
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్ఫాస్ట్ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు.
శశి థరూర్ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2025
यह हमारे लिए अत्यंत हर्ष का विषय है कि हमें श्री थरूर जी को क्षेत्र की सर्वश्रेष्ठ इडली परोसने का अवसर प्राप्त हुआ। हमारी आशा है कि हमारी टोली उनके स्वादेंद्रियों को तृप्त करने में सफल रही होगी तथा इन पाक-कला के अनुपम चमत्कारों से उन्हें परमानंद की स्थिति मिली होगी। https://t.co/oTaJ2Ykrsn pic.twitter.com/PifmOlitQF
— Swiggy Food (@Swiggy) September 28, 2025
ఇంతకీ శశిథరూర్ ఇడ్లీ గురించి ఏమన్నారంటే..
ఈ మధ్య ఓ నెటిజన్ ఇడ్లీ గురించి అభివర్నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్ తనదైన ఇంగ్లీష్తో కవితాత్మకంగా ఓ కౌంటర్ పోస్ట్ చేశారు. ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్ చేశారు.
మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్, ఎంఎఫ్ హుస్సేన్, సచిన్ టెండూల్కర్ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్ సెక్షన్లో పోస్టులు పెడుతున్నారు.
దక్షిణాది ప్రసిద్ధ ఫలహార వంటకం ఇడ్లీని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరు..
థాంక్యూ సర్. https://t.co/eg46kbwIV7— తెలుగు తీపి (@kkmohan73) September 28, 2025