breaking news
viral
-
'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్
సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు. సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026 -
సంజూ సీక్రెట్.. ఆమెతో లవ్స్టోరీ! చారులత గురించి తెలుసా?
ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్ ఇవానియోస్ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అయితే చారులత తన కెరీర్పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్పై ఫోకస్ పెట్టి కెరీర్లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
అజిత్ పవార్ ‘దుర్ఘటన’.. జై పవార్ సంచలన వీడియో విడుదల
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాద ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇదే విమాన ప్రయాణంలో వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ చీఫ్ పైలట్ సీటులో నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను అజిత్ పవార్ కుమారుడు జై పవార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. ఈ స్థాయి బాధ్యతారాహిత్యం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోహిత్ సింగ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.జనవరి 28న పూణే జిల్లా బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నడుపుతున్నది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జై పవార్.. తన తండ్రిని కోల్పోయిన వేదన వర్ణనాతీతమని, ఆ బాధ జీవితాంతం తమను వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ స్థానంలో కూర్చుని నిద్రపోవడం ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడమేనని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని జై పవార్ అన్నారు.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ ముగిసేవరకు వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన అన్ని విమానాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శనివారం విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై కూడా జై పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.Ajit Pawar's son Jay Pawar shares video showing VSR Ventures owner asleep in airplane cockpit. pic.twitter.com/WurvM6fueH— News Algebra (@NewsAlgebraIND) March 2, 2026ప్రమాద సమయంలో విజిబిలిటీ నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉండటం, రన్వేపై గుర్తులు వెలిసిపోవడం, రన్వే ఉపరితలంపై చిన్నపాటి రాళ్లు ఉండటం ప్రమాదానికి కారణాలు కావచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక అసంపూర్తిగా ఉందని, దీనివల్ల తమకు న్యాయం జరగదని జై పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు, బాధిత కుటుంబాలకు ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ తాజా వీడియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జై పవార్ డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!
వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడే సుమిత్ మిట్టల్ తన మొత్తం సక్సెస్ జర్నీని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. దాంతో కాల్సెంటర్లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్సెట్లో ఆల్ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్లో ఎంసీఏ చేసే రేంజ్కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్కు చేరుకున్నట్లు తెలిపాడు. చివరగా సుమిత్ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.Yes, I failed IIT JEE twiceYes, I failed in chemistry pre board examYes, my family faced financial crisisYes, I worked at a call centerYes, I completed my BCA from a distant collegeYes, I just started with teaching 4 students in a very small roomBut, I got AIR 4 in NIMCET… pic.twitter.com/OOasjxAVhm— Sumit Mittal (@bigdatasumit) February 24, 2026 (చదవండి: హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!) -
బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!
‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు. కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్ బిహారి. ఉత్తర్ప్రదేశ్లోని ఖలీలాబాద్కు చెందిన లాల్ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో బిహారి ‘లీగల్’గా చనిపోయాడు. ఎలా బయటపడిందిఅంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. భయం.. భయంగాబిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. న్యాయ పోరాటం తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్ బిహారి మృతక్’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్గాంధీ, వీపీ సింగ్లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు. ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. ‘మృతక్’ సంఘం ఆవిర్భావంఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్ సంఘం’(అసోసియేషన్ ఆఫ్ ది డెడ్) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు. జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్’ సర్టిఫికెట్ జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. లాల్ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.తెరకెక్కిన ‘కాగజ్’లాల్ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్ కౌశిక్ అనే బాలీవుడ్ దర్శకుడు ‘కాగజ్’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. దిలీప్ మాదిరెడ్డి (చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టాల్సిందే..) -
"పంచ్" ఎమోషనల్ ట్రెండ్..దెబ్బకు అమాంతం ఆ బొమ్మకు డిమాండ్
ఇంటర్నెట్ యుగంలో వైరల్ అవుతున్న కంటెంట్లో చాలావరకు వినోదం, ట్రోల్స్ లేదా షాకింగ్ అంశాలే ఎక్కువ. కానీ కొన్నిసార్లు అత్యంత సాదాసీదా భావోద్వేగ క్షణం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను కదిలిస్తుంది. అలాంటి అరుదైన కథే పంచ్ అనే 7 నెలల జపనీస్ మకాక్ది. జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఉన్న ఈ చిన్న కోతి, తల్లి వదిలేయడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఒంటరితనంలో, తనకు ఏకైక సాంత్వనగా మారింది ఒక ‘స్టఫ్డ్ ఒరంగుటాన్ బొమ్మ’. దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ, భయపడినప్పుడు మరింత బలంగా ఆలింగనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు, వీడియోలుగా బయటకు రావడంతో, సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపించాయి. ఈ ట్రెండ్ హైదరాబాద్లోనూ కనిపించింది. దీంతో ఈ బొమ్మకు నగరంలోనూ, ఆన్లైన్లోనూ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ ప్రపంచ ప్రఖ్యాత ఫరి్నచర్ బ్రాండ్ ఐకియాకు చెందినది కాగా.. ఈ ప్రభావంతో పలు దేశాల్లోని తమ ఐకియా స్టోర్స్లో ఈ బొమ్మకు సోల్డ్ ఔట్ బోర్డుల పెట్టడం విశేషం. ఒక జూలో ఒరంగుటాన్ బొమ్మతో కోతి (మకాక్) వైరల్ పంచ్ వీడియోలు వైరల్ కావడానికి కారణం కేవలం ‘క్యూట్’ ఫ్యాక్టర్ మాత్రమే కాదు. ఈ తరం సోషల్ మీడియా వినియోగదారులు కూడా. ముఖ్యంగా హైదరాబద్ వంటి నగరాల్లో నివసించే యువత.. భావోద్వేగ అనుబంధం, మానసిక ఆరోగ్యం, ఒంటరితనం వంటి అంశాల పట్ల మరింత సున్నితంగా స్పందిస్తున్నారు. పంచ్ కథలో కనిపించింది అదే మానవీయ కోణం. ‘కంఫర్ట్’ అనేది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకూ అవసరమనే భావన ఈ కథ ద్వారా బలంగా ముందుకొచి్చంది. ఈ ప్రభావంతో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ ప్లష్ బొమ్మకు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రముఖ ఈ–కార్ట్ సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా యువత, పెట్ లవర్స్ ఈ బొమ్మలను పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నాయి. కొందరు ఈ బొమ్మలతో దిగిన ఫొటోలు, రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత సందడి చేస్తున్నారు.‘జూ’కు వెళ్లోద్దామా.. హైదరాబాద్ యువతలో పెరుగుతున్న పెట్ కల్చర్, మెంటల్ హెల్త్ చర్చలు, ‘కంఫర్ట్ ఆబ్జెక్ట్స్’ పట్ల ఆసక్తి.. ఇవన్నీ పంచ్ కథను నగరానికి మరింత దగ్గర చేశాయి. రీల్స్, షార్ట్స్, స్టోరీల రూపంలో ఈ కథ స్థానిక సోషల్ మీడియా ఫీడ్స్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కారణంగా నగరంలోని జూలకు వెళ్లే వారి సంఖ్య పెరగనుందని పలువురి అభిప్రాయం. అసలు అలాంటి జంతువు నగరంలోని జూ పార్క్లో ఉందా అని పలువురు ఔత్సాహికులు గూగుల్ సెర్చ్లో అడగడం కొసమెరుపు. అయితే నగరంలోని జూలో ప్రస్తుతం విభిన్న రకాల కొండవానరాలు (మకాక్) కనిపిస్తాయి.. టఫ్టెడ్ మార్మోసెట్, స్క్విరెల్ మంకీ, క్యాపుచిన్ మంకీ, బోనెట్ మకాక్, లయన్–టెయిల్డ్ మకాక్, రేసస్ మకాక్ వంటి స్థానిక కోతులు ఉన్నాయి. కానీ జపనీస్ మకాక్ (పంచ్ మాదిరి) మాత్రం ఇందులో ఉండదు. ఇక ఒరంగుటాన్ వంటి ఏషియాటిక్ గొరిల్లా తరహా అడవిపిల్లి/ఏప్ జాతులు గురించి ప్రభుత్వ జూ వెబ్సైట్ ప్రకారం స్పష్టమైన ప్రస్తావన లేదు. పంచ్ కథ, ఈ డిజిటల్ యుగంలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది. లైఫ్స్టైల్ మార్కెట్పై ప్రభావం.. పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ సాఫ్ట్ ఒరంగుటాన్ బొమ్మ వీడియోలు వైరల్ అనంతరం జపాన్, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు భారత్ వంటి దేశాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కొన్ని దేశాల్లో ఇది స్టాక్ అవుట్ అయినట్టు సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొన్నారు. సోషల్ మీడియా వైరల్ ట్రెండ్లు ఎలా నేరుగా లైఫ్స్టైల్ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయో చెప్పే తాజా ఉదాహరణ. ఒక భావోద్వేగ కథ, ఒక సాధారణ ఉత్పత్తిని గ్లోబల్ ట్రెండ్గా మార్చగలదన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. -
బాలభీముడు..ఏకంగా 5.9 కిలోలు..
పుట్టుకతోనే రికార్డు సృష్టించింది ఈ నవజాత శిశువు. అసాధారణ జననంగా నిలిచింది. ఈ ఘటన న్యూయార్క్లో చోటు చోసుకుంది. జనవరి 31న కయుగా మెడికల్ ఆస్పత్రిలో 5.9 కిలోల బరువున్న షాన్ జూనియర్ అనే మగబిడ్డ జన్మించాడు. సగటు నవజాత శిశువు బరువు కంటే దాదాపు రెండు రెట్లు బరువుతో ఒక మగబిడ్డ జన్మించడంలో అక్కడున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. తమ ఆస్పత్రిలో ఇప్పటివరకు జన్మించిన అత్యంత బరువైన శిశువని అన్నారు. ఆ శిశువు తల్లిదండ్రలు టెర్రికా, షాన్ దంపతులు తమ బిడ్డ పెద్దగా పుడతాడని అనుకున్నాం కానీ..మరి ఇంత బారీగా పుడతాడని అనుకోలేదని, చాలా షాక్ అయ్యామని చెబుతున్నారు. ఆ బిడ్డకు డైపర్లు మూడు నుంచి ఆరునెలల బిడ్డకు ఉపయోగించవే వాడాల్సి వచ్చిందని అన్నారు. తాను మూడు నెలల వయసున్న శిశువుకి జన్మనిచ్చానని సంబరపడిపోతోంది తల్లి టెర్రికా. ఆ బాలభీముడు జన్మించిన మరో ఆడ శిశువు జన్మించింది. ఆ బిడ్డ బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే. సదరు ఆస్పత్రి ఈ ఇద్దరు పిల్లల జనన వేడుకలను జరుపుకుంది.ప్రతి జననం ప్రత్యేకమైనది, ఆ తల్లిదండ్రులకు ఓ మధుర జ్ఞాపకం కూడా అని అన్నారు. కాగా చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత బరువైన శిశువు జనవరి 19, 1878న ఒహియోలోని సెవిల్లెలో జన్మించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం..బేబ్గా పిలిచే ఆ శిశువు పుట్టినప్పుడు ఆశ్చర్యకరంగా 9.98 కిలోలు బరువు, 28 అంగుళలా పొడవుతో ఉన్నాడు. దాంతో ఇప్పటివరకు నమోదు చేయబడ్డ అతిపొడవైన బరువైన నవజాత శిశవుగా రికార్డులెక్కింది. అయితే ఆ శిశువు కేవలం 11 గంటలు మాత్రమే జీవించింది. (చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..) -
ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వందల కిలోమీటర్లు..
రోజు కాదు రెండురోజులు కాదు ఒక దేశం మరో దేశం కాదు...ఆ ఇద్దరు మిత్రులు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి ఏడాదిన్నర పాటు నడుస్తూ 12000 కిలోమీటర్లు నడిచి చైనాకు చేరి తమ యాత్ర ముగించారు. లోయిక్ వాయిసాట్, బెంజిమిన్ హంబోల్ట్ ఈ ప్రయాణంలో గ్రహించింది ఏమిటంటే మనుషులు అట్టే చెడ్డవారు కాదని!‘ప్రపంచాన్ని చూడాలని ఉంది. ప్రకృతితో మమేకమై బతకాలని ఉంది’ అని చాలామంది అంటూ ఉంటారు. కాని ఆ ఇద్దరు యువకులు మాత్రం దాన్ని చేసి చూపించారు. కష్టాలను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం ఎందుకు సాధ్యం కాదో నిరూపించడానికి ఈ ప్రయాణం చేశారు. దేవుడిచ్చిన రెండు కాళ్లు ఎంత దూరం తీసుకెళ్లగలవో చూద్దామని కూడా వాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణానికి నడుము కట్టారు. కదలాలనే తలంపు ఉండాలేగాని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లడానికి కాళ్లున్నాయని వీరు నిరూపించారు. అందుకే ఆ పాదాలకు నమస్కారం.ఆ ఇద్దరు..27 ఏళ్ల బెంజమిన్ హంబోల్ట్, 26 ఏళ్ల లోయిక్ వాయిసాట్ పారిస్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఏదో వెలితి. జీవితం మరీ రొటీన్ అయిపోతోందన్న తలంపు. అటు ప్రపంచాన్ని, ఇటు తమ అంతరంగాన్ని ఒకేసారి చూడాలన్న కోరిక. అందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. సెప్టెంబర్ 2024లో ఉద్యోగాలు వదిలేశారు. వారి స్వస్థలం అన్నేసీ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. చైనాలోని షాంఘై చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందుకోసం వారు ఏ వాహనాన్నీ ఆశ్రయించలేదు. కేవలం కాలినడకనే ఐకానిక్ సిల్క్ రూట్ ద్వారా 16 దేశాలు దాటాలని నిశ్చయించుకున్నారు. 17 నెలలపాటు 8 వేల మైళ్లు (12వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసిన వారు ఇటీవల వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.ఏయే దేశాలు దాటి వచ్చారు? ఫ్రాన్నష్ నుంచి నడక మొదలుపెట్టిన లోయిక్, బెంజిమిన్ తమ ప్రయాణంలో భాగంగా స్విట్జర్లాండ్, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా, టర్కీ, రష్యా, ఉబ్జెకిస్థాన్, కిర్జిస్థాన్, కజికిస్థాన్ తదితర దేశాలు దాటారు.చివరి మజిలిగా చైనానే ఎందుకు?చైనానే తమ అంతిమ గమ్యస్థానంగా ఎందుకు చేసుకోవాలనుకున్నారని వారిని అడిగినప్పుడు వారి సమాధానం చాలా బలమైన చరిత్రకు సూచనగా నిలిచింది. ‘ఇది వైరుధ్యాల భూమి. ఇక్కడ పురాతన నాగరికత వేగవంతమైన ఆధునికీకరణను కలుస్తుంది. ఫ్రాన్స్లో ఉన్న మాకు ఈ నేలకు చేరుకోవాలని అనిపించింది. మా నిత్యజీవితాల్లో ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఇంత దూరం రాక తప్పదని మాకు అనిపించింది’ అని వారు వివరించారు.మనుషులు మంచివాళ్లేఈ ప్రయాణం లోయిక్, బెంజిమిన్కు ఎన్నో గొప్ప అనుభవాలు ఇచ్చింది. ‘మేము దారిలో మనుషులను కేవలం మంచినీళ్లు అడిగేవాళ్లం. వాళ్లు మా యాత్ర గురించి తెలుసుకుని నీళ్లతో΄ాటు ఎన్నెన్నో ఇచ్చేవారు. మనుషులు మంచివాళ్లు’ అన్నారు వాళ్లిద్దరు. జిన్జియాంగ్ రాజధాని ఉరుంకిలోని ఒక హోటల్లో దిగినప్పుడు అక్కడి సిబ్బంది వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు. అంతేకాకుండా స్థానిక పోలీసు అధికారులు మూన్ కేక్లు, అక్కడి సాంప్రదాయ పెరుగును బహుమతిగా ఇచ్చారు. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మంచి మనుషులు తమకు సాయం చేశారని, అందువల్లే తాము సురక్షితంగా గమ్యం చేరామని అంటున్నారు. బోస్నియాలో ల్యాండ్మైన్స్ ఉంటాయన్న విషయం తమను భయపెట్టిందని, అయితే ప్రమాదమేమీ జరగకుండా సురక్షితంగా వచ్చామని తెలిపారు. తమ నడకలో తాము గొప్పగా ఆస్వాదించింది సూర్యోదయాలను అని వారన్నారు. బాగా నడిచి నిద్రకు సిద్ధమైతే ఆ కమ్ముకొచ్చే నిద్ర గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. నిద్ర పట్టక, ఉన్న చోటునే ఉండి వ్యాయామం ఎరగక ఉంటున్నవారు వీరిలా కాకపోయినా కొంతైనా నడిచినా అదే తమకు తాము ఇచ్చుకునే గొప్ప కానుక. (చదవండి: భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..) -
చంద్రబాబు అసలు స్వరూపం
-
కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్ ఏంటంటే..
కొన్ని ఘటనలు చాలా సిల్లీగా ఉంటాయి. మనుషులు కూడా..చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడటం వల్లనో అపార్థం చేసుకోవడం వల్లనో.. క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి..చంపుకునేంత వరకు వెళ్లిపోతోంది పరిస్థితి. ఇక్కడ కూడా అచ్చం అలానే చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సరదాగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం జస్ట్ ఓ కుక్క కారణంగా ఘర్షణ వాతావరణంగా మారి ఏకంగా పెళ్లే ఆపేసేందుకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన వివాహ వేడుక కుక్క కారణంగా హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దివంగత సునీల్ కుమార్ , సరోజ్ గుప్తాల కుమార్తె తాన్య కేషర్వాణి, దివంగత రాకేష్ చందా, బాబ్లీదేవి కుమారుడు సుమిత్లు ఇంటి నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల ఫిబ్రవరి 18న ఫతేపూర్ అధికారిక వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. పెళ్లి తంతులో భాగంగా బంధువులు, శ్రేయోభిలాషులు నడుమ తెల్లవారుజామున 4 గంటలకు ఆభరణాలు సమర్పించే ఆచారం సాగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబం పెంపుడు కుక్క దూకుడుగా మొరగడం ప్రారంభించింది. విసుగుతో వరుడు కుటుంబానికి చెందిన యువకుడు ఆ కుక్కను కొట్టడంతో మొదలైన గొడవ..చూస్తుండగానే క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. ఈ ఉద్రిక్త ఘటనలో మహిళలతో సహా సుమారు ఎనిమిది మంది దాక తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరుఫు కుటుంబంలో ముగ్గురి తలలకు తీవ్ర గాయలయ్యినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్టేషన్కు చేరుకున్నాయి. అక్కడ వివాహాం అధికారికంగా రద్దు చేశారు. ట్విస్ట్ ఏంటంటే వధువు తాన్య దీన్ని నిరాకరించింది. తమ పెళ్లి ఎప్పుడో జనవరిలో అయిపోయిందని, ఇది అధికారికంగా నిర్వహించిన తంతు అని స్పష్టం చేసింది. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ తన భర్తతో కలసి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి మరి వివరణ ఇవ్వడం విశేషం.(చదవండి: కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!) -
లిఫ్ట్ ఫెయిల్ ..చిన్నారి తెగువతో తప్పిన ప్రమాదం
ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కామన్ గా మారాయి. తయారీ సంస్థలు సరైన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. అయితే లిఫ్ట్ లో చిక్కుకోబోయిన ఇద్దరు చిన్నారులను ఒక బాలిక మెలకువతో తక్షణమే స్పందించి కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఒక అపార్టుమెంటులోని ఎలివేటర్ లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వారి కుటుంబసభ్యుల కోసం వేచిచూస్తు అక్కడే ఉన్న బాలిక లిఫ్ట్ ని తన చేతితో ఆపుతుంది. అయితే వారు లిఫ్ట్ ద్వారాల మధ్యలో ఉండగానే ఆ గేట్స్ అకస్మాత్తుగా క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ చిన్నారి లోపలికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న బాలిక తక్షణమే స్పందించి వారికి తన చేయితే లిఫ్ట్ ని బిగియపట్టింది.తన శక్తికి మించిన పనైనా ఏమాత్రం అ ధైర్యపడకుండా బిగుతుగా లిఫ్ట్ గేటును పట్టుకుంది. ఇంతలోనే వారి కుటుంబసభ్యులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా ఆ చిన్నపిల్లలను బయిటకి తీశారు. దీంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. సాధారణంగా లిఫ్ట్ సెన్సార్స్ ఏదైనా అడ్డు చూపితేనే వెనక్కి వెళతాయి. అయితే ఇందులో చిన్న పాప అడ్డు ఉన్నప్పటికీ ఆ డోర్స్ క్లోజ్ అవడం ఆందోళనకు గురిచేస్తోంది.ఈ లిఫ్ట్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక ధైర్యసాహసాలకను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఎలివెేటర్ల భద్రతని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ తయారిలో ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ఏంటని ఇలాంటి వాటి వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. A small girl is seen at the entrance of a residential lift. As the elevator doors began to close, she noticed another child running toward the lift from the corridor.Without hesitation, the girl used her own body to partially block the doorway, preventing the heavy doors from… pic.twitter.com/llUbPdk5eN— SUNIL KUMAR (@ijustsunil) February 21, 2026 -
సమస్య అబ్బాయిలది కాదు..! 1950ల నాటి ఆలోచనలనే..
మహిళా సాధికారత అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పేస్తుంటాం. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడతాం. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పాతధోరణికే వంతపాడతాం. అందులోనూ అత్తగా హోదా రావడంతోనే మహిళలు వెనుబడిపోతున్నారా..?లేక ఏళ్ల నాటి కుచించిత మనస్తత్వం వల్లనో తెలియదు..కానీ అప్పటి వరకు ఉన్న స్త్రీత్వం అత్త అన్న పదం కారణంగా తక్కువగా మారిపోతోంది. చూడటానికి సింపుల్గా కనిపించే ఈ రెండు అక్షరాల పదబంధం తెలియకుండానే తనలోని స్త్రీకి తానే హాని చేసుకుంటూ..ఎవరో తొక్కేస్తున్నారు అని అనుకుంటోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట వైరల్ అవుతోన్న ఓ అత్త డిమాండ్ చూస్తే..ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామనిపిస్తుంది.ఏఐ టెక్నాలజీ, రోబో టెక్నాలజీతో దూసుకుపోతున్న తరుణంలో పెళ్లి విషయంలో కాస్త అప్గ్రేడ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదేమో అంటున్నారు గురుగ్రామ్ సీఈఓ జస్వీర్ సింగ్. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆధునిక కుటుంబాల ఆలోచనలు ఈకాలంలో కూడా ఇలానా అన్నట్లుగా ఉన్నాయంటూ రాసుకొచ్చారు. యువత సైతం కెరీర్ వరకు ఎంత బాగా ఆలోచించినా..కొన్నివిషయాల్లో ఆలోచనలు పాతధోరణికే వంతపాడుతున్నారని అన్నారు. మాట్రిమోనియల్ యాప్ నాట్. డేటింగ్ సీఈవో ఓ మాట్రీమోనిల్ ప్రొఫెల్ని షేర్ చేస్తూ..వారి డిమాండ్లు గురించి రాశారు. డిల్లీ చందిన ఓ తల్లి తన కొడుకు రూ. 75 లక్షలు సంపాదిస్తున్నాడని, కాబట్టి కాబోయే కోడలు..మంచి పేరున్న యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయి అయ్యి..ఉద్యోగం చేసే ఆలోచన ఉండకూడదని కండిషన్ పెట్టారామె. పైగా..అందంగా ఉండాలి, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అయ్యి ఉండాలి. ఇంటికి, కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తన కొడుకు భార్య పెళ్లి తర్వాత పనిచేయడం తమకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. వాళ్లు ముఖ్యంగా డిమాండ్ చేస్తోంది ఏమిటంటే..కెరీర్కి అంత ప్రాధాన్యత ఇవ్వని అమ్మాయి కావాలని చెబుతున్నారు. అయితే సీఈవో జస్వీర్ సింగ్ మాత్రం వాళ్లకి కావాల్సింది మంచి డిగ్రీ, అందమైన శరీరం ఉన్న పనిమనిషి కోసం చూస్తున్నారని అన్నారు. ఇటీవల ఇలాంటి డిమాండ్లో కూడిన కేసులను చాలానే చూస్తున్నామని అన్నారు. ఆధునికులు కానీ సాంప్రదాయవాదులు, తెలివైనవారు కానీ విధేయులు, కార్పొరేట్ తరహా రేంజ్ కానీ కావాల్సింది 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారంటూ నేటి మగపిల్లల కుటుంబాల ఆలోచన తీరుని విమర్శించారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అసలు మనం సమాన భాగస్వామ్యానికి సిద్ధంగా లేం కదూ..!. చదువుల్లోనూ, సంపాదనలోనూ అప్గ్రేడ్ అవుతాం కానీ..పెళ్లి విషయంలో మాత్రం కాలం చెల్లిన ధోరణిలో ఉండటానికే ఇష్టపడుతుండటం బాధకరం. ఇక్కడ సమస్య అబ్బాయిలది కాదు..పెద్దలు తమ ఆలోచన తీరు బ్లూప్రింట్నే వారిలో నాటేస్తుండటం వల్ల వస్తున్న సమస్య ఇది. వివాహాలు చేసే విధానంలో డెవలప్మెంట్ ఉంది, కానీ మనస్తత్వాలను మార్చుకోవడం లేదా అప్గ్రేడ్ అవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నారు.(చదవండి: ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..) -
బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. అయితే అరుదైన వ్యాధితో చనిపోవడానికి ముందు తన ఇద్దరు కుమార్తెలు (బిల్లీ, జార్జియా) కోసం రాసిన భావోద్వేగపూరితమైన సందేశం నెట్టింట వైరల్గా మారింది. ఈ సందేశాన్ని విన్న తరువాత కన్నీళ్లు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎరిక్ డేన్ తన జీవితంలోని ఒడిదుడుకులు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, డిప్రెషన్ వంటి సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘‘లెటర్స్ టు మై డాటర్స్" (Letters to My Daughters) అనే ప్రాజెక్ట్లో భాగంగా తీవ్రమైన భావోద్వేగంతో తన ఇద్దరు కుమార్తెలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, తమకు తాము నిజాయితీగా ఉండాలని కోరారు. తాను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు, కానీ నా తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానన్నారు. తన పిల్లలు కూడా తప్పులు చేయడానికి భయపడ కూడదని హితవు పలికారు. తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని, వారి ఎదుగుదలలో తండ్రిగా గర్వపడతానని చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చారు. లోకం ఏమనుకున్నా సరే, తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.కన్నీళ్లు పెట్టించే ఎరిక్డేన్ ఏమోషనల్ మెసేజ్ ‘‘వర్తమానంలో జీవించండి.ఇప్పుడే, ఈ క్షణమే. మీ దగ్గర ఉన్నదల్లా ఈ వర్తమానమే. దానిని నిధిలా దాచుకోండి. ప్రతి క్షణాన్ని ప్రేమగా ఆస్వాదించండి. ప్రేమలో పడండి. అది కేవలం ఒక వ్యక్తితో కాకపోవచ్చు (అది కూడా మంచిదే అనుకోండి). కానీ ఏదో ఒక దానితో ప్రేమలో పడండి. మీ అభిరుచిని, మీ సంతోషాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని ఉదయాన్నే నిద్రలేపేలా చేసే, రోజంతా ఉత్సాహంగా నడిపించే ఒక లక్ష్యాన్ని కనుగొనండి. అమ్మ, మీరు ఎన్నో ప్రదేశాలు చూశాం. ఎన్నో బీచ్ల్లో గంటల తరబడి సంతోషంగా గడిపాం. ఆ క్షణాలు ఎప్పటికీ నాతోనే.స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనస్తత్వానికి తగ్గ వ్యక్తులను వెతకండి, వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉండండి. ఆపై వారికి అంకితమవ్వండి. ఎటువంటి తీర్పులు, షరతులు, ప్రశ్నలు ఉండని నిజమైన స్నేహితులు మీకు తిరిగి అంతే ప్రేమను ఇస్తారు. మీ స్నేహితుల్ని ప్రేమించండి.వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు..నవ్విస్తారు. సాయం చేస్తారు..మార్గనిర్దేశం చేస్తారు. కొంతమంది మిమ్మల్ని కాపాడతారు.మీలోని ప్రతి అణువుతో, ఆత్మగౌరవంతో పోరాడండి. మీకు అనారోగ్యం లేదా మరేదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, పోరాడండి. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ చివరి శ్వాస వరకు పోరాడండి. ఈ వ్యాధి నా శరీరాన్ని నెమ్మదిగా హరిస్తోంది కావొచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయ లేదు.మీరు దేనినైనా ఎదుర్కోగలరని, మీ జీవితం ముగిసిపోవచ్చని, నరకాన్ని కూడా గౌరవంగా ఎదుర్కోగలరని నేను నిరూపించానని ఆశిస్తున్నాను. మై డియర్ బిల్లీ, జార్జియా, మీరే నా హృదయం, మీరే నా సర్వస్వం. తలెత్తుకుని పోరాడండి. శుభరాత్రి. ఐ లవ్ యూ’’ అంటూ ఇచ్చిన సందేశం ఆయన మరణం తరువాత విడుదలైంది. ఇది పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.“I hope I've demonstrated that you can face anything, you can face the end of your days, you can face hell with dignity. Fight, girls, and hold your heads high. Billie and Georgia, you are my heart, you are my everything. Goodnight. I love you.Eric Dane leaves his daughters —… pic.twitter.com/kHA4UjW4yK— Netflix (@netflix) February 20, 2026 మరోవైపు డేన్ స్నేహితులు , మద్దతుదారులు ALS తో పోరాడుతూ మరణించిన డేన్ భార్య రెబెక్కా, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, బిల్లీ, జార్జియా కోసం GoFundMe ప్రచారం ప్రారంభించారు. లాస్ ఏంజిల్స్లోని "ఫ్రెండ్స్ ఆఫ్ ది డేన్ ఫ్యామిలీ" ‘ఇన్ హానర్ ఆఫ్ ఎరిక్ డేన్’ అనే పేరుతో ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.1.07 కోట్లనిధులను సేకరించారు. మొత్తం 2.27 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా అమెరికన్ టీవీ సిరీస్ గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు పొందిన ఎరిక్ డేన్ 53 ఏళ్లకే (2026 ఫిబ్రవరి 19న) చనిపోవడంతో హాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనేది ప్రొగ్రెసివ్ న్యూరోడీజెనరేటివ్ వ్యాధి.ప్రస్తుతం దీనికి చికిత్స లేదు.తన మరణానికి ముందు, ఎరిక్ డేన్ తాను మరణించిన తర్వాతే ఈ విషయం ప్రపంచంతో పంచుకుంటాడనే అవగాహనతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ALS తో తన పోరాటం, వ్యసనంతో తన పోరాటాలు, రెబెక్కా గేహార్ట్తో ప్రేమతదితర విషయాలు పంచుకున్నాడు. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ నెట్ఫ్లిక్స్లో ఉంది. -
ఈ వధువరులది ఎంత గొప్ప మనసు..!
చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్ స్టాఫ్ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.ఈలోపు వధూవరులు...‘క్యాటరింగ్ స్టాఫ్ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. వధూవరులకు పాన్ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by @Cinematographer🎬 (@aarush7069) -
ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..
నూట నలభై ఆరు సంవత్సరాల డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (డీహెచ్ఆర్) చరిత్రలో తొలి మహిళా టికెట్ కలెక్టర్ (టీసి)గా సరితా యోల్మో చరిత్ర సృష్టించింది. ప్లస్ టు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రావడంతో పై చదువులు చదువుకోలేకపోయింది సరిత. ఆమె భర్త దవా యోల్మో కూడా రైల్వేలో పనిచేసేవారు. ఆయన సీనియర్ సెక్షన్ ఇంజినీర్గా రిటైర్ అయ్యారు.‘సరిత అంకితభావం ఉన్న ఉద్యోగి మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను ఎలా సమన్వయం చేసుకోవాలో బాగా తెలిసిన మహిళ. డీహెచ్ఆర్లో ఫస్ట్ ఉమెన్ ట్రైయిన్ టికెట్ కలెక్టర్గా సరితను చూడడం గర్వంగా ఉంది’ అంటున్నాడు దవా యోల్మో.న్యూ జల్పైగురి నుండి నడిచే బ్రాడ్–గేజ్ రైళ్లలోటికెట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది సరిత.‘డీహెచ్ఆర్లో టీసిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొంత భయం కూడా ఉంది. న్యూ జల్పైగురి, డార్టిలింగ్ల మధ్య పది గంటల ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం నా ఉద్యోగ జీవితంలో కొత్త ఎపిసోడ్’ అంటుంది సరిత.టికెట్ కలెక్టర్ యూనిఫామ్లో ఉన్న సరితను ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రయాణికులు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు.‘కుర్సియాంగ్లోని రైల్వే ప్రెస్లో పనిచేయడం నాకు సంతోషంగా ఉండేది. అయితే ఆ ప్రెస్ మూసివేయడంతో విధి నాకు వేరే దారి చూపింది. న్యూ జల్పైగురికి బదిలీ కావడంతో కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వచ్చింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని వాణిజ్య విభాగంలో చేరకపోతే, నాకు కొత్త అవకాశాలు వచ్చేవి కావు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది సరిత. View this post on Instagram A post shared by The CSR Journal (@thecsrjournal) (చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..) -
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ) -
లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ
ఇటీవల కాలంలో లేఆఫ్స్ కామన్గా మారాయి. ఇంతకుమునుపు కేవలం ఐటీ రంగానికే పరిమితమవ్వగా, ఇప్పుడు అన్నిరంగాలకు ఇది పాకింది. దీని ప్రభావంతో ఉద్యోగుల్లో అభద్రతా, ఏ క్షణం ఏం జరుగుతోందన్న ఒత్తిడి ఎక్కువయ్యాయి. తమ సహోద్యోగులు ఉద్యోగాలు పోయాయంటేనే..మనకేం జరుగుతోందో అనే ఆందోళన. ఇది ఉద్యోగం సంపాదించడాని కంటే భయంకరమైన టెన్షన్. సింపుల్గా చెప్పాలంటే 40 ఏళ్లు వస్తే ఆ ఉద్యోగి జాబ్ ఉంటుందా లేదా అన్నంత గుబులు మదిలో మెదులుతోంది. అలాగని టెన్షన్తో బతకలేం కదా..మరి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసి..మళ్లీ మన ట్రాక్లోకి రావాలో ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి మాటల్లో తెలుసుకుందామా..!.అతడే 47 ఏళ్ల మాజీ టెక్ ప్రొఫెషనల్ హేమంత్ విర్మానీ. ఈ భారత సంతతి వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ..లేఆఫ్ని ధైర్యంగా ఫేస్ చేయక తప్పదని అంటున్నాడు. తన గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు హేమంత్. "నేను యూఎస్లోని అమెజాన్లో సుమారు పదకొండున్నరేళ్లుగా సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను. సరిగ్గా 2023 నుంచి మా కంపెనీలో తొలగింపులు చేపట్టడం చూశాను. నా బృందంలోని సభ్యులను తొలగించడం చాలా దగ్గరగా చూశాను. అది ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలుసు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి నాకు వస్తుందని అప్పుడు తెలియలేదు. సరిగ్గా అక్టోబర్ 2025 అర్థరాత్రి నన్ను తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చాక గానీ తెలిసిరాలేదు. ఆ క్షణం ఒక్కసారిగా షాక్కి గురయ్యా..!. కళ్లముందే పరిస్థితి తలకిందులైనట్లుగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. చాలా రోజుల వరకు ఉద్యోగం పోగొట్టుకున్నా అనే బాధలోనే ఉండిపోయా. అయితే ఆ రోజు నా ఉద్యోగం పోయిన వెంటనే నా మేజనర్తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడాను. ఆయన నాతో చాలా సానుకూలంగా, మానవీయంగా మాట్లాడారు, పైగా నా స్కిల్స్ని అభినందించారు కూడా. అంతేగాదు ఆ తదుపరి మరసటి రోజు ధైర్యంగా ఉన్నానా? లేదా? అని నా పాత మేనేజర్ కాఫీషాప్ వద్దకు వచ్చి కలుస్తుండేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన లేఆఫ్ అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ వాళ్లంతా సానుకూలంగా వ్యవహరిస్తున్నా..నా(హేమంత్) పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్నట్లుగా..నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యేవాడిని. ఈ పరిస్థితిలో నా కూతురు ఎలా ఉంటుందా అని గమనించగా..నా చిట్టితల్లే నాకు గొప్ప పాఠం నేర్పిందని చెబుతున్నాడు హేమంత్. పరిస్థితులు మారినప్పుడూ వాటిని అంగీకరిస్తూ..ఆమె తన ఖర్చులను సర్దుబాటు చేసుకున్న తీరు..ఎప్పటికీ ఇలానే ఉండపోమన్న ఆమె నమ్మకం..మళ్లీ నన్ను భుజం తట్టి నిలబడేలా చేశాయి. అప్పుడే తెలిసింది..లేఆఫ్తో..అప్పటి వరకు నేను వదిలేసిన ప్రతి పనులను తిరిగి చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా నా కూతురు ప్రాజెక్ట్ వర్క్స్లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం వరకు అన్నిటిపై ఫోకస్ పెట్టా. అలాగే ఇక తదుపరి నేనేం చేయాలనే దిశగా అడుగులు వేస్తూ.. ఏఐ స్కిల్స్పై దృష్టిసారించాను. అలాగే మళ్లీ పుంజుకోవడానికి మార్గాలేంటో అన్వేషించడం ప్రారంభించా. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేసినప్పుడూ..అలా ఉండిపోకూడదు..మరింత బలంగా పైకి ఎగరడం ఎలాగో ఆలోచించడం నేర్చుకున్నా. అంతేగాదు ఆ లేఆఫ్ని మన అభ్యున్నతికి వరంగా మార్చుకోవాలని తెలుసుకున్నా" అంటూ..తన అనుభవాన్ని అత్యద్భుతంగా వివరించాడు హేమంత్. అతని పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..గొప్ప స్ఫూర్తిని నింపావు బాస్ అని పోస్ట్లు వెల్లువెత్తాయి.(చదవండి: టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్చేస్తే..) -
65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే!
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్..రెయ్..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్ కూడా ఉంది. అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్-ఉండేల్ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్ పొందానంటోంది బామ్మ. సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్ని బుక్చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. View this post on Instagram A post shared by Sonali H N (@shesays2324) (చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ‘ఐరా’
క్రికెట్ మ్యాచ్లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్గా మారాయి.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ ఎవరీ ఐరాఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్. విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువటఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్) View this post on Instagram A post shared by Aira Rawat (@aira_rawat_) -
గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..
బంగారం ధర ఏ రేంజ్లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్లో ఒక వ్యక్తి ఒక బాక్స్ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్ బ్రాండ్లు బాగా ఫేమస్ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.Saudi wedding ceremonyBride’s brother offers 24 karat Gold biscuits to Groom’s family 😳pic.twitter.com/2lOAZwUhoi— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 11, 2026 (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూసలమ్మే అమ్మాయి గుర్తుందా..!. అందమైన మోముతో అందర్నీ ఆకర్షించి..రాత్రికిరాత్రికే సంచలనంగా మారింది. పైగా నటిగా అవకాశం వరించింది కూడా. అలా ఏదోక విశిష్ట లక్షణంతో సెన్సెషన్ అయిన వాళ్లెందర్నో చూశాం. కానీ ఇలాంటి కళ్లున్న అమ్మాయిని మాత్రం చూసుండరు. ఈ అమ్మాయి 20 ఏళ్ల క్రితం పలు పోస్ట్కార్డ్లపై కనిపించి సంచలనంగా మారింది. అయితే అప్పుడు సోషల్ మీడియాలు లేవు కాబట్టి..మ్యాగ్జైన్ కవర్పేజీలో, పర్యావరణ సావనీర్లలోనూ ఆమె ముఖ చిత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏముంది ఆమె ముఖంలో అంతగా ఆకర్షించేది అంటే..ఆమె అందమైన కళ్లు. కవులు చెప్పే కలువరేకుల్లాంటి కనులు గురించి విని ఉంటారు. కానీ ఈమె కళ్లు ఎలా ఉంటాయో తెలిస్తే..విస్తుపోతారు. ఇంతకీ ఎవరీమె అంటే..దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్లోని పుష్కర్ ఫెయిర్లో ఆ యువతి ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎడారి పట్టణ నేపథ్యం నుంచి వచ్చి ఆమె చిత్రాలు చాలా దూరం ప్రయాణించాయి. ఆ అమ్మాయే రాజస్థాన్కి చెందిన పప్పుదేవి. మళ్లీ ఇన్నేళ్లకు ఆన్లైన్లో ఆమె ఫోటో వైరల్గా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ఇంతకీ ఆమె మోములోని స్పెషల్టీ మొత్తం కళ్లదే. ఆ కళ్లు అలాంటి ఇలాంటివి కాదు..అచ్చం పులి లాంటి అందమైన కళ్లు. వాటిని చూస్తే కళ్లుతిప్పుకోలేం. మరోసారి చూడాలనిపించేంతగా కట్టిపడేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఒక విజిటింగ్ ఫోటోగ్రాఫర్ ఆమె అద్భుతమైన పులికళ్లను క్లిక్మనిపించడంతో ఆమె ముఖ చిత్రం పలు వార్తపేపర్లలోనూ, పోస్టకార్డులపైకి వెళ్లిపోయింది. అలా ఆమె రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది. మళ్లీ సరిగ్గా ఇప్పుడుమరోసారి ఆ పప్పుదేవి ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందని ఆరాలు మొదలయ్యాయి. ఇక పప్పు దేవి ఒక సఫారి డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆమె ఇద్దరు కుమార్తెలకు వారసత్వంగా పులికళ్లు వచ్చాయి. ఆ అమ్మాయిలు ఇద్దరు పప్పు దేవికి స్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటారట. పర్యాటకులను పిలుస్తూ..మిర్రర్ వర్క్ బ్యాగులను విక్రయించడంలో సాయం అందిస్తారట. అయితే సందర్శకులు చాలామంది తనను, ఆ ఇద్దరు కుమార్తెలను చూసి అవిశ్వాసం వ్యక్తం చేస్తూ..ప్లీజ్ కళ్లజోడు పెట్టుకోరా అని అడగుతారని అంటోంది పప్పుదేవి. కాగా, పప్పుదేవి తాను బంజారా కమ్యూనిటీకి చెందినదాన్ని కాదని స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి తన కళ్లను చూసి అందుకు సరిపోయే దుస్తులు ధరించమని సూచించడంతో ఈ వేషధారణలో ఉన్నానని వివరణ ఇచ్చిందామె. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..!
వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్లో వైరల్ అవుతున్న పోస్ట్. అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్ ఫర్ఈచ్ అదర్' అంటూ కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్లో. అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్ ఆర్డర్ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత తనకు గిఫ్ట్ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్డేకి ఇచ్చిన గిఫ్ట్లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్ ప్లషీ, చాక్లెట్ బార్ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.(చదవండి: టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!) -
'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..
తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పైగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడంపై సూచనలు కూడా ఇచ్చారు. అయితే థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి చెప్పే పేరెంటింగ్ పాఠాలు చాలా ఆలోచనాత్మకంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను అభ్యున్నతి మార్గంలో నడిపించే దిక్సూచిలా ఉంటాయి అవి. గతంలో దీని గురించి తన అనుభవాలను జోడిస్తూ చెప్పారు. ఈసారి పిల్లల పెంపకంపై పేరెంట్స్ని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికర పోస్ట్ చర్చనీయాంశమై హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్లో ఏ చెప్పారంటే..తన పోస్ట్లో వేలుమణి పిల్లలను పెంచడాన్ని రెండు విధాలుగా పోల్చారు. టైప్ ఏ అని రాస్తూ..చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ..పిల్లలను బహిరంగంగా అభినందించడం, పోరుగువారితో తమ పిల్లల సక్సెస్ని షేర్ చేసుకుంటుంటారు. అంతేగాదు అక్కడితో ఆగారు..అందుకుగానూ విదేశీ పర్యటనలు అంటూ వారికి సర్ప్రైజ్ గిప్ట్లు కూడా ఇస్తుంటారు. ఈ పేరెంటింగ్ విధానంలో ఇరువురు సంతోషంగా ఉంటారు. కానీ పిల్లల్లోని అసలైన ప్రతిభాపాటవాలు వెలులోకి రావని అంటున్నారు. మరోవైపు టైప్ బి అనేది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక చిన్న సమస్యను పరిష్కరించేలా ప్రేరేపిస్తారు. దాని తర్వాత మరింత పెద్ద సమస్యను ముందుంచుతారు. అలా క్రమంగా సవాళ్లను స్వీకరించే సామార్థ్యం..అధిగమించి శక్తిని పుంజుకునేలా బలోపేతం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వారిలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీసే యత్నం చేస్తుంటారు. ఇది పిల్లలకు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ ఉండటాన్ని నేర్పిస్తుంది. ఫలితంగా పిల్లలు ప్రయోజకులు అవ్వడమే కాదు..బలోపేతమైన పెద్దలుగా మారేందుకు దోహదపడుతుంది. చాలామటుకు పిల్లల సామర్థ్యాలను వెలికితీసేలా పెంచెలాని కోరుతూ..పిల్లలను గారబం మాత్రం చెయ్యొద్దని హితవు పలికారు పోస్ట్లో. అయితే వేలుమణి చెప్పిన ఈ అంశం నెటిజన్లుల్లో ఒక విధమైన ఉత్సుకతను రేపి..చర్చలకు తెరలేపింది. ప్రోత్సహిస్తేనే కాదా..పిల్లలు ముందుకు పోగాలరు. దాన్నే వద్దంటున్నారు అని కొందరు, కఠినమైన ప్రేమ అనేది పిల్లవాడిలోని నిజమైన సామర్థ్యాన్ని అన్లైక్ చేస్తుందని మరొకొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇక్కడ వేలుమణి చెబుతోంది అది కాదు. ఆయన ఎల్లప్పుడూ పిల్లలను ప్రేమించండనే అంటున్నారు. అయితే కాస్త తెలివిగా ప్రశంసిస్తూ..పిల్లలు బలాన్ని పుంజుకునేలా చేయాలి. కంఫర్ట్జోన్కి పరిమితం కానివ్వకుండా సవాళ్లును చలాకీగా స్వీకరించే బలోపేతమైన వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దాలనే విషయం మరువకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే పెద్దలు గారబం జోలికి పోకూడదు..అప్పుడే వాళ్లలో అపారమైన ప్రతిభపాటవాలు వెలికి తీయగలగడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.Two kinds in Mothers. A. A child solves a small problem. Appreciates. Celebrates. Tells all neighbors. Puts in Social media too. Takes for a foreign trip. Both happy. B. A child solves a small problem. Gives a bigger problem. Keeps it incremental for years. In the long run…— Dr. A. Velumani.PhD. (@velumania) February 10, 2026 (చదవండి: అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
పార్లమెంట్లో రభస: మహిళా ఎంపీల వీడియో విడుదల
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదప్రతివాదనలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఫిబ్రవరి 4న లోక్సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి మరికొద్ది నిమిషాల ముందు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సభలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా, ప్రతిపక్ష ఎంపీలు దాడికి దిగే అవకాశం ఉందని భావించి, ఆ రోజు ప్రధానిని సభకు రావద్దని స్పీకర్ ఓం బిర్లా ముందే సూచించినట్లు తెలియవచ్చింది.ఈ ఘటనపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. వారి ఎంపీల దిగజారుడు ప్రవర్తనపై కాంగ్రెస్ గర్వపడుతోందని ఆయన విమర్శించారు. ‘మేము గనుక మా బీజేపీ ఎంపీలను ఆపకుండా, కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనేందుకు అనుమతించి ఉంటే, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలన్నదే మా ప్రథమ ప్రాధాన్యత’ అని రిజిజు పేర్కొన్నారు. సభా మర్యాదలను కాపాడటానికే తాము సంయమనం పాటించామని ఆయన స్పష్టం చేశారు.ఈ నిరసన వెనుక జనరల్ (రిటైర్డ్) ఎం.ఎం. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ప్రచురితం కాని పుస్తక ప్రస్తావన ఉంది. గత వారం రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో పార్లమెంటులో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వివాదమే ఫిబ్రవరి 4నాటి గందరగోళానికి దారితీసింది. అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష ఎంపీలు వ్యూహరచన చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడంతో, ఆ రోజు సభ అర్థంతరంగా వాయిదా పడింది. Congress Party is proud of the most degrading behavior by their MPs !! If we had not stopped all BJP MPs and allowed the Women MPs to confront Cong. MPs, it would have led to very ugly scene. We have very high consideration, to protect the dignity & sanctity of the Parliament. https://t.co/tRj5HjLKFH pic.twitter.com/aTmktk4Y7E— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2026 -
‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’
కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్లో ఓ వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్మెంట్ డిమాండ్ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్ చేయవచ్చు.ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.ప్రతి 6-12 నెలలకు లింక్డ్ఇన్, సీవీ అప్డేట్ చేయండి.పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.కంపెనీలు రెజెక్ట్ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్ కోసం ఉన్న పాత ఫర్నిచర్లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ
మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by KEMI (@eczema.bread) (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..
కొన్ని తలరాతలు దేవుడి అత్యంత నాటకీయం రాస్తాడని అంటుంటారు పెద్దలు. అబ్బాం ఇదేం చిత్రం అనేలా జీవితాన్ని ముగించేస్తాడు. అలాంటి కథ ఈ వ్యక్తిది. ఓ నిజాయితీపరుడు..ఏళ్ల తరబడి చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించిన కథ ఇది. పోనీ అదేమంత పెద్ద అవినీతి కేసు.. అంటే అదీ కాదు. కానీ అన్నేళ్లు ఆశతో తాను నిర్దోషిని అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం ఎవ్వరినైనా కదలిస్తుంది. అతడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి, ఆశావాదానికి ప్రతీక. ఈ కథ చిన్న చిన్న కష్టాలకు హైరాన పడేవాళ్లకు ఓ స్ఫూర్తి. అలాగే ఆశావాదంగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కూడా.ఆ వ్యక్తి కథ హాలీవుడ్ మూవీ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ని తలపించే గాథ. అందులో ఓ నిర్దోషి ఎలా అయితే చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడో అలానే గుజరాత్కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి చాలాకాలంపాటు శిక్షను అనుభవించాడు. మొత్తం జీవితం అంతా జైలులోనే గడిపాడు ప్రజాపతి. ఇంతకీ అతడిపై మోపబడిన నేరం ఏంటంటే..రూ. 20ల లంచం కేసులో ఏకంగా 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సింపుల్గా చెప్పాలంటే 1994 నాటి హాలీవుడ్ చిత్రం లాంటిది అతడి కథ. అసలేం జరిగిందంటే..1996లో పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ ప్రజాపతి అహ్మదాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రూ. 20ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఆరోపణలు చేశారు. 1997లో సెషన్స్ కోర్టులో ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు. 2002లో అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 3,000/- జరిమానా విధించింది. ప్రజాపతి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆయన నిర్దోషి కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. అంతేగాదు హైకోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇక ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఈ కేసు మొత్తం అనుమానంతో చేసిన ఆరోపణలే తప్ప వాస్తవం లేదని కోర్టుకి నివేదించారు. కాగా, హైకోర్టు ఎప్పుడైతే ప్రజాపతిని నిర్దోషిగా పేర్కొందే..తతక్షణమే ఆయన భావోద్వేగంగా విడుదలైనందుకు ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు హాయిగా చనిపోయినా పర్లేదని అన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే న్యాయవాది గాంధీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రజాపతికి సూచించారు. ఆ మరుసటి రోజు ఆ విషయమై ఆయనకు ఫోన్ చేయగా, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని న్యాయవాది గాందీ తెలిపారు. ఇన్నేళ్లు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాడానికి పోరాడిని విధానం అసామాన్యమైనది. చివరికీ..తన నిజాయితీ నిరూపించుకుని మరీ కన్నుమూశాడు. అదీకూడా ఆయన నోటి నుంచి వెలువడినట్లుగానే జరిపోవడం బాధకరం. ఇన్నేళ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ పోరాడాడు..కనీసం కోన్నాళ్లు బతికి ఉన్నా బాగుండేదే అని అతడి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆవేదనగా అన్నారు. (చదవండి: ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!) -
బైకర్పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road. Authorities are probing who shot the tiger, why it was harmed and… pic.twitter.com/EIQWPpSf7W— The Sentinel (@Sentinel_Assam) February 6, 2026 ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది. ⚠️ Stay Alert, Stay Alive 🐅Suspected tiger attack claims life ofpolice constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV— अक्स (@Vickyaarya007_) February 6, 2026 -
యువతుల మిస్సింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.దేశ రాజధాని రీజియన్లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.— Delhi Police (@DelhiPolice) February 6, 2026గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. -
పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.పాలలో యూరియాకూరగాయలలో ఆక్సిటోసిన్పనీర్లో కాస్టిక్ సోడాసుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడితేనెలో పసుపు రంగుపౌల్ట్రీలో స్టెరాయిడ్లుఐస్క్రీమ్లో డిటర్జెంట్పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71% యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్కు కారణమవుతుందని అన్నారు.పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారుప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. Biggest Health Crisis in India 🚨FOOD ADULTERATION - खाने में मिलावट👉Urea in Milk👉Oxytocin in Vegetables👉Caustic Soda in Paneer👉Brick powder in Spices👉 Yellow dye in Honey 👉 Steroids in Poultry👉 Detergent in ice creamWe all are consuming slow poison!Raised… pic.twitter.com/LxWi1nIcP0— Raghav Chadha (@raghav_chadha) February 4, 2026 (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!
ఈ రోజుల్లో చేసిన సాయాన్నిగుర్తించుకుని కృతజ్ఞత చూపించడం అత్యంత అరుదు. ఒక వేళ ఆయా వ్యక్తులు తారసపడిన ముఖం చాటేస్తుంటారు చాలామంది. కానీ ఈ జంట ఎప్పుడో చేసిన వైద్యుడి సాయాన్ని గుర్తించుకోవడం కాదు, అతడు తారసపడిన వెంటనే చేసిన పనికి ఆ డాక్టర్ సైతం కంగుతిన్నాడు, ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆ వైద్యుడు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ఆఫ్రికన్ డాక్టర్ ఇద్రిస్ తాహిర్కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. ఆ సాయంత్రం ఒక రెస్టారెంట్లో చేసిన భోజనం తానొక గొప్ప జ్ఞాపకంగా మిగలనుందని అతడి ఆ సమయంలో తెలియదు. ఒక రోజు సాయంత్రం డాక్టర్ ఇంద్రిస్ ఒక రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ డైనింగ్ టేబుల మీద ఇద్దరు బ్యూటివఫుల్ ట్విన్స్తో ఉన్న జంటను చూస్తాడు. ఆ కవలలను చూసి ఆ వైద్యుడుకి చాలా ముచ్చటేస్తుంది. ఆ తర్వాత వాళ్లంతా తమకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడు డిన్నర్ పూర్తి అవ్వగానే బిల్లు పే చేద్దామని వెళ్తుండగా కవలల తండ్రి ఆపి తాను బిల్లు పే చేశానని చెబుతాడు. దాంతో తాహిర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరతను తన బిల్లు ఎందుకు కట్టాడని కన్ఫ్యూజన్లో ఉండగా..ఆ జంట డాక్టర్ గారు..మీరు మమల్ని గుర్తుపట్టలేదని అర్థమైంది. ఐదు నెలలు క్రితం తాను తన భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చామని, అక్కడ తన భార్యకు కవలలను ప్రసవించేలా సాయం చేసింది మీరేనని వివరిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్కి ఏం మాట్లాడలేక ఆ దంపతులు చూపిన కృతజ్ఞతకు ఆనందంతో తడిసి ముద్దవుతాడు. అస్సలు ఈ సాయంత్రం డిన్నర్ ఇంతలా తన జీవితంలో ఓ గొప్ప మరుపురాని జ్ఞాపకంగా ఉంటుందని ఊహించలేదు అంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం వృత్తిలో ఆ డాక్టర్ చూపిస్తున్న నిబద్ధతకు అంతా ప్రశంసించడమే కాదు..సేవకు దక్కుతున్న గౌరవం అది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. I saw a couple at a restaurant with their beautiful twins. Just as I was about to pay my bill, the husband insisted he’d already taken care of it. He said, “You probably won’t recognize me, but you’re the one who operated on my wife five months ago, those are the twins you…— Idris Tahir (@Idrees_taheer) February 1, 2026 (చదవండి: ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..) -
సత్సంబంధాల కోసం 50-30-20 రూల్..! ఎంత కేటాయించాలంటే..
యూట్యూబర్, అంకుర్ వారికు ఆర్థిక నిర్వహణకు చెప్పిన ఇదే రూల్ సత్సంబంధాలకు వర్తిస్తుందన్నారు. అందరు భావోద్వేగ శక్తిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించేస్తుంటారిని అన్నారు. మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే రూల్ పాటిస్తే..జీవితంలో మంచి రిలేషన్స్, అభ్యున్నతి రెండూ సునాయసంగా సాధించగలుగుతామని అన్నారు. మన ఎనర్జీని సరైన విధంగా వినయోగిస్తే..మంచి సంబంధాలను నెరపడమేగాక, అవి మన విజయానికి, ఎదుగదలకు ఉపకరిస్తాయని అన్నారు. మరి అదెలాగంటే..భావోద్వేగ శక్తిని ఇలా హ్యండిల్ చేయండి అంటూ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికు 50-30-20 రూల్ గురించి వివరించారు. ఆర్థిక శాస్త్రంలో సరైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఈ రూల్ భావోద్వేగ ప్రాధాన్యతను కూడా ఎలా మార్గనిర్దేశితం చేస్తుందో వివరించారు. మన ఎనర్జీలో సగం పని, కుటుంబం, కచ్చితంగా కేటాయించాలి. ఇక 30% మనకు సురక్షితంగా అనిపించే బంధాల కోసం ఎనర్జీని ఖర్చు చేయాలి. మిగిలిన 20% వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు, స్వీయ పరిశీలనపై దృష్టిపెట్టాలని అన్నారు.ఈ విధంగా భావోద్వేగ శక్తిని విభజించడం ద్వారా అలసిపోకుండా బాధ్యతలు, అర్థవంతమైన సంబంధాలు, స్వీయ-సంరక్షణ తదితరాలను సమతుల్యం చేయడం సులభతరమవుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల, బాధ్యతలను పోషిస్తూనే మానసిక, భావోద్వేగ స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ రూల్ హెల్ప్ అవుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతం 20% ఎనర్జీని ఖర్చు చేయడం అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. నెటిజన్లు కూడా అందుకు మద్దతిస్తూ..20% వ్యక్తిగత సంరక్షణకు అత్యవసరం అని..అందరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారంటూ పోస్టులు పెట్టడం విశేషం.(చదవండి: రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!) -
హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..!
లైఫ్లో ఒకానొక టైంలో కష్టపడకపోతే..మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పడు ఏదైనా సంపాదించగలం, ఆ తర్వాత మనతరం కాదు అని అంటుంటారు. అలాగే కష్టబడి డిగ్రీలు చదివి..ఉద్యోగం సంపాదించక హమ్మయ్యా అనేస్తాం. కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి, ఎదుగుదల మొదలవ్వుతుంది. అలాకాకుండా..చతికిలపడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక ఆలోచింపచేసేలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.26 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి నందిని శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గొప్ప కెరీర్ పాఠాన్ని షేర్ చేశారు. టీనేజ్ చివరలో.. 20ల ప్రారంభంలో ఉన్నవారికి ఉపయోగపడే అధ్బుతమైన కెరీర్ సలహాలను ఇచ్చారామె. కార్పోరేట్ లైఫ్ వాస్తవికంగా ఎలా ఉంటుందనేది ఒక్క మాటలో చెప్పేశారామె. కెరీర్ ప్రారంభ సవంత్సరాల్లో అందరి దృష్టి డబ్బు పైనే ఫోకస్ ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా విజయపరంపరతో జాబ్లో దూసుకోవడం అనేది ఎప్పటికీ శక్తిమంతమైనదని నొక్కి చెప్పారు. అది ఇరవైలలోనే సాధ్యమని అప్పుడే మంచిప్రయోజనం పొందగలమని అన్నారు. ఎందుకంటే అప్పటికీ ఎలాంటి కుటుంబ ఒత్తిళ్లు, బాధ్యతలు ఉండవు, పైగా వారివద్ద చాలా సమయం ఉంటుంది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యక్తిగత డెవలప్మెంట్పై ఫోకస్ పెడితే రానురాను కష్టం అనే మాటే ఉండదని అన్నారు. ఇలాంటి ధోరణితో ఉంటే గనుక రిస్క్ తీసుకునేందుకు భయపడరు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మనం ఫ్రీగా ఉన్న టైంలోనే కష్టపడేందుకు ఆసక్తి చూపాలి..అప్పుడే మన కెరీర్ ఉన్నతంగా ఉంటుంది..అలాగే ఈ కార్పొరేట్ లైఫ్లో మన మనుగడ సాధ్యమని నొక్కి చెప్పారామె. లేదంటే మనల్ని కాపాడే వారెవ్వరూ లేరు అని గుర్తించుకోండి అని అన్నారామె. తాను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పటికీ..తన కెరీర్, ఫిట్నెస్ లక్ష్యాలు, సాధించాల్సిన ఆశయాలను ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు. అంతేగాదు తన విజయవంతమైన కెరీర్ జర్నీని డాక్యమెంట్ చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీలో పనిచేస్తూ కెరీర్పై ఎన్నో కలలతో ఉన్నవాళ్లకు ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తన పోస్ట్ని ముగించారు శర్మ. కష్టే ఫలి అంటే ఇదేగదూ.! అంతేగాదు నెటిజన్లు సైతం ఇది ముమ్మాటికీ నిజం. ఎవ్వరికీ మన సమస్యను పట్టించుకునేంత సమయం లేదు. అందరూ వారివారి సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారని కొందరూ. మరికొందరూ డెవలప్మెంట్ అనేది ఉద్యోగ ఆఫర్తో ముగిసిపోదని అక్కడ నుంచే ప్రారంభమని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.I'm 26 and i work at @Microsoft .if you're in your late teens or early 20s, here are a few things i wish someone told me earlier:1. Hard work compound - espcially early.People talk a lot about money compounding, but effort compounds too. But Consistency changed…— Nandani S (@TheDebugDiva) January 28, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
‘కుక్కను చూసినా వదిలిపెట్టడు’
‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని ఉద్దేశించి కూటమి నేత ఒకరు చేసిన వ్యాఖ్య నెట్టింట వాయిస్ కాల్ రూపంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరిట వాయిస్ కాల్ ఒకటి గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్కు చపలత్వం ఎక్కువ. రాంగ్ట్రాక్లో పోతున్నాడు. మనోడు ఇన్స్టాలో వచ్చిన మెసేజ్లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు.దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని బాధితురాలు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ::: సాక్షి, రైల్వే కోడూరు -
అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!
అందరు లక్షల్లో ఆదాయం వస్తే ఎంత బాగుండును అనుకుంటుంటారు. అందుకోసం చిన్న పార్ట్టైం ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇంకొందరు ఏకంగా నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది. అయినా ఇంకా ఏదో వెలితి. సంపాదించింది ఏ మాత్రం అక్కరకు రాదు. అలాంటి బాధనే సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకున్నాడు ఓ చార్టడ్ అకౌంటెంట్. చార్టడ్ అకౌంటెట్ నితిని కౌశిక్ సోషల్ మీడియా ఎక్స్ పోస్టులో.. ఆకర్షణీయమైన ఆదాయం ఉంది. కానీ ఆర్థిక స్వేచ్చ లేదంటూ తన గోడుని వెల్లబోసుకున్నారు. మెట్రో నగరాల్లో జీవించేవాళ్లు నెలకు రెండు లక్షలు సంపాదించినా..సరిపోవడం లేదని వాపోయాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం అని చెప్పాడు. పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం కూడా భారంగా ఉందని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కూడా ఆందోళనకరంగా పెరిగాయని అన్నారు. ఇక వైద్యం దగ్గరకు వచ్చేటప్పటికీ..ఆరోగ్య సంరక్షణ తీవ్రమైన ఆర్థిక ప్రమాదంగా ఉందని బాధగా చెప్పుకొచ్చారు. మనమంతా ట్రెడ్మిల్పై పరుగులంఖించుకుంటున్నామే తప్ప సంపదను సృష్టించుకోలేకపోతున్నాం అని వేదనగా చెప్పాడు. నిరంతరం ఈఎంఐలు చెల్లిస్తూ..రుణ చెల్లింపు యంత్రాలుగా మారిపోతున్నాం అంటూ బాధగా తన ఆవేదనను వివరించారు సీఏ కౌశిక్. అయితే ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు మండిపడ్డారు. ఇది ముమ్మాటిక ఆర్థిక నిర్వహణ వైఫల్యమని తేల్చి చెప్పారు. సంపాదన తోపాటు ఖర్చులను బ్యాలెన్స్ చేసే నేర్పరితనం లేనప్పుడూ..ఎంత సంపాదించినా వృధానే అన్నారు. చాలీచాలని జీతంతో బతుకుతూ..తమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నావారు కూడా ఉన్నారని గుర్తుచేశారు. సంపాదనకు తగ్గ ఖర్చు, పొదుపు చేయగలిగే సమర్థత ఉంటే..ఏదైనా సాధ్యం చేసుకోగలమంటూ ఎన్నో ఆర్థిక పాఠాలు, చిట్కాలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదండోయ్ అధిక ఆదాయం ఉంటే హ్యాపీ కాదు..సంతృప్తిగా బతకడం తెలియాలి. అసలు ఎంత సంపాదించాం అనేది కాదు..దాన్ని ఏవిధంగా ఖర్చుచేస్తూ..పొదుపు చేయగలం అనేది అత్యంత ముఖ్యం సుమీ. -
'మహానటి' బ్యూటీ ఇల్లు.. కేరళ శైలికి కేరాఫ్గా..!
మహానటి హిరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటన అశేష ఆదరాభిమానాలు పొందిన ముద్దుగుమ్మ. విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న నటి. ఆమె తన చిరకాల స్నేహితుడు ఆంథోని థటిల్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడచక్కగా ఉండే ఈ జంట ఇల్లు కూడా వారిలానే ఆద్యంత అందంగా..అద్భుతాలకు నెలవుగా బహు సుందరంగా ఉంది. అది ఇల్లా లేక ఏదైనా టూర్కి వెళ్లామా అనేలా కళాకృతులకు నిలయంగా మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. మరీ హీరోయిన్ కీర్తి ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకుందో తిలకిద్దాం రండి..!."హౌస్ ఆఫ్ ఫన్"గా పిలచే కీర్తి ఇల్లు ఆధునికత, సంప్రదాయాల మేళవింపుగా అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఆరుబయట బ్యాక్ వాటర్స్ ఉత్కంఠభరిత దృశ్యాలు ఉత్సాహాన్ని అందిస్తే..లోపటి సుందర దృశ్యాలు సౌందర్యాలి ఆలవలంగా ఉంది. అందమైన చిన్న వంటగది, బ్యాక్వాటర్స్తో చుట్టబడిన బాల్కనీ, వాక్ ఇన్ వార్డ్రోబ్తో విశాలమైన బెడ్రూమ్ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక అక్కడే గోకు వేలాడిదీసిన చంద్రుడి కళలు..వారే డేటింగ్ ప్రారంభించిన రోజు, వివాహం చేసుకున్న రోజున చంద్రుని కళల దశల జాబితాను అందించే కళాకృతి కళ్లను పక్కకు తిప్పనివిధంగా కట్టిపడేస్తుంది. నటిగా తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన మహానటి మూవీకి సంబంధించిన ఛాయచిత్రాలతో కూడిన ఫ్రేమ్ కీర్తి నటనను గుర్తు చేస్తోంది. డైనింగ్టేబుల్ వద్ద వారి వివాహ ఫోటోలు, వెడ్డింగ్ కార్డ్ ఫ్రేమ్ స్పెషల్ ఎంట్రాక్షన్గా ఉంటుంది. ఇక బెడ్రూమ్ కేరళ శైలిలో బూడిద రంగు గోడలు నిండా వ్యక్తిగత ఫోటోలతో కనువిందు చేయగా, అక్కడ సమీపంలోని ఫలకంపై “ఎవరూ హుందాగా బయటకు రారు” అని రాసి ఉంది. దాన్ని చూపిస్తూ..ఈ దృశ్యం, అక్కడి వైబ్స్ చాలా మత్తునిస్తాయని హాయిగా నిద్రపట్టేస్తుందని అంటోంది కీర్తి. లివింగ్ రూమ్లో మెత్తటి బూడిద రంగు సోఫాలు, రిలాక్స్డ్ వైబ్స్ అందిస్తున్నాయి. అక్కడ కూడా వాల్స్పై ఫోటోలు అలంకరించి ఉన్నాయి. అలాగే ఒక ప్రైవేట్ హోమ్ థియేటర్, టెర్రస్పై యోగా, సాధారణ ఫోటోషూట్లు, సూర్యాస్తమయాలను ఆస్వాదించేలా అందంగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ అందమైన ఇల్లు బిజీగా ఉండే ఆమె ప్రొఫెషనల్ జీవితానికి దూరంగా చక్కటి విశ్రాంతి అందించే ప్లేస్. View this post on Instagram A post shared by Varsha Ravindran • Interior Stylist (@chestnuthomestylists) (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!) -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
పబ్లిసిటీ పిచ్చి ఎంత పని చేసింది!
పాకిస్థాన్లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi— Adeel Raja (@adeelraja) January 20, 2026 -
థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..!
అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం రాశాడంటే..యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు. ఆయన పోస్ట్లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్లో వేణు రాసుకొచ్చారు. అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. Since it’s a long weekend, a small thought.I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026 (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...) -
వ్యక్తి ప్రాణం తీసిన.. యువతి పోస్ట్
కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే మనస్థాపంతో తనువు చాలించాడు.గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు. దీపక్ చాలా మంచి వాడని అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు. -
అవును నా ప్రియుడే.. అయితే తప్పేంటి?
వివాహేతర సంబంధాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.‘‘హలో.. పోలీస్ స్టేషన్ ఆ నా భార్య నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్ చేశాడు ఓ భర్త. ఆ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్ నెంబర్ 113 తలుపును విరగొట్టాడు. లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె. ‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలోని నవాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 🚨 होटल ड्रामा, VIDEO वायरल 🚨🏨 पत्नी प्रेमी संग, पति 👮♂️ पुलिस के साथ पहुंचा😱 पकड़े जाने पर बोली— “तलाक दे दूंगी”📍 वायरल वीडियो झांसी (UP) बताया जा रहा#Jhansi #UPNews #ViralVideo #BreakingNews pic.twitter.com/yX4Z3ggciQ— Mr Kushal Gupta,( K G ) (@g94897659) January 16, 2026 -
అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారపు గాజులను'..
ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లని, ప్రాణ స్నేహితుల్ని నమ్మడానికి వీల్లేని రోజులు. సాయం చేసిన వాడినే నాశనం చేసే దారుణమైన గడ్డు రోజుల్లో. 'మనిషన్న వాడు కానిరాడమ్మా..' అనే ఆర్యోక్తిలా ఉన్నాయి పరిస్థితులు. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో ఉదంతలే నిదర్శనం. కానీ దాన్నే తలదన్నేలా ఇక్కడ జరిగిన సంఘటన హైలెట్గా నిలిచింది. పైగా 'నమ్మకానికి' కొండంత విలవ ఉంది అని నిరూపించే అపురూపమైన ఘటన ఇది.మెట్రో ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిందే. జనంతో కిటకిటలాడుతూ..అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి బెంగళూరు మెట్రో ప్రయాణంలో జరిగిన ఘటన నెట్టింట అందరి మనసులను తాకింది. రోజువారి ప్రయాణంలో కనిపించిన దయకు సంబంధించిన ఓవిషయాన్ని నెట్టింట ఒక మహిళ పంచుకుంది. ఆ పోస్ట్లో ఆ మహిళ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడూ..ఒక చిన్న అమ్మాయి మణికట్టుపై అందమైన బంగారు గాజుని గమనించింది. అయితే ఆ గాజు డిజైన్ ఆమెను ఆకట్టుకుంది. వెంటనే ఆమె ఆ అమ్మాయిని కాస్త ఆ గాజుని ఫోటో తీసి ఇవ్వగలరా..నేను అదేలాంటి డిజైన్ గాజుని తయారుచేయించుకుంటానని అడిగింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. పైగా ఆ మహిళను విస్తుపోయాలే చేసింది ఆ అమ్మాయి. అప్రయత్నంగా తన చేతి గాజుని తీసి ఆ మహిళ చేతిలో పెట్టేసి మీకు నచ్చినట్లుగా చేయించుకోండి అని సింపుల్గా అంటుంది. ఆ హఠాత్పరిణామనికి ఆ మహిళ నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి.. ఇది ఒరిజనల్ బంగారు గాజు కాదని, ఇంది వన్ గ్రామ్ గోల్డ్ బంగారు గాజు అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె విశాల హృదయం, నిజాయితీ ఆమె మనసుని తాకడమే గాక ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకం ఇంకా బతికే ఉందా అని ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. అంతేగాదు ఆ అపురూపమైన క్షణానికి గుర్తుగా ఆ గాజుని తన వద్ద ఉంచుకుంది. పైగా అందుకు సంబంధించిన అపురూపమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ గాజు తన సొంతం ఎలా అయ్యిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.(చదవండి: పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..) -
ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..!
పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఈ చిన్నారి చిన్న వయసుకే అత్యంత అరుదైన ఘనత సృష్టించాడు. నిండా పట్టుమని పదేళ్లు కుడా లేవు. ఏకంగా ఏడు ఖండాలు చుట్టేశాడు అమెరికన్ బుడ్డోడు వైల్డర్ మెక్గ్రా. జస్ట్ ఏడేళ్లకే అంటార్కిటికాతో సహా ఏడు ఖండాలు చుట్టొచ్చి.. అరుదైన ఘనతను సాధించాడు. అంటే ఈ చిన్నారి ప్రయాణం శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమైందని తెలుస్తోంది. అతడి సాహసయాత్రలను తల్లిదండ్రులు జోర్డి లిప్పే మెక్గ్రా, రాస్ మెక్గ్రాలు నమోదు చేశారు. ఏడు ఖండాలను చుట్టొచ్చే చిన్నారిగా తమ కుమారుడిని పెంచలేదని చెబుతున్నారు అతడి తల్లిందండ్రులు. తమకు పర్యాటనలంటే మహాఇష్టమని, ఆ నేపథ్యంలోనే తాము నచ్చిన ప్రదేశాలకు పర్యటిస్తున్నామని ఆ కుటుంబం చెబుతోంది. ఇక తమ కుమారుడు వైల్డర్ జర్నీ ఎనిమిది వారాల వయసులో పోర్చుగల్ పర్యటనతో ప్రారంభమైందని, తర్వాత అతడి రెండో పుట్టినరోజు ముందు కరేబియన్, కెనడా, మెక్కికోలను సదర్శించినట్లు వెల్లడించాడు తండ్రి రాస్. అతను పెద్దయ్యాక యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు వెళ్లడం జరిగిందని అన్నాడు. అయితే తాము దక్షిణ అమెరికా పర్యటనకు ముందు తమ బిడ్డ ఐదు ఖండాలు సందర్శించాడని గుర్తించాం అని చెప్పుకొచ్చాడు తండ్రి రాస్. దాంతో అప్పుడే తమకు వైల్డర్ ఈ ఖండాల జాబితాను పూర్తి చేస్తే ఎలా ఉంటుది అనే ఊహ వచ్చిందని, అందుకు అనుగుణంగా ట్రిప్లు ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు పేరెంట్స్. అలా ఈ కుటుంబం సాహసయాత్ర కాస్తా అంటార్కిటిక్ ఖండానికి చేరుకుంది. ఆ విధంగా తమ బిడ్డ వైల్డర్ ఈ ఖండంలో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కులలో ఒకడిగా నిలిచాడని ఆనందంగా చెబుతున్నారు. అంతేగాదు ఈ అంటార్కిటక్ పర్యటనలో తన భార్య జోర్డికి అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైల్డర్ తండ్రి రాస్. ఎందుకంటే ఆమె ఈ అంటార్కిటికా ఖండంలో గర్భవతిగా(వైల్డర్ కడుపులో ఉండగా) అడుగు పెట్టిందట. అంటే జోర్డీ డెలివరీ అయ్యాక తన బిడ్డతో కలిసి మరోసారి అంటార్కిటికాకు వచ్చారామె. కాగా, ఆ కుటుంబం ఈ పర్యటనలు కేవలం గమ్యస్థానాలు లేదా రికార్డుల కోసం మాత్రం కాదని, ఆయా విభిన్న సంస్కృతులను అనుభవించడం, మరుపురాని జ్ఞాపకాలను పొందుపర్చుకోవడం అని చెబుతుండటం విశేషం. ఈ టూర్ల వల్ల వైల్డర్కి సహనంగా ఉండటం అలవడిందని చెబుతున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ ఫ్యామిలీ విజయవంతంగా ఏడు ఖండాలు చుట్టేసినా..ఇక్కడ నుంచి ప్రశాంతమైన ప్రయాణాలపై దృష్టి సారించనున్నాం అని చెబుతుండటం విశేషం. ఇక ఇప్పుడే వెళ్లే టూర్లన్ని తమ బిడ్డకు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని వెళ్లేలా జర్నీ ప్లాన్ చేయనున్నాం అని నవ్వుతూ చెబుతున్నారు వైల్డర్ తల్లిదండ్రులు.(చదవండి: భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!) -
ధర్మరాజు లేకుండానే.. అలుపెరుగని ప్రయాణం
మహాభారతంలో ధర్మరాజుతో కడదాకా నడుస్తుంది ఓ శునకం. ఆ మధ్య వచ్చిన పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్లో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్రకు వీధికుక్కలతో ముడిపెట్టిన సీక్వెన్స్ ప్రేక్షకుల్ని ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. అయితే విశ్వాసం, కరుణ మాత్రమే కాదు.. శాంతి కోసమూ నాలుగు కాళ్ల అలోకా అలుపెరగని ప్రయాణంతో అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇంటర్నెట్లో రీల్స్ చూసేవాళ్లకు అలోక అనే పేరు తెలియక పోవచ్చు. కానీ స్క్రోలింగ్ చేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గర కచ్చితంగా తారసపడుతుంది. అమెరికాలో పర్యటిస్తున్న బౌద్ధభిక్షువులతో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోందీ అలోక. దీనికి దక్కిన ఫేమ్తో ఏకంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే ఓపెన్ చేశారు. ఒకటి రెండు బిస్కెట్లు వేస్తేనే కృతజ్ఞతలు చూపించే కుక్క మాదిరే.. తనను కాపాడిన వాళ్లను వీడేదే లేదంటూ వెంట తిరుగుతోంది. స్వర్గాన్ని కాదని.. మహాప్రస్థాన ఘట్టంలో ధర్మారాజు భార్యాసహోదరులు స్వర్గానికి వెళ్తారు. అయితే తనతో వచ్చిన కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరించడం వల్ల స్వర్గానికి వెళ్ళలేక కొద్దిసేపు నరకంలో గడపాల్సి వస్తుంది. తనతో పాటు ఉన్న జీవిని విడిచిపెట్టలేనని చెబుతాడాయన. అయితే.. ఆ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవతే అని తెలుసుకున్నాక చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథ.. ధర్మరాజు యొక్క నిస్వార్థత, సత్యనిష్ఠ, విశ్వాసపాత్రత, అన్ని జీవుల పట్ల కరుణను తెలియజేస్తుంది. పాతాళ్ లోక్లో.. 2020 కరోనా టైంలో అమెజాన్ ప్రైమ్లో వచ్చిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. అందులో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్ర ఉంటుంది. సుత్తిని ఉపయోగించి భయంకరంగా చంపే పాత్రలో అభిషేక్ బెనర్జీ ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్రూరమైన పాత్ర అయినప్పటికీ కుక్కల పట్ల జాలి చూపించే వ్యక్తిగా అతనిలోని మానవీయ కోణాన్ని చూపించారు ఇందులో. ఆ కోణమే కథలో ఓ కీలక మలుపునకు కూడా కారణమవుతుంది. అలా ప్రేక్షకులు హతోడి త్యాగిని మరింత గుర్తుంచుకున్నారు. భూమ్మీద అలోకా.. కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి అలోక అని పేరు పెట్టి(పాలి భాషలో వెలుగు అని అర్థం) బాగోగులు చూసుకున్నారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది. ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్ ఉంది కదా.. అలా ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు బౌద్ధబిక్షువులతో పాటు ఈ పర్యటనలో అలోకా కూడా భాగమైందన్నమాట. -
యుద్ధం అనాథను చేస్తే..సేవతో అందరి మనసులను దోచుకుంది..!
యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్ చిన్నారి కథ..!.ఆమె లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను. అలా ఆమె జు జెన్స్ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి. అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె. 1980లో తన బిడ్డతో షెన్యాంగ్కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది. అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్క్రాస్ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్ ఆ పని అస్సలు చేయలేదు. నిజానికి ఆ సమయంలో జపనీస్ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! మన హైదరాబాద్కి జస్ట్..) -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ స్పందించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు?నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని… pic.twitter.com/LZCLiepwxs— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రెజల్యూషన్గా.. నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్.. ఈ ఉదయం మరో పోస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్లో చేరతానంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారాయన. Having been fully engaged until yesterday with New Year security and arrangements alongside my dedicated and committed team, I felt today was the right moment to share my New Year resolutions with my extended family—you.Life, as we know, is a balance between professional… pic.twitter.com/WroFZxqDqu— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026 -
న్యూ ఇయర్ రెజల్యూషనా?.. ఛా అవతలికి పో!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. సాధారణంగానే.. ఈ టైంలో ‘రెజల్యూషన్స్’ తెరపైకి రావాలి. కానీ, ఈసారి ఎందుకనో ఆ హడావిడి లేదు. ఇటు సోషల్ మీడియాలో ఆ పదం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది. ఎవరినైనా మైక్ పెట్టి కదిలిస్తే దాంతోనే కొట్టేలా కనిపిస్తున్నారు. అదే సమయంలో.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాత వీడియో గురించి చర్చించుకుంటున్నారు. న్యూఇయర్ అనగానే కొత్తగా ‘రెజల్యూషన్స్’ షురూ అవుతాయి. అప్పుడైతే ఉత్సాహం టన్నులకొద్దీ ఉంటుంది. మంచి అలవాట్లు మొదలుపెట్టి.. పాడు పద్ధతులను పాతరేయాలనుకుంటారు. నాలుగు రోజులు గడిచాయా.. ఉత్సాహం ఉసూరుమంటుంది. నెల తిరిగేసరికల్లా ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు.. మోటివేషన్ సూత్రాలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒకప్పుడు.. కనిపించిన దృశ్యాలివి. 1997లో శేఖర్ సుమన్ లేట్నైట్ టాక్ షో Movers and Shakers కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి న్యూఇయర్ రెజల్యూషన్స్ అడిగారు. వారు నిర్మోహమాటంగా చెప్పిన సమాధానాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలామంది “స్ట్రిక్ డైట్ పాటిస్తాం” అన్నారు. ఒక యువతి “ఎక్కువ మంది బాయ్ఫ్రెండ్స్ సంపాదించుకుంటా” అని చెప్పగా, ఇంకో యువకుడు “నెలకో గర్ల్ఫ్రెండ్ మార్చేస్తా” అంటూ సరదాగా స్పందించాడు.“ఈ ఏడాదిలో అయినా జీన్స్, టీషర్ట్స్ కొనుక్కుంటా” అని ఓ యువకుడు, “ఈ ఏడాదిలోనైనా బడికి బండెడు పుస్తకాలు మోయకూడదనుకుంటున్నా” అంటూ ఓ పిలగాడు ఇచ్చిన సమాధానాలు చిరునవ్వు తెప్పించాయి. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకుంటాం అంటూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. నిజాయితీతో కూడిన ఆ సమాధానాలు నేటి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by The90sIndia🤩 (@the90sindia)మరి ఇప్పుడో.. గత కొన్నేళ్లుగా కొత్త ఏడాది తీర్మానాలు (Ne Year Resolutions) విషయంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. డిజిటల్ ఎరాలో డైరీల్లో రాసుకోవడం, బొమ్మలు గీసుకుని గోడలకు తగిలించుకోవడం నామోషీ అయిపోయింది. మొదలు పెట్టిన జోష్ను పాత అలవాట్లు మింగేయడం.. బిజీ లైఫ్స్టైల్తో కొన్ని వారాలకే మరిచిపోవడం.. సాధ్యం కాని పెద్ద ప్లాన్లు పెట్టుకోవడం వాటిని మధ్యలోనే వదిలేసేలా చేస్తున్నాయి. ఆఖరికి.. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆర్డినరీ రెజల్యూషన్ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏది? అని అడిగితే.. ఛా అవతలికి పో అనే సమాధానం ఎక్కువగా వినిపించదంటారా? ఆరోజుల్లో.. సాధారణంగా వినిపించిన రెజల్యూషన్స్బరువు తగ్గాలిజిమ్కి క్రమం తప్పకుండా వెళ్లాలిడైట్ పాటించాలి (స్ట్రిక్ డైట్ చాలా పాపులర్)పొగ తాగడం మానేయాలిచదువు & కెరీర్పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలికొత్త స్కిల్ నేర్చుకోవాలిఉద్యోగంలో కష్టపడి ప్రమోషన్ పొందాలిమంచి స్నేహితులు సంపాదించుకోవాలిసరైన బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్ సంపాదించుకోవాలికుటుంబంతో ఎక్కువ సమయం గడపాలిఖర్చు తగ్గించుకోవాలిపొదుపు చేయాలిఅప్పులు తీర్చేయాలిమద్యం తగ్గించుకోవాలికొత్త పుస్తకాలు చదవాలికొత్త ప్రదేశాలు చూడాలికొత్త హాబీ మొదలుపెట్టాలి (ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి)ఆరోజుల్లో.. రెజల్యూషన్స్ ఎక్కువగా వ్యక్తిగత ఆరోగ్యం, చదువు, సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగేవి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలు తమ రెజల్యూషన్స్ను నేరుగా చెప్పేవారు, టీవీ షోలు, పత్రికలు, డైరీల్లో రాసుకునేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. పోస్టులు కూడా చేసి చాటి చెప్పుకునేవారు. మరి ఇప్పుడో.. ఈ డిజిటల్ యుగంలో ప్రైవేట్గా ఉంచుకోవడమో లేదంటే అసలు పెట్టుకోవడమే బెస్ట్గా ఫీలవుతున్నారు. -
2025 చివరి సూర్యోదయం చూశారా?
మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది చివరి రోజు ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి సందర్శకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి సూర్యోదయాన్ని వేలమంది వీక్షించారు. నారింజ రంగులో ఆకాశంలో కనిపించిన ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో బంధించారు. 2025ன் கடைசி சன்ரைஸ்.. குமரியில் கண்டு ரசித்த சுற்றுலா பயணிகள் #kanyakumari #sunrise #newyear2026 #sun pic.twitter.com/f7U5H4FzpI— Thanthi TV (@ThanthiTV) December 31, 2025ప్రత్యేకం ఎందుకంటే.. కన్యాకుమారి భారతదేశ దక్షిణ అంచున ఉంది. ఇక్కడి సూర్యోదయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు చేరుతారు. అందుకు కారణం.. అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతం, భారత మహాసముద్రం కలిసే అరుదైన ప్రదేశం కాబట్టి. ఈ సంగమం వద్ద సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేక అనుభవం. అలాగే సూర్యాస్తమయం కూడా. దేశంలో చాలా అరుదుగా ఒకే ప్రదేశంలో సముద్రంపై సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించగల అవకాశం ఇక్కడ ఉంది. అయితే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగానే కాకుండా.. ఆధ్యాత్మిక ధోరణిలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. సూర్యోదయాన్ని దైవానుభూతిగా భావించే భక్తులు.. సంవత్సరాంతం, ఏడాది తొలిరోజు.. పండుగల సమయంలో ప్రత్యేకంగా సముద్ర స్నానాలు చేస్తారు. సుందర దృశ్యాలు.. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో నారింజ, బంగారు, ఎరుపు రంగులతో కాంతులు కనిపిస్తాయి. సముద్రపు అలలపై ఆ ప్రతిబింబం పడటంతో ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుక పనిగట్టుకుని పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. -
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా.. -
పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్
కొన్ని చిన్న చిన్న పనులు..చాలా ఎఫెక్ట్వ్గా ఉంటాయి. చాలా చాలా సాధాసీదా పనులే అయినా వాటి ప్రభావం మాములుగా ఉండదు. మనకు మన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మంచి మంచి విందులు ఇప్పిస్తారు. అదులో పెద్ద విషయం ఏం లేదు. కానీ మనం సంపాదించే రేంజ్కి వచ్చినప్పుడు కూడా వారి చేత ట్రీట్ ఇప్పించుకునే తింటే ఆ ఆనందమే వేరు. అది మన తల్లిదండ్రలకు గొప్ప అనుభూతి కూడా. అదెలాగో అందుకు సంబంధించిన వీడియోని జత చేస్తూ పోస్ట్లో వివరించారు చాయ్ సుట్టా బార్ సహ-వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే . ఆయన తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం గురించి చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకుంది. ఆ వీడియోలో వ్యాపారవేత్త దూబే తన తల్లిదండ్రులను ఒక కేఫ్లో డేట్ కోసం తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. అంతేగాదు మీరు కూడా ఇలా పేరెంట్స్ని ట్రీట్ కోసం వెళ్దామని ప్రోత్సహించడంని పిలుపునిస్తూ..అక్కడ జరిగిన దృశ్యాన్ని ఇలా పంచుకున్నారు. తన కోసం కూడా తన తండ్రినే ఆర్డర్ చేయమని ఆ వ్యాపారవేత్త అడిగారు. ఆయన తమ ముగ్గురు కోసం భోజనం ఆర్డర్ చేసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ తర్వాత చివరిలో బిల్లు కూడా తండ్రి చేత పే చేయించాడు ఆ వ్యాపారవేత్త. ఆ తర్వాత చివరగా నాన్న కొంచెం ఛేంజ్ ఉంటే ఇవ్వరూ అని అడిగి మరి తీసుకున్నాడు. ఆయన కూడా చాలా ఆనందంగా ఇచ్చారు. ఇలా ఎందుకు చేశానో వివరిస్తూ..ఇలా చెప్పుకొచ్చారు. "మనం పేరంట్స్చేత బిల్లు కట్టించి ఫ్రీగా ట్రీట్లు తీసుకోమని కాదు నా ఉద్దేశ్యం. మనం మంచి ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించే రేంజ్లో ఉన్నా..వారి చేతనే డబ్బులు కట్టించి వారికి నచ్చిన ఐటెం ఆర్డర్ చేయిపించి తింటే మనం ఎప్పటికీ వారిపై ఆధారపడి ఉన్నామని, మనం ఎప్పటికీ వారి పిల్లలమే అనే భావన కలుగుతుంది. అదే సమయంలో వారికి తాము వృద్ధులం అనే భావన కలగదు. మన పిల్లలు చిన్న వాళ్లు వాళ్ల కోసం మనం దృఢంగా ఉండాలనే భావన, ఆశ కలుగుతుంది. మన పిల్లలు ఎప్పటికీ పిల్లలే, చిన్నవాళ్లు మనపై ఆధారపడుతున్నవాళ్లు అన్న ఫీలింగ్ వారికి గొప్ప అనుభూతిని, జీవితంపై గొప్ప ఆశను రేకెత్తిస్తుందంటూ". పోస్ట్లో రాసుకొచ్చారు అనుభవ్ దూబే. ఇది చాలామంది మనసుని తాకడమే కాదు..ఇలాంటి చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకు మంచి అనుభూతిని కలిగించడంలో సహయపడటమే గాక, పిల్లలతో వారి బంధాన్ని మరింత బలపరుస్తాయని అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anubhav Dubey (@anubhavdubey1) (చదవండి: పక్షవాతం బారినపడిన వ్యక్తి అసామాన్య ప్రతిభ..! జస్ట్ ఒక్క చేతి వేలు, కాలి బొటనవేలితో..) -
91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..
తల్లి ప్రేమకు మించిది ఏది లేదు. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అన్న ఆర్యోక్తి ఎప్పటికీ ప్రకాశంతంగా వెలుగుతుంటుంది. ముదుసలి వయసులో సైతం తన బిడ్డకు తానే ఏదో చేయాలని తప్పనపడుతుంటుంది. అందుకోసం ఎంతలా తల్లి కష్టపడేందుకైనా సిద్ధపడుతుంది అనేందుకు ఈ 91 ఏళ్ల తల్లే ఉదాహారణ. ఆ ముదసలి వయసులో కూడా కొడుకు కోసం తప్పన పడుతూ అల్లిన స్వెటర్లో ప్రతి అల్లికలో ఆమె ప్రేమ, కష్టం కనిపిస్తుంది. ఎంత ఖరీదైన స్వెటర్ కూడా ఈ అమ్మ అల్లిన స్వెటర్ ఇచ్చిన వెచ్చదనంతో సరితూగదు.సోషల్ మీడియోలో అరుణ్ భాగవతులు తన తల్లి అంతులేని ప్రేమకు నిదర్శనమైన ఓ సన్నివేశాన్ని షేర్ చేసుకున్నారు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అమ్మ ప్రేమ అనంతం అని కీర్తిస్తున్నారు. ఇంతకీ అతడు పోస్ట్లో ఏం రాసుకొచ్చాడంటే..అరుణ్ భాగవుతుల తల్లి 91 ఏళ్ల వయసులో మంచానికే పరిమితమై ఉందామె. అయినా తన కొడుక్కు తన చేతనైనది ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. అందుకోసం తన చేత్తో తానే స్వయంగా స్వెటర్ అల్లాలనుకుంది. అలా మంచం మీద స్వెటర్ కుట్టేందుకు రెడీ అయ్యింది. చేతులు నొప్పి పుట్టినప్పుడల్లా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని అల్లడం ప్రారంభించేది. కొడుకు మీద ఉన్న ప్రేమ అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టేలా చేసింది. అయితే ఈ వయసులో ఇదంతా ఎందుకు అని కొడుకు వారించిన వినలేదామె. అయితే ఆమె మందుగా పైభాగాంలోని మెడ భాగాన్ని పూర్తిచేసింది. ఒక్కసారి ధరించి చూసి..సరిపోయిందో లేదో చెప్పమంది. అయితే అరుణ్ దాన్ని వేసుకుని చూసి..కొంచెం పొడవు చేయమని సూచించాను. అందుకోసం అల్లిందంతా విప్పేయాల్సి వస్తుందని తెలియదు. అయితే తన తల్లి ఒక మాటకూడా మారుమాట్లాడకుండా కామ్గా అంత విప్పేసి కుట్టింది. నడుము కొలత కాకుండా ఛాలికొలత తీసుకుని కుట్టడంతో కాస్త టైట్ అయ్యిందని వివరించాడు అరుణ్. అయితే ఆమె ముందు వెనుక భాగాలు అల్లడం పూర్తయ్యాక.. మరోసారి అది సరిపోయిందో లేదో చూడమని కోరగా..అప్పుడు ముందు భాగానికి, వెనుక భాగానికి, ఆరు అంగుళాలు ఖాళీ ఉంది. దాంతో ఆమె షాక్ అయ్యింది. అయినా సరే ఏదో రకంగా తన తల్లి స్వెట్టర్ని పూర్తిచేసి మళ్లీ ఇచ్చారట చూడమని. ఈసారి అది కాస్తా సరిపోయినా..పొట్టైందట. అయితే ఈసారి మార్పులు చేర్పులు గురించి చెప్పబుద్దిగాక, ఊరుకున్నానని ఆయన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ స్వెట్టర్ పొట్టిగా ఉందేమో..ఆమె ప్రేమ మాత్రం చిన్నది కాదు అని షేర్ చేయడం నెటిజన్లు మనసును హత్తుకుంది. బ్రాండెడ్ స్వెటర్లలో అత్యంత అమూల్యమైన స్వెటర్ అని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025 -
ధురంధర్ మూవీ క్రేజ్తో వైరల్గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకారణంగా నెట్టింట దూద్ సోడా అనే పానీయం తెగ వైరల్గా మారింది. అసలేంటి పానీయం తాగొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా అంటే..ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గేరా ఒక భారతీయ గూఢచారిగా, మొహమ్మద్ ఆలం అనే సోడా విక్రేత వేషంలో కనిపిస్తారు. "డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ కావడంతో పాటు, ఈ దూద్ పానీయం పై అందరి దృష్టి పడేలా చేసింది. ఒకరకంగా మరుగున పడిపోతున్నకొన్ని రుచులు మళ్లీ గుర్తుకుతెచ్చేలా ముందుకు తీసుకు వస్తాయి ఈ సినిమాలు. దూద్ సోడా అంటే..దూద్ సోడా అనేది పాకిస్తానీకి చెందిన ప్రసిద్ధ పానీయం . లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రోజువారీ ఇష్టమైన పానీయం ఇది. చల్లటి పాలు, సోడా, తగినంత చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా జాజికాయ పొడిని కూడా జోడిస్తుంటారు. పాకిస్తానీ ఆహార సంస్కృతిలో ఒక జ్ఞాపకశక్తినిచ్చే, రిఫ్రెషింగ్ డ్రింక్గా పరిగణిస్తారు.తయారీ..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 'సాహిలోజీ' ఇటీవల లాహోర్లో ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. "ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి, ఆపై వేడి వేడి పాలను పోస్తారు. పాకిస్థాన్లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాలను చల్లబరుస్తారు. ఆ తర్వాత, ఎరుపు రంగులో ఉండే కోకాకోలాను ఆ పాల మిశ్రమంలో కలుపుతారు. చివరగా సాంప్రదాయ పద్ధతిలో సోడాను బాగా మిక్స్ చేస్తే నోరూరించే దూద్ సోడా సిద్ధమవుతుంది" అని వీడియోలో ఆయన వివరించారు .చాలా మంది 1:1 లేదా 1.5:1 పాలు-సోడా నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఇది పానీయాన్ని క్రీమీగా ఉంచుతుంది. అయితే ఎక్కువమంది ఈ పానీయాన్ని రూహ్ అఫ్జా, రోజ్ సిరప్, తులసి గింజలు లేదా ఏలకులు వంటి రుచులను కూడా జోడించి సేవిస్తారు.బ్రిటిష్ కాలం నాటిది..బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందే, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో దూద్ సోడాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇది బ్రిటీష్ కాలం నాటిది. ఉత్తర భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు కూడా. అప్పట్లో స్థానిక హకీంలు నిర్వహించే సోడా ఫౌంటైన్లలో రోజ్, ఖుస్, నిమ్మకాయతో పాటు ఈ పాల సోడాను కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసేవారు.వాస్తవానికి ఈ పానీయం విక్టోరియన్ ఇంగ్లాండ్లో పుట్టి, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి చేరుకుంది. 1947 దేశ విభజన తర్వాత, పాకిస్థాన్లో ఇఫ్తార్ సమయంలో తాగే ప్రధాన పానీయంగా ఇది మారిపోయింది. అక్కడ దీనిని 'రూహ్ అఫ్జా'తో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. అటు భారతదేశంలో పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో ఈ పానీయం నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఎవరికి మంచిదకాదంటే..ఈ పానీయం కడుపులోకి వెళ్లగానే చాలామందికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాల ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి. ఇందులో సోడా ఉపయోగించడం వల్ల ప్రేగులపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు తేలికపాటి ఆమ్లతను ఉపశమనం చేసినా..ఇందులో ఉపయోగించే సోడా వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.లాక్టోస్ పడనివారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నావారునివారించడమే ఉత్తమం అని చెబుతున్నారు. అతిగా తాగితే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera)(చదవండి: హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!) -
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్) -
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్లో "ఇవాళ ర్యాపిడో బైక్లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే..) -
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్లోని H&M స్టోర్లోని హైటెక్ ట్రయల్ రూమ్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్దేవా. చక్కటి మ్యూజిక్ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..) -
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్బో ఏమాత్రం కాదు. ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్ జామ్ట్లాండ్లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో.. [07] A spectacular sun halo in Jämtland, Sweden.pic.twitter.com/YhLl9nF8nV— 𝘀𝗶𝘆𝗲𝗡𝗴𝗼 (@Mrsiyengo) December 21, 2025సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి. సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్(ఫిజిక్స్). అయినా కూడా నెటిజన్స్ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు. హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు. కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట. సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది. -
ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..
ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్ లేదా రెస్టారెంట్) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..అమెరికాలో జరిగి అరుదైన సందర్భం. 78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ స్టాఫ్కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్ రాలేకపోతాడు. ఇంతలా సడెన్గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్లోని 45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ ఆరా తీశారు. దశాబ్దకాలంగా అతనికి సర్వీస్ అందిస్తున్న ఆ చెఫ్ వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్తో ఆ చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ అతని డోర్ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్ నేలపై పడి ఉండటం చూసి షాక్ తింటాడు చెఫ్ డోనెల్. అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్ డోనెల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్ తీసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్ పక్క అపార్ట్మెంట్లోకే షిఫ్ట్ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.అయితే చెఫ్ డోనెల్ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్ డోనెల్. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.) -
హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!
ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్వతహాగా ఆహారప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్లో ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అలానే ఈసారి కూడా గజగజ వణికించే ఈ చలిలో తనెంతో ఇష్టంగా తినే ఆహారాన్ని షేర్ చేశారు. దీన్ని శీతకాలపు చిరుతిండిగా అభివర్ణిస్తూ..ఆ రెసీపి తయరీతో సహా వివరించారు. నిపుణుల సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం.గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల కాలానుగుణ వంటకాన్ని నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. ఇది శీతకాలపు చిరుతిండి అని, తనకెంతో ఇష్టమని అన్నారు. పోంక్ రెసిపీ వ్యవహరిస్తారని చెప్పారు. ఇది ఆకుపచ్చని జొన్నలు,నిమ్మకాయ, మఖానా, కొద్దిగా సేవ్ జోడించి తయార చేసి స్మోకీ వంటకమట. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్లిపోవాల్సిందేనట. దీనికి వెల్లుల్లి చట్నీ జోడిస్తేనే మంచి రుచి వస్తుందని చెప్పారు గోయెంకా. ఎలా చేస్తారంటే..తాజా పోంక్(ఆకుపచ్చని జొన్నలని) పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం జల్లుకోవాలి. క్రంచిగా ఉండేలా మఖానా చక్కెర బంతులను జోడిస్తూ..స్సైసీ పంచ్ ఇచ్చేలా వెల్లుల్లి చట్నీ జోడిస్తే చాలట. కాస్త ఆకర్షణీయంగా కనిపించేలా క్రిస్పిసేవ్ చలులుకుంటే..ఎంతో రుచికరమైన పోంక్ రెడీ..!.ఆరోగ్య లాభాలు..ఇది కేవలం చిరుతిండి కాదు. లేత దశలో ఉండే ఈ జొన్నలు ప్రత్యేకమైన వగరు రుచి కలిగి నోటిలే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఫైబర్ మూలం. ఇందులో ఉపయోగించే జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి. అందువల గ్లూటెన్ అంటే పడినివాళ్లకి లేదా సెలియాక్ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మంచిది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని అందివ్వడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలుగజేస్తుంది. అలాగే ఇందులో ఐరన్, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఇది మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.My favourite winter snack is ‘ponk’. Its green jowar, lightly roasted, rushed daily from Surat to Mumbai. Add salt, lemon, makhana sugar balls, sev, a spoon of garlic chutny, and you’ll be transported to heaven. This version has a little hara chana twist. pic.twitter.com/IzDOvUctIT— Harsh Goenka (@hvgoenka) December 13, 2025 (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!
"నిస్వార్థమెంత గొప్పదో…నీ పదము రుజువు కట్టదా..సిరాలు లక్ష ఓంపదాచిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.ఆ సేవ వృధాగా పోలేదు..ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
ఆ కారు నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..! వైరల్గా ఓ తండ్రి పోస్ట్..
కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు. తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట. ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!) -
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్లో తొలిసారిగా నవీద్పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్ను నిఘా వర్గాలు సీరియస్గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025 -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు!
ఎన్నో స్ఫూర్తిదాయకమైన స్టోరీలు చూస్తుంటాం. ఎంతవరకు ప్రేరణగా భావిస్తామో తెలియదు గానీ, మన కళ్లముందే డెవలప్ అవుతున్న వాళ్లను బొత్తిగా గమనించం. కనీసం వాళ్లను చూసినా.. సక్సెస్ని ఒడిసిపట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈవిద్యార్థి.జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒకప్పుడు బ్లింకిట్లో డెలివరీ ఏజెంట్గా పనిచేసిన ఉద్యోగి గురించి సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేశారు. ఆయన ఆ పోస్ట్లో విద్యార్థి దృఢ సంకల్పాన్ని, ఆహార సాంకేతికత పర్యావరణ వ్యవస్థ సృష్టించిన అవకాశాలను ప్రశంసించారు. గోయల్ తన పోస్ట్లో బ్లింకిట్ ఉద్యోగి అథర్వ్ సింగ్ తండ్రి మద్దతు లేకుండా విద్య, జీవన ఖర్చుల కోసం ఎలా నిధులను సమకూర్చుకుంటున్నాడో వివరించారు. ఇది చూశాక తాను ఏమి సంపాదించలేని సమయం చాలానే ఉంది కదా అని నా జీవితం ప్రశ్నిస్తున్నట్లు అనిపించిందని గోయల్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది బ్లింకిట్ నియామకం గురించి ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూశాకేనని అన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి జీవితం దినదినాభి వృద్ది చెందుతూనే ఉందని పోస్ట్లో వెల్లడించారు గోయల్. ఒక పక్క కాలేజ్లో డిజైన్ కోర్సు చదువుతూ బ్లింకిట్లో డెలివరి బాయ్గా పని చేసిన ఆ అబ్బాయి ఇవాళ జొమాటో డిజైన్ బృందంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడంటూ ఆయన పోస్ట్ని ముగించారు. ఇది నిజంగా గ్రేట్ కదా..ఒకప్పుడు డెలివరీల చేసిన అబ్బాయే ..డిజైన్ చేసే స్థాయికి అంటే చాలా స్ఫూర్తిదాయకమైన జర్నీ కదూ ఇది. క్షణాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు చాలా అమ్యూలమైన పాఠాన్ని అందించింది ఈ స్టోరీ అని కొందరూ, ఇలాంటి సక్సెస్ స్టోరీలు మనకు ఆకాశమే హద్దు అని అనిపించేలా చేస్తాయి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Stories like this make all of it absolutely worth it. pic.twitter.com/HMd1U3N8c7— Deepinder Goyal (@deepigoyal) December 11, 2025 (చదవండి: రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు) -
రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..
కొన్ని ఉద్యోగ ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉంటాయి. ఆఫర్ని అంగికరించొచ్చా? వద్దా? అనే సందేహంలోకి నెట్టేస్తాయి. దాని వెనుక కాస్త ఇబ్బందుల తోపాటు, మన ప్రియమైన వాళ్లను వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. పోనీ రిస్క్ చేద్దామన్నా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మన అనుకున్న వాళ్లే మనకు దూరమైపోతారా అనే బెంగ, గుబులు మొదలై.. నానా హైరానా పడుతుంటాం. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ శాస్త్రవేత్త. ఏ నిర్ణయం పాలుపోక నెటిజన్ల సలహా తీసుకుందామనే ఉద్దేశ్యంతో తన కథను షేర్ చేసుకున్నాడు ఈ పరిశోధకుడు.ఆ వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్లో తాను పర్యావరణ పరిశోధనలో పనిచేస్తున్నానని, తన కంపెనీ మెక్ముర్డో స్టేషన్లో ఆరు నెలల పరిశోధన కోసం అంటార్కిటికాకు వెళ్లాలనుకుంటున్నారా అని అడిగింది. ఆరు నెలల పరిశోధన కోసం ఏకంగా రూ. 1.3 కోట్లు చెల్లిస్తానని బంపరాఫర్ ఇచ్చింది. పైగా అంత మొత్తం రిటైర్మెంట్ టైంకి ఆహారం, గృహనిర్మాణం, విమానాలు, గేర్ పనులు అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ ఆఫర్ నాకెంతో నచ్చింది. అందులోనూ అంటార్కిటికాలో ఉండటం అంటే ఖర్చులు లేకుండా హాయిగా జీవించొచ్చు. మూడేళ్లు తన స్నేహితురాలితో కలిసి ఉన్నా, కానీ ఇప్పుడు సడెన్గా తనను వదిలి వెళ్లడం అన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది. ఇదేమి థ్రిల్లింగ్ ఫీల్లా అనిపించేది కూడా కాదని చెబుతున్నాడు. ఒకవేళ తాను ఆ ఆఫర్ని అంగీకరించినా.. కూడా ఆమె తనకు మద్దతిస్తుందని, కానీ అంతకాలం ఆమెకు దూరంగా ఉండటం అంటేనే మనసుకు చాలా కష్టంగా ఉందని వాపోయాడు. అదీగాక తన ప్రస్తుత ఆదాయ నికర విలువ రూ. 1.62 కోట్లు అని, ఆరు నెలల ఒప్పందం కారణంగా త్వరితగతిన రిటైర్మెంట్ తీసుకుని హాయిగా బతికేయొచ్చని చెబుతున్నాడు ఈ శాస్త్రవేత్త. అంతేగాదు జీతం మొత్తం కూడా నేరుగా బ్యాంకులోనే కంపెనీ చెల్లిస్తుంది కాబట్టి..ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఏకంగా ఆరు నెలలు ఒంటరిగా సైన్సు పరిశోధనలతో గడపాలి. సైన్సే లోకంగా గడిపాను గానీ..ఇలా ఒంటిరిగా అంకితమయ్యే అవకాశం కల్పిస్తుందని కలలో కూడా అనుకోలేదని చెబుతున్నాడు. అయితే ఈ ఆరు నెలల కాలం తన వ్యక్తిగత జీవితంపై తన రిలేషన్స్పై గట్టి ప్రభావం చూపి మళ్లీ ఒంటిరిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది. అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది కాస్త చెప్పండి అంటూ తన బాధనంతా రాసుకొచ్చాడు ఈ పరిశోధకుడు పోస్ట్లో. అయితే నెటిజన్లు చాలామంది ఆ ఆఫర్ని ధైర్యంగా అంగీకరించండి, మీ స్నేహితురాలు పూర్తిగా మద్దతిస్తుందన్న నమ్మకం ఉంటే బేషుగ్గా నిర్ణయం తీసుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. పైగా పదవీవిరమణ సమయానికి ఇద్దరూ హాయిగా గడపొచ్చు. అలాగే జస్ట్ ఆరు నెలల కాలం పెద్ద ఎక్కువ సమయం ఎడబాటు కూడా కాదు. కాకపోతే గడ్డకట్టే ఆ అంటార్కిటిక్లో జీవన స్థితి ఎలా ఉంటుంది, తట్టుకోగలనా లేదా అనేదాని గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు సాగండి ఆల్ద బెస్ట్ అని చెబుతూ పోస్టులు పెట్టారు.(చదవండి: Adarsh Hiremath: డ్రాపౌట్ టు బిలియనీర్) -
లైన్ డ్రాయింగ్ కోసం..
బొమ్మల పుస్తకంలోకి వెళితే పుస్తకంలోకి వెళ్లినట్లు మాత్రమే ఉండదు. మరో ప్రపంచంలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటుంది. బొమ్మల ప్రపంచానికి ‘ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్’ అనేది మైండ్–బ్లోయింగ్ అప్గ్రేడ్. ‘నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. కానీ గీయడం మాత్రం రాదు’ అనేవారికి ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్లు బెస్ట్ ఫ్రెండ్స్! బొమ్మలు గీయడం ఏమాత్రం రాక΄ోయినా తమ ఊహలను ‘ఏఐ లైన్ డ్రాయింగ్’తో బొమ్మలుగా మలచవచ్చు.కొన్ని ఫ్లాట్ఫామ్స్....ఓపెన్ఆర్ట్ (ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) దీనిలో పోర్టయిట్స్, అబ్స్ట్రాక్ట్, ఫ్లోరల్, ఫ్యాషన్ అనే విభాగాలు ఉన్నాయి.ఏఐలైన్ ఆర్ట్.కామ్ పోర్టయిట్.యాప్/ఫొటో–టు–లైన్ ఆర్ట్ ‘కన్వర్ట్ ఇమేజ్ టు లైన్ డ్రాయింగ్ ఇన్ సెకండ్స్’ అంటోంది ఐకలరింగ్ఏఐ ఫోటర్ (ఫ్రీ ఆన్లైన్ ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) న్యూ ఆర్క్.ఏఐ. ప్రోమీఏఐప్రో కాన్వా.కామ్/ఏఐ–ఆర్ట్–జనరేటర్ ఏఐ–డ్రా.టోక్యో (చదవండి: -
50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!
ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు, చిన్న చిన్న గొడవలు కామన్గానే ఉంటాయి. అవి వర్క్ పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు కాబట్టి..అక్కడున్నంత సేపే గుర్తించుకుంటాం. ఆ తర్వాత వదిలేస్తాం. కానీ కొందరు కాస్త చొరవ తీసుకుని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మహిళపట్ల కొందరు మగ ఉద్యోగులు ప్రవర్తన డిఫెరెంట్గా ఉంటుంది. అలా కాకుండా 50 ఏళ్ల వ్యక్తి వయసుకు తగ్గట్టుగా కాకుండా కుర్రాడిలా ప్రవర్తిస్తే ఎవ్వరికైన చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న వివాహిత.ఆమె పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళ 50 ఏళ్లకు పైనే ఉండే సహోద్యోగితో తనకెదురైన అసౌకర్యమైన క్షణాన్ని పోస్ట్లో షేర్ చేసుకుంది. తామెప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. మేనేజ్మెంట్ మీటింగ్లు ముగిసిన వెంటనే కంపెనీయే ఫ్రీగా స్నాక్స్ పెట్టడం జరుగుతుంది. దానిని తాము షేర్ చేసుకునేవాళ్లం. అలాగే ఏదైనా విషయం ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్లో చాట్ చేసుకునేవాళ్లం. అవన్నీ పనిలో భాగంగా చాలా సాధారణమే. అందువల్ల స్నేహపూర్వకంగానే ఇదంతా అనే భావించా. కానీ ఒక వారం తర్వాత పెళ్లిచేసుకుని వచ్చాక ఒక్కసారిగా అతడి తీరు మారిపోయింది. రోటీన్గా ఇదివరకిటిలా స్నాక్స్ షేర్ చేయడం అన్ని చేశారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా..సడెన్గా గ్రూప్లో మెసేజ్ల పరంపర డిఫెరెంట్గా మొదలైంది. ఆరోజు జరిగే పనుల గురించి జోక్ చేయడం నుంచి కాస్త విభిన్నంగా మాట్లాడాడు. దాన్ని కూడా తేలిగ్గా తీసుకున్నానంటూ తన గోడును చెప్పుకొచ్చిందామె. డిసెంబర్ 30కి ముందు రోజు అదనపు షిఫ్ట్ల అనంతరం అతడి స్వరంలో మార్పులు స్పష్టంగా గమనించాను. అతడు ఓ పెద్దాయనలా ప్రవర్తించడం లేదనిపించింది. మన ఇద్దరం మంచి ఫుడ్లవర్స్ కాబట్టి ఎప్పుడైనా సరదా వీలుకుదిరితే డిన్నర్కి ప్లాన్ చేద్దామా అని అడిగాడు. ఒక్కసారిగా ఆ మాటకు హుతాశురాలినయ్యానంటూ..తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. అంతేగాదు అతడి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసి దూరంగా ఉంచాలా, యాజమాన్యానికి ఈ ఘటన గురించి వివరించాలో సలహా ఇవ్వమని కోరింది పోస్ట్లో. అయితే నెటిజన్లు..ఆ ఆహ్వానానని తిరస్కరించండి. అతడి ఆలోచన తీరు సరిగా లేదు..సున్నితంగా రిజెక్ట్ చేసి దూరంగా ఉండటమే మంచిది అంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. (చదవండి: ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..? ఆ హాస్య నటుడు ఏకంగా 78 కిలోలు తగ్గి..) -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..
ఫుడ్ రెస్టారెంట్ లేదా హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్ తీసుకుని ఆ యువకుడు సక్సెస్ అయ్యాడా అంటే..జర్మన్లో అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగం చేసేవాడు మోహన్. స్కాలర్షిప్పై పారిస్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్గా రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు. ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dosamaa (@dosamaa_in) (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..) -
శునక టెక్ సేవలు
ఇకముందు... ‘కుక్కలు ఏం చేస్తాయి?’ అనే ప్రశ్నకు– ‘ఇంటికి కాపలా కాస్తాయి’ అనే ఏకైక సమాధానం మాత్రమే వినిపించక΄ోవచ్చు. ‘ఇంకా ఎన్నో చేస్తాయి’ అని చెప్పవచ్చు. కుక్కలను మరింతగా ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే... డాగోసోఫీ బటన్. గృహోపకరణాలను శునకం నియంత్రించడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. కుక్కలు తమ యజమానులకు మరిన్ని ఇంటి పనులలో సహాయం చేయడానికి వీలుగా యానిమల్–కంప్యూటర్ ఇంటరాక్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న అప్లికేషన్ను రిసీవర్లో ప్లగ్ చేయాలి. తద్వారా ఫ్యాన్ ఆన్చేయడం, లైట్ ఆఫ్ చేయడం... మొదలైన వాటికి డాగోసోఫీ బటన్ ఉపయోగపడుతుంది. నీలి, తెలుపు రంగులో ఉన్న డోగోసోఫీ బటన్ను శునకానికి కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ బటన్ చాలా సున్నితంగా ఉంటుంది. కుక్క తన ముక్కుతో బటన్ను తట్టడంతో అది యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడానికి శునకానికి కొంత శిక్షణ అవసరం ‘డాగోసోఫీ ఈ పరికరాలను మాత్రమే, ఇంత సంఖ్యలో మాత్రమే నియంత్రిస్తుందనే పరిమితి లేదు. మీ సృజనాత్మకతతో ఎన్ని పరికరాలైనా నియంత్రించేలా శునకానికి శిక్షణ ఇవ్వవచ్చు’ అంటున్నారు డాగోసోఫీ రూపకర్తలు. (చదవండి: మలబద్ధకం నివారణ కోసం..! ఈట్ ఫ్రూట్) -
పేరు మార్చేసుకున్న ఇండిగో?!
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్ హాట్టాపిక్ మారింది.ఆ పోస్ట్లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్లైన్స్ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్వైరల్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్ విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది. నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్డేట్ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్ కోరుకుంటుందేమో అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది కాబోలు.Name change announced…. pic.twitter.com/Pd3JJiE6CG— Harsh Goenka (@hvgoenka) December 5, 2025 (చదవండి: ఏఐ చాట్బాట్తో జర జాగ్రత్తోయ్..!) -
అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..
మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్లైన్లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. పురుషుల కొరతకు రీజన్దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికా-భారత్కి మధ్య ఇంత వ్యత్యాసమా..!) -
రెండున్నర నెలల భారత్ పర్యటనలో గమనించింది ఇదే..!
అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్స్టాగ్రామ్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.ప్రజలు: యూఎస్ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.కార్లు: యూఎస్లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్లో అదనపు వేడి ఉంటుంది.మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.స్థోమత: యూఎస్లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్లో పర్లేదు, నిర్వహించగలం.కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Anna Haakenson | Adventure Family Travel (@wanderlust.haaks) (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
కంటెంట్ క్రియేటర్ అవ్వడం కోసం..రూ. 15 కోట్ల కంపెనీని అమ్మేశాడు..!
వెల్సెటిల్ అయ్యాక మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి..చక్కగా ఆర్జింగ్, సత్కారాలు, రివార్డులు పొంది కూడా మళ్లీ నచ్చిన కెరీర్ కోసం మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెడుతున్నానని చెబుతున్నాడు. వామ్మో అందుకు ఎంత ఓపిక కావలిరా బాబు అనిపిస్తోంద కదూ..!. మరి ఇంతకీ ఈ వ్యక్తి దేని కోసం ఇలా అంటే..హైదరాబాద్కు చెందిన రాజీవ్ ధావన్ సక్సెస్కి సరికొత్త అర్థమిచ్చేలా తన కథను నెట్టింట పంచుకున్నాడు. “ఇదిగో నా కథ“ అనే క్యాప్షన్తో షేర్ చేశాడు. తనది సాధారణ విజయగాధ కాదంటూ తన ప్రస్థానం మొదలైన విధానం గురించి వివరించాడు. తాను చిన్నప్పుడూ బేకరీలకు సాస్లను అమ్మడం ప్రారంభించానని, పెద్దయ్యాక రిటైల్ స్టోర్లో పనిచేశానని చెప్పుకొచ్చాడు. అక్కడ తాను రాక్లలో చొక్కాలను మడతపెట్టి శుభ్రం చేసేవాడనని చెప్పుకొచ్చాడు. తర్వాత జీఈలో తన తొలి కార్పొరేట్ జీతం చూడగానే..ప్రపంచంపైన ఉన్నట్లు ఫీలయ్యానంటూ తాను సాధించిన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని, సరిగ్గా ఆ సమయంలోనే తల్లిని కోల్పోయానని తెలిపాడు. అలా 18 ఏళ్లు వచ్చేటప్పటికీ ఎంఎన్సీలో పనిచేశానిట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రూ. 40 వేల రుణంతో హైదరాబాద్లో వాట్స్ ఇన్ ఏ నేమ్ను ప్రారంభించి..ఏకంగా 15 కోట్ల కంపెనీగా మార్చాడు. దాదాపు వంద ప్లస్ బ్రాండ్లు, అవార్డులు మంచి గుర్తింపు అందుకున్నానంటూ తన కథను చెప్పుకొచ్చాడు. అంతేగాదు 30 ఏళ్లకే మెర్సిడేజ్ కారు కొని తన కలను సాకారం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం దాన్ని అమ్మేసి మారుతి కారుతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను ప్రారంభించిన అన్ని కంపెనీలను అమ్మేశానని కూడా వెల్లడించాడు. అయితే తాను ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇలా చేయలేదని, కెరీర్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనిపించి ఇలా చేశానని చెబుతున్నాడు. 39 ఏళ్ల వయసులో ఉన్న తాను కంటెంట్ క్రియేటర్గా కొత్తగా తన కెరీర్ని మొదలు పెట్టాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానంటూ తన సక్సెస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు గ్రేట్ ఎచివ్మెంట్స్ అని ప్రశంసించారు. అంతేగాదు మీ మళ్లీ కెరీర్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మీ ధైర్యం అసామాన్యమైనదని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.ఎవరీ రాజీవ్ ధావన్?ధావన్ తన పోస్ట్లో ఎనిమిదవ తరగతి ఫెయిల్యూర్, పది తర్వాత చదువు మానేసినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం తర్వాత తన చదువుని తిరిగి పూర్తిచేసినట్లు తెలిపాడు. అతని లింక్డ్ఇన్ ప్రకారం.. యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: అద్భుతమైన కెరీర్ ట్రాక్ రికార్డు..! ఒకరు యుద్ధ భూమిలో, మరొకరు ఇన్విస్టిగేషన్లో..) -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్మశానంలో యువతి.. వణికిపోతున్న కరీంనగర్ ప్రజలు
సాక్షి, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కబరస్తాన్(స్మశానం)లో ఓ దృశ్యం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ యువతి గత మూడు రోజులుగా అక్కడి నుంచి కదలడం లేదు. కుటుంబ సభ్యులు సైతం ఆమెను కదిలించే ప్రయత్నం చేయకపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. ఈ ఘటన వెనుక తీవ్ర విషాదం ఉన్నట్లు తెలుస్తోంది. సదరు యువతి తల్లి ఈ మధ్యే చనిపోయింది. ఆ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిందామె. ఆపై ఆమె ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి వెతికిన కుటుంబ సభ్యులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తల్లి సమాధిని ఆనుకుని పడుకుని పోయిందామె. అలా.. పగలూ రాత్రి తేడా లేకుండా కదలకుండా మూడు రోజులుగా ఆమె స్మశానంలోనే ఉండిపోయింది. కదిలించే ప్రయత్నం చేస్తే.. గుర్రుగా చూస్తుండడంతో స్థానికులే కాదు కుటుంబ సభ్యులూ భయపడుతున్నారు. డిప్రెషన్లో ఉందా? మతి భ్రమించిందా? అనేది ఆమెను అక్కడి నుంచి తరలిస్తేనే స్పష్టత వచ్చేసింది. సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆమెను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్తో సంచలనం
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్సెట్ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్కి వెళ్లిపోయాడు. అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనూ ఫోన్తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్లు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్లైన్ మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్నే ఉదాహరణ. (చదవండి: ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..) -
అమెరికా మోజుతో 90 లక్షల ప్యాకేజీని కాలదన్ని..
విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. అతడే అభిజయ్ అరోరా. భారత్కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్తో చదవాలనే డ్రీమ్తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | Study Abroad | Careers | AI (@abhijayarora_) (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
రెస్టారెంట్ బిల్లుపై డిస్కౌంట్.. పేటీఎం బాస్పై జోకులు
సాధారణంగా మధ్యతరగతివారికి డిస్కౌంట్లు అంటే మోజు ఎక్కువ. ఎక్కడ ఏది కొనాలన్నా మొదట డిస్కౌంట్ ఎంత వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ సంపన్నులు కూడా వీటికి అతీతులు కాదని కొందరు నిరూపిస్తున్నారు.పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా ఓ రెస్టారెంట్ బిల్లుపై భారీ తగ్గింపు పొందిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్త వైరల్గా మారి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. బిలియనీర్లు కూడా డిస్కౌంట్ల కోసం చూస్తారనే అంశంపై నెటిజన్లు చమత్కారాలు చేయడం మొదలుపెట్టారు.ఢిల్లీ విమానాశ్రయంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు విందు జరుపుకొన్న విజయ్ శేఖర్ శర్మ.. డిన్నర్ బిల్లు రూ. 40,828 వచ్చినట్లు తెలిపారు. అయితే ఈజీడైనర్లోని ఆఫర్లు, కూపన్లు ఉపయోగించి బిల్లును రూ. 24,733కి తగ్గించగలిగారు. మొత్తం రూ. 16,095 ఆదా కావడం ఆయనను ఆశ్చర్యపరచింది.ఈ బిల్లు స్క్రీన్షాట్ను తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన “ఇది ఊహించని పుట్టినరోజు గిఫ్ట్లా అనిపించింది” అంటూ ఈజీడైనర్, దాని వ్యవస్థాపకుడు కపిల్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. 35% రెస్టారెంట్ డిస్కౌంట్ రూ. 14,290 తో పాటు రూ. 2,000 అమెరికన్ ఎక్స్ప్రెస్ కూపన్ కూడా వర్తించడంతో ఈ భారీ తగ్గింపు వచ్చింది.నెటిజన్ల స్పందనలువిజయ్ శేఖర్ శర్మ పోస్ట్ వైరల్ కావడంతో, డిస్కౌంట్ను ఆయన వాడుకోవడంపై సోషల్ మీడియా యూజర్లు జోకులు పేలుస్తున్నారు. “మాకు కూడా ‘కపిల్ చోప్రా లాంటి స్నేహితులు’ ఉంటే బాగుండేది” అని కొందరు సరదాగా చెప్పారు. “బిలియనీర్లు డిస్కౌంట్ చూసి ఇలా ఎంజాయ్ చేస్తే… మనం మాత్రం రెస్టారెంట్లలో రూ. 20 సర్వీస్ ఛార్జీ కోసం వాగ్వాదం చేస్తాం” అని మరో కామెంట్ వైరల్ అయింది. “పేటీఎం క్యాష్బ్యాక్ కర్మ తిరిగి వస్తోంది” అని ఒకరు వ్యాఖ్యానించారు. “మీరు బిలియనీర్ కాదా? బిలియనీర్లు కూడా డిస్కౌంట్లను ఇష్టపడతారా?” అంటూ మరొకరు ప్రశ్నించారు.It is too good to be true that a ₹40k restaurant bill becomes ₹24 k just because you have friend like @KapilChopra72 ‘s awesome and incredible @eazydiner ! 😄Thank you EazyDiner , it is always awesome discounts on food 🤗🙏🏼 pic.twitter.com/XthhbM4NXM— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 22, 2025 -
సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..
కంటతడి పెట్టించే కష్టాల కొలిమి..సాధించాలన్న ఆశయాన్ని కన్నీళ్లు చుట్టుముట్టేస్తున్నా..వెనకడగు వేయలేదు. మనసును మెలిపెట్టే బాధనంతటిని లక్యాన్ని మరింత చేరువ చేసే సాధనంగా మార్చాడు. జీవిత పోరాటంలో ఎలా గెలుపుని ఒడిసి పట్టుకోవాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. అతడు అడగడుగునా ఎదురయ్యే సవాళ్లను, కంటతడి పెట్టిస్తున్న ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడమే గాక, తన బాధ్యతల విషయంలోనూ రాజీకి తావివ్వకుండా ఎలా సమర్థవంతంగా నిర్వర్తించింది రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు.ఆ పోస్ట్లో తాను ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని పేర్కొన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అతడి తండ్రి తన పిల్లలకు మంచి మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో ఢిల్లీ వెళ్లాడు. కానీ విధి మరోలా తలిచింది. అనూహ్యంగా 2013లో తండ్రి ఆకస్మిక మరణం తన జీవితాన్ని పూర్తిగా విషాదకరమైన జీవితంలోకి నెట్టేసింది. అయితే అతడు ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చినా..చదువును వదలకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాడు. అలా 2015లో రూ. 3.15 లక్షల ప్యాకేజ్తో బహుళ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ సక్సెస్ని అక్కడితో ఆపకుండా 2018 నాటికి వేరే కంపెనీకి మారి రూ. 7.5 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఢిల్లీ అద్దె ఇంట్లో ఉంటూ అప్పులన్నీ తీర్చేశాడు. కానీ నవంబర్ 2020లో మళ్లీ విషాదం చుట్టుమట్టింది. ఆ ఏడాది తన తల్లిని కోల్పోయాడు. దాంతో అతడిపై తమ్ముడు, చెల్లి బాధ్యతలు మీద పడ్డాయి. తనలా తన తోబుట్టువులను కూడా మంచి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారి చదువుల విషయంలో రాజీపడకుండా చదివించాడు. దాని ఫలితం సోదరికి రూ. 11 లక్షల వార్షిక ప్యాకేజ్తో ఉద్యోగం రాగా, తమ్ముడికి బీటెక్ సెకండియర్లో ఉండగానే జాబ్ కొట్టేశాడు. అలాగే తన స్వగ్రామంలోని ఇంటిని 2021లో పునర్నిర్మించే పనులు ప్రారంభించాడు. ఆ ఇల్లు అక్టోబర్ 2022 నాటికి పూర్తవ్వగా, నవంబర్ 2022లో, తాను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే తన వివాహం ఇంటి నిర్మాణాన్ని కవర్ చేయడానికి సుమారు రూ. 20 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నానని, దాని ఈ ఏడాది ఆగస్టు 2025 నాటికి క్లియర్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి పొదుపులు లేవు గానీ అతిపెద్ద సక్సెస్ని సాధించగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. ఇదేంటి అనుకోకండి. ఎందుకంటే జీవితం నన్ను బాధించే కష్టాల కడలిలో ముంచినా..వెనక్కిచూడలేదు, ఆగిపోలే..!. స్థైర్యంతో ముందుకు సాగిపోయాను..మంచి స్థాయికి చేరుకున్నా. అలాగే నా తోబుట్టువులను సెటిల్ చేయగలిగా. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నా. గుర్తించుకోండి సక్సెస్ అటే ఎన్ని కోట్లు కూడబెట్టాం అన్నది కాదు. జీవితం మనల్ని ఎంత కష్టబెట్టినా..తడబడకుండా ముందుకు సాగడం అని సగర్వంగా పోస్ట్లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించడమే కాదు..ఇది గొప్ప స్ఫూర్తిగాకమైన స్టోరీ బ్రదర్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
భర్త మరణంతో ఆ రంగునే దరిచేరనివ్వలేదు..! కానీ కూతురు.
భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు. అలానే అన్నింటిని వదిలేసి..బతుకుతున్న ఆమె జీవితంలోకి మళ్లీ కాంతులు వచ్చేలా రంగులతో నింపింది కూతురు. సంతోషంగా ఇదివరకటి స్త్రీలా త్రుళ్లిపడుతూ ఉన్న ఆ దృశ్యం.. దూరమైన ఆమె భర్త సైతం ముచ్చటపడేలా అందంగా ఉంది.ప్రగతి అనే సోషల్ మీడియా వినియోగదారు నెట్టింట ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను వ్యక్తిగత విషయాలను పోస్ట్చేసే వ్యక్తిని కానని, ఈ రీల్ తన తల్లి కోసం అని పేర్కొంది. తన తల్లి నాన్న మరణంతో ఎరుపు రంగుకి పూర్తిగా దూరమైందని, ఎరుపు రంగు చీర గానీ డ్రెస్లుగానీ ధరించటమే మానేసిందని చెప్పుకొచ్చింది. అయితే తాను ఈసారి తన తల్లి కోసం ఎరుపు రంగు చీరను కొని, కట్టుకోమని ఫోర్స్ చేసినట్లు వెల్లడించి. అయితే ప్రగతి ఎంతో బతిమాలాడగా ఆమె ఒప్పుకుంది. అందువల్లే ఈ రీల్ని పోస్ట్చేశానని వివరణ ఇచ్చింది. ఎందుకంటే చాల ఏళ్ల తర్వాత ఎరుపు రంగు చీరలో తాను ఎలా ఉన్నానే అనేది గుర్తుండిపోవాలి, ఆ బాధకరమైన రోజులు కళ్లముందు కానరాకూడదని ఇలా చేశానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. ఆమె తాను కొన్న ఎరుపు రంగులో అద్భుతంగా కనిపించడమే కాదు..ఆమె చేసిన ర్యాంపు వాక్ కూడా అదుర్స్ అని సంబరపడింది. విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో పక్కనే ఓ ఫోటోఫ్రేమలో ఉన్న ప్రగతి తండ్రి కూడా ఈ దృశ్యాన్ని సంతోషిస్తున్నాడేమా అన్నట్లుగా ఉంద . అంతేగాదు ఆ వీడియోలో చివరగా..అయినా స్వేచ్ఛను అనుమతి కింద పరిగణించకండి, ముఖ్యంగా మహిళలో విషయం అంటూ ప్రగతి విజ్ఞిప్తి చేయడం అందరీ హృదయాలను తాకింది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు..మళ్లీ ఆమె తనకిష్టమైన ఎరుపు రంగుని స్వీకరించాక ఎంత అందంగానో కనిపిస్తోంది అని మెచ్చుకుంటూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by PRAGATI (@pragatipatil440) (చదవండి: బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..) -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..
ప్రధాని నరేంద్ర మోదీని శక్తిమంతమైన నాయకుడిగా అభివర్ణించొచ్చు. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనైనా భారతీయత ఉట్టిపడే ఫ్యాషన్ శైలిలో కనిపిస్తుంటారు. అందుకు నిదర్శనం ప్రతీ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో కనిపించే మోదీ లుక్. ఆయన మన భారతీయ సంప్రదాయ ఫ్యాషన్కు చిహ్నమైన తలపాగ, టైలర్డ్ జాకెట్తో ఐకానిక్ హాఫ్ స్లీవ్ కుర్తాలలో దర్శనమిస్తుంటారు. ప్రతిష్టాత్మకంగా లేదా సాధారణంగా జరిగే వేడుకలకైనా అందుకు అనుగుణమైన స్లైల్ స్టేట్మెంట్తో కనపించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ఆయన ఫ్యాషన్ శైలి భారతీయ సారాంశాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఆయన చేతికి ధరించే వాచ్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆఖరికి దీని విషయంలో కూడా మెదీ తన భారతీయతను వదులుకోలేదంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి ఆ వాచ్ స్పెషాలిటీ, దాని ధర తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అరుదైన రూపాయి నాణెం..ఈ వాచ్లో 1947 నాటి అరుదైన రూపాయి నాణేన్ని స్పష్టంగా చూడొచ్చు. జైపూర్కి చెందిన వాచ్కంపెనీ తయారు చేసిన ఈ 43ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ని 'రోమన్బాగ్' అనిపిలుస్తారు. ఇది జపనీస్ మియోటా ఉద్యమం ఆధారితమట. ఇందులో నడిచే పులి ఇమేజ్ భారత్ స్వాతంత్ర్య ప్రయాణాన్ని, మేక్ ఇన్ ఇండియా చొరవను సూచిస్తుంది. ఇక ఈ రూపాయి నాణెంల బ్రిటిష్ పాలనలో ముద్రించిన చివరి నాణెం కావడంతో ఈ వాచ్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1946-47లలో ముంద్రించిన నాణెం అని వాచ్ని చూడగానే క్లియర్గా తెలుస్తుందట. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుందట. ఇందులో బంగారం లేదా వెండి రంగులతో రోమన్, దేవనాగరి లిపి సంఖ్యలు ఉంటాయట. లోపల నుంచి యాంటీ-రిఫ్లెక్టివ్ పూత ఉండి, సీ-త్రూ బ్యాక్ నీలమణి క్రిస్టల్ను ఉంటుంది. ఈ వాచ్కి వాటర్ ప్రూవ్ ఫిచర్ కూడా ఉంది. మోదీ ఈ వాచ్ని ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ మధ్య పలు కార్యక్రమాల్లో ధరించి కనిపించారు. దీని ధర దగ్గర దగ్గర రూ. రూ. 55 వేలు నుంచి రూ. 60 వేలు వరకు పలుకుతుందట.అందువల్లే హాట్టాపిక్గా..జైపూర్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకుడు గౌరవ్ మెహతా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈ స్వదేశీ టైమ్పీస్ను ధరించడంతో ఈ ప్రొడక్ట్కి నెట్టింట అమితంగా క్రేజ్ ఏర్పడిందన్నారు. నిజానికి సాదాసీదాగా చూస్తే ఈ భారతీయ లగ్జరీ ..ఇవాళ ఆసక్తికరమైన ఆంశంగా మారిపోయిందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఎడ్ షీరాన్, రఫ్తార్ వంటి వారు కూడా జైపూర్కు చెందిన మెహతా కంపెనీ తయారు చేసిన టైమ్పీస్లను ధరించి కనిపించేవారు.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. అంతేగాదు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు. ఇదే తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సైతం ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పోస్టు పెట్టడంతో మరోసారి ఉపాసన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు..దానికి శ్రీధర్ వెంబూ ఏం కౌంటరిచ్చారు అంటే..ఉపాసన నవంబర్ 17 ఐఐటీ హైదరాబాద్కి వెళ్లి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఉపాసన అక్కడి అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే.. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. పైగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది. పైగా అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెనుదూమారం రేపాయి. ఏం చెబుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే తరుణంలో జోహో ఫౌండర్ మాజీ సీఎం శ్రీధర్ వెంబు కూడా ఉపాసన్ పోస్ట్పై ఘాటుగా స్పందించారు. ఆయన ఉపాసన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు. ఇది మనం సమాజానికి, మన పూర్వికులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు. తాను అదే విశ్వసిస్తానని కూడా చెప్పారు. తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపకుడికి ఇదే విషంయ చెబుతానని కూడా అన్నారు. అంతేగాదు పురుషులు మహిళలు ఇద్దరూ వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని, దానిని వాయిదా వేయద్దని సూచించారు కూడా. వారు సమాజానికి, వారి స్వంత పూర్వీకుల పట్ల జనాభా విధిని నిర్వర్తించాలని నొక్కి చెప్పారు. ఈ భావన వింతగా, పాతకాలం మాటలులా అనిపించొచ్చు. కానీ ఈ ఆలోచన కచ్చితంగా ప్రతిధ్వనిస్తుందని నమ్ముతున్నా అంటూ ఉపాసన కొణిదెల పోస్ట్ని రీట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియో ఎక్స్లో పేర్కొన్నారు శరీధర్ వెంబు. కాగా, గత నెలలో ఉపాసన, రామ్చరణ్ తాము రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన శ్రీమంతం వేడుక వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. View this post on Instagram A post shared by Startups Talk India (@startupstalkindia) చదవండి: అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..! -
‘మా మేనేజర్ కరుణామయుడు’
ఉద్యోగులు సడెన్గా తమ మేనేజర్లకు మేసేజ్ చేస్తూ.. ఆరోగ్యం బాగాలేదు సర్.. ఈరోజు కొంచెం ఆఫీస్కు లేటుగా వస్తాను.. అని అడిగితే.. డాక్టర్ దగ్గరికి వెళ్లాక రిపోర్ట్లు సెండ్ చేమయనే వారున్నారు. అలాంటిది ఓ కంపెనీ మేనేజర్ తన కింది ఉద్యోగుల పట్ల చూపిస్తున్న కరుణకు ఫిదా అవుతున్నారు. తమ టీమ్ సభ్యుల్లో ఒకరు ఇటీవల జరిగిన ఓ సంఘటనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే తెగ వైరల్ అవుతోంది.‘అమెరికన్/యూరోపియన్ మనస్తత్వంతో భారతీయ మేనేజర్’ అనే శీర్షికతో r/IndianWorkplace అనే రెడ్డిట్ హ్యాండిల్లో పోస్ట్ అయిన వివరాల ప్రకారం.. ‘గుడ్ మార్నింగ్, నేను ఇవాళ ఇంటి నుంచి పని చేయాలనుకుంటున్నాను. మెడలో సమస్యగా ఉంది’ అని రాశారు. దానికి మేనేజర్ స్పందిస్తూ..‘సరే. నిన్ను హాస్పిటల్కు తీసుకెళ్లడానికి ఎవరైనా ఉన్నారా?’ అన్నాడు. అందుకు ఉద్యోగి తన ఫ్లాట్మేట్ సహాయం చేస్తాడని చెప్పినప్పుడు, మేనేజర్ మరింత భరోసా కల్పిస్తూ.. ‘డాక్టర్ ఏం చెబుతాడో నాకు అప్డేట్ ఇవ్వు. కంగారు పడకు. ఇది సాధారణ నొప్పి మాత్రమే అవ్వాలని ఆశిస్తున్నాను. ఆరోగ్యం జాగ్రత్త’ అని అన్నారు.ఆ ఉద్యోగి గతంలో సదరు మేనేజర్తో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు సెలవు గురించి తెలియజేసిన ప్రతిసారీ తన మేనేజర్ చాలా సపోర్ట్ ఇస్తారని చెప్పారు. అవసరమైతే మరుసటి రోజు కూడా సెలవు తీసుకోమని తరచుగా చెబుతారని తెలిపారు. అత్యవసర సమావేశాలు, విశ్రాంతి తీసుకోవడం ఒకేసారి ఉంటే పెయిడ్ లీవ్ను వృధా చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సలహా ఇస్తారని చెప్పారు. ఆ సమయంలో బలవంతం చేయరని తెలిపారు. ఇలాంటి సపోర్ట్ చాలా కంపెనీల్లో అరుదని పేర్కొన్నారు. తన మునుపటి మేనేజర్ కూడా అంతే దయతో ఉండేవారని, ఇద్దరు ఇలాంటి మేనేజర్లు దొరకడం నిజంగా తన అదృష్టమని పొంగిపోయాడు.ఈ పోస్ట్తో నెటిజన్లు మేనేజర్పై ప్రశంసలు కురిపించారు. ఒక యూజరు ‘నేను తయారీ రంగంలో పని చేస్తున్నాను. ఓవర్ టైమ్ పనిచేసిన తర్వాత నేను ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చినా, నా మేనేజర్కు చెప్పి వెళ్లాలి. అది మా పరిస్థితి’ అన్నారు. మరొకరు, ‘మనం ఎల్లప్పుడూ ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు -
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు. -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
అతను నిద్రపోయి అరవైఏళ్లు దాటింది.. ! వైద్య ప్రపంచానికే అంతుచిక్కని మిస్టరీ..
వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్లోని ఒక మారుమూల ప్రశాంతమైన గ్రామం లో.. 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ నివసిస్తున్నాడు. అతని కథ ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలను మాత్రమే కాదు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే సడలి, వడలిపోయే సాధారణ మనుషుల ధోరణికి భిన్నంగా ఈ రైతు జీవితం ఉండడమే ఈ ఆశ్చర్యాలకు కారణం. ఒకటీ రెండూ కాదు ఏకంగా 62 ఏళ్ల నుంచీ ఈ తాత కళ్లు మూతపడలేదట.గత 1962 నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని న్గోక్ పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధంలో తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న తర్వాత, 20 సంవత్సరాల వయసులో అతనికి ఈ అసాధారణ పరిస్థితి ప్రారంభమైంది. జ్వరం తగ్గింది కానీ, అతని నిద్ర సామర్థ్యం తిరిగి రాలేదు. ఆరు దశాబ్దాల క్రితం అధిక జ్వరం తర్వాత తన నిద్రలేమి ప్రారంభమైందని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్గోక్ గుర్తుచేసుకున్నాడు. ‘నేను మందులు తీసుకున్నాను, ఇంటి చిట్కాలు ప్రయత్నించాను, నిద్రపోవడానికి మద్యం కూడా తాగాను, కానీ ఏదీ పని చేయలేదు.‘ అంటూ చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు పొరుగువారు కూడా ఇన్ని సంవత్సరాలలో అతను ఎప్పుడూ నిద్రపోవడం తాము చూడలేదని చెబుతున్నారు.అయినప్పటికీ, న్గోక్ అసాధారణంగా అందరిలాగే చురుకైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతిరోజూ, అతను తన పొలానికి వెళ్తాడు, భారీ బరువులు ఎత్తుతాడు, రైస్ వైన్ తయారు చేస్తాడు పొరుగువారితో చాట్ చేస్తాడు. మనుగడ కు మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనదని భావించే ప్రపంచంలో, అతని కథ మానవ జీవశాస్త్రం గురించి సైన్స్ మనకు చెప్పే ప్రతిదానినీ సవాలు చేస్తుంది.మీడియా నివేదికల ప్రకారం, పలువురు వైద్యులు ఆ గ్రామాన్ని సందర్శించి న్గోక్ ను చాలాసార్లు పరీక్షించారు అతనికి ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు లేవని కనుగొన్నారు. అతని రక్తపోటు, గుండె. మెదడు అన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. అదే వైద్య నిపుణులను కలవరపెడుతుంది, ఎందుకంటే జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి అంతర్గత అవయవాల పనితీరు కోసం శరీరం విశ్రాంతిపై ఆధారపడటం వల్ల మానవులు నిద్ర లేకుండా కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేరని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.గత 2023లో, అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్సీక న్గోక్ ఇంటికి వెళ్లాడు. అతనితో గడిపిన బిన్సీ్క, న్గోక్ కార్యకలాపాలను నిశితంగా గమనించాడు తన పొలాలకు వెళ్లి పనిచేయడం, రైస్ వైన్ తయారు చేయడం.. అవన్నీ అయిపోయాక అతను నిశ్శబ్దంగా, పూర్తిగా మేల్కొని కూర్చోవడం చూశాడు. పెద్ద మొత్తంలో మద్యం సేవించిన తర్వాత న్గోక్ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి పొంది ఉండవచ్చని బిన్సీక తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు, అయితే ఇది వైద్యపరంగా ఎప్పుడూ నిర్ధారితం కాలేదు. విచిత్రమేమింటే... న్గోక్ రోజువారీ అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవి కావు...పైగా ఆందోళనకరంగా ఉంటాయి. డ్రూ బిన్సీక వీడియో ప్రకారం, అతను దాదాపు రోజుకు అర లీటరు రైస్ వైన్ తీసుకుంటాడు, దాదాపు 70 సిగరెట్లు తాగుతాడు. అయినప్పటికీ అతను శారీరకంగా చురుకుగా ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడుసాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకునే గ్రామంలోని ఇతరుల మాదిరిగా కాకుండా, తన రాత్రులను పనిలో లేదా ఆలోచనలో న్గోక్ గడుపుతాడని స్థానికులు చెబుతున్నారు. అతని ఇలాంటి పరిస్థితి అతన్ని ఇప్పుడు ప్రపంచ ఉత్సుకతగా మార్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్గోక్ కథ, విస్మయం, ప్రశంస సానుభూతి మిశ్రమాన్ని రేకెత్తించింది. కొంతమంది ఆన్లైన్ వినియోగదారులు అతని బలం, ఉత్పాదకతను ప్రశంసిస్తూ, ‘నేను చనిపోయినప్పుడు నిద్రపోతాను‘ అనే నానుడిని న్గోక్ మరొక స్థాయికి తీసుకెళ్లాడని చమత్కరించారు. మరికొందరు అతని పరిస్థితిని యుద్ధ గాయం తాలూకు శాశ్వత ప్రభావంగా, విషాదకరమైన జ్ఞాపకంగా పరిగణించారు, వియత్నాం యుద్ధం ప్రసాదించిన బాధాకరమైన ఒత్తిడికి అతని నిద్రలేమికి ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘ఇది యుద్ధం తాలూకు శాశ్వత ప్రభావాలను చూపిస్తుంది అనుభవజ్ఞులు ఏమి అనుభవిస్తారో వెలుగులోకి తెస్తుంది. ఈ వ్యక్తి తన నిద్రలేని సంవత్సరాలలో అద్భుతమైన పని చేశాడు, కష్టపడి పనిచేస్తూ తన అద్భుతమైన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు(చదవండి: 'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...)) -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
రియల్ అన్నాచెల్లెళ్ల అనుబంధం..!
అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి వెండితెరపై ఎన్నో సీన్లు చూస్తుంటాం. అడపదడపా కన్నీళ్లు కూడా పెడుతుంటాం. ఇది కూడా అలాంటి భావోద్వేగ దృశ్యమే. అయితే ఇది నిజజీవిత సంఘటన. తన సోదరుడికి భారతీయ అధికారుల నుంచి అవసరమైన చట్టపరమైన, వైద్యసహాయం కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ హైకోర్ట్ను ఆశ్రయించింది.నాలుగు వారాల లోపు అతడి గురించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది హైకోర్ట్. జైట్లీ సోదరుడి పరిస్థితి తెలుసుకోవడానికి నోడల్ ఆఫీసర్ని నియమించాలని డిల్లీ హై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం తరువాత సెలీనా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (చదవండి: స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!) -
అమ్మ ఆఖరి కోరిక
‘ఏం కావాలి ఈ జీవితానికి?’ అనే ప్రశ్నకు జవాబు... ‘చిన్న ఆనందం’ కేన్సర్ బారిన పడిన ఆ తల్లికి తన జీవితం ముగింపు దశకు వచ్చిందనే విషయం తెలిసిపోయింది. ‘నాకు తాజ్మహల్ చూపెట్టరా’ అని కుమారుడిని అడిగింది. అడిగిందే తడవుగా తల్లితో పాటు తండ్రిని కూడా తీసుకెళ్లి తాజ్మహల్ చూపించాడు.‘ఈ జీవితానికి ఇది చాలురా’ అన్నట్లుగా ఉంది ఆమె కళ్లలోని సంతోషం. భర్త యూఎన్ శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్నందు వల్ల చికిత్స కోసం ప్రతి రెండు వారాలకు ఒంటరిగా గ్వాలియర్ నుండి ఢిల్లీకి వెళ్లేది. ఆగ్రా, కాన్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆమె తాజ్మహల్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు.కుమారుడు ‘ది ఒబేరాయ్ అమర్విలాస్’లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ‘తాజ్ మహల్ చూడాలని ఉంది’ అని తల్లి అడిగిన తరువాత తల్లిదండ్రులను ఆగ్రాకు తీసుకువెళ్లి తాను ఉద్యోగం చేసే హోటల్లో వారికి బస ఏర్పాటు చేశాడు. హోటల్ నుంచి అల్లంత దూరాన తాజ్మహల్ కనిపిస్తోంది.‘ఎప్పుడు వెళుతున్నాం అక్కడికి?’ అని అడిగింది తల్లి. ఆ తరువాత కొద్దిసేపట్లోనే తల్లికి తాజ్ చూపించి ఆమెను ఆనందంలో ముంచెత్తాడు కుమారుడు. తాజ్మహల్ చూసిన పదిహేనురోజులకు ఆమె చనిపోయింది. తన తల్లి చివరి కోరిక గురించి రెడిట్లో చేసిన పోస్ట్ నెటిజనుల హృదయాలను కదిలించింది. (చదవండి: -
'ఏఐ'తో జర జాగ్రత్తోయ్..!
ప్రస్తుతం ఆన్లైన్ యూజర్స్, సోషల్ యాప్స్ వాడుతున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్స్ని పెంచుకోవాలని, రీల్స్ వైరల్ కావాలని యువతలో ఉన్న తపన వారిని ‘ఏఐ ఫేక్ వీడియో’ వైపు పురిగొల్పుతోంది. ఈ రూపంలో యువతను టెక్నాలజీ కొత్త దారిలోకి నెడుతోంది. సాంకేతికత ద్వారా వచి్చన స్వేచ్ఛను సృజనాత్మకత పేరుతో మాయచిత్రాలుగా మలుస్తున్న ఈ కొత్త ట్రెండ్ నగరంలోని సైబర్ నేర విభాగాలను ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీ ఎటు దారితీస్తుందోనని విశ్లేషకులు, టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పులి వీడియో వైరల్గా మారింది. ఒక యువకుడు ఏఐ టూల్స్ సహాయంతో తమ కాలనీలో ఒక చిరుత పులి తిరుగుతున్నట్లు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో సహాజంగా, వాస్తవంగా కనిపించడం వల్ల చాలా మంది భయంతో పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అది వీడియో ఫేక్ అని తెలిసినా.. ఆ క్షణం వరకూ నెటిజన్లను అది నిజమైనదిలా భ్రమింపజేసింది. ఇదే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ శక్తి. ఇలాంటి ప్రభావాలు రానున్న రోజుల్లో విస్తృతం అవుతాయని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నవీ పెరుగుతున్నాయి. ప్రఖ్యాత నటులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ఎవరి వీడియోలైనా ఏఐ సహాయంతో మార్ఫ్ చేసి ‘వైరల్’ కంటెంట్గా మార్చేస్తున్నారు. సైబర్ చట్టాలు చెప్పేదేంటి?.. భారత చట్టప్రకారం.. ఎవరినైనా తప్పుదోవ పట్టించే, లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఫేక్ కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణించబడుతుంది. ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 66డీ, 67, 468, 469, 500 వంటి నిబంధనల కింద ఇటువంటి చర్యలు శిక్షార్హం. దీనికి సంబంధించి దోషిగా తేలితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేలల్లో, లక్షల్లో జరిమానా విధించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫేక్ వీడియోలు తయారు చేయడం ఒక రకమైన నేరం (ఫ్రాడ్)గా పరిగణించబడుతుంది. ఇది ప్రజల్లో భయం లేదా ద్వేషం.. వంటి వాటిని ప్రేరేపిస్తే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, దీనికి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చట్టం చెబుతోంది.యువతలో పెరుగుతోన్న ‘వైరల్’ పిచ్చి.. హైదరాబాద్ యువతలో చాలామంది ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నారు. ఏఐ యాప్స్ సులభంగా అందుబాటులో ఉండటం, వాటిని వాడటానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడం వల్ల ఈ ఫేక్ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో వచ్చే డోపమైన్ రష్ వల్ల యువతలో వాస్తవం, నైతిక అంశాల మధ్య సున్నితమైన పరిపక్వత మసకబారుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. సైబర్ నేర విభాగం ప్రకారం.. 18–28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ తరహా కంటెంట్ ఎక్కువగా రూపొందిస్తున్నారు. టెక్ సావీ స్టూడెంట్స్, డిజిటల్ క్రియేటర్స్ పేరుతో ఉండే ఇన్స్టా లేదా యూట్యూబ్ యూజర్లు ఫేక్ కంటెంట్ను ‘ఫన్’గా తీసుకుంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం తీవ్రమైనవేనని నిపుణులు చెబుతున్నారు. వైరల్ పేరుతో వాస్తవాన్ని మర్చిపోవద్దు, నేటి ఫేక్ వీడియోస్ రేపటి రోజున నేరం అవుతుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ ప్లాట్ఫారమ్ల బాధ్యత.. మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారŠమ్స్ కూడా ఇప్పుడు డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. అయితే యూజర్లు కంటెంట్ షేర్ చేయడానికి ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం వారి బాధ్యత. ‘షేర్ చేసేముందు చెక్ చేయండి’ అనే కొత్త డిజిటల్ ప్రచారం అవసరం. హైదరాబాద్ వంటి టెక్ సిటీకి ‘ఏఐ ఫేక్ వీడియోలు’ సాంకేతిక అభివృద్ధి కాదు, విలువల సంక్షోభ సూచిక. సాంకేతికత మన చేతిలో ఉన్న అస్త్రం.. దాన్ని వినియోగించే విధానమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా.. లేక గందరగోళంలో పడేస్తుందా అన్నది నిర్ణయిస్తుంది.డిజిటల్ ఎథిక్స్.. ఇలాంటి వీడియోలు ప్రజల్లో అపోహలు, భయాలు, అనవసర వివాదాలు రేపుతున్నాయి. ఉదాహరణకు చిరుతపులి వీడియో వల్ల ఒక ప్రాంతంలో పిల్లలను బయటకు పంపకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం, ఫేక్ సెలబ్రిటీ వీడియోల వల్ల ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరిగి ఘర్షణలకు దారితీసిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ఇది సమాజంలో తీవ్ర ప్రభావం చూపి.. ‘వాస్తవం’, ‘అవాస్తవం’ అనే అంశాలపై నమ్మకం కోల్పోయే దిశకు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు, సోషల్ మీడియా కంపెనీలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘డిజిటల్ ఎథిక్స్’ అనే అంశాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం ద్వారా యువతకు వాస్తవం–వైరల్ మధ్య తేడాను తెలియజెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు. -
భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!
మన దేశానికి వచ్చిన విదేశీయులను మన వివాహ వేడుకలు ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి అనడంలో సందేహం లేదు. దీనికి తాజా ఉదాహరణ జేక్ కోడియా అనే కొరియన్. గురుగ్రామ్లోని కాస్మెటిక్ రిసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్న కోడియా తొలిసారిగా ఒక భారతీయ వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఆ వేడుకలోని వైభోగం, అతిథి మర్యాదలలోని ఆత్మీయతను చూసి అతడికి వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. విందులోని రుచుల సంగతి సరే సరి. పానీపూరి అతడికి తెగ నచ్చేసింది. వధువు ఎంట్రీ నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నాడు. పెళ్లివారితో కలిసి డ్యాన్స్ చేశాడు.‘కొరియన్ విజిట్స్ ఇండియన్ వెడ్డింగ్స్’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజనుల మనసును హోల్సేల్గా దోచేసుకుంది. ఒక ఫారినీయుడు ఇలా స్పందించాడు... ‘తాజ్మహల్ చూడడానికి ఇండియాకు వెళ్లాలనుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి వేడుకలు చూడడానికే ఇండియాకు వెళ్లాలనిపిస్తోంది’. View this post on Instagram A post shared by Cha Jaeil🇰🇷🇮🇳💕 (@pyara_jake_kodia) (చదవండి: ఎక్కడైనా సీక్రెట్ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!) -
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్నాగ్ రైల్వే స్టేషన్లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. అనంత్నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు. In an unusual incident on the Srinagar–Anantnag route, an eagle crashed into the windshield of a moving train, injuring the driver and shattering the glass. The train was halted immediately to provide medical aid, while all passengers on board were declared safe.Source:… pic.twitter.com/2Fed2O4rkV— Mid Day (@mid_day) November 8, 2025 -
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖుషీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
-
ఐఏఎస్ సారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..?
అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఏ మాటైనా, విమర్శ అయినా చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్లే..అనుకోకుండా లేదా ప్రమాదావశాత్తు చిన్న మాట తూలిన అంతే సంగతులు. ఇదేంటి సారూ..! ఇలా చేశారు అని అంతా వేలెత్తి చూపించేస్తారు. పైగా విమర్శలపాలవ్వక తప్పదు. అందుకే పెద్దలు సదా అటెన్షన్, నమ్రతగా ఉండాలి అని చెబుతుండేది అందుకే కాబోలు. ఇప్పుడిదంతా ఎందుకంటే..పాపం ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉద్దేశ్యం మరొకటి అయితే ప్రజల్లో మరొలా వెళ్లి..ఆయన ప్రవర్తననే ప్రశ్నించే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే..విదేశాల్లో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ నీలేష్ చేసిన ఒక్క పోస్ట్ పెద్ద వివాదాస్పదమై, సోషల్మీడియాలో చర్చలకు దారితీసింది. మన దేశ రాజాధానిలో వాయు నాణ్యత ఏ పరిస్థితిలో ఉందో తెలిసిందే. ఈ విషయమై నిపుణులు ఈపాటికే ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేశారు కూడా. అయితే ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తాను ఆ నేపథ్యంలోనే ఢిల్లీని వదిలి విదేశాల్లో బతుకుతున్నానంటూ..తాను అమెరికాలో ఉన్న స్థితిని, ఢిల్లీలోని పరిస్థితిని పోల్చి మరి వివరించారు. పైగా ఢిల్లీ గగన వీధుల్లో పొగమంచుతో ఉన్న స్కైలైన్ని, అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ ప్రకృతి దృశ్యం చూపిస్తూ..రెండింటి మధ్య ఎంత వ్యత్యాసమో గమనించండి అని పోస్ట్లో రాసుకొచ్చారు. ముఖ్యంగా భారతదేశ రాజధానిలోని ప్రమాదకర గాలి నాణ్యత, విదేశాలలో కాలుష్యం లేని వాతావరణం మధ్య వ్యత్యాసాన్నిరీడింగ్లతో సహా చూపించారు. అయితే మన రాజధానిలో గాలి నాణ్యత అంతకంతకు పడిపోతుంది అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఇలా వేరే దేశంతో పోల్చి మనల్ని మనం దిగజార్చుకుంటూ చెప్పడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశానికి సేవ చేసే బాధ్యతయుతమైన వృత్తిలో ఉండి, ఇలా దేశం విడిచి వచ్చి మంచి పనిచేశాను, ఇప్పుడు నేను చాలా సురక్షితంగా ఉన్నానంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లుగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటూ మండిపడ్డారు నెటిజన్లు. అసలు సమస్య పరిష్కారంలో భాగం కావలి గానీ మీరే ఇలా చేస్తారా?. నిజానికి మీరు దేశ సేవ చేయడానికే ఐఏఎస్ చేశారనుకున్నా..కానీ.. అని మిమర్శిస్తూ పోస్టులు పెట్టారు.If I hadn't left India, I would have had to live and breathe in this mess otherwise known as the North Block Secretariat.Note the stark contrast. 🤯 https://t.co/vBKuC0Te7p pic.twitter.com/GHUUtJfQNQ— LV Nilesh (@LVNilesh) November 2, 2025 (చదవండి: ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!) -
ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!
డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్గా పనిచేసిన వ్యక్తిలో..ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా ఇటీవల కొత్తగా కారు డ్రైవర్ని నియమించుకున్నారు. పనిలో జాయిన్ అయిన రెండు రోజులు సాధారణంగానే పనిచేశాడు. మూడోవ రోజు..ఏకంగా ఆఘ మేఘాల మీద పునీత్ గుప్తాకి ఎదురొచ్చి డోర్ ఓపెన్ చేసి స్వాగతం పలికాడు. ఈ అనుహ్య చర్యకు విస్తుపోయిన సీఈవో..ఇంత హడావిడి ఏం అవసరం లేదు. కారు స్టార్ట్ చేసి ఉంటే తాను ఎక్కగానే కారు వెళ్లిపోయేది కదా అని చీవాట్లు పెట్టారు పునీత్ గుప్తా. పైగా మరోసారి రిపీట్ అవ్వనివ్వద్దు, కేవలం టైం వేస్ట్ అవ్వకుండా చూసుకో చాలు అని కాస్త గట్టిగా చెప్పారు. కానీ కారు డ్రైవర్ మాత్రం తన పనే తాను చేసుకుంటున్నానని చెప్పే యత్నం చేసినా..గుప్తా అలా వద్దని వారించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు నార్మల్గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటా అని ఆలోచించారు గుప్తా. అప్పుడే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్ కాల్లో రూ. 500 కోట్ల ఒప్పందం గురించి మాట్లాడానని, బహుశా దానివల్లే ఇతడిలో ఇంత మార్పు వచ్చిందా అని విస్తుపోయారాయన. డబ్బు నిజానికి ఎవ్వరినైనా మార్చేస్తుంది. అంటూ తనకు జరిగిని అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. అయితే నెటిజన్లు ఈ పోస్ట్పై మిశ్రమంగా స్పందించారు. కొందరు డ్రైవర్ అంకితభావంతో పనిచేస్తున్నాడని పేర్కొనగా, మరికొంతమంది కోట్లు గురించి వినగానే బ్రో 'కార్పొరేట్ డ్రైవర్ మోడ్'ని అన్లాక్ చేసాడు" అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..) -
ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిల్..! కానీ ఇవాళ..
అందరు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అందుకోసం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివి మరి అనుకున్న డ్రీమ్ని నెరవేర్చుకుంటుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా 17 ఏళ్ల వయసులో ఐఐటీలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో ఆ కల చేజారిపోయింది. పోనీలే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు. అది కూడా విఫలమే. ఇన్ని ఫెయ్యిల్యూర్స్ ఎదురైనా..నా వల్ల కాదని చేతులెత్తేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడే డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. పాపం చిన్నప్పటి నుంచి తను కన్న ప్రతి కల నీరుగారిపోయేది. అడుగడుగునా వైఫల్యాలే. చిన్నప్పటి నుంచి ఐఐటీలో చేరడమే హర్షిల్ లక్ష్యం . కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా 75 వేల ర్యాంకు తెచ్చకున్నాడు. దీంతో ఆ ఐఐటీ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. చివరికీ మాములు కాలేజ్లో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పోనీలే 20 ఏళ్లకే అందరికంటే మంచి పొజిషన్లో ఉండేలా లక్షల వేతనంతో కూడిన జాబ్ కొట్టేయాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. చివరికి నెలకు రూ. 30 వేలు సంపాదించే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని అతికష్టం మీద తెచ్చుకున్నాడు. ప్రతి రోజు తనను తాను అసహ్యించుకుంటూ..ఇదేం ఉద్యోగం అని బాధపడిపోతుండేవాడు. అయినా సరే తన డ్రీమ్ని వదిలిపెట్టకుండా..అలా చాలా ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూనే ఉండేవాడు. అలా చేస్తుండగా ఏ కంపెనీ నుంచి రిప్లై వచ్చేది కాదు. అలా ఆరు నెలలుగా కేవలం చదువుకోవడం, వ్యాయామాలు చేయడం, ఉద్యోగం కోసం వేట. ఇంతలా చేసినా..ఎలాంటి ఫలితం లేదు. అయితే ఒకరోజు నుంచి ఆకస్మికంగా ఇటర్వ్యూ కాల్స్ రావడం ప్రారంభించాయి. అలా 2024 నాటికి ఓ చిన్న ఆన్లైన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇంటర్న్షిప్నే పూర్తి సమయం ఉద్యోగంగా మార్చుకున్నాడు. తొందరలో ఆ ఉద్యోగానికి స్వస్తి పలకక తప్పలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. అలా పెద్దపెద్ద సంస్థలతో స్పాన్సర్ షిప్లు చేసే స్థాయికి చేరుకుని.. సొంతంగా కంపెనీకి పెట్టుకునే రేంజ్కి ఎదిగాడు. ఇవాళ ఏకంగా రూ. 54 లక్షలు అధిక వేతనానన్ని అందుకుంటూ తన కలను నెరవేర్చుకున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్లో తన సక్సెస్ జర్నీ గురించి వివరించాడు డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. బ్రో మీది చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ, ఎదురుదెబ్బలను ఎలా ఇంధనంగా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. దృఢ సంకల్పంతో ఉండేవాడికి అదృష్టమే ఒళ్లోకొచ్చి వాలుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు అంటూ హర్షిల్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్) -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్
సాధారణంగాఉద్యోగులకు బాస్ను లీవ్ అడగాలంటే భయం. నిజాయితీగా ఉన్నకారణం చెబితే లీవ్ ఇస్తారా? లేదా అనేదాంతో ఏవో వంకలు చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో వాళ్లకి బాలేదనో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. అంతేకాదండోయ్.. అల్ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్ పెట్టే ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా ఒక లీవ్ మెయిల్ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ కంపెనీల సీఈవో కొన్ని విచిత్రాలను, విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన CEO ఉద్యోగి సెలవు అడిగిన తీరును షేర్ చేశారు. అతని నిజాయితీని మెచ్చుకున్నాడు. జెన్ జెడ్ (Gen Z) వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని నావిగేట్ చేసే విధానం తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..గురుగ్రామ్లోని నాట్ డేటింగ్ కో ఫైండర్, సీఈవో జస్వీర్ సింగ్ తన కంపెనీ ఉద్యోగి లీవ్ కు సంబంధించిన ఒక మెయిల్ సెలవు స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అందులో ఇటీవల బ్రేకప్ అయింది సార్, లీవ్ కావాలి.. పనిమీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. కొంత సమయం కావాలి. 28వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (దాదాపు 11 రోజులు) సెలవు తీసుకోవాలని అనుకుంటున్నాను." అంటూ లీవ్ కోసం దరఖాస్తు చేశాడు. అతనికి లీవ్ మంజూర్ చేశారట. సింగ్ దీనిని తాను అందుకున్న "అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు"గా అభివర్ణించడం తోపాటు, జెన్ జెడ్ (Gen Z) ఏదీ దాచుకోదు అంటూ కమెంట్ చేయడం విశేషం.ఉద్యోగి నిజాయితీని, దానికి మద్దతుగా నిలిచిన సీఈఓ నిర్ణయాన్ని ప్రశంసించారు నెటిజన్లు. మీరు మంచిబాస్ ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు Gen-Z ను మిలీనియల్స్తో పోల్చి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. "జనరల్ జెడ్ బ్రేకప్ అయితే లీవ్ పెడతారు..కానీ మిలీనియల్స్ అలా కాదు వాష్రూమ్లో ఏడ్చుకుంటారు.. టార్గెట్లను ఫినీష్ చేస్తారు భావోద్వేగంతో స్పందించారు.చదవండి: పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, అసలు సంగతి ఇదీ! -
బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది బిగ్బీ దివాలీ గిఫ్ట్కు మెచ్చుకోగా, మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... బిగ్బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు అనే క్యాప్షన్తో ఈ వీడియోనే షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్ను ప్రశంసించారు. మరికొందరు బిగ్బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే, రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్గా కూడా ఇస్తారు" అంటూ స్పందించారు. పలు కంపెనీలు, కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. View this post on Instagram A post shared by Sagarthakurvlog (@sagar.thakur84)నోట్: ఈ వీడియోలో అమితాబ్ క్లిప్లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు. -
భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!
మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.భారత్లో నివశిస్తున్న జపనీస్ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని నెట్టిట షేర్ చేయడంతో వైరల్గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది. యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు. బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి దయతో జీవించే ఆర్ట్ని నేర్పింస్తుందనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Nozomu Hagihara (Nono)萩原望 (@india_nono_) (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
నీటికి బదులు బీర్!
ఒక్క రోజంతా నీరు తాగకుండా ఉంటే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అయి, ఏ పని చేయలేం. కాని, అమెరికాకు చెందిన లోరీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నీరే తాగడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! జిమ్లో రెండుసార్లు ఎక్కువ శ్రమ చేసి ఆసుపత్రిలో చేరినా, ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. సాదాసీదా నీటి కంటే కాఫీ, బీర్, రుచికరమైన పానీయాలే తనకు ఇష్టమని చెప్పేసి, లోరీ నీటిని పూర్తిగా మానేసింది. డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా చెప్తున్నారు. అందుకే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన హైడ్రేషన్ పద్ధతిని ఫిక్స్ చేసుకుంది. ఉదయం కాఫీతో మొదలు, మధ్యాహ్నం మరో కాఫీతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, సాయంత్రం జిమ్ తర్వాత బీర్, రాత్రికి రెండు పుల్ల ఐస్క్రీమ్స్.. ఇదే ఆమె స్టయిల్. వీటన్నింటికీ రోజుకి దాదాపు నూటయాభై డాలర్లు, అంటే పదమూడు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. మంచినీరు తాగితే ఇంత ఖర్చు అవసరం లేదని తెలిసినా, ‘ఇవి నాకు నీటికి మించిన రుచితో హైడ్రేషన్ ఇస్తున్నాయి’ అని ఆమె సమర్థించుకుంటోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసి కొందరు షాక్ అయ్యారు, కొందరు నవ్వుకున్నారు. కానీ లోరీ మాత్రం తన ప్రత్యేక హైడ్రేషన్ స్టయిల్కి కట్టుబడి, తనదైన రీతిలో ఆనందంగా జీవిస్తోంది. View this post on Instagram A post shared by 60 Second Docs (@60secdocs) (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
ప్రపంచ కుబేరురాలు పార్క్బామ్?
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. పార్క్బామ్ గతంలో చేసిన పోస్ట్ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.పార్క్బామ్ గతంలో పని చేసిన ఏజెన్సీ వైజీ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యున్ సుక్ (Yang Hyun Suk) తనను భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె దాదాపు 4.5 క్వాడ్రిలియన్ డాలర్లు (రూ.4,500 లక్షల కోట్లు-Quadrillion - ఒకటి తర్వాత 15 సున్నాలు) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఒక లీగల్ డాక్యుమెంట్ స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. ఈ మొత్తం దాదాపు ప్రపంచ జీడీపీకి 41 రెట్లతో సమానం. దాంతో అందులో తెలిపిన మొత్తం చాలా అసాధారణంగా ఉండడంతో ఈమేరకు పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి.Breaking: Park Bom is expected to become the richest person in the world if she wins the case, surpassing Elon Musk.Park Bom of 2NE1 has reportedly sued YG Entertainment for a demure amount of 1002003004006007001000034'64272e trillion won. pic.twitter.com/tCIUS60kGB— World updates (@itswpceo) October 23, 2025ఈ వివాదంలో పార్క్బామ్ ఈ భారీ మొత్తాన్ని నిజంగా గెలిస్తే ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా, తొలి ట్రిలియనీర్గా, ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ను అధిగమించిన తొలి మహిళగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
హీరోయిన్ శ్రియ దీపావళి లుక్.. పండగ కళ ఉట్టిపడేలా! (ఫోటోలు)
-
‘నో’ చెప్పడం ఎలాగో!?
జీవితం ఒకేసారి నాలుగు బంగారు అవకాశాలను ఇచ్చి అందులో కొన్నింటినే ఎంచుకోవాలనే పరిస్థితి తలెత్తితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే 20 ఏళ్ల టెక్కీకి ఎదురైంది. ఉద్యోగ వేటలో ఉన్న తనకు ముందుగా రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఆ రెండూ ఎంఎన్సీ సంస్థలు కావడంతో వాటికి అంగీకారం తెలిపి సంతకాలు చేశాడు. ఉన్నట్టుండి మరో రెండు కంపెనీల ఆఫర్లు వచ్చాయి. ఈసారి ఆఫర్ చేసినవి మునుపటి కంపెనీల కంటే టాప్ సంస్థలు. దాంతో ఇప్పటికే సంతకం చేసిన కంపెనీలకు ‘నో’ చెప్పడం ఎలాగో తెలియక తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్గా మారింది.ఈ టెక్కీ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. తన పరిస్థితి గమనించిన నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆచరణాత్మకంగా ఆలోచించమని చెబుతున్నారు. ‘ఉద్యోగుల తొలగింపుల సమయంలో కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి మీరు కంపెనీ ఆఫర్ను తిరస్కరించడం పెద్ద విషయం కాదు’ అని ఒకరు సూచించారు. మర్యాదపూర్వకంగా ఒక ఈమెయిల్ పంపాలని కొందరు సలహా ఇచ్చారు. చివరి నిమిషంలో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున ఆ యువకుడు చేరాలనుకుంటున్న సంస్థ గురించి కచ్చితంగా తెలిసే వరకు ఏ నిర్ణయం తీసుకోరాదని కొందరు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు..
ఆఫీసులో బాగా పనిచేయడం ఒక్కటే సరిపోదు.. దాన్ని ఉన్నత ఉద్యోగుల వద్ద చూపించుకోగలిగితేనే ప్రమోషన్లు వస్తాయని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఓ ఉద్యోగి తెలిపారు. ఈ విధానం వల్లే తనకు ప్రమోషన్ వచ్చినట్లు చెప్పారు. తాను చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రోహిత్ యాదవ్ అనే ఈ ఉద్యోగి తన ప్రమోషన్కు దోహదపడిన నాలుగు ప్రత్యేకమైన అంశాలను తెలిపారు.యాదవ్ తన కెరీర్లో ఎదిగేందుకు మొదటగా బాగా పని చేసినప్పటికీ, తన పనిని ఇతరులకు కనిపించేలా చేయడం ప్రారంభించినప్పటి నుంచే ఉద్యోగం పరంగా వృద్ధి సాధించినట్లు చెప్పారు.వీక్లీ విన్స్(వారంలో సాధించిన విజయాలు)ప్రతి శుక్రవారం యాదవ్ పని పరిమాణంతో సంబంధం లేకుండా తాను సాధించిన మూడు పని సంబంధిత విజయాలను డాక్యుమెంట్ చేసేవాడు. ఇది పనిపై స్పష్టతను పొందడానికి, సమీక్షల సమయంలో తన పని గురించి చర్చించడానికి సహాయపడినట్లు చెప్పారు.మంత్లీ మేనేజర్ అప్డేట్స్ప్రతి నెలా తన మేనేజర్కు కీలక ఫలితాలు, తాను నేర్చుకున్న పాఠాలను క్లుప్తంగా సందేశం పంపేవారు. ఈ అప్డేట్స్ తన పని ఫలితాలకు సంబంధించినవి మాత్రమే ఉండేవి. పని పరంగా గొప్పలు చెప్పుకోకుండా తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటున్నాడో పేర్కొన్నారు.సరైన ప్రశ్న అడగడంవన్-ఆన్-వన్ సమావేశాల్లో ఆయన అడిగే ప్రధాన ప్రశ్న.. ‘తదుపరి స్థాయికి సిద్ధంగా ఉండటానికి నేను ఏమి మెరుగుపరుచుకోవాలి?’. ఈ ప్రశ్న నిర్మాణాత్మక అభిప్రాయానికి మార్గం వేసింది. మేనేజర్ తనను చూసే విధానాన్ని మార్చిందని యాదవ్ వివరించారు.సమావేశాలలో మాట్లాడటంప్రతి మీటింగ్లోనూ తన అభిప్రాయాలు చెప్పేవాడని తెలిపారు. సమావేశాల్లో నిశ్శబ్దంగా ఉండే వారిని అధికారులు విస్మరించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. View this post on Instagram A post shared by Rohit Yadav (@rohitdecoded)ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. యాదవ్ వ్యూహాత్మక కెరీర్ విధానాన్ని చాలా మంది లింక్డ్ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. ‘నేను కార్పొరేట్ వాతావరణానికి కొత్త. ఈ చిట్కాలకు చాలా ధన్యవాదాలు. రేపటి నుంచి ప్రారంభిస్తాను’ అని ఒక కొత్త ఉద్యోగి స్పందించారు. ‘నేను మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లను ప్రయత్నించాను. కానీ మీలా జరగలేదు. చెప్పేది కనీసం వినే సహాయక మేనేజర్ అవసరమని నమ్ముతున్నాను’ అని మరో వ్యక్తి రాశారు. మరొకరు ‘పక్షపాతం పనిచేసే చోట ఇది పని చేయదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్ను వేలాడదీసి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్హ్యాండ్తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్కెట్ విలువ 2025లో గణనీయంగా పడిపోవడానికి దారితీసిన అంశాలను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో విశ్లేషించారు. ఐపీఎల్ విలువ గతేడాది రూ.92,500 కోట్ల నుంచి 2025లో రూ.76,100 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలియజేస్తూ అవి మార్కెట్, ప్రకటనలు, చట్టపరమైన మార్పులు, క్రికెట్ మార్కెట్పై చూపిన ప్రభావాన్ని అంచనా వేశారు.మీడియా హక్కులపై ఏకఛత్రాధిపత్యండిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడం ద్వారా మార్కెట్లో ఒకే పెద్ద బ్రాడ్కాస్టర్ (జియోస్టార్)కు అవకాశం ఏర్పడింది. గతంలో మీడియా హక్కుల కోసం పెద్ద సంస్థల మధ్య తీవ్రమైన పోటీ (బిడ్డింగ్ వార్) ఉండేది. దీని వల్ల మీడియా హక్కులను చేజిక్కించుకునేందుకు మరింత డబ్బు వెచ్చించేవారు. డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనంతో ప్రధాన బ్రాడ్కాస్టర్గా ఏర్పడినప్పుడు పోటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ (IPL) మీడియా హక్కుల కోసం చెల్లించే ధరలు తగ్గిపోయాయి. ఇది ఐపీఎల్ (IPL) మొత్తం విలువపై తీవ్ర ప్రభావం చూపింది.ఫాంటసీ, గేమింగ్ ప్రకటనలపై నిషేధంకొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం కింద ఫాంటసీ స్పోర్ట్స్, ఇతర గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం లేదా కఠినమైన నిబంధనలు విధించారు. ఐపీఎల్ (IPL) ప్రసారాలకు ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఒకప్పుడు అతిపెద్ద ప్రకటనదారులుగా ఉండేవి. కొత్త నిబంధనలతో ఈ వర్గాన్ని కోల్పోవడం లేదా వారి ప్రకటన బడ్జెట్ తగ్గడం వల్ల లీగ్ (League) ప్రకటనల ఆదాయంపై భారీగా దెబ్బతింది.ఆర్థిక అనిశ్చితిప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం, అనిశ్చితి నెలకొన్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు తమ ప్రకటనల బడ్జెట్లను పరిమితం చేశాయి. ముఖ్యంగా బ్రాండ్ (Brand) ప్రచారం కోసం చేసే ఖర్చు తగ్గింది.Why IPL valuation dropped again in 2025- from Rs 92,500 cr to Rs 76,100 cr:1. Disney Star–Viacom18 merger → single broadcaster (JioStar) → no bidding war, lower media-rights value.2. Ban on fantasy & gaming ads under new Online Gaming Act → loss of key advertiser category.…— Harsh Goenka (@hvgoenka) October 16, 2025ఫ్రాంచైజీల లాభాలపై ఒత్తిడిఏటా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి, వారి జీతాల కోసం అయ్యే ఖర్చు (సాలరీ క్యాప్) పెరుగుతూ వస్తోంది. మరోవైపు ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందాల విలువ అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అధిక ఖర్చులు, స్తబ్దుగా ఉన్న వీటి ఆదాయాల కారణంగా లాభాలు తగ్గుతున్నాయి.గ్లోబల్ క్రికెట్ప్రపంచ క్రికెట్ మార్కెట్లో అనేక కొత్త లీగ్లు పుట్టుకొస్తున్నాయి. ఇది ప్రేక్షకులను ఐపీఎల్ నుంచి కాస్త దూరంగా ఉంచుతుంది. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), సౌతాఫ్రికా టీ20, యూఏఈ (UAE) లీగ్ వంటి అనేక అంతర్జాతీయ లీగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్ -
ఇదే ఆఖరి దీపావళి పండుగ..! మళ్లీ ఏడాది..
దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్ నెట్టింట ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్4 కొలొరెక్టల్ కేన్సర్(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్ చేసుకున్నాడు. "దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్ జరగొచ్చు కేన్సర్ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు. (చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్లు చూశారా..?
దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్కరించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే సరిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపిస్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్ను హైలైట్ చేస్తున్నాయి.వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్స్టేషన్ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను సంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.వైరల్గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్లలో ఉద్యోగులు సూట్కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్ఫ్రైయర్లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.నెటిజన్ల స్పందనలుఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్ చేయగా “దీనిని నా మేనేజర్కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.కంపెనీ గురించి..ఇన్ఫో ఎడ్జ్ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్, జీవన్ సాథీ, శిక్షిక.కామ్ వంటి ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్అప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్ -
తాలిబాన్ల చేతిలో.. పాక్కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..
సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్గా కూడా గిన్నిస్ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్ కార్డులు(credit cards) ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్లో. అలా ఏకంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు. అంతేకాదండోయ్ అన్నేసి కార్డులు ఉపయోగించడంతో గిన్నిస్ రికార్డుల్లకెక్కాడు కూడా.అతడే మనీష్ ధమేజ్. ఇతడి కథ అత్యంత విచిత్రంగా అనిపించినా..తెలివిగా, స్మార్ట్గా బతకడంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 30, 2021న గినిస్ రికార్డు నెలకొల్పాడు. వాట్ క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డా..? అని విస్తుపోకండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డుని ఖర్చు చేసి.. అప్పలు పాలవ్వలేదు. దాన్ని ఆయన ఎలాంటి అప్పు లేకుండా..మంచి ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అలా ఆయన వద్ద మొత్తం 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన రోజు క్రెడిట్ లేకుండా మొదలవ్వదట. అంతలా క్రెడిట్ కార్డులంటే ఇష్టమట. కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ రైల్వే లాంజ్, ఎయిర్పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఇంధనం ఇలా ఎన్నో క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తారట.ప్రతి రివార్డు పాయింట్లను వేస్ట్ చేయకుండా ఉపయోగించేయడంతో.. అవన్నీ అప్పులుగా కాకుండా ఆదాయ వనరుగా మారింది మనీష్కి. ఆ నేపథ్యంలోనే ఆయన వద్ద అంతలా క్రెడిట్ కార్డుల కలెక్షన్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు 2016లో నోట్ల రద్దు సమయంలో అందరూ డబ్బులు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే.. ఇతడు మాత్రం క్రెడిట్ కార్డుతో పనికానిచ్చేశాడట. ఆయన బ్యాంకు నగదు కోసం త్వరపడడట. క్రెడిట్ కార్డుల సాయంతో డిజటల్గా డబ్బుని ఖర్చు చేయగలను అని చెబుతున్నారు. ఇక ఆయన విద్యా నేపథ్యం ఏంటంటే..కాన్పూర్ సీఎస్జీఎం విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, లక్నో ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఇగ్నో నుంచి సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ తదితరాలు పూర్తి చేశారు. ఈయన్ను చూస్తే..సాంకేతికతను వినియోగించుకుంటూ..తెలివిగా ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తే..సాధారణ విషయాలు కూడా అసాధారణంగా మారిపోతాయనేందుకు మనీష్ స్టోరీనే ఉదాహరణ కదూ..!.During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z— Fact Point (@FactPoint) October 10, 2025 (చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
స్విట్జర్లాండ్ ట్రిప్లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)
-
పాపం మెలోనీ! అటు ట్రంప్.. ఇటు ఎర్డోగాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. Trump to Giorgia Meloni:“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. Erdogan to Meloni in Cairo:“You look great but I have to get you to stop smoking”🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్తో కలిసి స్మోక్కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్ -
బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే..
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ టారిఫ్ల మధ్య పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ సామాన్యులకు అందని విధంగా బంగారం విలువ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా చేసిన ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం విలువ పెరుగుతున్న తీరుపై ఇది చర్చకు తెరలేపింది.బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి గోయెంకా ఒక కిలో బంగారం విలువను దశాబ్దాల కాలంలో విలాసవంతమైన కార్ల ధరలతో పోల్చి చూపారు. ఈ పోలిక బంగారం పెట్టుబడిదారులకు గొప్ప ఆశాజనక సందేశాన్ని ఇస్తుండగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై దాని ప్రభావాన్ని సూచిస్తోంది.హర్ష్ గోయెంకా ట్వీట్ చేసిన పసిడి-కారు పోలికలు ఇవే:కింద తెలిపిన విధంగా కేజీ బంగారం విలువ ఆయా సంవత్సరాల్లో సదరు కార్ల ధరలకు సమానం ఉంది(అంచనా మాత్రమే).1990లో 1 కేజీ బంగారం=మారుతి 8002000లో 1 కేజీ బంగారం=ఈస్టీమ్2005లో 1 కేజీ బంగారం=ఇన్నోవా2010లో 1 కేజీ బంగారం=ఫార్చ్యూనర్2019లో 1 కేజీ బంగారం=బీఎమ్డబ్ల్యూ2025లో 1 కేజీ బంగారం=ల్యాండ్ రోవర్పెట్టుబడికి పసిడి స్వర్ణయుగం!ఈ పోస్ట్లో గోయెంకా మరింత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పెరుగుతున్న ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం విలువ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేశారు.2030లో 1 కిలో బంగారం = రోల్స్ రాయిస్ కారు ధరకు సమానం అవుతుంది.2040లో 1 కిలో బంగారం = ఒక ప్రైవేట్ జెట్ ధరలకు సమానంగా మారుతుంది అన్నారు.1990: 1kg gold = Maruti 8002000: 1kg gold = Esteem2005: 1kg gold = Innova2010: 1kg gold = Fortuner2019: 1kg gold = BMW2025: 1kg gold = Land RoverLesson: Keep the 1kg gold- in 2030 it may equal a Rolls Royce car and in 2040 a private jet🛩️! 😀— Harsh Goenka (@hvgoenka) October 12, 2025బంగారం విలువ ఎందుకు పెరుగుతోంది?నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారానికి పెట్టుబడి సురక్షిత సాధనంగా డిమాండ్ను పెంచుతున్నాయి. అదనంగా అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. చాలా మంది పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో దాని విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా హర్ష్ గోయెంకా ట్వీట్ ద్వారా స్పష్టమవుతున్నట్టుగా కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే ఒక కిలో బంగారం విలువ సాధారణ కారు స్థాయి నుంచి అత్యంత విలాసవంతమైన ‘ల్యాండ్ రోవర్’ స్థాయికి చేరింది. భవిష్యత్తులో అది ‘రోల్స్ రాయిస్’ లేదా ‘ప్రైవేట్ జెట్’ ధరల స్థాయికి చేరుతుందని అంచనా వేయడం పసిడిలో పెట్టుబడికి ఉన్న దీర్ఘకాలిక విలువను నొక్కి చెబుతోంది. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, తరతరాలకు సంపదను అందించే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం అని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. -
'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్టాపిక్గా మారి వార్తల్లో నిలిచింది. అతడే న్యూజిలాండ్కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు. ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్లైన్లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
పిట్ట మైల్డ్.. వేట వైల్డ్
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు. ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట! -
84 ఏళ్ల వయసులోనూ స్టైలిష్ హెయిర్స్టైల్
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్లో అధునాతన సాంకేతిక అభివృద్ధి విభాగానికి బాధ్యత వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ షోటారో ఓడేట్ ‘అనిమే’ అనే హెయిర్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 84 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఆటోమోటివ్ నిపుణుడు సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలో అపారమైన కృషి సంస్థలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.ఇటీవల ఒక జపనీస్ షోలో ఓడేట్ మాట్లాడుతూ అనిమే స్పైకీ హెయిర్స్టైల్ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నానని వెల్లడించారు. తన జుట్టు అసాధారణంగా గట్టిగా, సులభంగా ముడుచుకుపోతుందని పేర్కొన్నారు. తన పేలవమైన నిద్ర అలవాట్ల కారణంగా ప్రతి ఉదయం జుట్టు అస్తవ్యస్తంగా ఉండేదని చెప్పారు. ఈక్రమంలో కొత్త హెయిర్ స్టైల్ను అనుసరించినట్లు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈయన తన చిన్నతనంలో తన జుట్టును స్టైల్గా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని గడిపేవారట.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..షోటారో ఓడేట్ కేవలం హెయిర్స్టైల్ను ఫాలో అవ్వడంలో మాత్రమేకాదు సాంకేతిక రంగంలో చాలా కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలకు సంబంధించి మొత్తం 253 పేటెంట్లు కలిగి ఉండటం విశేషం. ఆయన 2003లో హోండాలో చేరినప్పుడు సీట్ బెల్టుల్లో ప్రత్యేకత కలిగిన డిజైనర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS సిస్టమ్ లీడ్ ఇంజినీర్గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.About to go to bed so im going to put this up... Shotaro Odate. 84 years old. Chief Engineer at Honda. Looks strong and rocks the Sasuke Hairstyle daily.Something to strive for. pic.twitter.com/hnUotU6vKV— Jonathan Magno 🇺🇲 🇵🇭 (@HyperM0nkey1) September 29, 2025Honda Chief Engineer Shotaro OdateBeing cool is ageless and timeless. 😊 pic.twitter.com/9KByqO0gtH— meemingwong (@freetheatoms) September 22, 2025 -
ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్ని భోపాల్కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025 (చదవండి: డిజిటల్ డిటాక్స్లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..) -
బాబోయే ఇదేం ట్రాఫిక్!
బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, జాతీయ రహదారిల్లో.. అదీ నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?(Massive Traffic Jam). ఇదేదో సమ్మెలో భాగం జరిగిందనుకుంటే మీరు పొరపడినట్లే!!. బీహార్లోని ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఢిల్లీ-కోల్కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) గత నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్గా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు. భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్లు చెబుతున్నారు. ‘‘30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్, రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాం కదా. అయినా ఎవరూ సహాయం చేయరా?’’అని ప్రవీణ్ సింగ్ అనే ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్రైవర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “రెండు రోజులుగా ట్రాఫిక్లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో బాధపడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల సమయం పడుతోంది” వాపోయాడు.ఇదిలా ఉంటే.. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్తో ప్రభావితం అయ్యాయి. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ ఈ ట్రాఫిక్ సమస్యపై స్పందించేందుకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా?(World Worst Traffic Jam Incident).. అధికారిక గణాంకాలేవీ లేకపోయినా.. 2010లో చైనా దేశంలోని బీజింగ్-టిబెట్ ఎక్స్ప్రెస్వే (National Highway 110) పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో.. బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడ్డారు.ఇదీ చదవండి: సౌర తుపానుతో మనిషికి ముప్పేనా? -
Cow Cess: ఇదేందయ్యా ఇది.. ఇది మేం చూడలే!
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లే అందుకు నిదర్శనం. అయితే బార్లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు. రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే.. ఆ తాగుబోతు రాజస్థాన్కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు. సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్ఛార్జ్గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..
ఫస్ట్డే డ్యూటీ ఎవ్వరికైనా భయంగానే ఉంటుంది. ఆరోజు కొత్తగా విధుల్లోకి రావడం..ఎలా ప్రవర్తించాలి, ఉండాలి వంటి వాటి గురించి చాలా ఆందోళనగా ఉంటుంది. ఆ ఒత్తిడి మొత్తం.. అవతలి వ్యక్తి ఆ రెండు అక్షరాలకు కట్టుబడి స్పందించిన తీరుతోనే ఉఫ్మని ఎగిరిపోతుంది. అలాంటి సమయంలోనే ఆ పదం అర్థం, విలువ తెలుసొస్తుంది. నెట్టింట వైరల్గా మారిన కండక్టర్ ఫస్ట్ డే డ్యూటీ స్టోరీ..ఓ గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది. చూడటానికి మనకు సామాన్యంగా కనిపించే కొన్ని పదాలు, గొప్ప అర్థాన్ని, అమూల్యమైన పాఠాలను బోధిస్తాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బీఎంటీసీ వజ్ర బస్సులో కొత్తగా కండక్టుర్ జాయిన్ అయ్యాడు ఒక వ్యక్తి. తొలిరోజు డ్యూటీ కావడంతో చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ రూట్ వైపు టిక్కెట్లు ఇచ్చే విషయమై చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే కొత్తగా వచ్చిన ఈ కండక్టర్కి మద్దతు తెలుపుతూ..సైలెంట్గా ప్రోత్సహించాడు ఆ బస్సు డ్రైవర్. ఎక్కిన జనాలందరికి టికెట్లు ఇచ్చేంతవరకు ఆపి..పోనిచ్చేవాడుడ డ్రైవర్. అలాగే ఎక్కిన ప్రయాణికులు కూడా అతడు ఆలస్యంగా టికెట్లు ఇస్తున్నాడని, ఓకింత అసహనానికి గురైనా..అతడి బాధను అర్థం చేసుకుని సహకరించారు. పైగా వచ్చే తదుపరి స్టాప్లలో జనం ఎక్కుతారని..ఇక్కడ నుంచి ఇంత ఖరీదంటూ కండెక్టర్కి సహాయం చేశారు కొందరు ప్రయాణికులు. నిశబ్దంగా వారంతా అందించిన ప్రోత్సాహం..అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపి, మొత్తం టెన్షన్ ఉఫ్మని ఎగిరిపోయేలా చేశారు. ఏ వ్యక్తిలో అయినా ఆందోళన పోగొట్టాలంటే దయతో కూడిన సానుభూతి, ఓర్పుగా వ్యవహరించడమే అని ఆ ప్రయాణికులు, బస్సు డ్రైవర్ తమ చేతలతో తెలియ చెప్పారు. అక్కడకి ఓ ప్రయాణికుడు కొత్తగా డ్యూటీలోకి జాయిన్ అయ్యావా..? అని ప్రశాంతంగా అడిగిన తీరు కూడా అతనిలో ఆందోళన మొత్తం ఎగిరిపోయేలా చేసింది. పైగా ఆ వ్యాఖ్య కాస్త దయతో మిగతావారందరు సహాయం చేసేందుకు ఉపకరించింది. మనం నిశబ్దంగా అందించే ప్రోత్సాహం, ఓర్పు నుంచి కరుణ పుట్టుకొస్తుందని అవగతమయ్యేలా చేశారు. నిజానికి నటనతో కరుణను వ్యక్తపరచడం అనేది అసాధ్యమని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. అంతా క్షణాల్లో జరిగిపోవాలనే ఏఐ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరికి అయ్యిందానికి, కానిదానికి కస్సుబుస్సులాడటం అలవాటైపోయింది. ఓపిక అనే పదం ఎగిరిపోయింది. తరుణంలో ఈ ఘటన అందరిని ఆలోచింపచేసేలా పాత రోజుల్లోకి తీసుకెళ్లిందంటూ నెటజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఒక ప్రముఖ సంస్థలో జాయిన్ అయ్యిన కొత్త ఉద్యోగైనా.. అతడికి నిశబ్దంగా ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే..అద్భుతాలు చేస్తారు, వాళ్ల టాలెంట్ని వెలికితీయగలుగుతారు అనేందుకు నిదర్శనమే ఈ అరుదైన ఘటన. (చదవండి: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..! రెండుసార్లు ఫెయిలైనా..) -
హాయ్ స్విగ్గీ.. వాట్ ఏ సడన్ సప్రైజ్!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్ఫాస్ట్ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. శశి థరూర్ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/DdF1yiheT3— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2025 यह हमारे लिए अत्यंत हर्ष का विषय है कि हमें श्री थरूर जी को क्षेत्र की सर्वश्रेष्ठ इडली परोसने का अवसर प्राप्त हुआ। हमारी आशा है कि हमारी टोली उनके स्वादेंद्रियों को तृप्त करने में सफल रही होगी तथा इन पाक-कला के अनुपम चमत्कारों से उन्हें परमानंद की स्थिति मिली होगी। https://t.co/oTaJ2Ykrsn pic.twitter.com/PifmOlitQF— Swiggy Food (@Swiggy) September 28, 2025ఇంతకీ శశిథరూర్ ఇడ్లీ గురించి ఏమన్నారంటే.. ఈ మధ్య ఓ నెటిజన్ ఇడ్లీ గురించి అభివర్నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్ తనదైన ఇంగ్లీష్తో కవితాత్మకంగా ఓ కౌంటర్ పోస్ట్ చేశారు. ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్ చేశారు.మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్, ఎంఎఫ్ హుస్సేన్, సచిన్ టెండూల్కర్ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్ సెక్షన్లో పోస్టులు పెడుతున్నారు.దక్షిణాది ప్రసిద్ధ ఫలహార వంటకం ఇడ్లీని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరు..థాంక్యూ సర్. https://t.co/eg46kbwIV7— తెలుగు తీపి (@kkmohan73) September 28, 2025 -
రెస్టారెంట్లో పనిచేస్తూ రూ. 4 కోట్లు..! కానీ చివరికి..
ఆర్థిక భద్రత ముఖ్యమే. పొదుపుగా ఉండాలి. ఇవన్ని ఆర్థిక సూత్రాలే. కానీ వాటితోపాటు కాసింత సంతోషానికి, ఎంజాయ్మెంట్కి కూడా చోటివ్వాలి. లేదంటే ఈ జీవితం క్షణ భంగురం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఊహకందని భవిష్యత్తు కోసం మరింత ఆరాటం, పొదుపు ఎంత అనర్థదాయకమో ఈ వ్యక్తిని చూస్తే తప్పక తెలుస్తుంది. ఉన్నంతలో సంతోషంగా ఉండటం వేరు. ఎప్పటికైనా అతి పొదుపు చివరికి వ్యథనే మిగులుస్తుంది అనేందుకు ఇతడే ఉదాహారణ.జపాన్కి చెందిన సుజుకి అనే వ్యక్తి ఒక రెస్టారెంట్లో పనిచేస్తుండేవాడు. అతడు చిన్నతనం నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. అందుకే పూర్తి సమయం ఉద్యోగానికే కేటాయించి, డబ్బులు ఆదా చేసేవాడు. చౌకగా లభించే అపార్టుమెంట్లో నివశించేవాడు. ఆఖరికి తన కాబోయే భార్యను కూడా తను పనిచేసే రెస్టారెంట్లోనే కలుసుకున్నాడు. అతడు చాలా పొదుపరి అని భార్యకు తెలుసు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు పుట్టాక కాస్తా ఖర్చులకు వెనకడాకపోయినా..మిగతా అన్నింటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా పొదుపుగా ఉండేవాడు. జీవితంలో ఒక్కసారి కూడా రెస్టారెంట్ భోజనం చేయలేదు. ఏసీ కూడా ఉపయోగించకుండా లైఫ్ని గడిపేశాడు. కనీసం బైక్ లేదా కారు వంటివే ఉపయోగించ లేదు. ఉద్యోగానికి సైకిల్పైనే వెళ్లేవాడు. మాటల్లో చెప్పలేనంత పిసినారిలా బతికాడు. ఎలాగైతేనేం అతలా పొదుపుగా ఉండి ఏకంగా రూ. 4 కోట్లు దాక ధనం కూడబెట్టాడు. అయితే ఆ డబ్బుతో భార్యతో సంతోషంగా ఉందాం అనుకునేలోపు ఆకస్మికంగా చనిపోయింది. "ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం సుజుకి 65 ఏళ్లు. ఇన్నాళ్లు ఎంతలా కఠినంగా వ్యవహరించాను అని కుమిలిపోతున్నాడు. చిన్న చిన్న ఆనందాలు, కానీ సరదాలకు కానీ తావివ్వకుండా ఓ మర మనిషిలా బతికానే అంటూ రోదిస్తున్నాడు. ఎంతలా వెక్కి వెక్కి ఏడ్చినా..కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఆ రోజులు మళ్లీ రావు. ఇప్పుడు ఈ డబ్బుని తానేం చేసుకోవాలి అని కన్నేరుమున్నీరుగా విలపిస్తున్నాడు." హాయిగా కడుపు ఆరగించుకునే సమయంలో మొలకలు, చిన్న చికెన్ ముక్కలతో కాలక్షేపం చేశాడు. ఇప్పుడు హాయిగా తిందామన్నా..శరీరం, వయసు రెండు సహకరించడం లేదు. పోనీ షికారు చేద్దామన్నా..రెండడుగులు వేస్తే..ఆయాసం, పైగా అక్కడి వాతావరణం పడక నానా ఇక్కట్లు పడుతున్నాడు. ఇతడిలాంటి వాళ్లెందరో జపాన్లో ఉన్నారట. గతంలో ఓ వ్యక్తి ఏకంగా పొదుపుకే జీవితాన్ని అంకితం చేసి రూ. 8 కోట్లు దాక కూడబెట్టి వార్తల్లో నిలిచాడట. ఈ ఘటనలు..డబ్బు సంపాదనే జీవితం కాదు. ధనం కూడబెట్టుకుంటే.నే.హాయిగా ఉంటాం అన్నది ఎన్నటికీ సరైనది కాదన్నది జగమెరిగిన సత్యం. ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు పెట్టాలి, పొదుపుగా ఉండాల్సిన చోట ఖర్చుని అదుపులో ఉంచాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడే మహనీయడని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక భధ్రత తోపాటు, ఆర్థిక స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వండి. అంతా అయిపోయాక ఏం చేద్దామన్నా..ఏం చేయలేం అని హెచ్చరిస్తున్నారు. (చదవండి: "మైక్ లేదు, వాయిద్యాలు లేవు" అద్భుతమైన గర్భా నృత్యం..! మాటల్లేవ్ అంతే..) -
చిన్ని అద్భుతం రాబోతోంది : స్టార్ సింగర్, ఫోటోలు వైరల్
-
కరూర్ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు
ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. కరూర్ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.So disturbing! Heart-breaking! 😢We need to get out of the hero-worshipping mentality. No celebrity is worth risking a life. #KarurStampede#VijayRally pic.twitter.com/FAlgDjKUkG— Satish Acharya (@satishacharya) September 28, 2025த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025உரிய பாதுகாப்பு வழங்கப்பட்டதாக தெரியவில்லை - Karur People !#TVK #JanaNayagan #KarurStampede pic.twitter.com/VkTqbB5mU5— MAHI (@MahilMass) September 28, 2025#KarurStampede 🚨 Heartbreaking Tragedy in Tamil Nadu 🚨What was meant to be a moment of hope and celebration at #TvkVijay’s rally in Karur has turned into an unimaginable nightmare.💔 31 innocent lives lost in a stampede-like situation.💔 Families who came with joy have… pic.twitter.com/y9cl6hW4RT— Akash (@AdvAkashji) September 27, 2025மீளமுடியாத துயர் 💔#JusticeForKarurRally #Karur #KarurStampedepic.twitter.com/bjvyACOnqS— Prakash (@prakashpins) September 28, 2025#KarurStampede #TVKVijayStampede #Karurpic.twitter.com/9BpJWtY2u3— Manoj Trichy (@manoj4trichy) September 28, 2025#KarurStampede#கொலைகாரன்_விஜய் pic.twitter.com/JRpXLGqDVL— த.சந்தோஷ்குமார் (@MKPSandy) September 28, 2025 -
దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్!
అమెరికాతో అప్పటిదాకా ఉన్న భారత్ స్నేహబంధం.. ట్రంప్ 2.0 రాకతో ఒక్కసారిగా చేదెక్కింది. మిత్రదేశం అంటూనే సుంకాల మోత మోగించారాయన. అటుపై ఉక్రెయిన్ యుద్ధాన్ని వంక పెట్టుకుని రష్యాతో ఇండియా మైత్రిని తీవ్రంగా తిట్టిపోస్తూ వచ్చారు. దీనికి తోడు వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. ఈ చర్చల్లో పురోగతి, మోదీపై ప్రశంసలతో ఆయన వెనక్కి తగ్గారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన పాక్కు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దరిమిలా.. అమెరికా అధ్యక్షుడిని భారత్కు మిత్రుడిగా చూడడం ఇక కష్టమేనంటున్నారు పశ్చిమబెంగాల్లోని బహారంపూర్ ప్రజలు. మోదీ ఎంత స్నేహంగా ఉంటున్నా.. ట్రంప్ మాత్రం మోసం చేశారని రగిలిపోతున్నారు. ఆ కోపంతో అక్కడి దుర్గా పూజ మండపంలో ఏకంగా ట్రంప్ను మహిషాసురుడి అవతారంలో(Trump Demon Statue) ఏర్పాటు చేశారు. పూజా కమిటీ సభ్యుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఎంతో స్నేహంగా ఉంటున్నప్పటికీ ట్రంప్ సుంకాలు విధించి మోసం చేశాడు. మన దేశంపై అధర్మంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. అందుకే రాక్షసుడిగా చిత్రీకరించాం’’ అని అన్నారు. బహారంపూర్లోని ఖాగ్రా శ్మశాన ఘాట్ దుర్గాపూజా(Durga Puja Trump) కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విగ్రహాన్ని అసిం పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. అయితే అది ట్రంప్ను దృష్టిలో ఉంచుకుని తానేం రూపొందించలేదని ఆయన అంటుండడం గమనార్హం. బహారంపూర్ మునిసిపాలిటీ మేయర్ నారు గోపాల్ ముఖర్జీ (టీఎంసీ) ఈ మండపాన్ని ప్రారంభించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్ అనే విషయం తెలిసి భక్త జనం ఈ మండపానికి ఎగబడిపోతున్నారు. అయితే..కిందటి ఏడాది కూడా ఇదే మండపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్జీకర్ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రూపంతో మహిషాసురుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ట్రంప్ను భారత్లో రాక్షసుడిగానే కాదు.. దేవుడిగానూ కొలిచిన సందర్భం ఉందని మీకు తెలుసా?.. తెలంగాణలోని జనగాం కోన్నె గ్రామంలో బుస్సా కృష్ణ అనే రైతు ట్రంప్ ఫొటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ వచ్చాడు(Trump Temple India). ఆ మరుసటి ఏడాది 2019లో తన ఇంటి ప్రాంగణంలో రూ. 2 లక్షల వ్యయంతో 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి నిత్యం పూలు, కుంకుమ, పాలాభిషేకం చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అయితే 2020లో ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఆ బెంగతో మంచం పట్టి.. ఆపై గుండెపోటుతో కృష్ణ మరణించాడు. అటుపై ఆయన కుటుంబం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది. అయితే.. తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ విగ్రహం గురించి పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం గమనార్హం. -
నో మెడిసిన్స్,నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్
బాలీవుడ్ నటి నేహా ధుపియా తన ఫిట్నెస్రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, రెసిపీలను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21 రోజుల చాలెంజ్ ప్లాన్ను షేర్ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్నెస్ ఛాలెంజ్ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా సహజంగానే ఇన్ఫ్లమేషన్ దూరంఅంటూ ఆమె పోస్ట్ చేశారు. నేహా ధూపియా తాజా పోస్ట్లో, నేహా ఇన్ఫ్లమేషన్తో పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా సీడ్స్ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) "21 రోజులు.. వన్ కమిట్మెంట్.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్ను షేర్ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్ చేయాలని కోరారు. ఈ డ్రింక్ కోసం కావాల్సినవిఒక చిన్న పచ్చి పసుపు ముక్క1 క్యూబ్ పచ్చి అల్లం5-7 నల్ల మిరియాలు1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)మీ దగ్గర MCT నూనె లేకపోతే1 స్పూన్ కొబ్బరి నూనె లేదా1 స్పూన్ నెయ్యి లేదా1 స్పూన్ ఆలివ్ నూనెవీటిన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్లలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్లో పేర్కొన్నారు.కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
చిక్కుల్లో అందాల భామ ‘బేబీ’.. బిగుస్తున్న ఉచ్చు
థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్నీ నోయినోంతాంగ్(Suphannee Noinonthong) అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అందులో ఉంది తానేనని, తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది. థాయ్లాండ్(Thailand)లో 76 ప్రావిన్స్కు విడివిడగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్లీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. అలా.. 27 ఏళ్ల సుపన్నీ(బేబీగా ఆమెకు పాపులారిటీ దక్కింది) ప్రాచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ నుంచి అందాల భామ గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్ 20వ తేదీన ఆమెకు కిరీటం దక్కగా.. ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ-సిగరెట్లు తాగుతూ, అశ్లీల నృత్యాలు.. చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆ మరుసటిరోజే నిర్వాహకులు టైటిల్ను వెనక్కి తీసుకుని, ఆమెను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. అయితే.. ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది. ఆ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులను, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో ఓ సుదీర్ఘ పోస్ట్ ఉంచింది. కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్సైట్కు పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతోకాలం బతికించుకోలేకపోయానని, అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంది. ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె.. జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది. తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని.. ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించింది. ఈ వివరణ తర్వాత.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు.. నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది. ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా.. న్యాయనిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాజ్ ప్రకారం.. కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలమ్పై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలమ్పై సంతకం చేయడంతో.. ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవశకాం ఉందని న్యాయనిపుణులు తెలిపారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది . అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు. చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS— Barack Obama (@BarackObama) September 22, 2025 (చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
‘అతడి’ని హగ్ చేసుకున్న సూర్య.. ఎందుకిలా చేశావు?
టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించి.. గెలుపు కోసం సూర్యుకుమార్ సేనను శ్రమించేలా చేసింది. పటిష్ట భారత జట్టుకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటి ప్రశంసలు అందుకుంటోంది.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం టీమిండియాను ఢీకొట్టింది ఒమన్. అబుదాబి వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ (15 బంతుల్లో 38) దంచికొట్టగా.. శుబ్మన్ గిల్ (Shubman Gill- 5) మరోసారి నిరాశపరిచాడు.సంజూ శాంసన్ అర్ధ శతకంఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అర్ధ శతకం (56)తో రాణించి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ అక్షర్ పటేట్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రామనంది, ఆమిర్ ఖలీమ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఒమన్ టాపార్డర్ సూపర్ హిట్ఇక టీమిండియా విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఫర్వాలేదనిపించగా.. ఆమిర్ ఖలీమ్ అద్భుత అర్ధ శతకం (46 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా సైతం హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 51) చేశాడు. అయితే, జతీందర్ను కుల్దీప్ యాదవ్, ఆమిర్ను హర్షిత్ రాణా, మీర్జాను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు పంపడంతో ఒమన్ జోరుకు బ్రేక్ పడింది. మిగిలిన వారిలో వికెట్ కీపర్ వినయ్ శుక్లా (1)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు.అంచనాలు తలకిందులుఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఒమన్.. 167 పరుగుల వద్ద నిలిచింది. దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచి.. లీగ్ దశను అజేయంగా ముగించింది. అయితే, ఈ మ్యాచ్లో ఒమన్పై భారత జట్టు ఏకపక్ష విజయం సాధిస్తుందని అంతా ఊహించారు.కానీ అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యసేనకు జతీందర్ సింగ్ బృందం గట్టి పోటీనిచ్చింది. టీ20 ఫార్మాట్లోని మజాను పంచింది. ఒమన్ ఆట తీరుకు భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒమన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారిపై ప్రశంసలు కురిపించాడు.ఆమిర్ ఖలీమ్ను హగ్ చేసుకున్న సూర్యఅంతేకాదు.. ఒమన్పై గెలిచిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో సూర్య చేసిన పని వైరల్గా మారింది. 43 ఏళ్ల వయసులో అద్భుత బ్యాటింగ్తో అలరించిన ఆమిర్ ఖలీమ్ను సూర్య ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అతడు పాకిస్తాన్లోని కరాచీకి చెందిన వాడు కావడం గమనార్హం.ఇలా ఎందుకు చేశావు? నీకిది తగునా?ఈ నేపథ్యంలో ఆమిర్ను అభినందిస్తూ సూర్య చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం .. ‘‘పాక్కు చెందిన వ్యక్తిని ఎలా హత్తుకుంటావు?’’ అని ప్రశ్నిస్తున్నారు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా దాయాది పాకిస్తాన్తో ముఖాముఖి తలపడిన టీమిండియా.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. బాధితులకు అండగా మెగా వేదికగా ఇలా నిరసన తెలిపింది. అయితే, సూర్య ఇప్పుడిలా అదే దేశానికి చెందిన ఆటగాడిని హగ్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. జట్టంతా ఒకే కుటుంబమని..కాగా యూఏఈతో పాటు ఒమన్ క్రికెట్ జట్లలో భారత్, పాక్కు చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం గురించి యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ.. తమ జట్టంతా ఒకే కుటుంబమని.. యూఏఈనే తమ దేశమని.. తమలో భారత్, పాక్ అనే మాట వినిపించవని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ను సూర్య హత్తుకోవడం నేరమేమీ కాదంటూ అతడి ఫ్యాన్స్ సపోర్టు చేసుకుంటున్నారు.చదవండి: PKL 12: తెలుగు టైటాన్స్ గెలుపుబాట𝘚𝘶𝘳𝘺𝘢 𝘋𝘢𝘥𝘢, 𝘦𝘬 𝘩𝘪 𝘥𝘪𝘭 𝘩𝘢𝘪𝘯, 𝘬𝘪𝘵𝘯𝘦 𝘣𝘢𝘢𝘳… 💙Encouraging words from India’s captain to Oman’s heroes ✨Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/Mng5zOIrOH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
తూమక్ తూమక్
సోషల్ మీడియాలో ‘తూమక్ తూమక్’ అనేది వైరల్ ట్రెండ్గా మారింది. కర్మ అనే టీచర్ చిన్న పిల్లలతో కలిసి వేసిన ‘తూమక్ డ్యాన్స్’ ఆహా అనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టీచర్ వేసిన పాపులర్ ట్రెండ్ స్టెప్స్ను చిన్ని స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా అనుసరించి ‘వారేవా’ అనిపించారు.‘మీరు నమ్ముతారో లేదోగానీ నేను ఈ వీడియోను వందసార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒక యూజర్. ‘నా వయసు 26 సంవత్సరాలు. మీ స్కూల్లో విద్యార్థిగా మారవచ్చా?’ అని సరదాగా అడిగింది ఒక యూజర్. ప్లేబ్యాక్ సింగర్ నేహా బాషిన్ ‘జుట్టి మేరీ’ ఆల్బమ్ పాపులర్ అయింది. ఈ పాటలోని తూమక్ స్టెప్స్కు ఆన్లైన్ లోకం ఫిదా అయింది. గతవారం క్లాస్రూమ్లో చిన్న అమ్మాయి ఒకరు చక్కని హావభావాలతో వేసిన తూమక్ తూమక్ స్టెప్స్ వీడియో కూడా వైరల్ అయింది. -
బోన్ బ్రోత్ బ్రేక్ ఫాస్ట్..! నాజుకైన శరీరాకృతికి బెస్ట్ రెసిపీ..
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. చండీగఢ్కి చెందిన ఆమె ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్బాస్ పదవ సీజన్లో రన్నరప్గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ని పంచుకుంది. తన గ్లామర్ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది. తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. బోన్ బ్రోత్ అంటే..ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్సూప్. చికెన్ లేదా మటన్ బోన్లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది. అతాగే రుచి కోసం ఈ సూప్లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్ఫాస్ట్నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..) -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!. టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్కు జై అనాల్సిందే! -
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగపూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
నాగ్పూర్:మధ్యప్రదేశ్లోని భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వింతైన ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది. దీనిపై వెళ్లే వాహనదారులు తికమకపడటం ఖాయం అనిపించేలా దానిని నిర్మించారు. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్లోనూ ఇలాంటి అద్భుతాన్నే నిర్మించారు. ఈ తాజా ఇంజినీరింగ్ పరిజ్ఞానం ఇప్పుడు అందరి దృష్టిని అలరిస్తోంది. నాగ్పూర్లో నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ అశోక్ చౌక్ సమీపంలోని ఒక ఇంటి బాల్కనీ భాగం గుండా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.స్థానికులు దీనిని ఎనిమిదవ అద్భుతం అని అంటున్నారు. భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ), నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఇంటి బాల్కనీ గుండా ఈ నిర్మాణం చేపట్టేమందు ఎందుకు దీనిని గమనించేలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ బాల్కనీ ఫ్లైఓవర్ గురించి ఇంటి యజమాని ప్రవీణ్ పాత్రే, అతని కుమార్తె సృష్టితో పాటు సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మేట్లు మీడియాతో మాట్లాడారు.పాత్రే, అతని కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుటుంబం ఆరు తరాలుగా ఆ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఆస్తి దాదాపు 150 సంవత్సరాల నాటిది. ఈ ఇంటిని 25 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. కాగా ఫ్లైఓవర్ తమ బాల్కనీని ఆనుకంటూ వెళ్లడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, భద్రతా ప్రమాదాల గురించి ఆందోళన చెందడం లేదని వారు అన్నారు. అయితే ఈ ఇంటి ప్లాన్కు ఆమోదం ఉందా? అని అడిగినప్పుడు వారు తప్పించుకునే సమాధానం ఇచ్చారు. This is some crazy stuff going on in Nagpur "Flyover inside my Balcony" 😂@bhaumikgowande @zoru75 @haldilal @public_pulseIN @IndianTechGuide pic.twitter.com/xQW6ejTJNX— Sahil Ghodvinde for Mumbai (@MumbaiCommunit2) September 12, 20259.2 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ను ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో రూ. 998 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ వివాదంపై అధికారులు మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్కు తెలియజేశామన్నారు.ఈ అనధికార నిర్మాణాన్ని కూల్చివేయడం నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని అన్నారు. కాగా సౌత్ నాగ్పూర్ ఎమ్మెల్యే మోహన్ మేట్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనికి కారకులైనవారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం బాల్కనీకి చేరుకునే ముందుగానే సంబంధింత అధికారులు నోటీసు జారీ చేసి, నిర్మాణాన్ని తొలగించి ఉండాల్సిందని ఆయన అన్నారు. -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
జూపిటర్ ది సూపర్ కంప్యూటర్..!
ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి. టెక్ టాక్ జూపిటర్– ది సూపర్ కంప్యూటర్ ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి.(చదవండి: పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!) -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! భారత్ని వీడక తప్పని స్థితి..!
ఒక భారతీయ మహిళ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో..ఒక్కసారిగా భారతదేశ రిజర్వేషన్ విధానం హాట్టాపిక్గా మారింది. ఇదేలా రాజకీయ జిమ్మిక్కుగా మారి ఉన్నత విద్యావంతుల పాలిట శాపంగా ఎలా మారిందో ఓ యువతి ఇన్స్టా వేదికగా వాపోయింది.అసలేం జరిగిందంటే..భారతదేశాన్ని విడిచి వెళ్లడం అనేది అంత ఈజీ కాదని, తప్పని పరిస్థితి అంటూ సోషల్మీడియా వేదికగా తన గోడును వెళబోసుకుంది. తాను ఉన్నత విద్యను భారత్లోనే అభ్యసించాలనుకున్నాని, తన మేథస్సు తన దేశ అభ్యున్నతి ఉపయోగపడాన్నేదే తన ఆకాంక్ష, లక్ష్యం కానీ విధిలేక దేశాన్ని విడిచి వెళ్తున్నానంటూ పోస్ట్లో కన్నీటి పర్యంతమైంది. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడే మంచిగా స్థిరపడాలని కలలు కనేదాన్ని కానీ పరిస్థితులు మరో గత్యంతర లేకుండా చేసేశాయ్ అని ఆవేదనగా చెప్పుకొచ్చిందది. భారత్లో బలమైన విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ..ఇక్కడ ఉన్నత విద్యను అందుకోవడంలో అడగడుగునా ఎలా అండ్డంకులు ఎదురయ్యాయో వివరించింది. తాను లక్నో విశ్వవిద్యాలయంలో చదివానని, అధిక మార్కులతో పట్టభద్రురాలినయ్యానని తెలిపింది. అలాగే కష్టపడి చదివి క్యాట్ ఎగ్జామ్ పాసయ్యానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మంచి సంస్థలో చదివే అవకాశం లభించలేదని. సీట్లు చాలా తక్కువ స్కోరు చేసిన వారినే ఎలా వరించాయో కూడా తెలిపింది. వారందరికి మెరిట్ కారణంగా కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన మంచి కాలేజ్ సీట్లు వచ్చాయని దాంతో తాను 2013లో రాజీపడి ఐఐఎంలో కాకుండా ఎఫ్ఎంఎస్లో చేరానని రాసుకొచ్చింది. అలాగే 2025లో జీమ్యాట్లో ఉత్తీర్ణత సాధించినప్పుడూ కూడా జనరల్ కేటగిరీలో పరిమిత సంఖ్యలోస్లాట్లు ఉండటంతో మంచి సంస్థలో సీటు సంపాదించలేకపోయాను. అందువల్లే తాను విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. ఇది తనొక్క వ్యథే కాదని, తనలాంటి ఎందరో టాపర్స్ ఆవేదన అని చెప్పుకొచ్చింది. జనరల్ కేటగిరీ అనేది ఆర్థికంగా అణగదొక్కబడిన సముహాలను వెనక్కి నెట్టేసి, రాజకీయ అంకగణిత సాధనంగా మారిందో వివరించింది. న్యాయం కోసం వచ్చిన రిజర్వేషన్ ఎలా అన్యాయంగా రూపాంతరం చెందిందో చెప్పుకొచ్చింది. అందువల్లే తనలా దేశానికి సేవ చేయాలని కలలు కనే ప్రతిభావంతులంతా ఈ దారుణమైన వ్యవస్థ కారణంగా దేశానికి దూరంగా నెట్టబడుతున్నారంటూ ఆవేదనగా చెప్పింది. చివరిగా తాను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదని కేవలం సమాన అవకాశం కోసం విజ్ఞప్తి, అన్నిటికంటే యోగ్యత, ప్రతిభను గుర్తించే వ్యవస్థ కోసం పడుతున్నా తపనే తన ఆవేదన అంటోంది. అలాగే తనలా ఎవ్వరూ భారంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట భారతదేశ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్య, దాని అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానంపై దృష్టిపెట్టాల్సిన తరుణం ఇది, లేదంటే మేధో ప్రవాహం తరలి వెళ్లిపోతుంది అంటూ పలువురు నెటిజన్లు అవేదనగా పోస్టుల పెట్టడం గమనార్హం.(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్స్టా పోస్ట్లో భారత్లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్షిప్కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
Pakistan: గుడ్డు విసిరింది ఎవరు?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్కు చేదు అనుభవం ఎదురైంది. రావల్పిండి అడియాలా జైలు బయట ఆమెపై కోడి గుడ్డు దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సొంత పార్టీ మహిళా కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. తోషాఖానా కేసులో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్తో శుక్రవారం ములాఖత్ అయిన అనంతరం అలీమా జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమెపైకి గుడ్డును విసిరారు. అది ఆమె గదవకు తాకి పగిలిపోయి దుస్తుల మీద పడిపోయింది. గుడ్డు విసిరింది ఎవరు? అంటూ గట్టిగా గదమాయించారు. వెంటనే తేరుకుని ఫర్వాలేదు.. వదిలేయండి అంటూ ఆమె తన ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమెపైకి గుడ్డు విసిరింది ఇద్దరు మహిళలని, వాళ్లు పీటీఐ మద్దతుదారులేనని, జర్నలిస్టుల గుంపులో వచ్చి గుడ్డు విసిరారని, వాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.తయ్యబ్ బాలోచ్ అనే సోషల్ మీడియా జర్నలిస్టు.. అలీమ మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్టులు చేశారు. దీంతో పీటీఐ మద్దతుదారులు ఆ జర్నలిస్టును టార్గెట్ చేశారు. ఇదే విషయమై అలీమాకు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె దాటవేశారు. ‘‘మీడియా అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.. బాలోచ్ను బెదిరించడం ఏంటి?.. ప్రశ్నించడమే నేరమా?’’ అని మీడియా ప్రతినిధులు ఆమెను నిలదీశారు. అయినా ఆమె మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఆమెపై గుడ్డు పడింది. అయితే.. ఈ దాడిని పీటీఐ ఖండించింది. అది తమ కార్యకర్తల పని కాదని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి భయపడే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, PML-N పార్టీ ఈ దాడి చేయించారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు, ఆర్మీ వర్గాలు స్పందించాల్సి ఉంది.Strongly condemn the disgraceful act of throwing an egg at Aleema Khanum, sister of former Prime Minister Imran Khan. No political disagreement should ever justify such disrespect. Pakistan’s politics need dialogue, not humiliation. #AleemaKhanum #StayStrongAleemaKhan pic.twitter.com/U5e2J1djPc— SAQIB (@saqibhussaiinn) September 5, 2025పాక్తో తోషాఖానా(ధనాగారం) కేసు సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు.. తోషాఖానాలో ఉన్న విలువైన బహుమతులను దొడ్డిదారిన అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి. రూ. 14 కోట్ల (అంటే సుమారు $500,000) విలువైన బహుమతులను అమ్మినందుకు.. 2023 ఆగస్టులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 8న జరగనుంది.


