మలుపులో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడతాయని స్పష్టమైంది. ఈ దారుణమైన ప్లానింగ్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీమ్స్, విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో ఏడుగురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందాలను రంగంలోకి దించింది. పక్కనే ఉన్న మెట్రో లైన్ వల్లే డిజైన్ లో ఈ సమస్య తలెత్తిందని దర్యాప్తులో తేలింది. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే మరో నాలుగు, ఐదు రోజుల్లో పాత కాంట్రాక్టర్తోనే మార్పుల పనులు ప్రారంభించనున్నారు. కొత్త డిజైన్ ప్రకారం మలుపు వ్యాసార్ధాన్ని 2 మీటర్ల నుండి 2.5 మీటర్లకు, వంతెన వెడల్పును 8.5 మీటర్ల నుండి 10.5 - 11 మీటర్లకు పెంచనున్నారు. దీని ద్వారా కార్లు, మధ్య తరహా, భారీ వాహనాలు సురక్షితంగా ప్రయాణించే వీలుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు -
'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!
"సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్ ఎంఎఫ్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన తన పోస్ట్లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు. ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు. కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు. వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్ స్నాక్స్ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.మితంగానే మంచిది..ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుThe samosa is one of the most eaten street foods on the planet. This is a 500-year-old recipe for it, written in Persian in a manuscript sitting in the British Museum.The manuscript is called the Ni'matnama, the Book of Delights, written between 1501-1510 AD, for the Sultan of… pic.twitter.com/uEjIe77zQl— Dr. M.F. Khan (@Dr_TheHistories) April 8, 2026 (చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..) -
ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ఆ ఆచారం!
మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్ పిలాయ్ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.రాజస్థాన్లోని భార్మర్కు చెందిన ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ మార్చి 29న జోధ్పూర్ ఐపీఎస్ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్ అధికారి దూద్ పిలాయ్ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. ‘దూద్ పిలాయ్’ అంటే..దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం. ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!) -
ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!
ఉన్నత చదువులు చదివితే కచ్చితంగా లక్షల ప్యాకేజ్లతో పనిచేసే ఉద్యోగాలు చేస్తుండటమో లేదా వ్యవస్థాపకులుగా కోట్లు గడించే రేంజ్లోనో ఉంటారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్లన్నింటిలో ఆల్ ఇండియా టాపర్ సాధించిన వ్యక్తులు అంటే కచ్చింతంగా చాలా పెద్ద పొజిషన్లోనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వ్యక్తి అత్యంత విరుద్ధంగా ఆ మార్గాన్ని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే..విస్తుపోతారు. ఇలా ఎలా ఇంత పెద్ద అనుహ్య మార్గాన్ని ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. పైగా అతడి కథ ఆలోచింపచేసేలా ఉండటమే గాక విజయానికి అసలైన అర్థం ఏంటో చాటి చెప్పారు.ఆయనే శ్రీష్ జాదవ్. 1968లో జన్మించిన జాదవ్, చిన్న వయస్సు నుంచే విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. 1985లో, భారతదేశంలోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ జేఈఈ))లో ఆయన ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించారు. అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) చదువుకున్నారు. సోషియాలజీ మినహా అన్నింటిలోనూ 'A' గ్రేడ్లు సాధించి, అద్భుతమైన విద్యా ప్రతిభను కనబరిచారు. అతని పదునైన మేధస్సు, నిలకడైన ప్రతిభ అతన్ని తన కాలంలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరిగా నిలబెట్టింది. ఆ తర్వాత 1989లో కంప్యూటర్ సైన్స్లో గేట్ (GATE) పరీక్షలో 99.92 అద్భుతమైన పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక అక్కడితో చదువుని ఆపలేదు, పీహెచ్డీ కూడా చేశారు. ఆ తర్వాత సంప్రదాయ ఉద్యోగాలతో సంపాదన బాట పట్టకుండా సమాజ సేవ కోసం సర్వస్వం త్యాగం చేశారు. నిరుపేద విద్యార్థులకు విద్యనందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన సమాజ సేవకు మించింది లేదనే భావంతో అరుణాచల్ ప్రదేశ్లోని నరోత్తమ్నగర్లో ఉన్న రామకృష్ణ మిషన్ పాఠశాలలో రెసిడెంట్ గౌరవ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1996, 1997ల మధ్య రామకృష్ణ మిషన్ శిల్పమందిరంలో గౌరవ లెక్చరర్గా సేవలందించారు. అలాగే 1997-2006 వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ రంగంలో లెక్చరర్గా, కో ఆర్డినేటర్గా సేవలందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత పెద్ద బాధ్యతలు స్వీకరించి, చివరికి రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి డీన్ ఆఫ్ రీసెర్చ్ మరియు కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయన సమాజానికి చేసిన విశేష సేవలకు గానూ 2009లో ఆయనకు ఐఐటీ కాన్పూర్ 'విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం ప్రదానం చేసింది. అంతేగాదు ఆయన సేవ మార్గాన్నే ఎంచుకున్నా.. విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. కంప్యూటేషనల్ జ్యామితి, గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి వాటిలో పరిశోధనలు చేశారు. అంతేగాదు ఆయన బీటెక్ ప్రాజెక్టు ఓ ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధన సంస్థచే ప్రచురణ కోసం ఎంపిక అవ్వడం విశేషం. కాగా, శ్రీష్ జాదవ్ కథ నిజమైన విజయం సంపాదనలో లేదని, తెలివిగా ఎంచుకోవడంలోనే ఉందని చెబుతోంది. అంతేగాదు సక్సెస్ అంటే సంపద, గుర్తింపు కానే కాదని, ఒక లక్ష్యంతో స్పష్టతతో జీవించడం గురించని చెప్పకనే చెప్పారు శ్రీష్ జాదవ్.(చదవండి: 'బుజ్జి' ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..) -
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..) -
‘ఐఐటీ బాబా’ మరో సెన్సేషన్ .. ‘ఎంత పని సేస్తివిరో..’
న్యూఢిల్లీ: లక్షల జీతం తెచ్చిపెట్టే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి, సన్యాసిగా మారి.. 2025 మహాకుంభ్ మేళాలో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ‘ఐఐటీ బాబా’ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడయ్యారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న అభయ్ సింగ్.. ప్రీతిక అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని అఘంజర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన వీరు ఒక్కటవ్వగా, ఫిబ్రవరి 19న కోర్టు మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తాజాగా అభయ్ సింగ్ తన భార్యతో కలిసి హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు. బ్యాంకులో కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికే ఇక్కడికి వచ్చినట్లు తనదైన కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన మీడియాతో చెప్పాడు. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ (అభయ్ గ్రేవాల్).. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ వైపు మళ్లి డిజైన్లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా రూ.36 లక్షల ప్యాకేజీతో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశారు. కానీ అక్కడ తీవ్రమైన డిప్రెషన్కు గురికావడంతో.. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.కెరీర్ను వదిలేసి సన్యాసం స్వీకరించాడు. 2025 మహాకుంభ్ మేళాలో సన్యాసి దుస్తుల్లో ఉన్న అతను.. తాను ఐఐటీలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అప్పటినుంచి నెటిజన్లు ఆయనను ‘ఐఐటీ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు చూసి పెళ్లి వ్యవస్థపైనే తనకు నమ్మకం పోయిందని అభయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకో గర్ల్ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలిపారు. కుటుంబానికి దూరంగా సన్యాసిగా గడిపిన అతను ఇప్పుడు మనసు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం విశేషం. అభయ్ తాజా నిర్ణయంతో అతని తండ్రితో పాటు తల్లి షీలా దేవి కూడా ఎంతో సంతోషించారు. కొడుకు, కోడలిని ఇంటిలోనికి సాదరంగా స్వాగతించారు. ఇది కూడా చదవండి: ‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు! -
రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..
మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్ అయిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్ క్రియేషన్ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్లు గురించి హైలెట్ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్ క్రియేషన్ అన్నది సరైన కెరీర్ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. అంతేగాదు కంటెంట్ను క్రియేట్ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Sanya Batra | Travel & Lifestyle (@insanyaty) (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!) -
ఫ్లూట్లు అమ్ముకునే వ్యక్తి కథ..!
సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సంగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్జోత్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్జోత్. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Prabhjot Singh (@intent.content.form) (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
రాధిక మర్చంట్ లైలాక్ వాచ్..! ప్రపంచంలోనే..
మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్తో తన లుక్ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకతలు..వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
నదిని శుభ్రం చేసిన ఒకే ఒక్కడు..! ఆనంద్ మహీంద్రా సైతం..
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.మధ్యప్రదేశ్లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు. బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్కే ఇదంతా అని ట్రోల్ చేసినట్లు తెలిపారు. సోషల్మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్లు, వ్యూస్ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు. ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు. అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడని అన్నారు. డిజిటల్ స్టార్డమ్ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.This young man from Biaora, M.P, was criticised for claiming to have cleaned parts of a river just in order to gain social media views.Well, we usually complain that social media rewards the trivial rather than the meaningful So If a desire for ‘likes’ can become a force for… pic.twitter.com/ARgEhphuQN— anand mahindra (@anandmahindra) March 30, 2026 (చదవండి: ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్కి మతిపోవాల్సిందే..!) -
పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..
పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించొచ్చు అనగానే మహా అయితే రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు ఉండొచ్చని అనుకుంటాం. రోజంతా నిలబడి.. అర కొర సంపాదనతో కష్టపడే వేతన జీవులుగా భ్రమపడతాం అని అంటున్నాడు కంటెంట్ విక్రేత. అంతేకాదండోయ్ వాళ్లు నిజంగా పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించగలరో స్వయంగా తెలుసుకునేందుకు ఆ స్టాల్లో పనిచేసి మరి రోజువారీ వేతనం లెక్కించాడు. మరి ఇంతకీ ఎంత సంపాదించొచ్చంటే..బెంగళూరుకు చెందిన పెరీరా అనే కంటెంట్ క్రియేటర్ రోడ్డు పక్కనే ఉన్న ఒక పానీపూరీ స్టాల్లో ఒక రోజంతా పనిచేసి అతడి రోజువారీ సంపాదనను లెక్కించాడు. అందుకోసం ఉల్లిపాయలు, బంగాళ దుంపల తొక్కు తీయడం, మసాల పూరీని తయారు చేయడం వంటి ప్రాథమిక తయారీ పనులను కుణ్ణంగా నేర్చుకుని మరి ప్రారంభించాడు పెరారీ. ఆ పనులు అలవాటయ్యాక వినియోగదారులకు అందించడం ప్రారంభించడు. మొదట్లో కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత రద్దీ పెరిగాక త్వరగా అలవాటుపడిపోయాడు. కేవలం ఒక గంటలోనే సుమారు 120 పూరీలు దాక అమ్మాడు. ఈ స్టాల్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని, సాయంత్రం అయ్యే కొద్దీ జనం క్రమంగా పెరుగుతారని ఆయన పేర్కొన్నారు. అంతేగాదు ఆయన పనిచేస్తున్న సమయంలో పలువురు సన్నిహితులు ఆయన గుర్తుపట్టారు కూడా. ఎంత ఆదాయం వస్తుందంటే..ఒక ప్లేట్ ధర రూ. 30లు. అంటే రోజుకి సుమారు 80 నుంచి 100 ప్లేట్లు అమ్ముడవుతాయని పెరీరా తెలిపారు. అంటే రోజువారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 3000 దాక ఉంటుంది. దానిప్రకారం నెలకు రూ. 90,000 వరకు గడిస్తాడని, దాదాపు ఏడాదికి రూ. 10.8 లక్షలకు సమానమని పెరారీ అంచనా వేశారు. అందుకు సంబంధించిన వీడియోతో సహా నెట్టింట షేర్ చేయడంతో సర్వత్రా పానీపూరీ వంటి సంప్రదాయ వ్యాపారాలతో ఇంతలా ఆర్జిస్తారా అని చర్చల మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..
ఎంబ్రాయిడరీలో ఉండే కళా నైపుణ్యం వేరేలెవెల్. అందులోనూ మన అమ్మమ్మలు ఆ వయసులో వారి చేత్తో పొద్దిగా కుడితే..అది మనకు ఎంతో అపురూపమైన జ్ఞాపకం.అలాంటి ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీని పరిచయం చేసింది ఈ బామ్మ. సుమారు 90 ఏళ్లు పైనే ఉండే ఈ బామ్మ తన కళను శ్రద్ధగా దాచుకున్న విధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియోని మనవడు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో మనవడు తన అమ్మమ్మ సూదీదారం పట్టుకుని కుట్టిన ఎంబ్రాయిడరీని తన మనవడికి చూపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె స్వయంగా రూపొందించిన కళాఖండాన్ని మనవడు చూస్తున్నప్పడు ఆ బామ్మ కళ్లు ఆనందంతో మెరుస్తుండటం చూడొచ్చు వీడియోలో. దశాబ్దాల క్రితం ఆమె చేసిన అందమైన కళాఖండం అది. అవి ఆమెకు కళ పట్ల ఉన్న అంకితభావం, ఓర్పుకు నిదర్శనం. యంత్రాలతో నేటితరం చిటికెలో చేస్తే..అవి అమ్మమ్మ తన స్వహస్తాలతో కేవలం సూది, దారంతో చాలా శ్రద్ధతో చేసిన అద్భుత సృష్టి. అవి ఆ అమ్మమ్మ గతం తాలుకా అమూల్యమైన జ్ఞాపకం కూడా. ఆ కళాఖండం సుమారు 1947 నాటి చారిత్రక ఘట్టం. వాటిని చూస్తే..ఇన్ని దశాబ్దాలు గడిచినా.. చెక్కుచెదరకుండా ఉన్న వాటిని చూస్తే ఆ కళ ఎంత విలువైనవనేది అనేది తెలుస్తోంది. ఇది తమ కుటుంబ చరిత్రలో భాగం, భావోద్వేగమైనది కూడా అని చెబుతున్నాడు ఆమె మనవడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా కుటుంబ వారసత్వ సంపద కళ మాత్రమే అనే విషయం నొక్కి చెప్పిందని అన్నారు. అంతేగాదు కళ ద్వారా నాటి జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయన్నారు. వేగవంతమైన ప్రపంచంలో కుటుంబం, సంప్రదాయం, వారసత్వం, జ్ఞాపకాల ప్రాముఖ్యతలను ఈ దృశ్యం హైలెట్ చేసిందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jujhar singh Aujla (@aujla_1994) (చదవండి: పంజాబీ వంటకాలకు ఫుడ్లవర్స్ ఫిదా..!) -
రూ. 41 లక్షల జీతం వద్దనుకుని కవయిత్రిగా..!
కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. తీరా ఏ సమస్యలు వచ్చినా..తట్టుకుని ముందుకు సాగి..సక్సెస్ అందుకునే నేర్పు, ఓర్పు కూడా అవసరం. కానీ ఇక్కడొక మహిళ లక్షల వేతనం కాదనుకుని సాహిత్య రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. సృజనాత్మక శక్తిపై ఆధారపడి ఉన్న రంగం, అన్ని వేళలా..అంతగొప్పగా రచనలు చేసే అవకాశం లేని దాంట్లోకి వెళ్లాలనుకోవడమే సాహసం అంటే..మంచి లగ్జరీ లైప్ని అనుభవించే ఉద్యోగాన్ని వదులకోవడం అంతకుమించిన సాహసం అనే చెప్పాలి. కానీ ఈ మహిళ అంత పెద్ద సాహసం చేసి కవియిత్రి అనుపించుకోవడమే ఇష్టం అని చెబుతోంది.ఆ అమ్మాయే 28 ఏళ్ల మాజీ కన్సల్టెంట్ అయిన నమ్రతా యాదవ్. ఆమె కవిత్వంపై అభిరుచితో సింగపూర్లోని కేపీఎంజీలో కార్పొరేట్ ఉద్యోగానికి స్వస్తి పలికింది. నిజానికి ఆమె న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2019, 2021 మధ్య నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లో అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలోకి రాకముందు ఆమె అక్కడ ఆరు నెలల పాటు రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేశారు. కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యంతో ఒక పెద్ద సంస్థలో అనుభవం సంపాదించేందుకు కేపీఎంజీ(KPMG)లో చేరింది. అక్కడ వర్కింగ్ కల్చర్ కూడా నచ్చిందామెకు. ఏడాదికి దగ్గర దగ్గరగా రూ. 41 లక్షలు పైనే జీతం అందుకునేది. సింపుల్గా చెప్పాలంటే అక్కడ మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించారామె. ఎలాంటి ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనలేదామె. అయితే ఆ ఉద్యోగం తన వ్యక్తిత్వానికి సరిపోదని భావించి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే సాహిత్యరంగంలోకి వచ్చేందుకు మొగ్గుచూపడం విశేషం. ఎక్కువ గంటలు శ్రమతో కూడిన కార్పొరేట్ జీవితం తన వల్ల కాదనిపించదని అన్నారామె. దగ్గర దగ్గర 40 గంటల పని, వారాంతాల్లో విరామంగా లైఫ్ ఉండకూదనిపించిందట. దాంతో సింగపూర్ నుంచి భారత్కి వచ్చేసి, క్రమం తప్పకుండా హిందీలో కవిత్వాలు రాయడం ప్రారంభించానని అంటోంది. పైగా ఒక్కత్తే ఆ దేశంలో జీవించడం పట్ల ఉన్న ఆందోళన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని అంటోందామె. 2024 డిసెంబర్లో, లక్నోలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో స్పోకెన్ వర్డ్ పొయెట్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఎంపిక అవ్వడంతో తన డెసీషన్ సరైనదే అని నమ్రతకు నమ్మకం కలిగింది. అంతేగాదు అక్కడ వేదికపై కవిత్వం చెబుతున్న వారిని చూసి అభిమానిగా మారడం కంటే..వారిలో ఒకరిగా తాను అవ్వాలనే కోరిక కలిగిందట. ఆ ఉత్సాహంతోనే సింగపూర్ని పూర్తిగా విడిచిపెట్టి భారత్కి వచ్చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యిందట. అంతేగాదు ప్రస్తుతం ముంబైలో తన రచనలకు వీలుక ల్పించే ఉద్యగాన్ని వెతికే పనిలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మరో ఇద్దరు తనలాంటి క్రియేటివ్ వ్యక్తులతో కలిసి అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు తాను బాగా సంపాదించిన లైఫ్ నుంచి ఆదాయం లేకుండా గడపడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా..నాడు ఆర్జించిన పొదుపులే తనకు ఆసరాగా మారాయని అంటోంది. అలాగే మార్చి 28న జరగనున్న తన సోలో డెబ్యూ షో కోసం పనిచేయాలని నిర్ణయించకున్నట్లు తెలిపింది కూడా. అయితే ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు మద్దతు తెలుపకపోయినా..ప్రస్తుతం తనను అర్థం చేసుకుంటున్నారని అంటోంది. ఏదీఏమైన తన అభిరుచి కోసం అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఇంత డేర్ చేసినందుకైనా.. నమ్రత తాను అనుకున్నట్లుగా మంచి కవయిత్రి అవ్వాలని ఆశిద్దాం.(చదవండి: పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్) -
105 ఏళ్ల పురాతన మట్టి ఇంటిలో విశ్రాంత ఉద్యోగి..!
ప్రస్తుతం అంతా ఆధునికతతో తీర్చిదిద్దిన ఇళ్లే దర్శనమిస్తాయి. మట్టి ఇళ్లు కనిపించే అవకాశాలే తక్కువ. పైగా దానికి చాలా చాకిరీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఓ విశ్రాంతి ఉద్యోగి..మట్టి ఇల్లే బాగుందంటూ..ఏకంగా తన తండ్రి కట్టిన వందల ఏళ్ల నాటి మట్టి ఇంటిలో ఉంటున్నాడు. ఎవరతను..? ఎందుకిలా అంటే..అతడే బ్రెజిల్కి చెందిన 80 ఏళ్ల ఫ్రాన్సిస్కో మటియాస్. స్థానికులు అతడిని ముద్దుగా "స్యూ చిక్విన్హో"గా పిలుచుకుంటారు. అతడు ఉద్యోగ కెరీర్ అంతా బ్రెజిల్లోని రియో డి జనీరోలో గడిపినప్పటికీ..అక్కడి పట్టణ వాతావరణం అంతగా అతడికి నచ్చలేదు. ఎప్పటికైనా తన మూలాలను వెతుక్కుంటూ తను పుట్టి పెరిగిన బ్రెజిల్లోని లోతట్టు గ్రామీణ ప్రాంతానికి వెళ్లిపోవాలని భావించేవాడు. అనుకున్నట్లుగానే..ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వగానే..బ్రెజిల్లోని సియారా గ్రామీణ ప్రాంతంలోని హిడ్రోలాండియా ఈనే చిన్న పట్టణానికి వెళ్లిపోయాడు. అక్కడే మటియాస్ పెరిగాడు. అక్కడ తన తండ్రి కట్టిన 105 ఏళ్ల నాటి మట్టి ఇల్లు ఉంది. అదికాస్త పాడైనప్పటికీ..ఆ ఇంటిలోనే ఉంటున్నాడు మట్టియాస్. అక్కడ సమీపంలోని బావి నుంచి నీళ్లు తోడుకుని కుండల్లో నిల్వచేసుకుంటాడు. ఇక వంట కట్టెల పొయ్యిమీదే చేసుకుంటాడు. అది కాస్త శ్రమతో కూడుకున్నది అయినా..అలా వండుకుని తింటేనే రుచిగాఉందని అంటాడు మటియాస్. తన ఇల్లు ఎంత చల్గా ఉంటుందటే..ఏసీలో కూడా అలాంటి అద్భుత వాతావరణం పొందలేమని నవ్వుతూ చెబుతున్నాడు. తన ఇంటిని మరింత అందంగా పునరుద్ధరించాలని అనుకుంటున్నాడు గానీ, అదికూడా నాటి పురాతన పద్ధతుల్లోనే చేయాలనేది అతడి ఆలోచన. నిజానికి ప్రస్తుతం ఇలాంటి ఇళ్లు కనిపించే అవకాశం లేదు. కానీ ఇతడి జీవన విధానం, ఇంటిని చూస్తే..కాలం ఒక్కసారిగా కాలం ఆగిపోయి వెనుతిరిగిందేమో అనిపిస్తుంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో..ప్రతీదాంట్లో కొత్తదనం కనిపిస్తున్న ఈ తరుణంలో..పూర్వకాలం నాటి వేగానికి వెళ్లిపోయామా అనిపిస్తుంది మటియాస్ జీవన విధానం చూడగానే. ఆ మట్టి ఇల్లు మరో యుగంలోకి తీసుకుపోయినట్లు అనిపించినా..అది నాటి సాంప్రదాయ గ్రామీణ వాస్తు శిల్పానికి సజీవ ఉదాహరణగా చెప్పవచ్చు. అక్కడ అతను ఏకాకీగా లేడు..చుట్టుపక్కల వాళ్లు ఏదో ఒకటైంలో వచ్చి పలకరిస్తూ ఉంటారట కూడా. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అంతా ఫోన్లోనే మాటలు, కలుసుకోవడం అయిపోయాక..ఇలాంటి పిచ్చపాటి కబుర్లుతో కూడిన మానవ స్పర్శ తనకు అత్యంత విలువైనదని చెబుతున్నాడు మటియాస్. నిజానికి ఈ 80 ఏళ్ల మటియాస్ తాత చెబుతున్న ప్రతి మాట అక్షర సత్యం..నాటి రోజులే నిజంగా గొప్పవి..కష్టపడి పనిచేసేవాళ్లం, హాయిగా కడుపు నిండా కబుర్లు చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు నోటికి తాళం చెప్పి.. బుర్ర, చేతులు..అనుక్షణం ఐఫోన్, స్మార్ట్ఫోన్లకు అంకితమై మూగ ప్రపంచంలో బతికేస్తున్నాం కదూ..!.(చదవండి: అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..! ఆ క్రియేటివిటీకీ మాటల్లేవ్ అంతే..) -
భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!
ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్ సక్సెస్ని షేర్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో సీనియర్ డైరెక్టర్ డెవలపర్ జీటీఎం మార్కెటింగ్గా పనిచేస్తున్నారామె. ఇన్స్టాగ్రామ్లో తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్లో తన కెరీర్ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భారత్ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్ లైఫ్లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!
ఉద్యోగ కెరీర్లో అంచలంచెలుగా ఎదుగుతూ..అత్యున్నతి స్థాయికి చేరుకోవాలనే ఎవరైన కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ కొందరు మాత్రమే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక జీతం అందుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ టెకీ. తన కెరీర్ సక్సెస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం నాలుగేళ్లలో ఏడాకి రూ. 3.5 లక్షలు అందుకునే స్థాయి నుంచి ఏకంగా ఏడాదికి రూ. 65 లక్షలు అందుకునే రేంజ్కి వెళ్లిపోయాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న అతడి మధ్యతరగతి కుటుంబానికి అతి పెద్ద ఊరట తోపాటు సంతోషాలు వెల్లివెరిశాయి. 2021లో క్యాంపస్ ఇంటర్వ్యూలో తక్కువ ప్యాకేజీతో నియమాకం అందుకున్నట్లు టెకీ తెలిపారు. అప్పుడు తన జీతం కేవలం రూ. 26 వేలు అని. అయితే ఆ టైంలో జాబ్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్షం, కష్టబడేతత్వం పెద్దగా ఏమి లేవని, హాయిగా సినిమాలు చూస్తూ, ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసేవాడినని అన్నారు. అయితే ఇంట్లో అప్పులభారం పెరిగిపోవడం, అందుకున్న జీతం ఏమాత్రం సరిపోకపోవడంతో..అప్పుడు వాస్తవికంగా నాలాంటి సాఫ్ట్వేర్ అందుకనే జీతం ఇది కాదని గ్రహించానంటున్నాడు. అప్పటి నుంచి మరింత కష్టపడటం మొదలుపెట్టా. అందులోనూ లాజికల్ మ్యాథ్స్లో ఉన్న పట్టుతో..లక్షల వేతనం అందుకునే టెకీల మాదిరి ఉద్యోగాలు అందుకునే వేటలో ఉన్నాను. అప్పుడు నా లక్ష్యం అప్పులు క్లియర్ చేసేలా మంచి ఉద్యోగం పొందడం. ఆ క్రమంలో 2023లో 45 శాతం జీతం పెంపు, 2024లో 28 శాంతం పెంపు కూడా అందుకోగలిగా. సరిగ్గా ఆ టైంలో ఇంజనీర్గా రూ. 19 లక్షలు వార్షిక జీతంతో కొత్త కంపెనీలో చేరా. విహారయాత్రాలు, ఎంజాయ్మెంట్ వంటి వాటితో సంబంధం లేకుండా చాలా కష్టపడ్డ..అయితే ఆ క్రమంలో కొన్ని ఇంటర్వ్యూలను చాలా త్రుటిపాయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు. చివరికి తన కష్టం ఫలించి సర్వీస్నౌ, పేపాల్, సిస్కో వంటి అత్యున్న కంపెనీల ఆఫర్లు అందుకోగలిగా. చివరికి తాను అనుకున్నట్లుగానే ఒక అగ్రశ్రేణి ఉత్పత్తి సంస్థ నుంచి రూ. 65 లక్షల ఆఫర్ అందుకున్నా. తనను అందురు కార్పొరేట్ బానిసగా భావించి ఉండొచ్చు..కానీ తన తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఎన్నటికీ ఊహించని గొప్ప వస్తువులను సైతం కొనుగోలు చేయగలను అని ఆనందంగా చెబుతూ పోస్ట్ని ముగించాడు. నెటిజన్లు సైతం సదరు టెక్నీషియన్ సక్సెస్ జర్నీ చాలా స్పూర్తిదాయకమైన విజయవంతంగా కెరీర్ని నిర్మిచుకోవడం ఎలా అనేందుకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
వాటర్ ట్యాంకులో డీజిల్.. ఇలా చేస్తే ఎలా?
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు దేశాన్ని తాకాయి. ఇదివరకే వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇక తదుపరి క్రూడాయిల్ కొరత ఏర్పడనుందేమో అనే భయంతో ఒక వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వాటర్ ట్యాంకర్ నిండా డీజిల్ నింపుకెళ్లారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ నిర్భందించడంతో చమురు నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇదివరకే దేశంలో వంటగ్యాస్, LPG, CNG కొరత ఏర్పడింది. అయితే ప్రభుత్వం వీటికి ఇబ్బందులు ఏమి లేవని సదరు సంస్థలను ఉత్పత్తి పెంచమని ఆదేశించామని ప్రకటించింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు సైతం రెండు మాసాలకు సరిపడా ఉన్నాయని ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు రవాణా చేపడుతున్నామని ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించినటప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వేల లీటర్లు నిల్వ చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేసే యత్నం చేస్తున్నారు.తాజాగా దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఒక వ్యక్తి నీటిని నిల్వచేసే ఒక ట్యాంకర్లో డీజీల్ నింపి నిల్వచేస్తున్నారు. దేశంలో డీజీల్ కొరత ఏర్పడే అవకాశం ఉందనే ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి దాదాపు ఐదువేల లీటర్ల డీజీల్ నిల్వ ఉంటుందని అది దాదాపు రెండువందల మందికి సరిపోతుందని అంటున్నారు. అయితే పెట్రోల్, డీజీల్ కొరత వదంతులతో చాలా మంది టౌన్లలో, గ్రామాలలో ఇదేవిధంగా చేస్తున్నారని దీనివల్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల కొరత ఏర్పడడమే కాదని ఇది చాలా ప్రమాదమన్నారు. సీసాలలో ఆయిల్ తీసుకెళ్లడానికి అనుమతించని దేశంలో ట్యాంకర్లలో ఎలా నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి 5 వేల లీటర్లు తీసుకుంటే ఇక చమురుకొరత రాకుండా ఏలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. The govt says it has fuel reserves for 50–60 days, but if it doesn’t curb rumors and panic, and fails to crack down on hoarders and black marketeers, that 50–60 day stock won’t last even two weeks.This man here is (proudly) filling 5,000 litres of fuel, enough to meet the needs… pic.twitter.com/6zYWunZbw5— THE SKIN DOCTOR (@theskindoctor13) March 11, 2026 -
తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..
కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. డాక్టర్ శరవణ కుమార్ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్లోనే ఉన్న అతన్ని డాక్టర్ ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!) -
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)


