యువతుల మిస్సింగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ | Operation Milap: Big Twist In Delhi Missing Persons Crisis | Sakshi
Sakshi News home page

యువతుల మిస్సింగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌

Feb 6 2026 1:17 PM | Updated on Feb 6 2026 1:35 PM

Operation Milap: Big Twist In Delhi Missing Persons Crisis

ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం

ఆపరేషన్‌ మిలాప్‌.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌. కిందటి ఏడాది ఈ ఆపరేషన్‌ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్‌ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్‌ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.

దేశ రాజధాని రీజియన్‌లో మిస్సింగ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్‌ ప్రమోషన్‌ ముఠా ఉందని తేల్చేశారు.

జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్‌ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్‌గా రిపోర్ట్‌ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్‌.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.

అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్‌ గర్ల్స్‌ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్‌ పోస్టుల ద్వారా వైరల్‌ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్‌ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.

గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్‌ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.

గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్‌ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్‌లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement