breaking news
women
-
బీసీ మహిళలపై టీడీపీ నేత దాష్టీకం
దర్శి: అధికారం అండతో టీడీపీ నాయకుడు తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టశింగన్నపాలెం గ్రామానికి చెందిన బీసీ మహిళలు ఆదివారం దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. కట్టశింగన్నపాలేనికి చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన బీసీ మహిళలు ఉదయాన్నే దర్శి చేరుకుని డీఎస్పీ, సీఐ కాళ్లకు నమస్కరించి తమ ఆవేదనను వివరించారు. తమకు న్యాయం చేయాలని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ... కట్టశింగన్నపాలెం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు నాదెండ్ల అంజయ్య వద్ద తమ భర్తలు కుటుంబ అవసరాల కోసం గతంలో రూ.50 వేలు, రూ.60 వేలు అప్పుగా తీసుకుని తిరిగి ఇస్తున్నారని చెప్పారు. అంజయ్య నూటికి పది రూపాయలు వడ్డీలు తీసుకుంటారని తెలిపారు. ఎన్ని డబ్బులు కట్టినా తమ అప్పులు తీరడం లేదన్నారు. బాకీలు ఉన్న తమ ఇళ్ల వద్దకు మద్యం తాగి వచ్చి మగవాళ్లు లేనప్పుడు వచ్చి ‘మీ మొగుళ్లు ఎక్కడికి పోయారే..’ అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీ నోట్లు మీకు ఇస్తా.. మా డబ్బులు మీరు పడుకుని చెల్లిస్తారా’ అంటూ చెప్పుకోలేని భాషలో అసభ్యంగా మాట్లాడుతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు.తాము బయట ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుని వస్తుంటామని, పండగకు గ్రామానికి వస్తే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. మూడు రోజులుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఇక్కడ అధికారులు స్పందించడం లేదని డీఎస్పీతో చెప్పారు. న్యాయం జరగకుండా మాపై ఇలానే వేధింపులకు గురిచేస్తే పోలీస్స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి చనిపోతామని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో డీఎస్పీ బాలమురళీకృష్ణ వెంటనే గ్రామానికి వెళ్లి విచారణ చేయాలని ఎస్ఐ ఏడుకొండలును ఆదేశించారు. -
నన్ను చిత్రహింసలు పెడుతున్నారు.. కువైట్లో భారతీయురాలి ఆవేదన
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికులు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఏజెంట్ల మోసాలకు బలై అక్కడ సరైన జీతాలు లేకుండా ఆ దేశస్థుల చేతిలో బందింపబడి చిత్రహింసలకు గురవుతుంటారు. తాజాగా అటువంటి ఘటన మరోసారి చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తాను అన్యాయంగా కువైట్లో చిక్కుకున్నానని మూడు నెలలుగా తనకు జీతం ఇవ్వకుండా తీవ్రంగా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల్లోకి వెళితే..కువైట్ దేశంలో ఒక ఇంటిలో పనిచేస్తున్న వనిత అనే మహిళ తనను అక్కడ తీవ్రంగా హింసిస్తున్నారని, రెండు నెలలుగా జీతం చెల్లించలేదని ఆవేదనతో వీడియో చేశారు. ఆమె మాటల్లో "నా పేరు వనిత, నేను కల్లకురిచి జిల్లాకు చెందిన దానిని. నేను అక్కడి నుండి వచ్చి మూడు నెలలు అయ్యింది. ఇక్కడ నన్ను హింసిస్తున్నారు. నన్ను రక్షించి నా మాతృభూమి అయిన భారతదేశానికి తీసుక వెళ్లాలని కలెక్టర్కు, జిల్లా పోలీసు అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గత రెండు నెలలుగా నా జీతం చెల్లించలేదు. నేను ఇక్కడి హింసను భరించలేను" అని ఆమె వీడియోలో అన్నారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై తమిళనాడు అధికారులకు చేరింది, దీంతో వారు దీనిపై ఆరా తీయగా వనిత కల్లకురిచికి చెందినదని తెలిసింది, ఈ విషయం వారి కుటుంబసభ్యులకు తెలియజేడంతో వారు ఆమెను రక్షించి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కోరినట్లు అధికారులు తెలిపారు.అయితే ఈ విషయమై స్పందించిన వనిత తల్లి , ఒక ఏజెంట్ కువైట్లో తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించి మోసం చేశాడని ఆరోపించారు. తనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్న వనిత, ఇంటి పనిమనిషిగా పనిచేయాలనే ఆశతో కువైట్ వెళ్లిందని కానీ ఇప్పుడు ఆమె చిత్రహింసలను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు." ఏజెంట్ ఆమెను మోసం చేశాడు. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు ఆమెను ఇంటి పని కోసం తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. కలెక్టర్ గారూ, దయచేసి నా కూతురిని ప్రాణాలతో ఇంటికి తీసుకురండి. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను," అని ఆమె తల్లి ఆవేదనతో చెప్పింది.అయితే దీనిపై స్పందించిన పోలీసులు వనితను తిరిగి భారత్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఆ వీడియోలో బాధితురాలు చీకటి గదిలో ప్రాధేయపడుతూ రెండు చేతులు జోడించి వేడుకోవడం అందరిని అందరినీ తీవ్రంగా కలిచివేసింది. -
పవన్ ఇలాకాలో స్త్రీలకు అవమానం
పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో వరలక్ష్మీ వ్రత పూజల టోకెన్ల కోసం వచ్చిన మహిళలకు తీరని అవమానం జరిగింది. టోకెన్లు ఇవ్వకపోగా, వారిని క్యూలో నుంచి బయటకు లాగేసి, అక్కడి నుంచి వెళ్లకపోతే ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం, చీరల కోసం వచ్చారంటూ జనసేన నేతలు అవహేళన చేయడంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. చీరలు ఎవరడిగారు..? పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు టోకెన్ల కోసం వస్తే ఇలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడ్డారు. ప్రతి ఏటా పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. పిఠాపురంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు. అయితే ఈసారి వ్రతాలతో పాటు మహిళలకు ఇవ్వడానికి వేల చీరలు సిద్ధం చేశామంటూ జనసేన నేతలు ప్రచారం చేశారు. ఎప్పటిలానే మహిళలు వ్రతాల టోకెన్ల కోసం గురువారం తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడ్డారు. అయితే, చీరల కోసం టోకెన్లన్నీ జనసేన నేతలే తీసుకెళ్లిపోవడంతో వ్రతాలకు వచ్చిన మహిళలకు ఒక్కరికి కూడా టోకెన్ అందలేదు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన మహిళలు ఆలయ అధికారులను నిలదీయగా.. టోకెన్లు లేవు పొండంటూ కసురుకున్నారు. ఆ వెంటనే పోలీసులు వచ్చి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులే స్త్రీలను క్యూలో నుంచి బయటకు లాగేయడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మర్యాదగా వెళ్లిపోకపోతే ఫొటోలు తీసి.. ఇళ్లకు వచ్చి మరీ తీసుకెళ్లి జైలులో పెడతాం..’ అంటూ పోలీసులు బెదిరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేమేమన్నా దొంగలమా.. జైలులో పెట్టడానికి? ఇదేనా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మహిళలకు ఇచ్చే గౌరవం?’ అంటూ మహిళలు మండిపడ్డారు.అవహేళన చేసిన జనసేన నేతలు ఇంతలో కొందరు జనసేన నేతలు వచ్చి.. వారంతా చీరల కోసం వచ్చారంటూ అవహేళనగా మాట్లాడటంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పుణ్య క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో వ్రతం చేసుకుందామని వచ్చామని, చీరల కోసం కాదంటూ కన్నీరు పెట్టుకున్నారు. చీరలు వద్దు.. వ్రతానికి టోకెన్లు ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. ఈసారి అంతా జనసేన నేతలే నిర్వహిస్తున్నారని, తమకు ఎటువంటి సంబంధం లేదని ఆలయ అధికారులు చెప్పడంతో మహిళలు మండిపడ్డారు. మీకు సంబంధం లేకపోతే గుడిలో ఎలా వ్రతాలు నిర్వహిస్తారంటూ వారిని నిలదీశారు. అయినా అధికారులు స్పందించకపోవడంపై భక్తులు మండిపడ్డారు. -
డామిట్.. సభ అడ్డం తిరిగింది..!
జమ్మలమడుగు: మహిళలకు ఏదో చేసేశామని కలరింగ్ ఇచ్చుకొనేందుకు కూటమి నేతలు సభ పెట్టారు. కానీ, మాకే పథకమూ అందలేదంటూ మహిళలు తిరగబడటంతో నేతలు కంగుతిన్నారు. చివరకు వచ్చే రెండేళ్లలో పథకాలు ఇప్పిస్తామంటూ వెళ్లిపోయారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బుధవారం ఏర్పాటు చేసిన ‘మహిళా బాగు.. సంభాషణ’ కార్యక్రమంలో చంద్రబాబు సర్కారుకు మహిళలు ఇచ్చిన షాక్ ఇది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే మహిళలు ఒక్కసారిగా లేచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడంలేదంటూ నిలదీశారు. కొత్తగా వితంతు పెన్షన్లు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. ‘తల్లికి వందనం’ నిధులు, మహిళల స్వయం ఉపాధికి తోడ్పడే ’పావలా వడ్డీ’ రుణాలు ఏవని ఎమ్మెల్యేని నిలదీశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తామని మాట తప్పారని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని విధాలా అర్హత ఉన్నా తమ ఇద్దరు పిల్లలకు ఈ పథకం రాలేదని, తల్లిదండ్రులు చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలను ఎలా సాకాలని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తన కోడలు స్త్రీనిధి కింద బ్యాంకులో రుణం తీసుకుందని.. అయితే కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారని, ఆ అప్పు తీర్చాలని బ్యాంకర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని మరో వృద్ధురాలు వివరించింది. నా భర్త మీ దగ్గరే పనిచేశారు.. అయినా పెన్షన్ లేదు ‘నా భర్త మీ వద్దే 15 ఏళ్లపాటు నమ్మకంగా పనిచేశారు. ఆయన చనిపోయి ఏడాది దాటింది. కుటుంబ భారం మోయలేక వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసి, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు‘ అంటూ ఎమ్మెల్యేకు ఓ మహిళ చెప్పింది. మహిళల మైకులు కట్ ఇలా మహిళల నుంచి విపరీతమైన ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతుండటంతో మైక్ల సౌండ్ తగ్గించేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి కలగజేసుకుని.. మరో రెండు సంవత్సరాల్లో ఈ పథకాలన్నీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు మాట్లాడేందుకు మరో అవకాశం ఇవ్వలేదు. -
‘ఆమె’ అప్పు పెంచింది!
భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన 2026 జూన్ త్రైమాసిక నివేదిక ప్రకారం, బ్యాంకు రుణాలను పొందడంలో మహిళలు ముందుంజలో ఉన్నారు. జూన్ 2026 నాటికి మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు అందించిన అప్పు గత ఏడాదితో పోలిస్తే 19.7 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్లో ఈ వృద్ధి 12.9 శాతంగా ఉండగా ఈసారి గణనీయంగా పుంజుకోవడం విశేషం.రుణ రంగంలో సమగ్ర పురోగతిఆర్బీఐ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం బ్యాంక్ రుణ వృద్ధి 16.5 శాతంగా నమోదు కాగా, మహిళా రుణగ్రహీతల వృద్ధి రేటు (19.7%) అంతకంటే అధికంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు తగ్గడం కూడా రుణాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. బ్యాంకుల బకాయి రుణాలపై సగటు వడ్డీ రేటు గతేడాది 9.71 శాతం నుంచి 9.26 శాతానికి దిగివచ్చింది. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే లభించే రుణాల వాటా 54.1 శాతం నుంచి ఏకంగా 64.1 శాతానికి చేరింది.గ్రామీణ, చిన్న పట్టణాల ఆధిపత్యంమెట్రో నగరాల కంటే కూడా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 21.1% వృద్ధి, అర్బన్/సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 21.4% నుంచి 21.6% వృద్ధి, మెట్రోపాలిటన్ నగరాల్లో 13.1% వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేవలం సాధారణ వ్యక్తిగత రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార వేత్తలుగా నిలదొక్కుకోవడానికి నిధి సదుపాయాలను వినియోగించుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు 18 శాతం చొప్పున పెరగడం దేశీయ ఆర్థిక రంగంలో స్థిరమైన పురోగతికి సంకేతం.ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ! -
AP: వివాహితపై ఐదుగురు యువకుల అత్యాచారం
సాక్షి, విజయవాడ: వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఐదుగురు యువకులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. మద్యం తాగొచ్చి మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దారుణంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘యాటిట్యూడ్ స్టార్’ వీరంగం.. ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా!’
ఢిల్లీ: ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా.. నువ్వు ఎంతటివాడివైనా సరే’ అంటూ గ్రేటర్ నోయిడాలోని ఓ హై-ప్రొఫైల్ సొసైటీలో సెక్యూరిటీ గార్డులను ఉద్దేశించి ఓ మహిళ బెదిరింపులకు దిగింది. డెలివరీ బాయ్ని గేట్ వద్దే ఆపారన్న చిన్న కారణంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తూ ఆమె సృష్టించిన వీరంగం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డబ్బుందనే అహంకారంతో సామాన్య సిబ్బందిపై ప్రదర్శిస్తున్న ఈ దౌర్జన్యానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.గ్రేటర్ నోయిడా వెస్ట్లోని బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘సెంచూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్’ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుంది. అయితే భద్రతా దృష్ట్యా నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది డెలివరీ బాయ్ను గేట్ వెలుపలే ఆపారు.కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ రాకపోవడంతో మహిళ గేటు వద్దకు వచ్చి పరిశీలించింది. డెలివరీ బాయ్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు గమనించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా దూషించడమే కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తారా? చేసుకోండి అంటూ దురుసుగా వ్యవహరించింది.బెదిరింపులు.. దాడి యత్నంఒకానొక సమయంలో కుర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసేందుకు యత్నించగా, మరో సిబ్బందిని వెనక్కి తోసేసింది. నాతో పోలిస్తే నీ స్థాయేంటో తెలుసా? నీతో నా షూస్ను క్లీన్ చేయించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. గార్డుల ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.డెలివరీ బాయ్ని ఎందుకు ఆపారనే కచ్చితమైన కారణం, ఈ ఘర్షణకు దారితీసిన ఇతర పరిస్థితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Next level nari shakti 🫡👍👏It peaks when she starts with - ग़रीब के पिल्ले..दो रोटी नहीं हैं तेरे पास - to the guard. Something tells me that her social media and corporate profile would be full of words like equality, feminism, etc etc. And as always, Noida society 😅 pic.twitter.com/FtK7HAIBsI— Maj Manik M Jolly,SM (@Manik_M_Jolly) August 26, 2026 -
రీల్స్ పిచ్చి పట్టాలపై రోటి.. వైరల్ అవుతున్న వీడియో
-
సమానత్వానికి ఉపాధే మార్గం
ఆగస్టు 26... మహిళా సమానత్వ దినోత్సవం. ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం నేడు అంతరిక్షం వరకు సాగింది. కానీ ప్రశ్న మిగిలే ఉంది.నిజంగానే ఆమెకు సమాన గుర్తింపు, భద్రత, స్వేచ్ఛ దక్కాయా? జవాబు... ఇంకా లేదు. ఒకవైపు ఆమె ముందుకు దూసుకెళుతోంది. మరోవైపు సామాజిక ఆంక్షలు, గృహహింస, వివక్ష ఆమె రెక్కలను కత్తిరిస్తూనే ఉన్నాయి. సమానత్వం అంటే ‘పురుషులతో పోటీ కాదు’... ‘పురుషులతో సమానంగా బతికే హక్కు’. ఆఫీస్లో సమాన అవకాశం, ఇంట్లో సమాన గౌరవం దక్కినప్పుడే ‘విమెన్స్ ఈక్వాలిటీ డే’కు అర్థం. ఆమెను కేవలం బాధ్యతగల గృహిణిగా, సమర్థురాలైన ఉద్యోగిగా మాత్రమే కాదు.. ఒక మనిషిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వంగా గౌరవించినప్పుడే అది సిసలైన సమానత్వం. అందుకై మార్పు అనివార్యం.మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి, సాధికారతకు, సమానత్వానికి.. ఉద్యోగం అనేది అత్యంత కీలకం. ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు,ఎన్నో అద్భుతాలు చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకే ఒక మాటతో ఉసూరుమనిపిస్తారు. ‘ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను’ గ్లోబల్ ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఇండీడ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిది మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టం అని భావించడం వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం లేదు....మహిళలు తమ కెరీర్ను ఎంచుకునే విధానాన్ని కుటుంబ బా«ధ్యతలు ప్రభావితం చేస్తున్నాయని, కెరీర్ను ఎంచుకోవడంలో సౌలభ్యం అనేది కీలక విషయంగా మారిందని చెబుతోంది ఇండీడ్ సర్వే. మరి కొన్ని విషయాలు... ⇒ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు సౌకర్యవంతమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ 48 శాతం మంది హైబ్రిడ్ లేదా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ కుటుంబ జీవితం–వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కోసం పది మందిలో ఎనిమిది మంది తక్కువ జీతానికైనా సరే ఉద్యోగాల్లో చేరుతున్నారు.⇒ ఆఫీసుకు హాజరు కావాల్సిన నిబంధనల కారణంగా 51 శాతం మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడం లేదు.⇒ పూర్తి సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధనను 37 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగ విధులలో సౌలభ్యం లేకపోవడాన్ని 34 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే తల్లులు హైబ్రిడ్, రిమోట్ వర్క్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.‘ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కలలు ఉన్నప్పటికీ, గృహ సంరక్షణ బాధ్యతలకే చాలామంది మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్.ఉద్యోగం డబ్బుల కోసం మాత్రమే కాదు...‘ఉద్యోగం అనేది కేవలం డబ్బు సం పాదించే మార్గం మాత్రమే కాదు. ఆర్థికంగానే కాదు మాససికంగా కూడా ఉపయోగపడుతుంది. వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. పని– వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటున్నారు లైఫ్స్టైల్ అండ్ ఫర్నీచర్ బ్రాండ్ ‘బెంట్చైర్’ సీఈవో, కో–ఫౌండర్ నటషా జైన్.ఆ లక్ష్యాలనే ఎంచుకుంటాను‘వ్యా పారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న ఈరోజుల్లో ఎంతోమంది మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. నా విషయానికి వస్తే...అసాధారణమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడమే పని–జీవిత సమతుల్యతకు ఒక మార్గం. నా మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా సాధించగలిగే లక్ష్యాలనే నా వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎంచుకుంటాను. నేను ఉత్తమ తల్లి లేదా ఉత్తమ ఉద్యోగి అని నిరూపించుకోవడానికి నన్ను నేను అతిగా ఒత్తిడికి గురిచేసుకోను’ అంటుంది దీక్ష చాబ్ర ఫిట్నెస్ కన్సల్టేషన్ ఫౌండర్ దీక్ష చాబ్ర.లక్ష్యాల దిశగా...‘ఇంట్లో బిడ్డను చూసుకోవాల్సిన బా«ధ్యతల వల్ల మొదట్లో నా వ్యా పారప్రయాణం భారంగా అనిపించింది. పని–జీవిత సమతుల్యతను కా పాడుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్గం ఉంటుంది. లక్ష్యాల దిశగా ప్రణాళిక వేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి రోజులో కొంత సమయాన్ని నా కోసం కేటాయించుకుంటాను’ అంటున్నారు గిఫ్టింగ్ కంపెనీ జిఫ్టర్ కో–ఫౌండర్ పూజా పుంజ్.పనిని ఆస్వాదించండి‘మొదటగా మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. చేసే పనిని ఆస్వాదించండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్పై కృషి చేయండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు ఒక మార్గం కనుగొన్న తరువాత ఉద్యోగ జీవితంలో లభించే సంతృప్తి, ఆనందం సాటిలేనివి. కెరీర్లో మీరు ఎదిగే కొద్ది పని–వ్యక్తిగత జీవిత సమతుల్యత గురించి మార్గాలు మరిన్ని కనబడతాయని గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే సమతుల్యత అనేది ఎక్కడో ఉండదు. అది మనం సృష్టించుకోవాలి’ అంటున్నారు ప్రమేయ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సంధ్యా రవి.నిరాసక్తత ఎందుకంటే..?ఉద్యోగాల కొరత, పని ప్రదేశంలో కార్మిక చట్టాలు వర్తించకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్లే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండడం, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కుటుంబ నేపధ్యం ఇందుకు ప్రధాన కారణాలు.n భారతదేశంలో పని చేసే వయసు ఉండి ఉద్యోగం చేస్తున్న మహిళల శాతం కేవలం 35 మాత్రమే.భారత్ కూడా ఉన్నత ఆదాయ దేశాల స్థాయికి చేరాలంటే మరో 9 కోట్ల మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ. 116 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ మహిళలకు భారీగా ఉ పాధి కల్పించింది. భారత్ కూడా అదే స్థాయిలో శ్రామిక ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తే, మూడు రెట్లు వేగంగా మహిళా ఉ పాధి పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.ఇంకా అక్కడే..మహిళా సాధికారతను కొన్నేళ్లుగా విద్య, ఉద్యోగం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదు పాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రమాణాలన్నింటిలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ ఎన్ఎఫ్హెచ్ సర్వే–6 (జాతీయ, కుటుంబ, ఆరోగ్య సర్వే) ఫలితాలు కనిపించని కోణాన్ని మన ముందుకు తెచ్చాయి. ⇒ 22.3 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహితలు తమ భర్త నుంచి భౌతిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో చేసిన ఎన్ఎఫ్హెచ్ –5 (2019–21) సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ తరహా వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారనేది ఆందోళన కలిగించే అంశం. ⇒ కేరళలో 87 శాతం మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్నారని ఎన్ఎఫ్హెచ్–6 చెబుతోంది. అయినప్పటికీ, భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న వివాహితల శాతం 9.8 నుంచి ఏకంగా 17.7 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.⇒ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందే వారి జీవితాలను దెబ్బతీస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ (25%), జార్ఖండ్ (28.1%), బీహార్ (34.6%), పశ్చిమ బెంగాల్ (36.4%) లతో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక, ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతున్నారు.వర్క్–లైఫ్ బాలెన్స్ కోసం...వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఉదయం మెంటల్ నోట్ క్రియేట్ చేసుకుంటాను. మెంటల్ నోట్ ద్వారా ఆరోజు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను దృష్టిలో పెట్టుకుంటాను. నా పని ముగించేలోపు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెడతాను. మీరు తీరికలేని జీవితాన్ని గడిపే ఉద్యోగి అయితే మీ కోరికల జాబితాలోని ప్రతిదాన్ని సాధించడం కష్టం. దీని వల్ల మనం పూర్తిగా అలసిపోతాం. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతాం. వృత్తి–కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మన ఆరోగ్యం, లైఫ్స్టైల్పై దృష్టి పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్స్గా మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతాం. అది అనారోగ్యానికి, డిప్రెషన్కు దారి తీయవచ్చు. పని నుండి పూర్తిగా విరామం తీసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు, మూడు రోజులు సెలవు తీసుకుంటాను.– రాశీ జైన్, ఆన్కో.కామ్ సీయివో, కో–ఫాండర్ -
మద్యం మత్తులో మహిళల వీరంగం.. ఇద్దరు యువకులపై దాడి
-
రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులపై మహిళల దాడి చేశారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది.సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి చనిపోతే యువకులు విజయ్, దుర్గాప్రసాద్ చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో యువకులు ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న తుమ్మలోవకు చెందిన ముగ్గురు మహిళలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..! -
ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..!
బెంగళూరు: మహిళా ఎస్ఐ, జైలులో ఖైదీతో అర్దనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడడం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం శాసనసభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఈ వీడియో ఏడాది కిందటిదని, ఆమెకు నోటీస్ ఇచ్చి బదిలీ చేశామన్నారు. ఆమె ఇలా చేయడాన్ని సమర్థించడం లేదన్నారు. పోలీసులే ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా?, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చారు అని వాపోయారు. ఓ మహిళా ఎస్ఐ.. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో ప్రేమలో పడింది. అతనికి యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఖైదీ ఆ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్ అయ్యింది. ఆ ఎస్ఐ దీనిపై వారం కిందట బెంగళూరు కబ్బన్పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ బాగోతం వైరల్ అయ్యింది. -
ఒంటరి మహిళల భూమి కబ్జా
పుట్టపర్తి అర్బన్: రూ.కోట్ల విలువైన భూమి. నెల రోజుల క్రితం జేసీ కోర్టులో మొదటి విచారణ కూడా జరిగిన భూమి. అలాంటి భూమిని టీడీపీ వర్గీయులు కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని తమ పేరుపై రికార్డుల్లో మార్చుకుని ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానిపల్లిలో చోటుచేసుకుంది. దీంతో బాధితులైన ఒకే కుటుంబానికి చెందిన ఒంటరి మహిళలు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టరుకు ఫిర్యాదు చేయడానికి పుట్టపర్తికి వచ్చారు. వారు తెలిపిన వివరాల మేరకు... గ్రామ సర్వే నంబర్ 76లోని 8.23 ఎకరాల భూమి ప్రమీలమ్మ, మంజుల, సంపూర్ణ, ఆదిలక్ష్మి, కిష్టమ్మ అనుభవంలో ఉంది. వీరి భర్తలు చనిపోవడంతో ఒంటరి మహిళలుగా మిగిలారు. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు సదరు భూమిని 15 రోజుల క్రితం వారి పేరుపై రెవెన్యూ రికార్డుల్లో మార్చుకున్నారు. ఈ విషయంలో పుట్టపర్తి ఆర్డీఓ కూడా వారి పక్షాన నిలిచినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ భూమి తాతల కాలం నుంచి తమ కుటుంబ అనుభవంలోనే ఉందని తెలిపారు. టీడీపీ వర్గీయుల వల్ల ఈ భూమి వివాదం మూడేళ్ల నుంచి నడుస్తోందని, ఈ క్రమంలోనే మనోవేదనతో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారని వివరించారు. భూ వివాదంపై ఇటీవల పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను కలిశామని, ఆమె కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని వెల్లడించారు. ‘నా కోర్టు నా ఇష్టం.. ఎవరికి చెప్తారో చెప్పుకోండి’ అంటూ దబాయించారని ఆరోపించారు. అలాగే సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేయగా ఆ రికార్డు తీసుకురండి, ఈ రికార్డు తీసుకురండి అంటూ పట్టించుకోలేదని, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాత్రం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కాగా.. ఎవరి లాగిన్లో రికార్డులు మార్చారో వెంటనే తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. -
ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే..
చాలా మంది గృహిణులకు ‘ఫ్రీ టైమ్’ అంటే గంటలు.. గంటలు దొరకదు. బోలెడన్ని పనుల మధ్యలో.. కొద్ది కొద్దిగా నిమిషాల రూపంలో దొరుకుతుంది. పొద్దున్నే పనులు.. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తయారీ.. అటు పైన పిల్లలు స్కూళ్ల నుంచి రావడం..అక్కణ్నుంచి వాళ్లకు ప్రిపరేషన్లు.. వీటిన్నింటి మధ్య అప్పుడప్పుడు కాస్తంత విరామం లభిస్తుంటుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. ఇన్వెస్టింగ్ కావచ్చు..ట్రేడింగ్ కావొచ్చు.. వీటికి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఇంత హడావుడి మధ్యలో అంతంత సమయం వెచ్చించలేములే అని పక్కన పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. అయితే, నిజం చెప్పాలంటే దీని కోసం గంటలు గంటలు స్క్రీన్పై వెచ్చించాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ డిగ్రీ అక్కర్లేదు. మీకు ఆసక్తి ఉండి, ఒక్క అరగంట సేపు ప్రశాంతంగా కాన్సెంట్రేట్ చేయగలిగితే స్ట్రెస్ ఫ్రీగా మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. దీనిపై పట్టు సాధించవచ్చు. ఇందుకోసం సింపుల్ కొన్ని చిట్కాలు ఉన్నాయి.చిన్నగా ప్రారంభించాలి.. ట్రేడింగ్ మొదలుపెట్టాలంటే బోలెడంత డబ్బుండాల్సిందే అనే అపోహ ఒకటుంది. నిజానికి అలాంటిదేమీ లేదు. చిన్న చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టొచ్చు. వంద రూపాయలు కావొచ్చు.. వెయ్యి రూపాయల నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని లెర్నింగ్ కోసం కేటాయించిన బడ్జెట్లాగా భావించాలే తప్ప ఇన్వెస్టింగ్ బడ్జెట్గా అనుకోవద్దు. ఈ దశలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేర్చుకోవడం. అంతే తప్ప ఎకాయెకిన లాభాలను సాధించేయడం కాదు. ముందుగా యాప్ ఎలా పని చేస్తుంది. ఆర్డర్లు ఎలా పెట్టాలి. రేట్లు ఏ రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఇందులోని సాధకబాధకాల గురించి అర్థం చేసుకునేందుకు చిన్న మొత్తాన్ని కేటాయిస్తేనే మంచిది. అప్పుడే మనస్సూ ప్రశాంతంగా ఉంటుంది. నేర్చుకోవడమూ సులభంగా, సరదాగా ఉంటుంది.ఫోకస్ ముఖ్యం .. మల్టీ టాస్కింగ్ వద్దు.. మహిళలు సహజంగానే మల్టీటాస్కర్లు. ఏకకాలంలో బోలెడన్ని పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే, ట్రేడింగ్ విషయానికొస్తే.. గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. వంట చేస్తూనో, ఇల్లు శుభ్రం చేసుకుంటూనో.. లేదా టీవీ చూస్తూనో.. ట్రేడింగ్ను కూడా చుట్టబెట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మిగతా పనుల్లాగా కాకుండా మార్కెట్టు, ట్రేడింగు అంటే ప్రత్యేకంగా దానిపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అది కొద్ది నిమిషాలే కావచ్చు. ఏకాస్త ఫోకస్ తప్పినా ... ఏదో పనిలో హడావిడిగా ఉండి.. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా లేదా ఎగ్జిట్ అయినా తీవ్ర ఫ్ర్రస్టేషన్కి దారి తీయొచ్చు. అందుకే మిగతా ఏ పనులూ లేనప్పుడు, మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఫోకస్గా ఉండగలిగినప్పుడు ఒక్క 15–30 నిమిషాల స్లాట్ని కేవలం దీని కోసమే కేటాయించాలి. ఒక రకంగా మీకు అత్యంత ఇష్టమైన హాబీ విషయంలో మీరు ఎలా ఉంటారో దీన్ని కూడా అలాగే భావించి, సమయం వెచ్చించాలి. పూర్తి ఫోకస్తో ఉండే ఆ కాస్తంత సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఆత్మవిశ్వాసమూ వస్తుంది.ఫస్ట్ ట్రేడ్ కోసం బడ్జెట్ పెట్టుకోవాలి.. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. ఎప్పుడూ కూడా ఇంటి అవసరాల కోసం ఉద్దేశించిన డబ్బుతో ట్రేడింగ్ చేయనే కూడదు. మీరు ట్రేడింగ్ మొదలుపెట్టదల్చుకున్నప్పుడు ముందుగానే, దాని గురించి తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు నెలవారీగా ఇంత అని కాస్త మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. అది అయిదు వందల రూపాయలైనా కావచ్చు.. దాన్ని వేరుగానే ఉంచండి. ఇంటి అవసరాల ఖర్చులు, ట్రేడింగ్పై ఇన్వెస్ట్మెంట్ని కలగాపులగం చేయొద్దు. దేనికదే వేరుగా ఉండాలి. సరిహద్దులు స్పష్టంగా ఉండాలి. అప్పుడు ట్రేడింగ్ అనేది ఆర్థికంగా ఒక రిస్కీ వ్యవహారంగా కాకుండా వ్యక్తిగతంగా చేపట్టిన ఒక ప్రాజెక్టులాగా అనిపిస్తుంది. ఆందోళనకు ఆస్కారం ఉండదు. నిత్యావసరాలు, ఫీజులు, ఇంటి ఖర్చులు.. ఇలాంటి వాటి కోసం ఉద్దేశించిన డబ్బు జోలికి వెళ్లనే వెళ్లొద్దు.15 నిమిషాల రొటీన్..రొటీన్గా ప్రతిరోజు పాటించే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తుంటాయి. కాబట్టి దీని విషయంలోనూ రోజూ ఒక పదిహేను నిమిషాల సేపు కేటాయించండి. ఒక ఐదు నిమిషాలు బేసిక్ ట్యుటోరియల్స్ను చూసేందుకు, నేర్చుకునేందుకు కేటాయించండి. ఇంకో ఐదు నిమిషాల పాటు సింపుల్ చార్ట్ను పరిశీలించండి. మీరు పరిశీలించిన, తెలుసుకున్న విషయాలను మననం చేసుకునేందుకు, రాసిపెట్టుకునేందుకు చివరి ఐదు నిమిషాలను కేటాయించండి. ఇలా వారాల తరబడి, కాస్త కాస్తంతగా తెలుసుకున్న విషయాలతో మార్కెట్పై కొంత చెప్పుకోతగ్గ స్థాయిలో అవగాహన వస్తుంది. చూస్తుండగానే మార్కెట్ ట్రెండ్స్, క్యాండిల్స్, ఎంట్రీలు, ఎగ్జిట్ల విషయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ట్రేడింగ్ అనేది ఆందోళన కలిగించేది వ్యవహారంగా ఉండనక్కర్లేదు. ప్రశాంతంగా, మీకు సమయం చిక్కినప్పుడు నెమ్మదిగా నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఉండాలి. భారీగా కాకుండా, చిన్న మొత్తాన్ని కేటాయించి, స్పష్టమైన సరిహద్దులు పెట్టుకుని, ఏకాగ్రతతో నేర్చుకునేందుకు కొద్ది నిమిషాలు కేటాయించగలిగితే.. నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకెళ్తే మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. సానుకూల ఫలితాలనే కాకుండా ప్రయాణాన్నీ ఆస్వాదించవచ్చు.అలర్ట్లను ఉపయోగించుకోవాలి..ట్రేడింగ్ తీరుతెన్నులు తెలుసుకోవడం కోసం మీరు గంటలు గంటలు స్క్రీన్ ముందే కూర్చుని ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఆధునిక ట్రేడింగ్ యాప్స్లో చాలా వెసులుబాట్లు ఉంటున్నాయి. మీరు ఆసక్తిగా గమనిస్తున్న షేరు ధర, మీరు అంచనా వేసే స్థాయికి చేరుకున్నప్పుడు తక్షణం నోటిఫై చేసేందుకు వీటిల్లో ప్రైస్ అలర్టులు ఉంటున్నాయి. అంటే, మీరు మీ రోజువారీ పనులు చేసుకోవడం కొనసాగిస్తూనే, అలర్టు వచ్చినప్పుడు ఒకసారి యాప్ చేసుకుంటే చాలు. దీనివల్ల స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత అవి తప్పయితే చింతించే పరిస్థితి తప్పుతుంది. పైగా ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా స్థిమితంగా నేర్చుకునేందుకు వీలవుతుంది.సాధారణంగానే మహిళా ఇన్వెస్టర్లు డిసిప్లిన్గా ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారు అతిగా ట్రేడింగ్ చేయరు. డబ్బు వ్యవహారాల్లో ఎలా తోస్తే అలా నిర్ణయాలు తీసుకోరు. రిసు్కల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వారికన్నా బోలెడంత సహనంతో, నిలకడగా ఉండే వారికే ట్రేడింగ్ లాభాలనిస్తుంది. మహిళల్లో సహజసిద్ధంగానే ఈ స్వభావం ఉంటుంది కాబట్టి వారికి అదొక సానుకూలాంశం. ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలను సాధించగలమనే విషయాన్ని విశ్వసించాలి. -
యువతి హత్య.. శరీర భాగాలను బిర్యానీ పాత్రలో వండేందుకు యత్నం?
చెన్నై: తమిళనాడులో వెలుగు చూసిన దారుణమైన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనుమానిత దంపతులు ఓ మహిళను అతి క్రూరంగా హత్య చేశారు. హత్య తర్వాత ఆ మహిళ శరీర భాగాలను ముక్కలుగా నరికి, అందులో కొంతభాగాన్ని బిర్యానీ పాత్రలో వండారు. ఆ పాత్ర మూతకు గాలి ఆడకుండా మైదా పిండితో సీల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగ్రా చేరుకున్న తర్వాత ఓ జనరల్ కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఉన్న ఎరుపు రంగు సూట్కేసు నుండి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్రా రైల్వే పోలీసులు ఆ సూట్కేసును తెరిచి చూడగా, అందులో తల లేని, ముక్కలుగా నరికిన ఒక మహిళా మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఆగ్రా రైల్వే పోలీసులు తమిళనాడు పోలీసుల సహాయం కోరారు. చెన్నై సెంట్రల్ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ పుటేజ్ను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. మధ్యవయస్కుడైన వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్కేసుతో సెంట్రల్ స్టేషన్కు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడం కనిపించింది. ట్రైన్ బయలుదేరే సమయానికి కొద్దిసేపు ముందు వారు ఆ సూట్కేసును లోపల ఉంచి కిందకు దిగిపోయారు. అనంతరం వారు పార్క్ స్టేషన్కు నడిచివెళ్లి, ఈఎంయూ రైలు ఎక్కి గుడువాంచేరిలో దిగి ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. 👉ఇదీ చదవండి: ఐఫోన్ పిచ్చి.. కుటుంబాన్ని బలితీసుకుందిగుడువాంచేరి పరిసర ప్రాంతాల్లో సుమారు 350లకు పైగా సీసీటీవీ కెమెరాలను విశ్లేషించగా, ఆ జంట గుడువాంచేరిలోని మస్జిద్ వీధిలో ఉన్న ఒక అద్దె ఇంటి నుంచి అదే సూట్కేసుతో బయలుదేరినట్లు తేలింది. గుడువాంచేరి పోలీసుల సహాయంతో ఆ ఇంటిని తనిఖీ చేయగా, అక్కడే హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు మాణిక్ ఉతిన్ లస్కర్, అతని భార్య భగమతి మాజి, హయత్ నిషా అనే ముగ్గురు నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. హత్యకు గురైన మహిళ హయత్ నిషాగా ప్రాథమికంగా గుర్తించారు. ఆమె తాంబరం సమీపంలోని ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బాధితుల్ని ఇంట్లోనే హత్య చేసి, ముక్కలుగా నరికారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన శరీర భాగాలతో బిర్యానీ వండిన ఆధారాలు లభ్యమయ్యాయి. బాధితురాలి తల ఎక్కడ పడేశారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
కారు డిక్కీలో యువతి మృతదేహం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి పనేనా?
సాక్షి,హన్మకొండ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా నిలిపి ఉంచిన ఒక కారు డిక్కీలో గుర్తుతెలియని ఒక యువతి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా ఓ కారు (రిజిస్ట్రేషన్ నంబర్: TS 03 FF 8094) రోడ్డు పక్కన పార్క్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ కారును అక్కడే వదిలేసి వెళ్లారు.అయితే, శుక్రవారం ఆ కారు నుండి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా, డిక్కీలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక యువతి మృతదేహం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సాఫ్ట్వేర్ ఉద్యోగి పనేనా?ఈ ఘటనపై తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు కారు వివరాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. సదరు కారు యజమాని సురేందర్ అని, కొన్ని రోజుల క్రితమే వినోద్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.ఈ హత్యతో వినోద్కు సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. ఆ యువతి ఎవరు? ఆమెను ఎక్కడ, ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!
-
యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది?
-
గంజాయి అమ్మిస్తున్న TDP నేతపై మహిళ సంచలన వ్యాఖ్యలు
-
మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..!
ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు. దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!.బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ ఫ్లాట్ఫామ్లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట. ‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు. గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట. భారత్లో ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల క్రేజ్..మన దేశంలో కూడా వీటి క్రేజ్పెరుగుతోందట. సుమారు 55% ఎంగేజ్మెంట్ రేటుతో, ఈ గ్లోబల్ ట్రెండ్లో భారతదేశం ముందుందట. అనేక ప్రముఖ దేశీయ బ్రాండ్లు తమ ప్రచారాలలో వీటిని చేర్చుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కైరా అనే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్కు దాదాపు 2.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నైనా అనే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్కు ఏకంగా .7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్రిత్తికా పటేల్ అనే ఏఐ మోడల్కు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారట. ఆఖరికి సాంకేతికతలో కూడా మహిళా ఏఐ అవతార్లదే అగ్రస్థానం కదూ..!.(చదవండి: 15 రోజులకు మించి బతికే ఛాన్స్ లేదన్నారు..కానీ ఆ అమ్మాయి ఇవాళ..) -
తుపాకులు వదిలి.. మాజీ నక్సలైట్ల ర్యాంప్ వాక్
-
భర్తని వదిలేసి కండక్టర్ తో జంప్..!
-
బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఘోరం!
కోల్కతా: డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం కారు నడపడం ప్రాక్టీస్ చేస్తూ, నియంత్రణ కోల్పోయి వాహనంతో సహా చెరువులో పడి ఓ 42 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది.కోల్కతాలోని కేస్టోపూర్ పరిధిలోని ప్రఫుల్ల కానన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్రా దాస్ (42) అనే మహిళ తన కుమార్తెను స్కూటర్ పై పాఠశాలలో దింపి ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం స్కూటర్ను పార్క్ చేసి, గ్యారేజ్ నుంచి తమ కారును బయటకు తీసి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.ఆగస్టు 22న ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. దీంతో ఆమె భర్త కృష్ణేందు దాస్ ఇటీవల కొనుగోలు చేసిన కారులో ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అయితే, డ్రైవింగ్లో సరైన అనుభవం లేకపోవడంతో, బ్రేక్ వేయబోయి పొరపాటున యాక్సిలరేటర్ను గట్టిగా తొక్కారు. దీంతో కారు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి సమీపంలోని చెరువు మధ్యలోకి పడిపోయింది.కారు క్షణాల్లో నీటిలో పూర్తిగా మునిగిపోయింది. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటకు పైగా శ్రమించి కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.కారును వెలికితీసిన సమయంలో సుమిత్రా దాస్ మృతదేహం వెనుక భాగం వైపు తిరిగి, కాళ్లు స్టీరింగ్ వైపు ఉన్నాయి. కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో ఆమె వెనుక డోర్ ద్వారా ప్రాణాలు కాపాడుకోవడానికి విఫలయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
డ్రగ్స్ లింక్.. ఉగాండా మహిళ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: దేశ భద్రతకు భంగం కలిగించే అవాంఛనీయ కార్యకలాపాలకు నిరోధించేలా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కీలక చర్యలు చేపట్టింది. ఈ రోజు (బుధవారం) ఉగాండా దేశానికి చెందిన నబంజ శారన్ అనే మహిళను అదుపులోకి తీసుకుంది. ఆ విదేశీయురాలిపై విచారణ జరుపగా, ఆమె వీసా గడువు ఇదివరకే ముగిసిందని అయినప్పటికీ భారతదేశంలో అక్రమంగా నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఈవిషయం సదరు మహిళ సైతం ధృవీకరించినట్లు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే..టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నబంజ శారన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో హైదరాబాద్లో తన నివాసానికి సంబంధించి ఆమె ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాలు గానీ, సరైన పత్రాలు గానీ సమర్పించలేకపోయింది. సమగ్ర విచారణ అనంతరం, తన వద్ద చెల్లుబాటు అయ్యే వీసా లేదని, వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో అక్రమంగా కొనసాగుతున్నానని ఆమె అంగీకరించింది.మరింత లోతుగా దర్యాప్తు చేయగా, ఆమె 06-03-2019న ఈ-టూరిస్ట్ వీసాపై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారతదేశానికి వచ్చినట్లు వెల్లడైంది. అనంతరం ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వెళ్లి, అక్కడ చిన్నచిన్న పనులు చేసింది. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మాదకద్రవ్యాల ముఠాలతో పరిచయాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్లలో డ్రగ్ పెడ్లర్లతో కలిసి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది.ఆమె టూరిస్ట్ వీసా గడువు 04-05-2019 నాటికే ముగిసింది; అయితే ఆమె పాస్పోర్ట్ 23-11-2027 వరకు చెల్లుబాటులో ఉంది. వీసా గడువు ముగిసినప్పటి నుండి ఆమె భారతదేశంలో అక్రమంగా నివసిస్తూ, డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఆమెను స్వదేశమైన ఉగాండాకు పంపించేందుకు H-NEW విభాగం హైదరాబాద్లోని ఎఫ్.ఆర్.ఆర్.ఓ (FRRO) ద్వారా బహిష్కరణ (డీపోర్టేషన్) ప్రక్రియను ప్రారంభించింది.బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉన్నప్పటికీ టూరిస్ట్ వీసా గడువు ముగిసినట్లు నిర్ధారించారు. అనంతరం హైదరాబాద్ FRRO నుండి ఎగ్జిట్ పర్మిట్ పొంది, భవిష్యత్తులో ఆమె భారతదేశంలోకి ప్రవేశించకుండా 'బ్లాక్లిస్ట్' చేశారు. ఆమె ప్రయాణానికి సంబంధించి ఈ రోజు (12-08-2026) తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన టికెట్ బుక్ చేశారు.ఇటీవలి కాలంలో కొందరు విదేశీయులు మెడికల్ వీసా, స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసాలపై భారతదేశానికి వస్తున్నారు. పాస్పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఇక్కడే ఉంటూ వివిధ రకాల మత్తుపదార్థాల రవాణా, సరఫరా, విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనం పెరిగి కుటుంబాలు, సమాజం తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయి.హైదరాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా మత్తుపదార్థాల బారిన పడవద్దని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) విజ్ఞప్తి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, వారు మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా H-NEW బృందానికి 8712661601 నంబరు ద్వారా తెలియజేయగలరని పోలీసు విభాగం పేర్కొంది.ఈ ఆపరేషన్లో ఇన్స్పెక్టర్ పి. శ్రీధర్, ఇన్స్పెక్టర్ ఎం. మధు బాబు తదితరులు పాల్గొన్నారు. -
నెలకు ఒకసారే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు..
కాబూల్: తాలిబన్లు విధించిన ఆంక్షలు మరింత కఠినం కావడంతో అఫ్గానిస్థాన్ మహిళల్లో సగం మంది ఇప్పుడు నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే ఇళ్ల బయటకు వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.అఫ్గాన్లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లతోంది. ప్రపంచంలోని బాలికలకు మాధ్యమిక విద్యను నిషేధించిన, మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదవడాన్ని అడ్డుకున్న ఏకైక దేశంగా అఫ్గానిస్థాన్ కొనసాగుతోందని లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది.“2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత గడిచిన అర్ధ దశాబ్దంలో, అఫ్గానిస్థాన్ తన జనాభాలో సగం మంది హక్కులను వ్యవస్థీకృతంగా తొలగించింది. ఆధునిక ప్రపంచంలో దీనికి సమానమైన ఉదాహరణ లేదు. దీంతో అది ప్రపంచంలో ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది” అని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ ప్రకటనలో పేర్కొంది.మహిళలపై ప్రభుత్వ నిబంధనల్లో చాలా వాటిని అమలు చేసే తాలిబన్ ఆధ్వర్యంలోని సద్గుణాల ప్రచారం, దుర్గుణాల నిరోధక మంత్రిత్వ శాఖ స్పందన కోరినా వెంటనే స్పందించలేదు. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా స్పందించలేదు. 2021లో అఫ్గానిస్థాన్లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్ సుమారు 2.4 మిలియన్ల అఫ్గాన్ బాలికలను మాధ్యమిక విద్యకు దూరం చేసిందని ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ మంగళవారం తెలిపింది.తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని 100కు పైగా ఆదేశాలు జారీ చేశారని, వాటి వల్ల వివక్షకు సంస్థాగత రూపం వచ్చిందని, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మహిళా హక్కుల సంక్షోభం మరింత లోతుగా మారిందని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది.తాలిబన్ మాత్రం తమ ఇస్లామిక్ చట్టాల వ్యాఖ్యానం, అఫ్గాన్ సంస్కృతికి అనుగుణంగా మహిళల హక్కులను గౌరవిస్తున్నామని చెబుతోంది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా మంది నెలలో రెండుసార్లు లేదా అంతకంటే తక్కువసార్లు మాత్రమే ఇళ్ల బయటకు వెళ్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు వంతుల మంది పురుష సంరక్షకుడు అయిన మహ్రం లేకుండా బయటకు వెళ్లడం సురక్షితం కాదని చెప్పారు.ఈ ఆంక్షల వల్ల మానసిక ఆరోగ్య సంక్షోభం కూడా మరింత తీవ్రమైందని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది. 10 మందిలో ఏడుగుడు మహిళలు తమ మానసిక ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఒంటరితనం, అవకాశాల కోల్పోవడం, సహాయక వ్యవస్థలకు పరిమిత ప్రాప్యత కారణాలుగా పేర్కొన్నారు.ఇటీవల జారీ చేసిన ఆదేశాలు మహిళలకు ఉన్న చట్టపరమైన రక్షణను మరింత బలహీనపరిచాయని సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన చర్యల వల్ల చట్టం ముందు పురుషులు, మహిళలకు సమాన హోదా రద్దయిందని, వివాహ జీవితంలో పురుషుల అధికారాన్ని పెంచిందని, మహిళలు విడాకులు కోరడం మరింత కష్టతరం చేసిందని తెలిపింది.మహిళలు ఇంకా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా దూరంగానే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ నివేదిక ప్రకారం మహిళల్లో కేవలం 7% మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. పురుషుల్లో ఈ సంఖ్య 84%గా ఉంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య 2,190 మందిని ప్రత్యక్షంగా కలసి నిర్వహించిన సర్వే, 2026 ఏప్రిల్ నుంచి మే మధ్య 2,811 మందితో నిర్వహించిన టెలిఫోన్ సర్వేల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. -
కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 2023లో తన ముగ్గురు పిల్లలను (8 నెలల కాలన్, 5 ఏళ్ల కోరా, 3 ఏళ్ల డాసన్) హత్య చేసిన కేసులో క్లాన్సీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ కేసు కేవలం ఒక నేర విచారణగా మాత్రమే కాకుండా, ఒక తల్లి పదేపదే సహాయం కోరినప్పటికీ వైద్యులు ఆమె మానసిక స్థితిని గుర్తించడంలో ఎలా విఫలమైందనే ప్రధాన ప్రశ్నను తెరపైకి తెచ్చింది.కోర్టు విచారణలో క్లాన్సీకి మద్దతుగా ఆమె మామ క్రిస్టోఫర్ క్లాన్సీ, అలాగే ఆమె బాల్య స్నేహితులు సాక్షాలను వెల్లడించారు. స్కూల్ టీచర్. పిల్లలను అమితంగా ప్రేమించే ఆదర్శ తల్లి. అయితే, పైకి సాధారణంగా కనిపించినప్పటికీ, క్లాన్సీ గత కొద్దికాలంగా తీవ్ర నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, తిమ్మిరి, ఆత్మహత్య ఆలోచనలతో నరకం అనుభవించినట్లు తెలిసింది. తనకు తాను 'జాంబీ'లా అనిపిస్తోందని ఆమె తన ఫ్యామిలీ థెరపిస్ట్ ఎదుట మొరపెట్టుకున్నారు. 13 రకాల మందులు.. ప్రసవానంతర సైకోసిస్ను గుర్తించని వైద్యులుహత్యలకు ముందు క్లాన్సీ వైద్య సహాయం కోరినప్పటికీ, వైద్యులు ఆమెకు ఏకంగా 13 రకాల మానసిక వైద్య ఔషధాలను (సైకియాట్రిక్ డ్రగ్స్) సూచించారు. క్లాన్సీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ అలియా గుడ్హార్ట్, డాక్టర్ జెన్నిఫర్ టఫ్ట్స్ కోర్టులో సాక్ష్యమిస్తూ.. తాము క్లాన్సీ ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించలేదని, ఉన్మాద లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో క్లాన్సీ పరిస్థితిని సరిగ్గా గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని, ఆమెకు అవసరానికి మించి మందులు ఇచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించారని డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై క్లాన్సీ కుటుంబం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది.వైద్యుల వైఫల్యమేనా?ప్రసవానంతరం వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలపై ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ నికోల్ కుమి కోర్టుకు వివరిస్తూ.. ప్రసవానంతర కాలంలో తల్లులకు నిద్ర పట్టకపోవడం తీవ్రమైన మానసిక సంక్షోభానికి మొదటి హెచ్చరిక సంకేతం. ప్రసవానంతర సైకోసిస్ బారిన పడిన వ్యక్తులు కొన్ని సమయాల్లో బయటకు సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ వారి అంతరంగంలో తీవ్రమైన భ్రమలు నడుస్తుంటాయి. ఆమె ఇంట్లోనూ, వైద్యుల ఎదుట తన అనారోగ్య సమస్యల్ని నయం చేయాలని మొరపెట్టుకుంది. కానీ ఆమెకు కేవలం మందులు, సరిదిద్దలేని సలహాలు మాత్రమే లభించాయి’ అని వివరించారు.కోర్టులో వాదోపవాదాలుపిల్లల ప్రాణాలు తీసిన అనంతరం క్లాన్సీ తన మణికట్టు, మెడ కోసుకుని రెండో అంతస్తు కిటికీ నుండి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. పిల్లలను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని, ఆత్మహత్యాయత్నం ఆమె ఉద్దేశపూర్వక చర్యకు నిదర్శనమని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. తీవ్రమైన ప్రసవానంతర సైకోసిస్ వల్ల క్లాన్సీ వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయారని, కాబట్టి ఆమెను నేరపూరిత బాధ్యురాలిగా పరిగణించలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విచారణ, మానసిక ఆరోగ్య సంక్షోభం మరియు కొత్త తల్లుల పట్ల వైద్య వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరుపై అమెరికా సమాజంలో సరికొత్త చర్చకు దారితీసింది. -
ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ
-
డ్యూప్లెక్స్ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బాగలగుంటెలో ఒక విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉంటున్న 57 ఏళ్ల దాక్షాయణి అనే మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో అస్థిపంజరమై కనిపించింది. ఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా, ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారి కనిపించింది. ఆమె మానసిక వేదన, ఒంటరితనంతోనే, దాదాపు ఏడాది క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం 2005లో ఆరోగ్య సమస్యల కారణంగా దాక్షాయణి కొడుకు మరణించాడు. దీంతో ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఆ తర్వాత ఆమె 'షిజోఫ్రెనియా' (Schizophrenia) అనే మానసిక అనారోగ్యంతో బాధపడగా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు.2017లో ఆమె భర్త ఉమేష్ కూడా మరణించడంతో, హవనూర్ లేఅవుట్లోని ఇంట్లో ఆమె ఒంటరిగానే నివసిస్తోంది.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ అనుమానం ఎలా వచ్చిందీ అంటేఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసివేసి ఉండటంతో, అద్దెకు తీసుకునేందుకు వెళ్లి తలుపులు తెరవలేకపోయిన బ్రోకర్లు స్థానికులు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బాగలగుంటె పోలీసులు ఆ డ్యూప్లెక్స్ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా దాక్షాయణి అస్థిపంజరం లభ్యమైంది. ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?మరోవైపు గత రెండేళ్లుగా దాక్షాయణితో తాము టచ్లో లేమని ఆమె సోదరుడు మహేష్ (50) తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ఎప్పుడు, ఎలా మరణించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ ప్రారంభించారు. -
తెలంగాణ వ్యవసాయ రంగంలో 52.26 శాతం మహిళలు
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2025 నివేదిక ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 52.26 శాతంగా ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వ్యవసాయ గణన 2015–16 నివేదిక ప్రకారం తెలంగాణలో మహిళల పేరిట ఉన్న భూకమతాలు 23.00 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో మహిళా శ్రామిక శక్తి 59.81 శాతం కాగా, భూ యాజమాన్యం 13.96 శాతంగా ఉందన్నారు. -
మీ వల్ల ఏ పని జరగదు.. ఇంటింటికి TDP కార్యక్రమంలో మంత్రి పార్థసారథికి ఇచ్చిపడేసిన మహిళా
-
పచ్చిగెడ్డి... ఆకలి ఇద్దరికీ ఒకటే!
ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్లు తీసుకోని కిర్కేట్ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది.సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా, అందురూ ఎండ తట్టుకోల్యాక ఎవురింట్లో వాళ్ళున్నారు.ఆవులకి నీళ్ళు తాపిద్దామని అమీనా పశువుల కొట్టంలోకి పోయింది. అన్ని ఆవులు బానే ఉండాయి. ఒకే ఒక్క ఆవు మాత్రం ముడ్చుక్కోని పండుకుంది. దాని ముందర ఏసినే ఎండుగెడ్డి అట్లనే ఉంది. కొంచెం కూడా తినల్యా. ఆవుని అట్ల చూస్తానే పాణమంతా ఎట్లో అయింది అమీనాకి. గెడ్డి చేతిలోకి తీసుకోని తినిపించేకి చూసింది. ఆవు అమీనా తుక్కు చూసి చేతిలో ఉన్నే గెడ్డి తినింది.హమ్మయ్య అనుకోని ఇంగ రొంత గెడ్డి తీస్కోని తినిపించింది. ఆవు కొంచేపు తిని మొగం పక్కకి తిప్పుకుంది. కడుగు నీళ్ళల్లో అన్నం, తౌడు కలిపి తీసుకొచ్చింది. అది గూడా రోంత తినింది. ఇంగ సాల్లే అనుకోని నీళ్ళు తాపిచ్చింది. నీళ్ళు తాగి పనుకుంది ఆవు.‘‘ఎంతసేపు ఆ ఆవు దగ్గరే ఉంటావు, ఇంట్లో పని మీ నాయినొచ్చి చేస్తాడా?’’ ఇంట్లో నుండేఅరిసింది అమీనా వాళ్ళత్త హుసేన్ బీ.ఇంకేం ఆలోచన చేయకుండా పరిగెత్తి ఇంట్లోకి పోయింది అమీనా. బట్టలు నానేసి, సామాన్లు కడిగేసి, ఇంట్లో మిగిలిండే పనులు చేసేసి కుచ్చుంది. కిటికీ లోనుండి ఆకాశం కనిపిస్తాంది. దూరంగా విండుమిల్లులు కనిపిస్తాన్నాయి. అవి తిరుగుతా ఉంటే వాటినే చూస్తా చూస్తా అమీనా ఆలోచనల్లో పడిపోయింది.∙∙ అమీనాకి పెళ్ళై సంవత్సరం దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. అమీనా మీద వాళ్ళత్తకున్న కోపానికి అది కూడా ఒక కారణం. సేద్యం చేసే కుటుంబం కావడంతో చిన్నప్పట్నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు చూస్కుంట పెరిగింది. పదో తర్తి వరకు ముక్కీ మూలిగి సదివి ‘కాలేజీకి పోను’ అని చెప్పేసింది. ఇంట్లో పనులు చేసుకుంట, సేన్లో పనులు, పాలు పిండేది, పచ్చిగెడ్డి కోసుకొచ్చి పశువులకి పెట్టేది ఒకటని కాదు. ఇంట్లో వాళ్ళమ్మ చేసే ప్రతిపనీ అమీనా కూడా చేసేది.ఒక అన్న, ఇద్దురు అక్కలు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. వయసులో అమీనా కంటే చానా పెద్దోళ్ళు కావడం మూలాన పెద్దగా మాట్లాడేది కాదు వాళ్ళతో. ఇంటిదగ్గర నేస్తులున్నా, వాళ్ళతో మాట్లాడేదీ తక్కువే. ఎప్పుడూ ఆవుల కొట్టంలోనే. వాటితోనే మాట్లాడేది. అవి తిరిగి మాట్లాడతాయని నమ్మేది. అన్నిటికంటే ఒక ఆవంటే రోంత ఎక్కువిష్టం అమీనాకి.అమీనా వచ్చి పక్కన నిలబడకుంటే ఏం తినేది, తాగేది కాదా ఆవు. ఎవురన్న వచ్చి ‘‘ఇప్పుడంటే ఇట్లుంది. రేప్పొద్దున పెండ్లయి వేరే ఊరికి పోతే ఎట్లమ్మే?’’ అనడిగితే, ‘‘ఎట్ల ఏం ఎట్ల? నాతో పాటు దీన్ని కూడా తీసకపోతా’’ అనేది చానా మామూలుగా.‘‘అట్లయితే పొలం, పశువులు ఉన్నే ఇంటికి, యాదో ఒక పల్లెటూరికి ఇయ్యబడ్తాది’’ అనేటోళ్ళు.‘‘పుట్టిండేది పల్లెటూర్లోనే, పెరిగిండేది ఈడనే. ఇంగ పెళ్ళి చేస్కోని పొయ్యేది పల్లెటూరికైతేనేం?’’ అనేది.‘‘కొంతమంది పొలం, పశువులు లేని ఇంటికి పోవల్ల అనుకుంటారు కదా, అట్ల అన్యాం లే’’ అనంటే, ‘‘నాకట్లాటివి ఏం లేవుబ్బా’’ అనేది.ఒకనాడు బంధువుల్లో ఒకాయప్ప వచ్చి ‘‘తెలిసినోళ్ళ పిల్లోడుండాడు తలారి చెరువులో. కొండమింద ఉంటాది ఆ ఊరు. పొలాలున్నాయి, పక్కనే సిమెంటు ఫ్యాక్టరీలో ఉజ్జోగం కూడా ఉంది, చానా ఆవులు, గేదెలు ఉన్నాయి’’ అని చెప్పినాడు. పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళొచ్చి చూసి పోయినారు, వీళ్ళు పోయి చూసొచ్చినారు. పెళ్ళి ఖాయమైంది. ఆ కొండమిందే ఉన్న హాజివలి దర్గా ఉర్సుకి చానాసార్లు పొయ్యొచ్చింది అమీనా. అదే ఊరికి పెళ్ళి చేస్కోని కోడలి మాదిరి పొయ్యేదంటే భలే సంబరమైంది అమీనాకి. రెండు నెలలు తిరక్కతలికే పెళ్ళయిపోయింది.అమీనా చెప్పినట్లే అత్తారింటికి పోతా పోతా ఆవుని కూడా పిల్చుకోని పోయింది. కొత్త పెళ్ళికూతురు కావడంతో పశువుల కొట్టం తుక్కు పంపీలేదు అమీనాని కొన్నిరోజులు. ఆవు తింటాందో లేదో అనే దిగులు. సరిగ్గా తినలేదు ఆవు.కొన్నిరోజులకి సేన్లో పని, పశువులకి మేత వేసేది, పాలు పిండేది మొదులుపెట్టింది. ఆవు మాత్రం కొంచెం కొంచెమే తినేది. ‘ఎందుకుబ్బా’ అని ఆలోచించుకుంది అమీనా.ఇంటిపనుల్లో, అత్త భయంతో తొందరగా గుర్తుకురాలేదు కానీ, మళ్ళా తెలిసింది అసలు సంగతి. పశువులకి పచ్చిగెడ్డే లేదని. ‘ఎందుకుబ్బా ఇట్లా?’ అనుకోని ఆ పొద్దు అట్లే ఉంది.మరుసటి నా పొద్దు కొడవలి తీసుకోని పచ్చిగెడ్డి కోసరం పోయింది. ఇండ్లన్ని దాటుకొని సేన్ల వైపు నడిసింది. ఎక్కడే గానీ రోంత కూడా పచ్చిగెడ్డి కనపరాల్యా. ఒక్కో సేను దాటుకోని పోతాంది. శనగలు, కుసాలు, ఆముదం తప్పించి వేరే పంట లేదు. ఎంతదూరం పోయినా ఇదే కత.విండు మిల్లులు దాటి పోయింది. అవి నిదానంగా తిరుగుతా ఉంటే వాటి తుక్కే చూసుకుంట నిలబడిపోయింది. తన జీవితం కూడా వాటి మాదిరే, అంత నిదానమైపోయినట్లు అనిపిస్తాంది. లోపలంతా ఏందో తెలియని నిస్సత్తువ. నడిసినంత దూరం నడిసి ఇంగ చేతకాక ఎనక్కి తిరిగింది. దర్గా దగ్గర నీడలో కొంచేపు కుచ్చుంది. ఉత్త చేతులతో ఇంటికొచ్చింది. ‘ఏందిబ్బా ఇంత తమాషా!’ అనుకుంది. ఇంట్లో అత్తని అడుగుదామనుకుంది. ఆయమ్మ మాట్లాడేది తక్కువా, అరిసేది ఎక్కువా అని మానుకుంది.సాయంకాలమైనాక ఇంటి పక్కన ముసిలాయమ్మొచ్చి బయట అరుగు మింద కుచ్చుంది. కసువు నూకుదామని పరక తీస్కోని బయటికొచ్చిన అమీనాని చూసి ‘‘ఏం పాపా, ఎట్లున్నావు?’’ అని ఎచ్చరిచ్చింది.‘‘బాగున్నా అవ్వా, నువ్వెట్లున్నావు?’’ అనడిగింది అమీనా.‘‘ఊరు పొమ్మంటాంది, కాడు రమ్మంటాంది. అట్లనే బతుకుతాండా’’ అని చెప్పింది ముసిలాయమ్మ.అమీనాకి నవ్వొచ్చింది కానీ ఆపుకోని ‘‘కాపీ తాగినావావ్వా?’’ అనడిగింది.‘‘ఇంగా లేదుమ్మా, కాపీ మాటేం గానీ నువ్వు కొడవలి తీసుకోని యాడికో పోతివే పొద్దన. సేను కాడికా?’’ అనడిగింది ముసిలాయమ్మ.‘‘అవునువ్వా, పశువులకి రోంత పచ్చిగెడ్డి ఏమన్నా దొరుకుతాదేమోనని పోతిని. యాడే గాని కనపరాల్యా’’ అని చెప్పింది కసువు నూక్కుంట.ముసిలాయమ్మ నగింది. నోట్లో మిగిలినే నాలుగు పళ్ళు కనిపిచ్చేటట్లు నగింది.‘‘ఏం వ్వా, అట్ల నగుతాన్నావ్?’’ అనడిగింది అమీనాకి అర్థంకాక.‘‘ఈ ఊర్లో పచ్చిగెడ్డి యాడిది పాపా. ఎనభై ఏళ్ళయింది నేను పుట్టి. ఈ ఊర్లోనే పుట్టి, ఈడే పెండ్లి చేస్కోని కాపురం చేసినా. నా పిల్లోళ్ళ పిల్లోళ్ళు కూడా పెద్దగైనారు. ఈ పొద్దుటిదాంక పచ్చిగెడ్డి అనేదే పెట్టింది లేదు పశువులకి’’ అని చెప్పి ఆపింది.ముసిలాయమ్మ ఏం చెప్తాందో అర్థం కాలేదు అమీనాకి.మళ్ళా ముసిలాయమ్మే ‘‘మనూరు కొండమింద గదా ఉండేది. బోరుకి నీళ్ళు పడవు. పడినా తాగేకి సరిపోతాయి గానీ సేద్యానికి సాలవు’’ అని చెప్పింది.దావెంబడి ఎంతసేపు నడిసినా శనగలు, కుసాలు, ఆముదాలే ఎందుకు కనపడినాయో అప్పుడర్థమైంది అమీనాకి.‘‘ఈ మాటే తెలీదువ్వా నాకు’’ అనింది అమీనా.‘‘తెలీక ఏం పాపా, కొండ మింద ఉన్నే ఊర్లో ఇట్లే ఉండేది.’’‘‘ఏమో, మా ఆవు వట్టిగెడ్డి సరిగ్గా తినడం ల్యా. మా ఊర్లో పచ్చిగెడ్డి బాగలవాటు. అందుకే దొరుకుతాదేమో అని పోతిని’’ కసువు నూకేది అయిపోయింది.‘‘యాడ పచ్చిగెడ్డిలే పాపా, పశువుల గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తాది. ఈ ఊర్లోని పశువులకి అసలు పచ్చిగెడ్డి అనేది ఒకటుంటాదని గూడా తెల్దు. శనగపొట్టు, సొప్ప, కడుగునీళ్ళల్లో అన్నం కలిపి పెట్టేది, పశువుల దాణా నీళ్ళల్లో కలిపి పెట్టేది – ఇవే తిండి. పాపం ఇవి తినే, పాలు ఇంతగా ఇస్తాన్నాయి. ఇంత ఆరోగ్గెంగా ఉంటాన్నాయి. ఇంగ పచ్చిగెడ్డి గనక దొరికితే ఇంగెన్ని పాలిస్తాయో, ఇంగెంత ఆరోగ్గెంగా ఉంటాయో...’’ అని చెప్తా పోతాంది ముసిలాయమ్మ.కసువు దిబ్బలో పోసొచ్చి పక్కనే కుచ్చుంది అమీనా.‘‘పెళ్ళికో, తిరుణాలకో వేరే ఊరు పోతే ఆడున్నే పశువులని చూసి ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయో అనుకుంటా. మనూరి పశువులు గుర్తుకొస్తాయి అప్పుడు. మనూరోళ్ళు ఎవురన్నా పశువులని కొండ కిందున్నే ఊర్లకి అమ్మితే పచ్చిగెడ్డి తిని బాగా బతుకుతాయిలే ఇంగ అనుకుంటారు. ఎంతో అవసరమయితే తప్ప వేరే ఊరి నుండి మనూరికి పిల్చుకోని రారు.ఈడే పుట్టిండేటివి అయితే ఇట్లే అలవాటు పడతాయిలే. అట్లాటిది మీ ఊరి నుండి తెచ్చినావు పాపా ఈ ఆవుని. యాడ అలవాటైతాది?’’ అనడిగింది అమీనాని.‘‘అదేవ్వా, నేను కూడా అదే అనుకుంటాన్నా నువ్వు చెప్తాంటే’’ అనింది అమీనా.ముసిలాయమ్మ ముందుకి వంగి ‘‘అవు పాపా, మీయత్త బానే ఉంటాదా నీతో, గొడవలేం పడదా?’’ అనడిగింది గుసగుసలాడుతున్నట్లే.అమీనా ఆ పక్కా, ఈ పక్కా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకోని సన్నగా ‘‘ఏం చెప్పేదిలేవ్వా. చానా అద్మానం మనిషి. అన్నం ఎక్కువసేపు తింటే గొడవే. అందరికన్నా ముందే తిన్నా గొడవే. తిండిలేని చోటు నుండి చేసుకొచ్చుకున్యాం. అదీ ఇదీ అని ఎన్ని మాటలంటుందో’’ అని చెప్పింది.‘‘అంటే అనుకోనీలే పాపా, నువ్వు ఆయమ్మ నోటికి తగలాకు. గొడవేస్కుందంటే ఇంగ అయిపాయ. పనికి పోయినే సాట ఆయమ్మని ఎచ్చరించల్లన్నా భయమే...’’ అని చెప్పి చిన్నగ అరుగు మింది నుండి లేసింది ముసిలాయమ్మ.ఎట్లా పచ్చిగెడ్డి దొరకదని తెలిసినాక ఇంగ ఉండే వాటిల్లోనే ఆవు ఏమి బాగ తింటుందో చూసి కడుపు నిండా కాకపోయినా ఒకరకంగా తినేటట్టు ప్రయత్నిస్తాంది అమీనా.అట్లనే ఆరు నెలలు గడిసిపోయినాయి. ఆవుకి ఇంగా అలవాటు కాలేదు ఊరు. అమీనాకి అప్పుడప్పుడే అలవాటయితాన్నాయి ఆ ఇల్లు, అత్త తిట్లు. ‘‘ఏమ్మా, ఏమన్నా విశేషమా?’’ అని అడిగేటోళ్ళు ఎక్కువైనారు. ఇంగా ఏమీ లేదు అని చెప్పేకి సాలయితాంది అమీనాకి. ఇంగో వైపు వాళ్ళత్త. కొంచేపు కుచ్చోని కనిపిస్తే సాలు యాదో ఒక పని చెప్తుంది. చేసేది కొంచెం ఆలస్యమైనా నోటికొచ్చిండేది తిడ్తుంది. ఆ తిట్టేది గూడా పని చేసేటప్పుడు కాక అన్నం తినేకి కుచ్చుంటానే మొదులుపెడ్తుంది. ఆ తిట్లు తినుకుంట అన్నం లోపలికి పోదు. చెయ్యి కడుక్కోని మళ్ళా పనిలో పడిపోతుంది అమీనా.మొగునికి చెప్పి చూసింది, లాభం లేదు. పుట్టింట్లో వాళ్ళకి చెప్పి చూసింది. ‘‘మామూలేమ్మా ఇంగా, సర్దుకుపోవల్ల’’ అని చెప్పినారు. ఎవరికీ పట్టినట్టు అనిపించల్యా. ఇంగో పక్క ఆవు పరిస్థితి బాల్యాకుండా పోతాంది. జీవితమంతా ఎట్లో అనుకుంటే, ఇంగెట్లో పోతాన్నెట్లు అనిపిస్తాంది.ఇంట్లో పని, సేన్లో పని, పశువుల పని ఈ మూడింటితోనే సరిపోతాంది. పెండ్లిగాకముందు కూడా చేసేది ఇవే పనులే అయినా ఏందో ఇప్పుడంతా మారిపోయినట్లు అనిపిస్తాంది. చుట్టూ యాడ చూసినా పచ్చటిపొలాలు కనపడే ఊరి నుండి వచ్చినే అమీనాకి ఆ సిమెంటు ఫ్యాక్టరీ, ఆ విండు మిల్లులు, గెడ్డి లేని సేన్లు చూస్తాంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చి పడినానో అనిపిస్తాంది.ఊర్లో ఉన్నెప్పుడు సేనుకి పోయి వస్తా వస్తా పెన్నేట్లో ఆడుకున్నేది గుర్తుకొస్తాది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు పచ్చిగెడ్డి మోపు తీసుకొచ్చి పశువులకి పెట్టేది గుర్తుకొస్తాది. టీవీ ఆన్ చేస్కోని తట్టలో అన్నం, పప్పు, చెనిక్కాయల పొడి, నెయ్యి పెట్టుకోని టీవీ చూస్కుంట ఎంచేపు కావల్సింటే అంచేపు తినేది గుర్తుకొస్తాది. కాపీ చేస్కోని లోటాలో ఏస్కోని బయట అరుగుమింద కుచ్చోని తాగేది గుర్తుకొస్తాది.మళ్ళా ఇంతకుముందు మాదిరి ఎప్పుటికైనా అయితాదా అని ఆలోచించీ, ఆలోచించీ ఒక నిర్ణయానికొచ్చింది. తనకెట్లా తప్పదు. యాదో ఒకరోజు తనకి నచ్చినట్లు మార్చుకోనీకి ప్రయత్నించల్ల.అప్పుటిదాకా ఇట్లనే. కానీ ఆవెందుకు ఆకలికి ఉండల్ల. దాని తిండిని, దాని ఆరోగ్యాన్ని నా మూలాన ఎందుకు దూరం చేయల్ల అనుకుంది.పుట్టింటోళ్ళని పిలిపిచ్చింది. ఆవుని తీస్కోపొమ్మని చెప్పింది. ఒకనాడు లగేజ్ ఆటో తెచ్చి ఆవుని తీసకపోయినారు పుట్టింటోళ్ళు. చానా బాధ పడతానే పంపింది. ఆవు పోనంటే పోనని మొండికేసి పోయింది.ఆరోజంతా ఏడూస్తానే పండుకుంది అమీనా. మళ్ళా ఇంటికి పోన్ చేసి ‘ఆవెట్లుంది, బాగా తింటాంద్యా లేదా’ అనడిగింది. ‘బాగా తింటాంది, ఇప్పుడు బాగుంది’ అని చెప్తే సంబరపడిపోయింది.ఆవిప్పుడు కడుపు నిండా తింటాంది, అమీనా తినేది ఎప్పుడో..!?- మొహమ్మద్ గౌస్ -
ఫోన్ నంబర్ల మాస్కింగ్ ఒక్కటే సరిపోతుందా?
భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆమూలాగ్రం మార్చేసి కోట్లాది మంది దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇప్పుడు ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అదే.. వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యత. దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం అమలు దశలోకి వచ్చిన నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేమెంట్ యాప్లు, భాగస్వామ్య బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబరు 4 నాటికి యూజర్ల మొబైల్ నంబర్లను పూర్తిస్థాయిలో ప్రదర్శించకుండా మాస్కింగ్ చేయాలి (కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించాలి). అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న ఫోన్ నంబర్ ఆధారిత యూపీఐ ఐడీలకు స్వస్తి చెప్పి యూజర్ నేమ్ ఆధారిత వర్చువల్ పేమెంట్ అడ్రెస్(వీపీఏ)లను కొత్త వినియోగదారులకు డిఫాల్ట్గా కేటాయించాలని ఆదేశించింది.స్త్రీల భద్రత.. సత్వర నివారణ చర్యలుచిల్లర వర్తకులకు లేదా అపరిచితులకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు వినియోగదారుల (ముఖ్యంగా మహిళల) ఫోన్ నంబర్లు బహిర్గతమై, వేధింపులు, సైబర్ బెదిరింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్పీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యూఆర్ కోడ్ లావాదేవీలలోనూ, పీర్2పీర్ బదిలీల్లోనూ వ్యక్తిగత నంబర్ ప్రదర్శన ఆగిపోయి ప్రాథమిక స్థాయి ప్రైవసీ రక్షణ లభిస్తుంది.ఇది ఒక భాగం మాత్రమే!ఫోన్ నంబర్లను దాచడం అనేది డిజిటల్ గోప్యత అనే పెద్ద సమస్యలో ఒక చిన్న పరిష్కారం మాత్రమేనని రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నంబర్ దాచినా చెల్లింపు నిర్ధారణ స్క్రీన్పై ఖాతాదారుడి పూర్తి పేరు, బ్యాంక్ వివరాలు కనిపించడం వల్ల వ్యక్తిగత గుర్తింపును సులభంగా కనుగొనే అవకాశం ఇంకా మిగిలే ఉంది.థర్డ్-పార్టీ యూపీఐ యాప్లు వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన, లొకేషన్, లావాదేవీల నమూనాలను ఎంతవరకు సేకరిస్తున్నాయి? ఆ డేటాను ప్రకటనల సంస్థలకు ఎలా విక్రయిస్తున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.సెప్టెంబరు 4 కల్లా బ్యాంకింగ్ సిస్టమ్స్ను అప్గ్రేడ్ చేయడం, కోట్ల మంది వినియోగదారులకు కొత్త వీపీఏ పద్ధతులపై అవగాహన కల్పించాల్సి ఉంది.వేగం, సౌలభ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టించిన యూపీఐ ఇప్పుడు విశ్వసనీయత, డేటా ప్రైవసీ అనే పరీక్షను ఎదుర్కొంటోంది. కేవలం నంబర్లు దాచడానికే పరిమితం కాకుండా డేటా మినిమైజేషన్ (అవసరమైనంత డేటా మాత్రమే సేకరించడం) సూత్రాన్ని వర్తింపజేస్తూ సమగ్ర సైబర్ భద్రతా చట్రాన్ని నిర్మించినప్పుడే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నిజమైన రక్షణ లభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
నేటికీ ఇంటికే పరిమితం?
మహిళలు సాధికారత సాధించారని, అభివృద్ధిపథంలో ముందున్నారని మాటలు చెప్పేస్తుంటారు. కానీ నివేదికలు మాత్రం ఇవన్నీ ఉత్తిమాటలేనని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇంటి, సంరక్షణ బాధ్యతల భారం కేవలం మహిళలపైనే పడుతోందని జాతీయ గణాంక కార్యాలయం చేపట్టిన సర్వేలో తేలింది. భారత్లోని 46 అతిపెద్ద నగరాల్లో (మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో) సుమారు 69 శాతం మంది మహిళలు కేవలం పిల్లల పెంపకం, ఇంటి పనుల కారణంగానే ఉద్యోగాలకి దూరంగా ఉంటున్నారని ఈ సర్వే తెలిపింది.⇒ 1% దేశవ్యాప్తంగా సామాజిక కారణాల వల్ల తాము ఉద్యోగానికి దూరంగా ఉంటున్నామని చెప్పిన మహిళలు ఒక్క శాతం కాగా, అలాగే పిల్లల సంరక్షణ ఇంటి బాధ్యతల కారణంగా తాము కూడా ఉద్యోగాలు చేయలేక΄ోతున్నామని చెప్పిన మగవారు కూడా ఒక్కశాతమే ఉండటం గమనార్హం.⇒ 30.7% ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలోని మహిళల ఉద్యోగ భాగస్వామ్యం అత్యల్పంగా 2025 నాటికి 30.7 శాతంగా నమోదైంది. అయితే ఈ మధ్యకాలంలో గణాంకాల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.23%పెద్ద నగరాల్లో పురుషుల కంటే మహిళలు 23% తక్కువ సంపాదిస్తున్నారు. దేశంలో, ఈ ధోరణి నగరాల మధ్య మారుతూ ఉంది. ఉదాహరణకు హౌరాలోని 83% మంది మహిళలు తాము ఉపాధి రంగానికి దూరంగా ఉండటానికి పిల్లల సంరక్షణ, ఇంటి పనులే కారణమని తెలపగా, ఆ తర్వాత సూరత్ (81%), పింప్రి చించ్వాడ్ , భోపాల్ (78%), ధన్ బాద్ (77%) ఉన్నాయి. అదేవిధంగా ఆగ్రా (41%), కోటా (57%), హైదరాబాద్ (58%), అలాగే విశాఖపట్నం, శ్రీనగర్లలో (60%) ఈ శాతంగా నమోదు అయింది. అయితే కొయంబత్తూర్లో ఈ శాతం చాలా తక్కువగా (38%) ఉంది.10%16 శాతం మంది మహిళలు ఉన్నత చదువుల కోసం, 10 శాతం మంది ఆరోగ్యం, వయోపరిమితి వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, ఉద్యోగాల్లో లేని పురుషుల్లో సగానికి పైగా (53%) మంది ఉన్నత చదువుల కోసమేనని చెప్పగా, 39 శాతం మంది ఆరోగ్యం, వయస్సుకు సంబంధించిన కారణాలను చూపారు.51%ఇతర పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, నగరాల్లో మహిళలకు లభించే ఉద్యోగాల శాతం మెరుగ్గా ఉంది. పెద్ద నగరాల్లో 65 శాతం మంది మహిళలు వేతనంతో కూడిన రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తుండగా, పట్టణాల్లో 51 శాతం మాత్రమే ఉంది. అలాగే నగరాల్లో 3 శాతం మంది మాత్రమే రోజువారీ వేతన కార్మికులుగా ఉండగా, పట్టణాల్లో 9%గా ఉన్నారు.రూ. 23,700/వేతనాల్లోనూ స్త్రీ, పురుషుల మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో పురుషులు నెలకు సగటున రూ. 30,700 సంపాదిస్తుండగా, మహిళలు మాత్రం నెలకు రూ. 23,700 మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే 23 శాతం తక్కువ. కళ్యాణ్–డోంబివిలి, నవీ ముంబై, నాగ్పూర్ వంటి నగరాల్లో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. అక్కడ మహిళలు పురుషుల సంపాదనలో దాదాపు సగం మాత్రమే పొందుతున్నారు. అయితే ప్రయాగ్రాజ్ (అలహాబాద్) మాత్రం ఈ ట్రెండ్కు భిన్నంగా ఉంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంపాదన ఎక్కువగా నమోదైంది.రూ. 16,160/స్వయం ఉపాధిలో పురుషుల నెలవారీ ఆదాయం (రూ. 33,880), మహిళల ఆదాయం (రూ. 16,160) కంటే రెట్టింపుగా ఉంది.49.5 గంటలుపట్టణ ప్రాంతాల్లోని కార్మికులు వారానికి సగటున 47.1 గంటలు పనిచేస్తుంటే, పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని కార్మికులు వారానికి 49.5 గంటలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పెద్ద నగరాల్లోని పురుష, స్త్రీ ఉద్యోగులిద్దరూ ఎక్కువ సగటు గంటలు పనిచేస్తున్నట్లు నమోదైంది.51.5 గంటలుఉద్యోగాలు చేసే మహిళలలో.. గుజరాత్లోని రాజ్కోట్ (51.5 గంటలు), తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ (50 గంటలు) నగరాలకు చెందిన మహిళలు ఆఫీస్లలో అత్యధిక సమయం పనిచేస్తున్నారు. -
గుండు కొట్టించుకుంటే 15 వేలు..!
తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు. ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు. తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలుఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులుతమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ… pic.twitter.com/zcggDhinxs— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026 -
మహిళలకు స్వర్గధామం ఈ దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మహిళల పురోగతి, న్యాయం, భద్రత ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అమెరికాలోని ‘జార్జ్టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ’ విడుదల చేసిన వుమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్(2025-26) ప్రకారం.. మహిళలు స్వతంత్రంగా, సురక్షితంగా, సాధికారతతో జీవించడానికి ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ (0.939 స్కోరు) అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 181 దేశాల్లో మహిళల భాగస్వామ్యం, చట్టపరమైన రక్షణ, భద్రతలకు సంబంధించిన 13 కీలక సూచికలను ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను ఖరారు చేశారు.టాప్-5లో నార్డిక్ దేశాలు1. డెన్మార్క్ (0.939)2. ఐస్లాండ్ (0.932)3. నార్వే (0.924), స్వీడన్ (0.924)4. ఫిన్లాండ్ (0.921)లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ తదితర దేశాలు టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా (11), కోస్టారికా, ఉరుగ్వే వంటి లాటిన్ అమెరికా దేశాలు సైతం గణనీయమైన ప్రగతితో ఉత్తమ శ్రేణిలో నిలిచాయి.నార్డిక్ మోడల్ ప్రత్యేకత ఏమిటి?ఉచిత విద్య, ఉద్యోగాల్లో అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం, బలమైన ఆర్థిక పురోగతి, రాజకీయ ప్రాతినిధ్యం, సమర్థవంతమైన చట్టపరమైన రక్షణలు నార్డిక్ దేశాల విజయ రహస్యం. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉన్న చోట మహిళలపై హింసాత్మక సంఘటనలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.యుద్ద భయాలు.. దయనీయ స్థితిలో చివరి స్థానాలుమరోవైపు అంతర్యుద్ధాలు, నిరంకుశ పాలన, రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న దేశాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అఫ్గానిస్థాన్ (181వ ర్యాంకు) ఆఖరి స్థానంలో నిలిచింది. యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సుడాన్, హైతీ, కాంగో, మయన్మార్ దేశాలు అడుగున మిగిలాయి. ఈ ర్యాంకులో దిగువన ఉన్న 12 దేశాల్లో నివసిస్తున్న 70 శాతానికి పైగా మహిళలు భీకర సాయుధ పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలకు కేవలం 50 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. ఇది వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ సూచీలో భారతదేశం 131వ ర్యాంకుతో 0.607 స్కోరు, పాకిస్థాన్ 169వ ర్యాంకుతో 0.462 స్కోరుతో నిలిచాయి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు
-
మహిళా జర్నలిస్టులపై దాడి.. చేసింది ఎవరు?
-
"పెద్ది" మూవీ పోస్టర్ తో తిరుమలలో మహిళ హల్ చల్..!
-
మహిళలకు భద్రత ఇవ్వలేని చెత్త ప్రభుత్వం.. కూటమి పై బొత్స కూతురు ఫైర్
-
కొడుకు ముందు మూత్రం పోసేలా కొట్టడం ఏంటండీ..
-
దుశ్శాసన పాలనపై 'రగిలిన రణనేత్రి'
చంద్రబాబు దుశ్శాసన పాలనపై నారీలోకం కొంగు బిగించి కన్నెర్ర చేసింది. లైంగికదాడులు, హత్యలు, అవమానాలపై రణనేత్రియై సమరభేరి మోగించింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కింది. అతివలపై పెరుగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగింది. ఈ దుష్ట సర్కారుకు ఒక్క క్షణం కూడా గద్దెపై ఉండే అర్హత లేదని ధ్వజమెత్తింది. ఫలితంగా ర్యాలీలు, ధర్నాలతో జిల్లా కేంద్రాలు అట్టుడికాయి. సర్కారు వెన్నులో వణుకుపుట్టించాయి. సాక్షి, అమరావతి: చంద్రబాబు దుశ్శాసన పాలనలో పచ్చపైత్యంతో పేట్రేగిపోయిన టీడీపీ నేత, మరికొందరు కలిసి గుంటూరులో సాగించిన దుశ్శాసన పర్వంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కదంతొక్కారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వనితలకు రక్షణ కల్పించడంలో సర్కారు విఫలమైందని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.అంబేడ్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని, రాష్ట్రంలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు ⇒ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న మహిళలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు సంఘీభావం పలికారు.నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలు ⇒ గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో భారీగా పాల్గొన్న మహిళా నేతలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్ కుమార్, డైమండ్ బాబు, మహి సంఘీభావం తెలిపారు. గుంటూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న నేతలు ⇒ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సర్కారుకి సద్బుద్ధి ప్రసాదించాలని మహిళా నాయకులు సాయిలక్ష్మి, విజయలక్ష్మి, కుమారి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ⇒ అనంతపురం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కూడా మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ⇒ రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించారు. చంద్రబాబు దుశ్శాసన పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పాడేరులో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకులు చంద్రబాబు పాలనలో దుశ్శాసన పర్వంరాష్ట్రంలో నిత్యం మహిళలు, బాలికలపై అఘాయిత్యాలతో చంద్రబాబు పాలన దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికొదిలేశారని, స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఆమె మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన అమానుష ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రూ.10 వేలు లంచం ఇవ్వలేదన్న కారణంతో ఓ టీడీపీ నాయకుడు గుంటూరు నగరం నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కూటమి నేతలు మహిళలపై వరుసగా దాడులకు పాల్పడుతున్నా, ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారని అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. గుంటూరు ఘటనపై మహిళా హోం మంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. నిందితుడు టీడీపీ కార్యకర్త అయితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. నేరస్తులను బహిరంగంగా ఎగ్జిబిట్ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందని అన్నారు. గుంటూరు ఘటన దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయని కాకుండా, బాధితురాలికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. -
సీజేపీ ప్రొటెస్ట్లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
హోమ్ మినిస్టర్ నువ్వు పనికిరావు అనితకు YSRCP మహిళలు కౌంటర్
-
మహిళల రక్షణ కోసం గళం ఎత్తిన YSRCP శ్రేణులు
-
CCTV ఫ్యూటజీ లేకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే కారుమూరి షాకింగ్ నిజాలు
-
సుద్దపూస మాటలు మాట్లాడకు .. గల్లా మాధవికి వరుదు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్..!
-
ఛీ.. నువ్వో ఎమ్మెల్యేవి.. నువ్వొక మంత్రివి.. 3 రోజులు గాడిదలు కాశావా?
-
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పచ్చనేత మరో దుశ్శాసన పర్వం.. వృద్ధురాలి జాకెట్ చింపివేత
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. మహిళలే లక్ష్యంగా అకృత్యాలకు తెగబడుతున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే.. మరో పచ్చనేత పేట్రేగిపోయాడు. దిక్కూమొక్కూలేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్ను చింపేసిన దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.బద్వేలులోని గౌరీశంకర్నగర్ 1021 సర్వే నంబరులోని 74వ ప్లాట్లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. మూడునెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ‘ఈ స్థలం మాది.. ఇల్లు ఖాళీచేసి వెళ్లిపొండి’.. అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వారు వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తన అనుచరగణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టారు.దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటియజమానిని తోసేసి ఆమె జాకెట్ చింపి దాడికి యత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. 16 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న దిక్కూమొక్కూ లేని ఆ వృద్ధదంపతుల పట్ల దౌర్జన్యాన్ని నిలదీశారు. వృద్ధురాలి జాకెట్ చించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. నా భార్య జాకెట్ చింపేసి.. ఆత్మాభిమానాన్ని మంటగలిపారు.. 16 ఏళ్లుగా గౌరీశంకర్నగర్లో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం. బొజ్జా తిరుమలేష్, అనుచరగణం పూటుగా మద్యం తాగి రెండు కార్లలో సమ్మెటలు, గడ్డపారలతో వచ్చి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన నా భార్యపై దాడికి యత్నించి జాకెట్ చింపేశారు. మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ నానా బీభత్సం సృష్టించారు. మాపై దాడికి పాల్పడి.. నా భార్య జాకెట్ చింపేసి మా ఆత్మగౌరవాన్ని మంటకలిపిన వారిపై చర్యలు తీసుకోవాలి. – వృద్ధురాలి భర్త, బద్వేలు -
నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తారా ? TDP నేత దౌర్జన్యంపై అంబటి ఆగ్రహం
-
బాల్ కట్వా గ్యాంగ్ దాడులు.. పోలీసులకు సవాల్
పాట్నా: అందరూ ఇంట్లో ఉండగానే చొరబడతారు. చాకచక్యంగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. దొరికిన డబ్బు, నగలు దోచుకుని పరారవుతారు. అయితే వెళ్తూ వెళ్తూ ఇంట్లోని మహిళల జుట్టును కత్తిరించి తీసుకెళ్తుండటమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనాల కేసులను ఛేదించడమే పోలీసులకు సవాలుగా ఉంటే, ఈ ‘జుట్టు కత్తిరించే’ గ్యాంగ్ మాత్రం వారికి కొత్త తలనొప్పిగా మారింది. బిహార్లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.నిత్యం సోషల్ మీడియాలో ‘చడ్డీ గ్యాంగ్’, ‘షట్టర్ కట్వా గ్యాంగ్’ గురించి వింటుంటాం. ఇప్పుడు ‘బాల్ కట్వా గ్యాంగ్’ బిహార్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో రెండు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. డబ్బు, నగలతో పాటు మహిళల జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వారు కత్తిరించి తీసుకెళ్లిన జుట్టును ఏం చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇదే స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల బిహార్లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామంలో రెండు వేర్వేరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. జూలై 8న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు అగంతకులు కుటుంబ సభ్యులను బంధించి, ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చారు. సుమారు 20 నిమిషాల్లో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.35 వేల నగదు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు పవన్ మేనకోడలు, 22 ఏళ్ల కరిష్మా దేవి జుట్టును కత్తిరించి తీసుకెళ్లారు.అదే గ్రామంలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో దోపిడీ చేసిన దుండగులు అక్కడ నిద్రిస్తున్న బాలిక జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లారు. వరుస దోపిడీలపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత కుటుంబాలను విచారించి, ఘటనాస్థలాలను పరిశీలించాయి. రెండు చోట్ల జరిగిన దోపిడీల తీరు ఒకే విధంగా ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.మరోవైపు, దుండగులు మహిళల జుట్టును ఎందుకు కత్తిరించి తీసుకెళ్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దోపిడీల కంటే ఈ అంశమే స్థానికులను ఎక్కువగా కలవరపెడుతోంది. రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? జుట్టును తీసుకెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.దర్హార్ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో చాలా మంది గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లకు కాపలా కాస్తూ మేల్కొని ఉంటున్నారు. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. -
గుంటూరు నడిబొడ్డున..మహిళపై 9 మంది
-
కక్షతో.. బాత్రూం క్లీన్ చేసే రసాయనం తాగించి..
హైదరాబాద్, సుభాష్నగర్: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో పేట్బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. గాజులరామారం కైసర్ నగర్లోని సర్వేనెంబర్ 342 ప్రభుత్వ స్థలంలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికురాలు సల్మా బేగం జూన్ 19న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కబ్జాదారుడు రత్నాకరం సాయిరాజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.సల్మా బేగంపై దాడి చేయాలని స్థానికంగా ఉన్న హేమశ్రీ, సయ్యద్ రేష్మ బేగం, సయ్యద్ రహీం, షహనాజ్ అనే మహిళలను ప్రేరేపించాడు. ఈ నెల 8న సల్మా బేగం ఇంట్లోకి నలుగురు చొరబడి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా బాత్రూం క్లీన్ చేసే రసాయనాన్ని బలవంతంగా తాగించి ప్రాణాపాయ స్థితికి గురి చేశారు. దాడి దృశ్యాలను సల్మా బేగం కూతురు ఫోన్లో చిత్రీకరిస్తుండగా మొబైల్ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.దీంతో ఈ నెల 8న సల్మా బేగం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రత్నాకరం సాయిరాజ్ కోసం గాలిస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సాయిరాజ్పై గతంలో ఆరు కేసులు ఉండగా అతనిపై భూకబ్జా షీటు నమోదు చేస్తున్నామని, అదే విధంగా ఓ మహిళపై గతంలో ఐదు కేసులు ఉండగా, దీనితో కలిపి ఆరో కేసు నమోదు చేసి ఆమెపై కూడా రౌడీ షీట్ నమోదు చేస్తామన్నారు. -
రాజస్థాన్లో బాలింతల వరుస మరణాలు.. వీడని మిస్టరీ!
రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతోంది. మే నెల నుంచి ఇప్పటి వరకు 18 మంది బాలింతలు ప్రాణాలు కోల్పోగా... కిడ్నీలు దెబ్బతిన్న మరో ఏడుగురు మహిళలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. జులై 5 నుండి జులై 10 మధ్య భిల్వారా, బన్స్వారా జిల్లాల్లోనే ఏకంగా తొమ్మిది మంది మహిళలు మరణించారు. ఇది రాష్ట్రంలో మాతృత్వ ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.భిల్వారాలోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ప్రసూతి ఆసుపత్రిలో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మహిళలు సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్సల అనంతరం మరణించారు. శస్త్రచికిత్స తర్వాత వీరంతా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యారని, ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆసుపత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి.అంతకు ముందు మే నెలలో కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు బాలింతలు మృతి చెందారు. జూన్లో బికనీర్లో సిజేరియన్ చేయించుకున్న ఆరుగురు మహిళలకు కిడ్నీలు దెబ్బతినగా.. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఏడుగురు మహిళలు ప్రస్తుతం డయాలసిస్పై ఉన్నారు.బాలింతల మరణాలపై ఆరోగ్యశాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ మాట్లాడుతూ.. వరుస మరణాలు తమను షాక్కు గురిచేసిందని.. మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మరణాలన్నీ ఒకే తహాలో సంభవించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం ఏంటో స్పష్టంగా అర్థం కావడం లేదు. మొదట ఎండల తీవ్రత (హీట్ స్ట్రోక్) వల్ల మరణించి ఉంటారని భావించాం.. కానీ ఇప్పుడు ఎండలు తగ్గిపోయాయి. రక్త పరీక్షల నివేదికలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఏదైనా నిర్లక్ష్యం లేదా వైద్యపరమైన లోపాలు ఉన్నట్లు తేలితే తప్ప వైద్యులు లేదా అధికారులపై చర్యలు తీసుకోలేమని మంత్రి తెలిపారు.విచారణ కోసం జైపూర్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించిన ప్రభుత్వం.. కోటా, జోధ్పూర్, బికనీర్ జిల్లాల ఆసుపత్రి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లతో మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కాగా, గతంలో ఎయిమ్స్ ఢిల్లీ బృందం చేసిన సమీక్ష తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గైనకాలజిస్టులతో లోతైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మరణాలపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఆసుపత్రుల ముందు నిరసనలకు దిగారు.ఆసుపత్రిలో ప్రతిరోజూ 30 నుండి 40 సిజేరియన్ శస్త్రచికిత్సలు జరుగుతుండగా.. అక్కడ కేవలం 8 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ సెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5 సాధారణ వాడకానికి.. 3 అత్యవసర అవసరాల కోసం కేటాయించారు. ప్రతి సెట్ను తిరిగి ఉపయోగించే ముందు కనీసం మూడు గంటల పాటు స్టెరిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే శస్త్రచికిత్సల ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని.. తద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆపరేషన్ థియేటర్ నుండి తీసిన కల్చర్ టెస్ట్ శాంపిల్లో బ్యాక్టీరియా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి బాలింతల మరణాలకు ప్రత్యక్ష సంబంధం ఉందా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ గౌర్ ఇన్ఫెక్షన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల నుండి క్రమం తప్పకుండా నమూనాలు సేకరించడం సాధారణ నియంత్రణ ప్రక్రియలో భాగమేనని చెప్పారు. బ్యాక్టీరియా బయటపడిన ఆపరేషన్ థియేటర్ను గత మూడు రోజులుగా మూసివేసి, ఫ్యూమిగేషన్ మరియు స్టెరిలైజేషన్ చేస్తున్నామని, తదుపరి పరీక్షల్లో నెగటివ్ వచ్చే వరకు అక్కడ శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
అమ్మాయిలతో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల గలీజు పనులు
సాక్షి,మచిలీపట్నం: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కొందరు యువతులతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. మచిలీపట్నంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఒక ప్రైవేట్ విందును ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకకు కొంతమంది యువతులను సైతం రప్పించారు. మద్యం మత్తులో సదరు యువతులతో కలిసి వీరు అసభ్యకర రీతిలో, అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేశారు.అశ్లీల నృత్యాల్లో పాల్గొని అడ్డంగా దొరికిపోయిన వారిలో సామాన్యులు లేరు. నేరుగా మంత్రి కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరులుగా వీరిని గుర్తించారు.సైదారావు, హితేష్, ఆంజనేయులు ఉన్నారు. సదరు జ్యువెలరీ షాపులో వీరు యువతులతో కలిసి చేసిన అశ్లీల డ్యాన్స్ల దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ అశ్లీల నృత్యాల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. -
'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..
నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్పాత్లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది. ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్పాత్లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది. అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది. చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanya Khanijow (@tanyakhanijow) (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం) -
రూ.2 వేల కోసం వెళ్లింది.. ఖాతాలో రూ.740 కోట్లు చూసి మహిళ షాక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా బిధాన్నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన యావత్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అన్నపూర్ణ భండార్ పథకం కింద కేవలం రూ. 2,000 తీసుకునేందుకు వెళ్లిన ఒక పేద మహిళ, తన బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా రూ. 740 కోట్ల 68 లక్షలు కనిపించడంతో నిర్ఘాంతపోయింది.డార్జిలింగ్ జిల్లాలోని ఫాన్సిదేవా బ్లాక్లో ఉన్న కోచుబారీ గ్రామానికి చెందిన మెహరూనేషా అనే మహిళదే ఈ ఘటన. శనివారం ఉదయం సుమారు 11:30 గంటలకు ఆమె తన ప్రాంతంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)కి వెళ్లి, అన్నపూర్ణ భండార్ పథకం కింద తనకు వచ్చిన సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నించింది. బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఆమె రూ. 2,000 విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత తన ఖాతా బ్యాలెన్స్ ఎంత ఉందో చూపించమని సీఎస్పీ నిర్వాహకుడిని కోరింది.ఖాతా వివరాలు తెరపై చూసిన సీఎస్పీ యజమాని షాహిద్ అన్వర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. మహిళ పొదుపు ఖాతాలో ఏకంగా రూ. 740 కోట్ల 68 లక్షలు కనిపించాయి. రాత్రికి రాత్రి మెహరూనేషా 'కోటీశ్వరురాలిగా' మారిపోయింది. ఈ విషయం తెలియగానే సీఎస్పీ బయట జనం గుమిగూడారు. ఆశ్చర్యానికి గురైన ఆ మహిళను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.తన భర్త ఒక సాధారణ కూలీ అని, కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని మెహరూనేషా తెలిపింది. కలలో కూడా ఇంత డబ్బు చూడలేదని, అకస్మాత్తుగా ఖాతాలో ఇంత పెద్ద మొత్తం రావడంతో తాము విస్తుపోయామని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె పేర్కొంది.సీఎస్పీ యజమాని షాహిద్ అన్వర్ కూడా ఈ ఘటనను ధృవీకరించారు. మహిళ ఉదయం తన దుకాణానికి వచ్చిందని, సాధారణ ప్రక్రియలో భాగంగా రూ. 2,000 తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఈ అంకె బయటపడిందని చెప్పారు. వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన మహిళకు సూచించారు.డార్జిలింగ్ జిల్లా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమస్య బ్యాంక్లో జరిగిన ఏదో సాంకేతిక లోపం వల్లే తలెత్తినట్లు తెలుస్తోంది. విషయం దృష్టికి రాగానే బ్యాంక్ యాజమాన్యం మహిళ పొదుపు ఖాతాను స్తంభింపజేసింది (ఫ్రీజ్ చేసింది). ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందన కోసం డార్జిలింగ్ జిల్లా కలెక్టర్ హరిశంకర్ పణిక్కర్ను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక లోపాలు ఎలా జరుగుతాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తదుపరి దర్యాప్తు నివేదిక వెలువడే వరకు ఈ వ్యవహారంపై స్పష్టత రాకపోవచ్చని అధికారులు తెలిపారు. -
అమ్మాయిల లోదుస్తులు దొంగలించి.. వికృత చేష్టలు..!
మహిళల దుస్తులు కాజేసి సీసీ టీవీ కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించే అసోంకు చెందిన వికృత కాముకుడిని బెంగళూరు ఇందిరానగర పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ హుసేన్ పట్టుబడిన వ్యక్తి. కంపెనీలో డెలివరీ బాయ్గా పని చేస్తూ ఇందిరానగరలో నివాసం ఉంటున్నారు. దుస్తులు కాజేయడంపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందిరానగర పోలీసులు అబ్దుల్ హుసేన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.స్నేహితురాలితో కలిసి హొయ్సళనగరలో ఓ యువతి నివాసం ఉండేది. గత మే నెల నుంచి ఇంటి కాంపౌండు లోపల దుస్తులు ఆరబెట్టిన స్దలంలో పలుమార్లు దుస్తులు చోరీకి గురయ్యాయి. కొద్దిరోజుల అనంతరం పాత దుస్తులు మళ్లీ కౌంపౌండ్లో పెట్టి కొత్త దుస్తులు మాత్రమే చోరీ చేసేవారని యువతి ఇందిరానగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుస్తులు పలుమార్లు చోరీకి గురికావడంపై యువతి రహస్య కెమెరా అమర్చింది. ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి కాంపౌండ్లోకి అక్రమంగా ప్రవేశించి గతంలో చోరీ చేసిన దుస్తులు ధరించి మళ్లీ దుస్తుల చోరీకి పాల్పడ్డాడు. అంతేగాక కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇందిరానగర పోలీసులు తీవ్రంగా గాలించి అరెస్ట్ చేసి జైలుకు పంపించగా బెయిల్పై విడుదలయ్యాడు. -బెంగళూరు -
14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!
చిన్న పని అంటూ ఏదీ ఉండదు... ప్రతి అవకాశం గొప్ప విజయానికి పునాది కావచ్చు. ఈ మాటలను నిజం చేసింది బ్రిటన్కు చెందిన క్లేర్ పార్ఫిట్(Claire Parfitt). 14 ఏళ్ల వయసులో అంతరిక్ష కేంద్రంలో స్పేస్ టాయిలెట్ను శుభ్రం చేసిన ఆమె.. ఇవాళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో భవిష్యత్ మార్స్ అన్వేషణ మిషన్లకు నాయకత్వం వహిస్తోంది..ఆమె ప్రస్థానం ఎలా మొదలైందంటే..నాటింగ్హామ్కు చెందిన క్లేర్కు చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై మక్కువ. వర్క్ ఎక్స్పీరియెన్స్ కోసం తొలుత నాసాకు దరఖాస్తు చేసినా అవకాశం రాలేదు. తర్వాత లీసెస్టర్లోని నేషనల్ స్పేస్ సెంటర్( National Space Centre)లో అవకాశం దక్కింది. ఆ సమయంలో స్పేస్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్తగా వచ్చిన ప్రదర్శన వస్తువులను విప్పడం, శుభ్రపరచడం వంటి బాధ్యతలను ఆమె నిర్వహించారు.ఆ పనుల్లోనే అంతరిక్ష యాత్రల్లో ఉపయోగించే స్పేస్ టాయిలెట్ను శుభ్రం చేయడం కూడా ఒకటి. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి బ్రిటిష్ వ్యోమగామి హెలెన్ షార్మన్ Helen Sharman ఉపయోగించిన స్పేస్సూట్ను విప్పి పరిశీలించే అవకాశం కూడా ఆమెకు లభించింది. ఆ సూట్ను చూసిన క్షణం.. " ఏదో నిధి పెట్టెను తెరిచినంత ఆనందం కలిగింది" అని ఆ రోజులను క్లేర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.ఆ చిన్న అవకాశం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఫిజిక్స్లో డిగ్రీ, స్పేస్క్రాఫ్ట్ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేసిన క్లేర్ అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెట్టి, వరుసగా కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఎక్సోమార్స్ రోవర్ మిషన్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2028లో ప్రయోగించనున్న ఈ రోవర్ అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ చేపట్టనుంది. అలాగే భూమిపై సౌర గాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసే స్మైల్ (SMILE) మిషన్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.2019లో నెదర్లాండ్స్లోని ESA పరిశోధనా కేంద్రంలో చేరిన క్లేర్ ప్రస్తుతం..మార్స్పై భవిష్యత్ మానవ, రోబోటిక్ మిషన్ల ప్రణాళిక బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనలను సమన్వయం చేసే International Mars Exploration Working Groupకు ఛైర్గా కూడా ఉన్నారు.మార్స్ను అధ్యయనం చేయడం మానవాళి భవిష్యత్తుకు ఎంతో కీలకమని క్లేర్ చెబుతున్నారు. 2028లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రయోగం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆ తర్వాత మానవ యాత్రలకు అవసరమైన సాంకేతికత, ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో మార్స్ సహజ స్వరూపానికి ఎలాంటి నష్టం జరగకుండా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించడం కూడా తమ బాధ్యత అని స్పష్టం చేశారు.తన విజయానికి చిన్ననాటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, నేషనల్ స్పేస్ సెంటర్లో లభించిన తొలి అవకాశం ప్రధాన కారణాలని క్లేర్ చెబుతున్నారు. ఆ సంస్థకు అప్పటి డైరెక్టర్గా ఉన్న మహిళను చూసి తానూ ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకత్వ స్థాయికి చేరాలనే ఆత్మవిశ్వాసం కలిగిందని గుర్తు చేసుకున్నారు.స్పేస్ టాయిలెట్ను శుభ్రం చేసిన విద్యార్థిని నుంచి మార్స్ మిషన్లకు నాయకత్వం వహించే శాస్త్రవేత్తగా ఎదిగిన క్లేర్ పార్ఫిట్ ప్రయాణం... చిన్న అవకాశాన్ని కూడా అంకితభావంతో స్వీకరిస్తే అది జీవితాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో చెప్పే స్ఫూర్తిదాయక గాథగా నిలిచింది.(చదవండి: ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..) -
నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందే..
-
Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..
‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్ సేఫ్ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..సేఫ్ పీరియడ్ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్ యాప్ లేదా క్యాలెండర్ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్స్ట్రువల్ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకోవాలి.ప్యాడ్స్ పడేయడమూ సమస్యే!రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్ వస్తాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్ కప్స్ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్ సేఫ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.అవగాహన తప్పనిసరి..పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – డాక్టర్ మనోరమ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్సొంత నిర్ణయాలు వద్దు..చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా పాటించడం సురక్షితమైన మార్గం.– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్ -
బావిలో 21 గంటల నరకం.. చంపేయాలని తాడు కత్తిరించినా..
సాక్షి,కరీంనగర్: ఆన్లైన్ జూదం, బెట్టింగ్ల వలయంలో చిక్కుకుని అప్పులపాలైన ఒక 21 ఏళ్ల విద్యార్థి, డబ్బుల కోసం ఓ మహిళను నమ్మించి తీసుకెళ్లి, దోచుకుని, ఆపై చంపేందుకు బావిలోకి నెట్టేసిన షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. చావు అంచుల వరకు వెళ్లిన ఆ మహిళ సుమారు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడి, ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది.కేసు వివరాల్లోకి వెళ్తే...కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన తంగరాల లక్ష్మి (55) అనే దినసరి కూలీ జూలై 1న పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొదట సాధారణ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే, మరుసటి రోజు ఉదయం నుస్తులాపూర్ గ్రామ శివార్లలోని ఒక వ్యవసాయ బావిలో మహిళ పడి ఉన్నట్లు స్థానిక రైతులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను రక్షించారు.పోలీసుల విచారణలో బాధితురాలు లక్ష్మి అసలు నిజాన్ని బయటపెట్టింది. ఒక అపరిచిత వ్యక్తి తన పొలంలో పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడని ఆమె తెలిపింది. మొదట ర్యాపిడో బైక్ బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు, జనం ఎక్కువగా ఉండటంతో, నిర్మానుష్య ప్రాంతం కోసం ఆమెను తన సొంత బైక్పై నుస్తులాపూర్ శివార్లలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ లక్ష్మిని బెదిరించి ఆమె వద్ద ఉన్న 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి పట్టీలు, నగదును దోచుకున్నాడు.తాను దొరికిపోకూడదనే ఉద్దేశంతో, నిందితుడు లక్ష్మిని అక్కడే ఉన్న ఒక లోతైన వ్యవసాయ బావిలోకి నెట్టేశాడు. బావిలో పడ్డాక ఆమె లోపల ఉన్న ఒక తాటిని పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది. అది గమనించిన నిందితుడు, ఆమె ఎలాగైనా చంపాలనే క్రూరమైన ఆలోచనతో ఆ తాడును కూడా కత్తిరించాడు.అయితే లక్ష్మికి ఈత రావడం ఆమె ప్రాణాలను కాపాడింది. తాడు తెగినా ధైర్యం కోల్పోకుండా, మోటార్ పైప్లైన్కు ఉన్న కేబుల్ వైరును పట్టుకుని రాత్రంతా బావిలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం రైతులు ఆమె అరుపులు విని బయటకు తీసేవరకు, దాదాపు 21 గంటల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది.కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని ధమ్మ దినేష్ రెడ్డి (21) అనే విద్యార్థిగా గుర్తించారు. ర్యాపిడో బుకింగ్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుంది. విచారణలో అతను ఆన్లైన్ జూదం, బెట్టింగ్ యాప్లలో దాదాపు రూ. 4 లక్షలు నష్టపోయి అప్పులపాలయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు.అలాగే, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన ఒక జ్యువెలరీ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. -
తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు
-
సహజ యోగంతోనే సహజ సౌందర్యం..
సంప్రదాయ కళలు, సంప్రదాయ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు – ఇవి మన దేశంలో వేల కొద్దీ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించాలి. కానీ మనం పాశ్చాత్య దేశాలచే ఎంతగా ప్రభావితులమయ్యామంటే, మన సంస్కృతిని మర్చిపోయి, బయటి విషయాలను అనుసరిస్తున్నాము. దీని కారణంగా మనలో మనం ఆత్మ’ అని పిలిచే అతి ముఖ్యమైన విషయం అజ్ఞానంతో కప్పబడుతుంది. మన దేశంలో ఆత్మను అలంకరించే వేలకొద్దీ విషయాలు ఉన్నాయి, అవి ఆత్మను అణచివేయవు.మన కళ్ళు చాలా త్వరగా బాహ్యమైన విషయాలపై పడతాయి. కారణం మనం మనుషులం కాబట్టి, మన ధ్యాస బయట ఉంటుంది. కానీ మనల్ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు, మనం నవ్వుతూ మన లోపల ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆలోచిస్తాము! దానిని వదిలి మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆ స్థితిని సాధించలేదు, మనకు అది ఇంకా తెలియదు, అందుకే మనం అలా చేస్తున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమించుకోలేక పోతున్నాము, మన ఆత్మను పాడుచేసే వాటిని మనం ఇష్టపడతాము, ఆ విషయం మనం గ్రహించలేము. మన జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి.సహజ యోగ ధ్యాన సాధన ద్వారా మానవుల లోపల కుండలినీ శక్తి జాగృతి చెందినప్పుడు, వారు భగవంతుని ఆశీస్సుల వలన ఆత్మ స్వరూపులుగా మారుతారు. ఆత్మికమైన శుభ లక్షణాలను పొందుతారు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆత్మకు ఉండే సహజ శుభ లక్షణాలైన అమాయకత్వం, పవిత్రత, మాతృ ప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలిసిపోయే స్వభావం, క్షమా గుణం వంటివి మన నిత్య జీవితంలో ఆచరించడం వలన మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం.మీ లోపల ఉన్న ’ఆత్మ’ అనే వజ్రాన్ని బయటకు తీయండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. ఆ వజ్రం మెరుపు మీరే. మీ లోపల ఉన్న ఆ వజ్రం పైకి వచ్చినప్పుడు, ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఆ ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. స్త్రీలకు శాశ్వతమైన విలువను కలిగి ఉండే ఏదో ఒకటి ఉంది, దానిని వారు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప విషయం ఏమిటంటే స్త్రీ అందరినీ ప్రేమించగలదు, కానీ ఆమె స్వార్థపూరితంగా మారినప్పుడు, ఆమె ప్రేమలో అందం ఉండదు.పురుషులలో ఆజ్ఞాపించే స్ఫూర్తి వారి మాటల ద్వారా, వారి చైతన్యం ద్వారా, వారి వ్యక్తిగత విజయాల ద్వారా వస్తుంది; అయితే స్త్రీలకు ఈ లక్షణాలు వారి ప్రేమపూర్వక శక్తి ద్వారా, వారి సహనం ద్వారా, వారి దయగల ప్రవర్తన, క్షమ, కరుణ ద్వారా వస్తాయని గ్రహించి, వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి.విత్తనాలు స్వయంగా దేనినీ సృష్టించలేవు. పువ్వులు, పండ్లు, ఇతర వరాలను అందించేది భూమాత. అదేవిధంగా, బిడ్డను సృష్టించేది స్త్రీ, శిశువును పోషించేది, చివరికి రేపటి ΄ûరుడిని పెంచుతుంది. కాబట్టి మహిళలు మొత్తం మానవాళి నివసించే భవనంగా భూమి తల్లిని పరిగణించాలి. – డా.ప్రతాని రాకేశ్, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా) -
పాకిస్థాన్లో ఫ్రెంచ్ మహిళ 10 ఏళ్ల బందీఖానా.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్!
భావప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో, ఒక మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఏకంగా పదేళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా నలిగిపోయిన ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.2014లో పాకిస్థాన్కు వచ్చిన నాటి నుండి నేటి వరకు కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని ఒక మట్టి ఇటుకల గదిలో బందీగా మారిన ఒక ఫ్రెంచ్ మహిళను, ఆమె ఐదుగురు పిల్లలను పాకిస్థాన్ పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. లవ్ మ్యారేజ్, విదేశీ ప్రయాణం జీవితాన్ని మారుస్తుందని ఆశపడిన ఆ మహిళకు పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ఒక నరకకూపాన్ని ఎలా పరిచయం చేసిందో వివరిస్తూ సాగే ఒక సంచలన నిజాల కథనం ఇది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, 54 ఏళ్ల సిల్వీ యాస్మినా అనే ఫ్రెంచ్ మహిళ తన పాకిస్థానీ భర్త అహ్మద్ ఖాన్తో కలిసి పన్నెండేళ్ల క్రితం పాకిస్థాన్ అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లిన భర్త, నాటి నుండి ఆమె బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా కట్టడి చేశాడు. మానసికంగా, శారీరకంగా విపరీతమైన క్రూర స్వభావం కలిగిన అహ్మద్ ఖాన్, రోజువారీగా ఆమెను పశువుకంటే హీనంగా హింసించేవాడు.కేవలం గదికే పరిమితం చేయడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కినా చంపేస్తానని బెదిరిస్తూ పదేళ్లకు పైగా ఒక బందీలా ఉంచాడు. ఈ క్రమంలో పుట్టిన ఐదుగురు పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం చూడనివ్వకుండా, ఆ నలుగు గోడల మధ్యే బంధీలుగా ఉంచడం ఆ భర్త క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. అయితే, ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడటానికి ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు. ఒకరోజు భర్త కళ్ళు కప్పి, యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి తప్పించుకున్నాడు.ఎలాగోలా ప్రాణాలు చేతబట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆ బాలుడు, తన తల్లి పడుతున్న నరకయాతనను, తమ బందీఖానా గురించిన వివరాలను పోలీసులకు వివరించాడు. బాలుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన జిల్లా పోలీస్ చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిఘా నీడన ఉన్న ఆ మట్టి ఇటుకల ఇంటిపై మెరుపు దాడి చేసి, ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె ఐదుగురు పిల్లలను సురక్షితంగా రక్షించారు. క్రూర భర్త అహ్మద్ ఖాన్ను అక్కడికక్కడే అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.రక్షించబడిన అనంతరం పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలో సిల్వీ యాస్మినా ఇంగ్లీష్, ప్యాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ, తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 2014 నుండి తాను ఈ దేశంలో కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని, కళ్లెదుటే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోదించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బాధితుల స్వదేశీ పునరావాసం కోసం ఇస్లామాబాద్లోని ఫ్రెంచ్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది.పాకిస్థాన్లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ అంతర్జాతీయ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్థాన్లో ప్రతి ఏటా వందలాది మంది మహిళలు భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో అక్కడ ఏటా ఎంతో మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి పడితే, ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక చట్టాలకు కూడా ఒక పెద్ద మేల్కొలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్!
న్యూఢిల్లీ: వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జూన్ 29న దంకుని(పశ్చిమ బెంగాల్) జంక్షన్ వైపు రైలు వెళ్తున్న సమయంలో, రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన ఆ మహిళ వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వే శాఖ, ‘రైల్ మదద్’, ‘ఆర్పీఎఫ్’ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై రైల్వే రక్షణ దళం తక్షణమే స్పందించి, తదుపరి చర్యల కోసం కేసును హౌరా డివిజన్కు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆర్పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి చర్యను పలువురు తీవ్రంగా ఖండించగా, కొందరు నెటిజన్లు బాధితురాలి ప్రయాణ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు. అయితే దుస్తులు లేదా నిలబడే స్థలాన్ని బట్టి మహిళలపై వేధింపులను సమర్థించలేమని మరికొందరు ప్రయాణికులు, నెటిజన్లు అంటున్నారు. Today I was travel in Vivek Express when I Stand at coach door ,this guy behave badly and giving me sign of Sexual .He was Travelling in a 15228- SMVT Express in 2nd General coach from Engine and now he was reaching to Dankuni Jn.@RailMadad @RailMinIndia @RailwaySeva @RPF_INDIA pic.twitter.com/bMp4J61Czg— Rupali Dixit 🇮🇳 (@GhumakkadLaali) June 29, 2026 -
అర్ధరాత్రి ఆస్పత్రిలో మహిళ హల్చల్
హైదరాబాద్: అర్ధరాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎల్బీనగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్కు శనివారం అర్ధరాత్రి వనస్థలిపురం ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ కడపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచి్చంది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించారు. అయితే మహిళ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడింది. వెంటనే డయల్–100కు సమాచారం అందించగా పోలీసులు వచ్చారు. పోలీసులు అక్కడే ఉన్న సమయంలో కూడా సిబ్బందిపై దాడి చేసింది.అనంతరం తన కారును నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్కు వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఎల్బీ నగర్ - శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో అర్ధరాత్రి మహిళ హల్చల్కడుపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగoలో చేరిన లలిత కరీర అనే మహిళప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించి, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలిపిన డాక్టర్లు.. దీంతో వారిపై ఆగ్రహంతో దూషిస్తూ దాడిపోలీసులకు ఫిర్యాదు… pic.twitter.com/VRrXHvO6tf— Telugu Scribe (@TeluguScribe) June 28, 2026 -
కు.ని. పనీ.. స్త్రీలదే!
కుటుంబ నిర్వహణ భారమే కాదు.. కుటుంబ నియంత్రణ భారం కూడా మహిళలే మోయాల్సి వస్తోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5 శాతం మంది ఉండగా, వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5 శాతం మాత్రమే. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయి. మహిళలనే బాధితులుగా నిలుపుతున్నాయి.దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బాధ్యత భారం మాత్రం ఇంకా మహిళల పైనే సాగుతోంది. అందుకు సాక్ష్యమే ఈ నివేదికలు. మహిళలకు సంబంధించిన ట్యూబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదయినప్పటికీ, దేశంలో 36.5% మంది మహిళలు దీనిని చేయించుకుంటున్నారు. కానీ ఎంతో సులువైన, సురక్షితమైన వాసెక్టమీ చేయించుకునే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.శాస్త్రీయత లేని అపోహలు...కుటుంబ నియంత్రణ భారమంతా మహిళలపైనే పడటానికి పురుషుల్లో ఉన్న అవగాహనా లోపం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీని లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. వాసెక్టమీ అనేది కేవలం శుక్రకణాలను తీసుకెళ్లే నాళాలను మూసివేసే ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గానీ, వారి శృంగార సామర్థ్యానికి గానీ, శారీరక శ్రమ చేసే శక్తికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీనపడిపోతుందని భావించడం వల్ల, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.మహిళలకే పరిమితం...దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారాలు, ఆరోగ్య పథకాలు కూడా ఈ బాధ్యతను మహిళల పైనే నెట్టేలా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులు, తల్లుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవాల కోసం నిరంతరం ఆసుపత్రులను సందర్శిస్తుంటారు. ఆ సందర్భాల్లో వైద్యులకు, గర్భిణులకు మధ్య శాశ్వత కుటుంబ నియంత్రణపై జరిగే చర్చలు సైతం కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళల బాధ్యత అనే భావనను బలపరిచాయి.కమ్యూనికేషన్ గ్యాప్...గతంలో దేశంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తాలూకు చేదు జ్ఞాపకాలు, భయాలు ఇప్పటికీ పురుషుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇందుకు ఒక కారణం. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కుటుంబ నియంత్రణపై సరైన చర్చలు జరగడం లేదు. ఈ కమ్యూనికేషన్ లోపం కారణంగా, మహిళలు తమ భర్తలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలు, కాపర్–టి వంటి పద్ధతులను వాడుతున్నారు. గతంలో 15% గా ఉన్న ఈ రహస్య వినియోగం ఇప్పుడు 27% కి పెరగడం గమనార్హం.మార్పు దిశగా...కుటుంబ నియంత్రణ అనేది ఇద్దరు భాగస్వాములకు సమాన బాధ్యత అయినప్పటికీ, ఈ భారాన్ని మహిళలే మోయాల్సి రావడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. సమాజంలో ఉన్న ఈ భారీ లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని, పురుషుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైద్యులు కుటుంబ నియంత్రణపై దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలి. వాసెక్టమీ సురక్షితమైనదనే అవగాహన కల్పించాలి. ఇప్పటికే వాసెక్టమీ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న పురుషులను, పురుష ఆరోగ్య కార్యకర్తలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చి, ఇతరులలో ఉన్న సామాజిక భయాలను పోగొట్టాలి. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయమనే భావనని సమాజం నుంచి తొలగించినపుడు మార్పు సాధ్యమవుతుంది. -
మంత్రి లోకేష్కు షాకిచ్చిన మహిళలు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించిన మంత్రి నారా లోకేష్కు మహిళలు షాకిచ్చారు. అవనిగడ్డలో బెల్టు షాపుల బాగోతాన్ని లోకేష్ ముందే మహిళలు బయటపెట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకేష్ను మహిళలు నిలదీశారు. మద్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు.మీ గ్రామంలో మద్యం షాపు ఉందా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. అవనిగడ్డలోని వైన్ షాపు నుంచి తెచ్చి తమ గ్రామంలో మద్యం అమ్ముతున్నారని మహిళలు చెప్పారు. తమ గ్రామంలో బెల్టు షాపు లేకుండా చేయాలని మహిళలు కోరగా.. తాను చూసుకుంటానంటూ అక్కడ్నుంచి మంత్రి లోకేష్ జారుకున్నారు. -
ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రీటా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట ఆడవాళ్ల బట్టలపై చర్చను లేవనెత్తింది. భారతీయ మహిళలు బీచ్కు వెళ్లి, స్విమ్సూట్ లేదా బికినీలో వేలకొద్దీ ఫోటోలు తీసుకున్నా, వాటిని ఫోన్ మెమోరీలోదాచుకోవడం తప్ప, సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయరు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ ఎలా కామెంట్ చేస్తుంది? ఆ వీడియో లేదా ఫోటో చూసి మిమ్మల్ని అవమానకరమైన పేర్లతో పిలిస్తే? అని భయం వెంటాడుతుంది అంటూనే కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం అగ్గి రాజేసింది.తాను కూడా బికీనీలు వేసుకుని ఫోటోలు దిగినా, వాటిని ఇన్స్టాగ్రామ్లో పెట్టనని రీటా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే భారత్లో ఉన్న 24 ఏళ్ల జీవితం తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో,దుస్తుల విషయంలోఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిందన్నారు. కానీ భయపడుతూ, ఎన్నాళ్లుంటాం అని ప్రశ్నించింది. అందుకే తన మైండ్ సెట్ మార్చుకుని ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నా అన్నారు.‘‘ఒక భారతీయ మహిళగా ఇలాంటి వీడియోను పోస్ట్ చేస్తానని తానెపుడూ అనుకోలేదు. అలా అని నేనెపుడూ బికినీ వేసుకోలేదని కాదు. థాయ్లాండ్ , ఇండోనేషియాలో చాలాసార్లు బికినీ ధరించా. అక్కడ బీచ్లలో ఇది చాలా కామన్. అయితే పూర్తిగా దుస్తులు కప్పుకున్నప్పుడు కూడా, ఏదో ఒకటి విమర్శిస్తారు. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూనే ఉంటారు. సో.. జనం ఏదో అంటారనే రెండో ఆలోచన కూడా చేయకుండా తాను ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా’’ అని చెప్పింది. View this post on Instagram A post shared by Rita | Travel & Itineraries (@travelwith.rita) బికీనీలో ఫోటో పెడితే ఏమవుతుందని చాలా కాలం ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా అక్కడ తగ్గట్టు ఉండాలని గ్రహించాను. నేను ఫరీదాబాద్లో బికీనీ వేసుకోను కదా, బీచ్లోనే వేసుకుంటాను. అలాగే బీచ్కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకోలేము కదా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఇండియన్ అంకుల్స్ కేవలం షార్ట్స్ వేసుకుని, సరిగ్గా స్విమ్సూట్ కూడా లేకుండానే సముద్రాలు, పూల్స్లోకి దిగుతుంటారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో తాను బికీనీ వేసుకున్నప్పుడు అక్కడెవరూ తనను వింతగా చూడలేదని, ఎవరి పని వారు చూసుకుంటారని రీటా చెప్పారు. నిజానికి మన భయమంతా సమాజం గురించే. చిన్నప్పటి నుండి మనకు అలవాటు చేసిన ఆలోచనా విధానం వల్లే వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను మాట్లాడేది కేవలం బికీనీల గురించి కాదు, మన బాడీతో కంఫర్టబుల్గా ఉండటం, భయంతో మన ఫీలింగ్స్ను అనుభవాలను కోల్పోకపోవడం గురించి అని చెప్పారు.ఈ వీడియోపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను జడ్జ్ చేస్తూ, నానా మాటలు అన్నారు. ‘నీ బాడీ. నీ యిష్టం’ అని కొందరు మహిళలు ఆమెను సమర్ధించారు. థాయిలాండ్లో గుడ్లప్పగించి చూడకపోవడం వల్ల స్వేచ్ఛగా ఫీలవుతాం అంటూ చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలిపారు. ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుమహిళల దుస్తుల ఎంపికను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సంకుచిత స్వభావం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. మహిళలు ఏం వేసుకోవాలో నియంత్రించే కంటే,ఇలాంటి పురుషాధిక్య, వివక్షతోకూడిన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.రీటాను విమర్శించిన వారిలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. ఈమెకు దూరంగా ఉండండి అని కొందరంటే, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా కాపీ కొడుతూ, మళ్లీ దానికి సమర్థన ఒకటి అని మండిపడ్డారు. పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులకున్నట్టు కాదు మరికొరు విమర్శించారు. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం -
తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు
-
ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అందరికీ తెలిసిందే.అయితే స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో యోగా చేయకూడదనే అపోహతో ఆ రోజుల్లో యోగాకు దూరంగా ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన మార్గదర్శకత్వంతో యోగా చేయడం పీరియడ్స్ సమయంలో కూడా సురక్షితమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా...చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో యోగాకు దూరంగా ఉంటారు. అయితే పిరియడ్స్లో ఉన్నా, యోడసాధనను ఆపాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్ టైంలో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచే ఇన్వర్షన్ ఆసనాల విషయంలో మాత్రం ఎలాంటి అసౌకర్యం అనిపించినా వాటిని చేయకుండా ఉండటం ఉత్తమం.పీరియడ్స్ సమయంలో యోగా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలై మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు నిపుణులు.. పీరియడ్స్ సమయంలో యోగా చేస్తే రుతుచక్రం మారిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కూడా అపోహేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి రుతుచక్రం క్రమబద్ధంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. -
అనిత, నారా లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!
అఫ్గానిస్థాన్లో ఒంటరిగా పర్యటించిన ఒక భారతీయ మహిళ అనుభవం నెట్టింట వైరల్గా మారింది. అంకితా కుమార్ అనే మహిళ అఫ్గానిస్తాన్కు సోలో టూర్కి వెళ్లింది. అదీ తన తల్లిదండ్రులకు చెప్పకుండా. అయితే ఈ ప్రయాణంలో తనకు దినదిన గండమే అందుకే నేను క్షేమంగానే ఉన్నాను అని ప్రతీ రోజు చెప్పాల్సి వచ్చింది అంటూ ఇన్స్టాగ్రామ్లో తన పర్యటనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో ఇవి పలువుర్ని ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపచేస్తున్నాయి.“అమ్మా, నాన్నా, నేను బాగున్నాను.” అప్గానిస్తాన్లో ఉండగా నేను వందసార్లు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ప్రతిరోజూ ఒక సాహసయాత్రే. ఇది నాకంటే నా తల్లిదండ్రులకే స్పష్టంగా తెలుసు. కానీ నేను ఊహించని ఒక విషయాన్ని ఈ దేశం నాకు నేర్పింది’’ అంటూ అక్కడి వాస్తవాలను వివరించారు. రెండు పూర్తిగా భిన్నమైన సత్యాలు ఒకే సమయంలో ఉండగలవని , జీవన పోరాటంలో వాటిని స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదనే సత్యం తనకు తెలిసి వచ్చిందన్నారు. అద్భుతమైన అఫ్గానిస్తాన్ ఇప్పటివరకు తాను చూసిన అత్యంత అద్భుతమైన దేశాలలో ఇదొకటి. అబ్బురపరిచే పర్వతాలు, అంతులేని చాయ్ కప్పులు, అపరిచితుల ఉదారత, ప్రేమ ఇక్కడి నుండి వెళ్ళిపోయాక కూడా చాలా కాలం పాటు నిలిచిపోయే ఆప్యాయత ఉన్న ప్రదేశం.తుపాకీలు చేతబట్టుకుని వ్యక్తులతో సంభాషించడంతోపాటు, వివిధ రంగాల వ్యక్తులతో కలిసిపోవడం ఆమె టూర్ వీడియోలో చూడవచ్చు. ఇంకా అఫ్టాన్ మహిళలతో మాట్లాడారు. వారితో ఆమె ఫొటో దిగారు. అంతేకాదు దశాబ్దాల సంఘర్షణ భారాన్ని మోస్తున్న ఆ దేశంలో ప్రజల స్థితిగతులను తాను నిశితంగా గమనించానని తెలిపారు. అయితే అక్కడి భవనాల్లో ఈ సంఘర్షణ తాలుకూ ఆనవాళ్లను భవనాలలో చూడవచ్చు. ప్రజలు చెప్పుకునే గాథల్లో వినవచ్చు. ఉండాల్సిన దానికంటే చాలా వేగంగా వయసు పైబడినట్లు కనిపించే ముఖాలలో కూడా ఆ బాధను చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఇంతటి అణచివేతను తట్టుకుని ముందుకు సాగుతున్న వారి తెగువ, ధైర్యం ఎంతో నచ్చిందన్నారు. ఇదీ చదవండి: సీక్రెట్ పెళ్లి, ఫస్ట్ యానివర్శరీ ఇన్స్టా స్టోరీ : తీరా ఆరా తీస్తే ..!అక్కడి ప్రజల ఆప్యాయతకు ముగ్ధులవ్వవచ్చు. వారి ఆప్యాయత, ఆతిథ్యం, స్నేహశీలత వంటివి చూసి మురిసిపోవాల్సిందే. అన్నారు. ఇది ఎంత అందమైందో అంతే హృదయ విదారకమైనది. ఎంత ఆశాజనకమైందో, అంత భారమైంది. అంత సంక్లిష్టమైంది కూడా. ఇన్ని వైరుధ్యాలన్నింటి మధ్య ఈ సోలో యాత్ర తనకు జీవితకాలపు సాహసయాత్రగా మారింది. అమ్మా, నాన్నా, నేను నిజంగా బాగానే ఉన్నాను అంటూ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!ఇక్కడ మహిళగా పుట్టడం కంటే చావడమే మేలుఅదే సందర్బంలో చాలామంది,ముఖ్యంగా మహిళల ముఖాల్లో ఎవ్వరూ ఊహించని దైన్యాన్ని, బాధల్ని కూడా మనం గ్రహించ వచ్చన్నారు. ఆఫ్ఘన్ మహిళలతో సంభాషిస్తున్న వీడియోను పంచుకుంటూ, అప్ఘానిస్తాన్లో ఒక మహిళగా పుట్టడం కన్నా చనిపోవడమే మేలు అని చాలా మంది అనడం విన్నాను. ఇక్కడి మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవాల గురించి మరింత తెలుసుకున్న తర్వాత, ఆ భావన ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైంది. బాలికలను ఆరవ తరగతికి మించి చదువుకోనివ్వరు. చాలా మంది మహిళలు ఒకప్పుడున్న ఉద్యోగాలు, ప్రజా జీవితం, అవకాశాల ఏమీ లేవు. మరోవైపు కుటుంబాల్లోని పేదరికంతో బాల్య వివాహాలు పెరిగాయి. గృహహింస చట్టాలు బలహీనంగా మారిపోయాయి. మనలో చాలామంది తేలికగా తీసుకునే రోజువారీ నిర్ణయాలు, వారికి చాలా గగనం. అయినా వారి తెగువ , ధైర్యం బతుకు పోరాటం తనను కదిలించిందన్నారు. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) ఆ దేశంలో అణచివేత నుంచే ఎదుగుతున్నమహిళల గురించి, ఆమె కఠినమైన నియమ నిబంధనల మధ్య మహిళల ప్రస్తుత పరిస్థితి గురించి ఇలా మాట్లాడారు. “ఇది అరుదుగా వార్తల్లోకి నిలిచేది. ఎందుకంటే ప్రజా నిరసనను బెదిరింపులు, నిర్బంధం లేదా హింసతో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ప్రతిఘటన నిశ్శబ్దంగా మారుతుంది. కానీ అదే విద్యను నిరాకరించినప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలనే నిర్ణయంగా మారుతుంది. మీ ప్రపంచం కుంచించుకుపోతున్నప్పుడు కూడా సృష్టిస్తూనే ఉండాలనే పట్టుదలగా మారుతుంది. మిమ్మల్ని మీరు చిన్నవారిగా చేసుకోమని నిరంతరం చెబుతున్నప్పుడు కూడా కలలు ఆగిపోకూడదనే నిర్ణయంగా మారుతుంది.23 ఏళ్ల ఫాతిమా గురించి చెబుతూ తెలివైన, ఆత్మపరిజ్ఞానం ఉన్న మహిళా గైడ్. @khatinzar.gallery కళను సృష్టిస్తూ, మహిళలకు మద్దతుగా ఒక అందమైన గ్యాలరీని నడుపుతున్నారు. 21 ఏళ్ల మహిళ నడుపుతున్న @vision__university, 12వేల మంది యువతులను విశ్వవిద్యాలయ స్థాయి వరకు చదివించి, వారు 6వ తరగతికి మించి చదువుకునేలా చేసే ఒక ఆన్లైన్ విశ్వవిద్యాలయం. ఈ మహిళలు తమకు సాధ్యమైన చోటల్లా గౌరవంకోసం తమ ఆనందంకోసం మార్గాలను కనుగొంటున్నారు. వారి పోరాటాన్ని ఆదర్శీకరించాలను కోవడం లేదు. కానీ ఇలాంటి సంక్షోభ పరిస్థితులుఎవరికీ ఎదురు కాకూడదని భావిస్తున్నా. నిరంతరం ముందుకు సాగడమే లక్ష్యంగా ఉండే మహిళల పట్ల అపారమైన గౌరవంతో అప్ఘానిస్తాన్ నుండి తిరిగి వచ్చాను అని చెప్పారు. ప్రతి ఒక్క రోజు. కొన్నిసార్లు ధైర్యం అంటే గుంపు ముందు నిలబడటం కాదు. కొన్నిసార్లు ధైర్యం అంటే కేవలం కనుమరుగవడానికి నిరాకరించడమే అంటూ చాలా భావోద్వేగంతో అక్కడి పరిస్థితులను, మరెన్నో విశేషాలను కళ్లకు గట్టారు.దురంధర్ నటుడు ముస్తఫా అహ్మద్ కూడా ఆ వీడియోలపై స్పందిస్తూ, అక్కడి పరిస్థితులను ఇంత అందంగా, ఎంతో ధైర్యంగా, స్ఫూర్తిదాయకంగా బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) -
సంస్కార హీనంగా మాట్లాడితే ఖండించా.. గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా ఈ రోజు (మంగళవారం) ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ మహిళా లోకం గురించి మాట్లాడలేదని ఇతరులు సంస్కార హీనంగా మాట్లాడిన వ్యాఖ్యలనే ఖండించానని తెలిపారు. -
నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నిర్మించిన ప్రతిష్టాత్మక ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ సోమవారం (జెవార్ ఎయిర్పోర్ట్) చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు తమ జీవితంలోనే మొదటిసారి విమానమెక్కి గగన విహారం చేశారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తొలి విమానంలో లక్నోకు ప్రయాణమైన మహిళల ముఖాల్లో ఆనందం కినిపించింది.భావోద్వేగంలో మహిళా రైతులు‘మేము విమానం ఎక్కుతామని ఎప్పుడూ అస్సలు ఊహించలేదు’ అంటూ మిథిలేష్, బబ్లీ, పింకీ అనే మహిళా రైతులు అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాల్లోకి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి విమానం స్థానిక రైతులను తీసుకుని లక్నో వెళ్లగా, మొదటి అధికారిక వాణిజ్య విమానం బెంగళూరుకు సర్వీస్ ప్రారంభించింది. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సాధనంగానే కాకుండా, తమ సొంత భూముల్లో నిర్మితమైన గగన తలాన్ని తామే స్వయంగా చూసేలా చేసి,పలువురు అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపింది.1.2 కోట్ల మంది ప్రయాణ సామర్థ్యంయమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్రస్తుతం పూర్తయిన మొదటి దశలో ఒక రన్వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను నిర్మించారు. ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో సిద్ధమైన ఈ విమానాశ్రయానికి ఈ ఏడాది మార్చిలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం చేరువయ్యింది.లక్ష మందికి ఉపాధి అవకాశాలుమొత్తం నాలుగు దశల్లో, సుమారు 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనున్నారు. భవిష్యత్తులో 5 రన్వేలతో ఏటా 22.5 కోట్ల మంది ప్రయాణించేలా దీని తుది బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, హాస్పిటాలిటీ, పారిశ్రామిక రంగాలలో సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భారీగా పెట్టుబడులు తరలివస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ఒక్క రీల్కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా! -
చంద్రబాబుపై కొత్త పాట
-
కేరళ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
తిరువనంతపురం: ఎన్నికల వాగ్దానం ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రియదర్శిని పథకం అమలవుతుందని తెలిపింది. ఈ పథకం కింద కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఆర్డీనరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వివరించింది.ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఆర్డినరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రియదర్శిని పథకం కింద ఉచిత ప్రయాణానికి ఎంపిక చేసిన బస్సులపై ప్రత్యేకంగా స్టిక్కర్లను అంటిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలుతో అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. -
మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు నేతలు ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది. -
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. -
తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్ కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్లోని కొందరు మసీదు ఇమామ్లు నిన్న ప్రజలను హెచ్చరించారు.తాలిబాన్లు నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు. తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.🇦🇫 Taliban opens fire on civilians protesting morality police in Herat, Afghanistan, residents hit streets demanding end to burqa and chador rules @visegrad24 pic.twitter.com/34ik8JLDAq— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) June 9, 2026 జిబ్రిల్కు అదనపు బలగాల తరలింపుజిబ్రిల్లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్ మీడియా ద్వారా ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.మానవ హక్కుల సంఘాల స్పందనదీనిపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కాల్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,హెరాత్లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్ఫర్ స్పాంటా ఎక్స్లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.Today, Afghan human rights defenders protested outside the UN office in Tehran in solidarity with the women of Herat and across Afghanistan. They called on the UN and the international community to end their silence and take action for Afghan women’s rights.#HeratAfghanProtest pic.twitter.com/DJcjvDNBUi— Jahanzib Wesa (@jahanzibwesa) June 11, 2026 -
‘కోటి’ సంపద సృష్టి
సాక్షి, హైదరాబాద్: మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలుగా ఎదిగేవిధంగా సముచితమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. వారిని రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకెళ్లే ఆర్థిక విప్లవానికి ఈ బస్సులు చిహ్నలుగా నిలుస్తాయని అన్నారు. ఆర్టీసీకి లీజుకు.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర రాష్ట్రంలో ఒకేరకమైన పంటలు పండించే విధానానికి స్వస్తి పలకాలని, అన్ని రకాల పంటలను పండించేవిధంగా పంట మార్పిడి విధానంపై మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, ఇతర ఆస్తులపై మహిళలకు యాజమాన్యం కల్పింస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు.మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, గణేష్, మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్షి్మ, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు
శబరిమల మందిరంలోకి 10–50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలను అను మతించే విషయంలో ఇంతక్రితం తీర్పును సుప్రీం కోర్టు పునః సమీక్షించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సుప్రీం కోర్టు స్త్రీలందరూ శబరిమల మందిరంలోకి వెళ్లవచ్చని 2018లో తీర్పు చెప్పింది. శబరిమల ఆలయ పూజారితో సహా పలువురు దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్ విచారణ సందర్భంగా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్విని యోగం చేస్తున్నారనీ, ఇప్పుడు సాంకేతికత పెరిగి న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల లక్ష్యం నెరవేరిందనీ, ఇక ఈ వ్యాజ్యాలకు స్వస్తి పలకా లని భారత సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు కూడా ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ వారు ఇలాంటి వ్యాజ్యాన్ని వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది. నిజానికి ఎవరైనా కోర్టులో వ్యాజ్యం వేయాలంటే తనే బాధి తుడు అయ్యుండాలి. అతని తరఫున మరెవరూ వ్యాజ్యం వేయ రాదు. దీన్నే ‘లోకస్ స్టాండయి’ అంటారు. ఏదైనా వ్యాజ్యం విచారించేముందు, ఆ వ్యాజ్యంలో పిటిషనర్ ఏ విధంగా బాధితుడో కోర్టులు తప్పనిసరిగా పరిశీలిస్తాయి. ఒకవేళ పిటిషనర్కు ఆ వ్యాజ్యంతో వ్యక్తిగ తంగా సంబంధం లేకపోతే కోర్టులు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేస్తాయి. ఆమెతో మొదలు...అయితే కపిలా హింగోరాని అనే మహిళా న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ఆద్యురాలిగా నిలిచారు. 1979లో మొదటి సారిగా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి, ఎన్నో ఏళ్లుగా దయనీయమైన స్థితిలో జైళ్ళలో మగ్గుతున్న స్త్రీ, బాల, వృద్ధు లతో సహా వేల సంఖ్యలో ‘అండర్ ట్రైయల్ ఖైదీల’ను విడుదల చేయించారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్, జస్టిస్ పి.ఎన్. భగవతి చొరవతో ‘లోకస్ స్టాండయి’ నియ మాన్ని పక్కన పెట్టి న్యాయం వైపు నిలబడ్డారు. తరువాత మరెన్నో కేసుల్లో పిల్ను జస్టిస్ భగవతి అనుమతించారు. ఒక వ్యక్తికిగానీ, ఒక సమూహానికిగానీ హక్కుల భంగం జరిగి... పేదరికం చేతగానీ, సాంఘికంగా వెనుకబాటుతనం వల్లగానీ న్యాయ స్థానాలను ఆశ్ర యించలేనివారి హక్కులను కాపాడేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏ నాగరీకుడైనా ముందుకు రావచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటినుంచి ఎంతోమంది ప్రజాహితం కోరి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి చట్టాల్లో మార్పు కోసం శ్రమించారు. ప్రభుత్వ అధికారుల కార్ల మీద ఉపయోగించే ఎర్ర బుగ్గ కేసు నుంచి, పబ్లిక్ స్థలాల్లో మైకుల ఉపయోగం, సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించడం, దీపావళి టపాకాయల నియంత్రణ, పర్యావరణం, వాహనాలకు తప్పనిసరి సీట్ బెల్ట్, బ్లడ్ బాంకులు, వీధి కుక్కల బెడద, పని చేసే ప్రదేశాలల్లో లైంగిక హింస, రహదారి ప్రమాదాలు వంటి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్స్ లేకుంటే ఎన్నో విస్తృత ప్రజా ప్రయోజనాలు చేకూరేవి కాదు.అయితే, కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కీర్తి కాంక్షతో వీటిని దాఖలు చేస్తున్నారు. వీటిని ‘పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు’గా కాక ‘ప్రైవేట్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు’గా సుప్రీం కోర్టు అభివర్ణించింది. విచారాణార్హం కాని వ్యాజ్యాలను, సుప్రీం కోర్టు, హైకోర్టులు భారీ జరిమానాలు విధించి తిరస్కరిస్తున్నాయి. కోర్టుల విలువైన సమయం వీటి వలన వృథా అవుతున్నదన్న మాట నిజమే అయినా... కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ‘పిల్’ను ఉపసంహరించరాదు. – కె.ఎస్.హరీశ్ కుమార్ ‘ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
పాతికేళ్లకే పీడిస్తోంది!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో రొమ్ము కేన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్న అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ సగటు ప్రతి లక్ష మందిలో 26.6 మందిగా ఉండగా, హైదరాబాద్లో ఏకంగా 54 మందికి చేరింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారినే ఈ మహమ్మారి లక్ష్యంగా చేసుకునేది.మారుతున్న కాలంతో పాటే జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాల ప్రభావంతో పాతికేళ్ల యువతులనూ రొమ్ము కేన్సర్ కబళిస్తోంది. 2020 నుంచి ఏటా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్యలో 15 శాతం వృద్ధి కనిపిస్తోందని ఎంఎన్జే ఆసుపత్రి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 60 శాతం మంది రోగులు అవగాహనా లోపంతో 3, 4వ స్టేజిల్లో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.ఎంఎన్జే ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య ఏటా సుమారు 15 శాతం పెరుగుతోంది. 2020లో కొత్తగా నమోదైన రొమ్ము కేన్సర్ కేసులు 677 ఉండగా, 2025 నాటికి 2500కు చేరింది. ఇది మహిళాలోకాన్ని కలవరానికి గురిచేస్తోంది. మొత్తం కేన్సర్ కాటేస్తున్న బాధితుల్లో 40 ఏళ్ల వయసులోపు ఉన్నవారే 25 శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. నగరానికి చెందిన 22 ఏళ్ల నర్సింగ్ విద్యార్థికి రొమ్ము సాధారణానికి భిన్నంగా ఉండటంతో ఇటీవల ఎంఎన్జే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. రొమ్ము కేన్సర్ సోకిందని నిర్ధారించుకుని, చికిత్సలకు సిద్ధమైంది. వైద్యుల శస్త్ర చికిత్సల అనంతరం ఆమె కోలుకుంటోంది.రంగారెడ్డి జిల్లాకు చెందిన 34 ఏళ్ల గృహిణి రొమ్ము కేన్సర్తో ఎంఎన్జే ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సుమారు 9 నెలల చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. వీరిద్దరే కాదు రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న వారిలో సుమారు 25 శాతం మంది 40 ఏళ్ల వయసు లోపే ఉంటున్నారని ఎంఎన్జే వైద్యులు చెబుతున్నారు. కారణాలనేకం.. గడిచిన ఐదేళ్లలో రొమ్ముకేన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పాతికేళ్లకే రొమ్ము కేన్సర్ అంటే ఆశ్చర్యమేస్తోంది. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు, ప్రాసెస్ చేసిన, జంక్ ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ఆలస్యంగా వివాహాలు, 30 ఏళ్లు దాటేంత వరకు సంతానం లేకపోవడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువ సమయం కూర్చుని ఉండటం, శారీక శ్రమ లేకపోవడం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు రొమ్ము కేన్సర్ను ప్రేరేపిస్తున్నాయి.– మాటూరి రమేష్, సర్జికల్ అంకాలజీ హెచ్ఓడీ, ఎంఎన్జే ఆసుపత్రి -
ప్రేమ పేరుతో బావ మోసం... రోడ్డెక్కిన మరదలు
-
రెండు వేల మంది మహిళల కడుపు కోత కచ్చితంగా అనుభవిస్తావ్.. ఉండి ప్రజలు
-
హీరోయిన్ కల.. సైబర్ క్రైమ్ కథ
సాక్షి, విశాఖపట్నం: మనలో ఉన్న ఆశ, అత్యాశ, బలహీనతలే సైబర్ నేరగాళ్లకు అసలు పెట్టుబడిగా మారుతున్నాయి. ఒకప్పుడు భయపెట్టి దోచుకున్న సైబర్ క్రిమినల్స్.. ఇప్పుడు అత్యాశను అడ్డం పెట్టుకొని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ డాక్టర్ భార్యకు సంబంధించిన సైబర్ నేర వ్యవహారం కూడా ఇదే తరహాలో జరిగింది. ఆమెకు టీవీ సీరియల్స్ అంటే పిచ్చి, నటన అంటే ప్రాణం. ఇంకేముంది.. ఈ విషయం తెలుసుకున్న ఓ సైబర్ నేరగాడు, టీవీ సీరియల్స్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి, ఆమె నుంచి రూ. 60 లక్షలకు పైగా గుంజుకున్నాడు. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించి బాధితులనే పక్కదారి పట్టించాలనుకున్న కంచరపాలెం పోలీసులు.. చివరికి అసలు విషయం తెలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా తరహాలో ఈ సైబర్ కథా చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ట్విస్టుల మీద ట్విస్టులతో నడిచింది.బుల్లితెర నటిని చేస్తానంటూ వలతెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ భార్యకు సోషల్ మీడియా వేదికగా విశాఖలోని మధురవాడ వాంబే కాలనీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ అనే నేరగాడు పరిచయమయ్యాడు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకున్న వరప్రసాద్.. సీరియల్ నటికి ఉండాల్సిన అర్హతలన్నీ ఆమెకు ఉన్నాయంటూ పొగడటం ప్రారంభించాడు. తనకు తెలిసిన డైరెక్టర్ల సాయంతో టీవీ సీరియల్స్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఒక ప్రముఖ చానల్లో త్వరలో ప్రారంభంకానున్న ఓ సీరియల్లో మంచి పాత్ర ఇప్పిస్తానని నమ్మించాడు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు, సదరు సంస్థకు డబ్బులు ముట్టజెబితే నటించే అవకాశం వెంటనే వచ్చేస్తుందంటూ ఆశపెట్టాడు. నటనపై ఉన్న పిచ్చితో ఆమె విడతల వారీగా దాదాపు రూ. 60 లక్షల వరకూ చెల్లించింది. డాక్టర్ భార్యను పూర్తిగా నమ్మించి, ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకున్న నేరగాడు లక్ష్మీ వరప్రసాద్.. ఆ ఖాతాలోని భారీ మొత్తాన్ని తన విలాసాలకు వాడుకున్నాడు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మురళీనగర్లోని ఒక కార్ల షోరూమ్ నుంచి రూ. 22 లక్షలకు పైగా విలువైన లగ్జరీ కారును కూడా కొనేశాడు. దీని కోసం డాక్టర్ భార్యకు చెందిన క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 22,43,083 లను నేరుగా ఆ కార్ల షోరూం బ్యాంకు అకౌంట్కు మళ్లించేశాడు.మోసం గ్రహించి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలులక్షలు గుంజుతున్నా సీరియల్ అవకాశం విషయంలో మాట మారుస్తుండటంతో, తాను మోసపోయానని సదరు డాక్టర్ భార్య ఆలస్యంగా గ్రహించింది. వెంటనే ఆమె తెలంగాణలోని మణుగూరు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన తెలంగాణ పోలీసులు నేరానికి వాడిన సొమ్ము జమయిన విశాఖలోని కార్ల షోరూం బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన కార్ల షోరూం యజమాని విశాఖలోని కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్ల షోరూం ప్రతినిధులు ఫిర్యాదు చేసిన వెంటనే విశాఖ పోలీసులు కేసు నమోదు చేయకుండానే, హుటాహుటిన ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని విశాఖ నుంచి నేరుగా తెలంగాణలోని డాక్టర్ నివాసానికి పంపించారు. కారు షోరూంకు తక్షణమే డబ్బులు చెల్లించాలంటూ డాక్టర్ దంపతులను ఆ అధికారి బెదిరించినట్లు సమాచారం. తాము అసలైన బాధితులమని నెత్తీనోరు బాదుకుంటున్నా కనీసం పట్టించుకోలేదని వైద్య దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంచరపాలెం పోలీసులు బెదిరింపులకు దిగడంతో డాక్టర్ దంపతులు గట్టిగా ఎదురుతిరిగారు. తాము నిందితులం కాదని, బాధితులమని, ఇప్పటికే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారే దర్యాప్తులో భాగంగా ఈ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని గట్టిగా వాదించారు. తమ వద్ద ఉన్న కేసు వివరాలను, ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లను వైజాగ్ పోలీసులకు చూపించారు. అక్కడ అప్పటికే కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని గ్రహించిన వైజాగ్ పోలీసులు ఇక చేసేదేమీ లేక తెలంగాణ నుంచి వెనుదిరిగారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తు స్పీడుకు, డాక్టర్ దంపతుల రివర్స్ ఎటాక్కు షాకైన కంచరపాలెం పోలీసులు వైజాగ్ చేరుకున్నాక అధికారికంగా కేసు నమోదు చేశారు. కార్ల షోరూం యజమాని ద్వారా లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బక్రీద్ సందడి.. పొట్టేళ్లతో యువతుల సెల్ఫీ
బక్రీద్ నేపథ్యంలో పాతబస్తీలో బుధవారం పొట్టేళ్లకు మేత తినిపిస్తూ యువతుల సెల్ఫీ.. -
పారాచూట్ ని ఢీ కొట్టిన విమానం.. ఇంతలోనే మహిళ ఏం చేసిందో చూడండి..!
-
22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్!
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనను చర్చను రేకెత్తిస్తోంది. 22 ఏళ్ల ఒక యువతి ప్రస్తుతం తన 6వ బిడ్డకు జన్మనివ్వబోతుండటమే ఇందుకు కారణం. ఆ డాక్టర్ తెలిపిన వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.రాజస్థాన్కు చెందిన ఈ దంపతులకు 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. అయినప్పటికీ, మరొక మగపిల్లాడు కావాలనే ఆశతో వారు మళ్లీ గర్భం దాల్చారు. స్పందన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రగ్యా తోమర్ పేషెంట్ , ఆమె భర్త అనుమతితోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ మహిళ డాక్టర్తో ఇలా అంది. "నాకు వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు.. మాకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు ఇంకొక అబ్బాయి కావాలి" అని చెప్పింది. ఆమె భర్త స్పందిస్తూ.. కుటుంబాన్ని పోషించడానికి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకే ఒక కొడుకు సరిపోడంటూ వ్యాఖ్యానించాడు. View this post on Instagram A post shared by Dr Pragya Tomar (@dr.pragyawellness)ఇప్పటికే ఆ మహిళ అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఇంత చిన్న వయసులోనే వరుసగా గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్రమైన ప్రాణాపాయాల గురించి డాక్టర్ ఆ దంపతులను హెచ్చరించారు. కాన్పుకు, కాన్పుకు మధ్య కనీస సమయం లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకదు. దీనివల్ల తీవ్రమైన రక్తహీనత (Anemia), పోషకాహార లోపం, శారీరక క్షీణత ఏర్పడతాయని వైద్యురాలు వివరించారు. ఇన్నిసార్లు గర్భం దాల్చం, ప్రసవాలతోనే ప్రాణం మీదికి తెచ్చుకున్నారని, ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో వైరల్ కావడంతో, సమాజంలో మహిళలపై ఉన్న ఒత్తిడిని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన "మగపిల్లాడిపై వ్యామోహం" లింగ వివక్షకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు."ఆమె ఒక వయస్కురాలిగా మారకముందే.. తల్లిగా మారిపోయింది" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు, "ఆ భర్త పరిస్థితి చూడండి. కనీసం కుటుంబానికి సరైన తిండి, బట్టలు, వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉండి కూడా.. వంశాన్ని ఉద్ధరించడానికి ఇంకో కొడుకు కావాలంటున్నాడు, ఎందుకు?" అని ప్రశ్నించారు. గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేకపోవడం, బాల్యవివాహాలు, ఫ్యామిలీ ప్లానింగ్ లోపించడం, కొడుకులు-కూతుళ్ల మధ్య చూపిస్తున్న వివక్షపై ప్రజలు గళమెత్తారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ -
ఈ బీచ్ మహిళలకు మాత్రమే!
దుబాయ్ మునిసిపాలిటీ ఇటీవల మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన బీచ్ను ప్రారంభించింది. ‘ఖోర్ అల్ మమ్జర్’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బీచ్లో స్థానిక మహిళలతో పాటు మహిళా పర్యాటకులు కాలక్షేపం చేయడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. దుబాయ్–2040 అర్బన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ బీచ్ను 27.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం విశేషం.ఇక్కడ మహిళలు రాత్రివేళ కూడా నిరాటంకంగా ఈతకొట్టడానికి, వినోద కాలక్షేపాలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈతకొట్టే మహిళల భద్రత కోసం లైఫ్గార్డులను కూడా ఏర్పాటు చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనిని ప్రారంభించారు. ఈ బీచ్లో ఫ్లోటింగ్ వాక్వే, జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ నిర్మాణం కోసం దుబాయ్ ప్రభుత్వం 500 మిలియన్ దీనార్లు ఖర్చు చేసింది.ఎడారిలో లైట్హౌస్లైట్హౌస్లు సాధారణంగా సముద్ర తీరాల్లో ఉంటాయి. రాత్రివేళల్లో నావికులకు దారి చూపడానికి ఇవి పనికొస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో లైట్హౌస్లు కనిపించవు. కనుచూపు మేరలో సముద్ర తీరంలేని ఎడారి నడిబొడ్డున లైట్హౌస్ ఉండటం విడ్డూరమే! ఈ ఇరవై అంతస్తుల లైట్హౌస్ రష్యాలోని అస్త్రాఖాన్ ప్రాంతంలోని ఎడారిలో ఉంది. ‘పెత్రోవ్స్కీ లైట్హౌస్’ పేరిట దీనిని 1741లో నిర్మించారు. తొలుత దీనిని కలపతో నిర్మించారు. గాలి దుమారానికి కూలిపోవడంతో తిరిగి 1876లో దీనిని ఇటుకలతో నిర్మించారు. ఈ లైట్హౌస్ తొలుత నిర్మించే నాటికి కాస్పియన్ సముద్రం దీనికి చేరువలోనే ఉండేది. తర్వాతి కాలంలో కాస్పియన్ సముద్రం వెనక్కు మళ్లడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. -
మహిళా సాధికారతకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది.మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.కాగా, ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. (చదవండి: కేన్స్ రెడ్కార్పెట్పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..! ఏకంగా 300 గంటలు..) -
ప్రేమించి పెళ్లి చేసుకుని రోడ్డుపై వదిలేసిన భర్త..
-
ఆ బస్సుల్లో మాత్రమే లేడీస్కు ఫ్రీ జర్నీ
తిరువనంతపురం: కేరళలోని మహిళా ప్రయాణికులకు యూడీఎఫ్ ప్రభుత్వం సరికొత్త కానుకను అందించబోతోంది. @ఇందిరా గ్యారెంటీ* పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆదాయ పరిమితులు కానీ, ప్రత్యేక కార్డులు కానీ లేకుండానే మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) పరిధిలోని అన్ని బస్సులకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన సర్వీసులలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.పరిమితులు లేవు.. కార్డులు అవసరం లేదురాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ (ఆర్డినరీ) కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఈ ఉచిత పథకం వర్తిస్తుంది. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు లేదా పాస్లను ప్రవేశపెట్టగా, కేరళలో ఎలాంటి ప్రత్యేక కార్డులు లేకుండానే ఉచిత ప్రయాణాన్ని అనుమతించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలువుతున్న నమూనానే కేరళ కూడా అనుసరిస్తోంది. అయితే, ఫాస్ట్ ప్యాసింజర్, సూపర్-క్లాస్ వంటి లగ్జరీ బస్సులలో ఈ సదుపాయం ఉండదు.ఏయే బస్సులకు వర్తిస్తుందంటే?ప్రస్తుతం కేరళలో సుమారు 4,700 కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, అందులో దాదాపు 3,000 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ 3,000 సాధారణ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందులో ఉండే సుమారు 300 సిటీ ఫాస్ట్ బస్సులు, 1,400 సూపర్-క్లాస్ బస్సులు, మరో 300 ఫాస్ట్ ప్యాసింజర్ సర్వీసులకు ఈ పథకం నుండి మినహాయింపు ఇచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా హై-కేటగిరీ డీజిల్ బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం ఆర్థికంగా సాధ్యం కాదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఆర్టీసీపై భారీగా ఆర్థిక భారంఈ సరికొత్త ఉచిత ప్రయాణ పథకం వల్ల కేరళ ఆర్టీసీపై నెలకు సుమారు రూ.90 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు, పెన్షన్ల కోసం రూ.80 కోట్లు అందిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల మరో రూ.3 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ ఉచిత పథకం కూడా తోడైతే, ప్రభుత్వ ముందస్తు సహాయం నెలకు దాదాపు రూ.220 కోట్లకు పెరగనుంది. అయినప్పటికీ, మహిళలతో పాటు వచ్చే పురుషుల వల్ల టికెట్ ఆదాయం కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా? -
మా అక్కను ఇలా చూస్తా అనుకోలేదు.. పొడిచి పొడిచి చంపారు.. చెల్లి ఆవేదన
-
యువతులపై ఆగని ఆగడాలు.. అలా చేస్తే పెళ్లికి అంగీకారమే
కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు. మహిళలపై కఠిన చట్టాలు కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.పార్కులు, జిమ్లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు -
బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు!
నూహ్: నీరే ప్రాణాధారం... కానీ ఆ గుక్కెడు నీటి కోసమే ఓ గ్రామం ప్రతిరోజూ ప్రాణసంకటాన్ని ఎదుర్కొంటోంది. ‘హర్ ఘర్ జల్’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లా మలాబ్ గ్రామంలో సూర్యోదయంతోనే మహిళల నీటి కష్టాలు మొదలవుతాయి. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలయినా,పురుషులైనా, చివరికి నిండు గర్భిణులైనా ఆ నీటి కుండల బరువు మోయక తప్పని దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.కాగితాలపైనే పథకాలు... కన్నీళ్లలో మహిళలుజల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, మలాబ్ గ్రామంలో మాత్రం పైపుల ద్వారా చుక్క నీరు రావడం లేదు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో, దాదాపు 12,200 మంది గ్రామస్తులు తాగే నీటి కోసం ‘కుండ్’ అనే భూగర్భ ట్యాంకులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. 82 ఏళ్ల వృద్ధురాలు షకీలా తన జీవితమంతా తలపై నీళ్ల బిందెలు మోస్తూనే గడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారి నిరీక్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.నిండు గర్భిణులకూ తప్పని..నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఏడు నెలల గర్భిణీ అయిన 26 ఏళ్ల అర్షీ సైతం ప్రతిరోజూ బరువైన నీటి బకెట్లు మోస్తోంది. బరువులు ఎత్తకూడదని వైద్యులు హెచ్చరించినా, ఆమెకు వేరే దారి లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు పలుమార్లు ఈ భూగర్భ ట్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా స్థానిక మహిళలు నిరంతర వెన్నునొప్పి, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.చదువును మింగేస్తున్న నీటి కటకటనీటి కోసం సాగే ఈ జీవన్మరణ పోరాటం బాలికల భవిష్యత్తును సైతం ఛిద్రం చేస్తోంది. ఇంటి పనుల్లో, ముఖ్యంగా నీళ్లు మోయడంలో సహాయపడేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పైగా పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో నెలసరి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరుబయట ఉండే భూగర్భ ట్యాంకుల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టుల పేరిట కేవలం హామీలకే పరిమితమవుతున్నారు.ఇది కూడా చదవండి: హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు! -
మొయినాబాద్ ఫౌంహౌస్లో దారుణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
ఢిల్లీలో దారుణం.. మహిళను పార్కింగ్ లో ఉన్న బస్సులోకి తీసుకెళ్లి
-
పాదచారులపైకి దూసుకొచ్చిన స్కార్పియో.. ఒకరు మృతి
రాజన్న సిరిసిల్లా జిల్లా, సాక్షి: గంభీరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గజ సింగవరం స్టేజివద్ద ఓ స్కార్పియో ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందంది. మరో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం
బీహార్లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బీహార్కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన తమ తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు. "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.సోదరుడితో సంజు చివరి మాటలు మే 13న అమ్మాయికి పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్తో ఫోన్లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్ ఆరోపించాడు.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?హత్య , హడావిడిగా అంత్యక్రియలు సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను -
ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్'
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్గా పేరు మార్పు. దేని గురించి ఈ పేరు మార్పు..ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు. అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయిమెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉందిఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందిసిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుందిఈ పేరు మార్పు లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.PMOS అంటే..?PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,లక్షణాలు:క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడంఅధిక ఆండ్రోజెన్ హార్మోన్లుమొటిమలు,ముఖంపై రోమాలు పెరగడంబరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బందిఇన్సులిన్ నిరోధకతసంతానోత్పత్తి సవాళ్లుకొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటంఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..టైప్ 2 మధుమేహంఅధిక రక్తపోటుగుండె జబ్బులుఫ్యాటీ లివర్ వ్యాధినిద్రలేమిడిప్రెషన్, ఆందోళనప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సమస్యకు గల కారణాలు:నిశ్చల జీవనశైలిప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపెరుగుతున్న ఊబకాయంసరిగా నిద్రపోకపోవడంఒత్తిడివంశపారంపర్య కారణాలురోగ నిర్ధారణను మెరుగుపరుస్తుందిఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..) -
కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?
తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్కు రాలేదని తెలిపారు. -
బాత్ రూమ్ కోసం ఇంట్లోకి వచ్చి.. CCTVలో నమ్మలేని వీడియో
-
పోలీస్ స్టేషన్ లో ఏమైంది? మహిళ మృతిపై అనేక అనుమానాలు
-
మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుంటారు?
చాలా మంది మహిళలు సాధారణంగా బైక్ వెనుక కూర్చున్నప్పుడు రెండు కాళ్లు ఒకే వైపునకు పెట్టి కూర్చుంటారు. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందనో, లేదంటే కేవలం చీరలు కట్టుకోవడం వల్ల ఇలా కూర్చుంటారని మనం భావిస్తుంటాం. కానీ, దీని వెనుక శతాబ్దాల నాటి యూరోపియన్ చరిత్ర, వలస రాజ్యాల ప్రభావం ఉందని చెబుతున్నారు ప్రముఖ బైకర్, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ జెనిత్ ఇర్ఫాన్. ఆమె ఇటీవల షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలో ఉన్న అంశాల ప్రకారం.. మహిళలు ఇలా ఒక పక్కకు తిరిగి కూర్చోవడం అనే సంస్కృతి.. మధ్యయుగ ఐరోపాలోని ఉన్నత వర్గాల నుంచి వచ్చిన అలవాటు. 14వ శతాబ్దంలో ప్రిన్సెస్ అన్నే ఆఫ్ బోహేమియా దాదాపు 1,600 కిలోమీటర్ల ప్రయాణాన్ని గుర్రంపై ఒక పక్కకు కూర్చునే పూర్తి చేశారు. ఆ కాలంలో మహిళలు పురుషుల వలె గుర్రంపై రెండు కాళ్లు ఇరువైపులా వేసి కూర్చోవడం అమర్యాదగా భావించేవారు. స్త్రీల మర్యాదను కాపాడటానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పాలన సమయంలో ఈ సంస్కృతి భారతదేశానికి దిగుమతి అయ్యింది. అప్పట్లో బ్రిటిష్ మహిళలు గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఇదే పద్ధతిని పాటించేవారు. కాలక్రమేణా ఇది మన దేశంలోని సామాజిక నిబంధనల్లో కలిసిపోయింది. -
20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!
కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు చంద్రేగౌడ అరెస్టైన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చంద్రేగౌడ రామనగర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అయితే ఇతడు తాను లాయర్, రిపోర్టర్, పోలీస్ అంటూ పరిచయం చేసుకుని మహిళలకు వల వేసేవాడు. కొన్నాళ్లు మంచివాడిగా నటించి చనువు పెంచుకుని, తాను డివోర్స్ తీసుకున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి చివరకు శారీరకంగా లోబర్చుకునేవాడు. ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తెలివిగా ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకుని బ్లాక్మెయిల్ చేశాడని గుర్తించారు. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి ఒక మహిళ వద్ద రూ.5 లక్షలు వసూలు చేశాడు. అదే మహిళ ఒకసారి నిందితుడి మొబైల్ను పరిశీలించగా పదుల సంఖ్యలో మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దీంతో సదరు బాధిత మహిళ ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ బీ.సుమతి.. కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ బీ.సుమతి ఈ రోజు ( శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లోని సిటిజన్స్ యొక్క ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే తమ ప్రధాన ప్రయారిటీ అని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ తో నేరాలకు చెక్.. క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మల్కాజ్గిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని సీపీ సుమతి పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.సాంకేతికతతో నేరాలకు చెక్నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ తెలిపారు. AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.మాదకద్రవ్యాల కట్టడి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణసమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు."మహిళా పోలీస్ కమిషనర్గా నన్ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు. -
డేట్కు వెళ్లడానికి అమ్మాయిలేదని కోపంతో ప్రాంతానికి నిప్పు..?
2025లో లాస్ ఏంజిల్స్లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..జోనాథన్ రిండర్క్నెచ్ అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో ప్రయాణికులను దించాడు. అనంతరం కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్తో ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు. -
పెళ్లి వేడుకలో ఘోర విషాదం.. డాన్స్ చేస్తూ నవ వధువు మృతి!
-
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
-
టోల్ సిబ్బందిపై టీడీపీ గూండాగిరీ.. మహిళ జుట్టు పట్టుకుని..!
-
స్త్రీల ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీవాసవీ కన్యక
వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితంగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అందచందాలతో, విద్యావినయాలు, గుణ గణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవించాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లితండ్రులను కూడా విస్మితులను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరుడు, విరూపాక్షుని వివాహం రత్నావతితో అతి వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. ఇలా ఉండగా... వేంగిరాజ్య పాలకుడు,పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరాజు విష్ణువర్ధనుడు తన సామంతరాజ్యమైన పెనుగొండకు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు ఆ చక్రవర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలాదిత్యు డనే మరొక పేరూ కలిగిన విష్ణువర్ధనుడు పెనుగొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహితుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురంపాడు. వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించనూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కులగురువైన భాస్కరాచార్యుని అధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశమయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమేననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్రమాదం, అందువలన కలిగే కులక్షయం అనే ముప్పూ తప్పుతాయని భావించగా; 102 గోత్రాల వారు మాత్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించబడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయ పడ్డారు. ఇంతలో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించింది. ‘అన్నలారా, తండ్రులారా! ఒక వినూత్న ప్రణాళికతో చక్రవర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచ కోత కోస్తాడు. అహింస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మార్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించ గలవారు మాత్రమే ఈ నా పోరాటంలోపాల్గొనగలరు’ అని ఆమె పలికిన పలుకులకు ఆమె తల్లిదండ్రులతోబాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనేపావన ప్రదేశంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నె పిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగడాలకు చరమ గీతం పాడడానికి; ఆడపిల్లల అభిప్రాయాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి; ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ్ర΄ాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ‘ మార్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతోబాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాలని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్యశ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అంటూ తమ జన్మవృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబలం, సమాజసేవల గురించి ప్రబోధించింది. ‘రాజా! చేతనైనే నన్ను ఇప్పుడు చెరబట్టు’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించక పోగా అపకీర్తి, ఆకస్మిక మరణం రాజును వరించాయి. గురజాడ వారు అన్నట్లు ‘పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‘. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి పోయాయి. విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలిరాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శించి, ‘గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించుకొందాం‘ అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానం లోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయాలు వెలిశాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
అక్షరాలా ఆమె కోసం...
పుస్తకాల రూపంలోని మహిళల క్రియేటివిటీని సెలబ్రేట్ చేసే పండగ, ప్రతిష్ఠాత్మకమైన... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేసి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించి, ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన అపురూపమైన బహుమతి... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఈ సంవత్సరం విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ లాంగ్లిస్ట్కు ఎంపికైన పదహారు పుస్తకాలలో కొన్ని పుస్తకాల పరిచయం...గోడలు కూలుతున్నాయి...జీవితాలు మారుతున్నాయిషీనా కలయిల్ రాసిన హృదయాన్ని కదిలించే నవల... ది అదర్స్. అది 1989 సంవత్సరం. తూర్పు జర్మనీలోని డాయిష్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో విభిన్న నేపథ్యాలు ఉన్న ముగ్గురు యువతీ యువకులు స్నేహితులవుతారు. మొజాంబిక్కు చెందిన ఆర్మాండో ఫ్యాక్టరీ కార్మికుడు. లోలిత భారతదేశానికి చెందిన వైద్యవిద్యార్థిని. థియో తూర్పు బెర్లిన్కు చెందిన యువకుడు. రచయిత కావాలని కలలు కంటుంటాడు. తూర్పు ఐరోపా అంతటా నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తుండగా ఈ ముగ్గురి జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలే... ది అదర్స్.కాసింత ప్రేమ కోసం...పందొమ్మిదేళ్ల గ్లోరియా కాలేజీకి వెళ్లదు. మరి ఏం చేస్తుంది? పార్కుల చుట్టూ తిరుగుతుంది. స్నేహితుల కోసం వెదుకుతుంది. రోజూ జాక్ ఇంటికి వెళుతుంటుంది. ఈ జాక్ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తిస్తాడు. లోకం మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఒక హింసాత్మక సంఘటన తరువాత గ్లోరియా, జాక్ల స్నేహం ముగిసిపోతుంది. గ్లోరియా ఒంటరిదైపోతుంది. ఈ హింసాత్మక ప్రపంచంలో అనుబంధాలు, కాసింత ప్రేమ కోసం ఆరాటపడే ఒక మహిళ అంతరంగాన్ని లోతుగా చిత్రించే నవల... గ్లోరియా డోంట్స్పీక్. ‘లూసీ యాప్స్ రాసిన గ్లోరియా డోంట్ స్పీక్ ఒక అద్భుతమైన పుస్తకం. హింస, దోపిడి, స్వీయనిర్ణయాధికారం... మొదలైన అంశాలతో రాసిన శక్తిమంతమైన పుస్తకం’ అన్నారు విమర్శకులు.చరిత్రపై ఫ్లాష్లైట్యుద్దం తరువాత జపాన్ పరిస్థితి, అమెరికాలోని శివారు ప్రాంతాలు, ఉత్తర కొరియా పాలన... ఇలా 20వ శతాబ్దపు పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఒక కుటుంబంపై రాసిన పుస్తకం... ఫ్లాష్లైట్. కొరియా నుండి అమెరికాకు వలస వచ్చి అమెరికన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే సెర్క్, అతడి పదేళ్ల కూతురు లూయిసా, సెర్క్ భార్య ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు. లూయిసా తండ్రి అదృశ్యం కావడం ఆ చిన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. సుసాన్ చోయ్ రాసిన ‘ఫ్లాష్లైట్’ ఒక కుటుంబం చుట్టూ తిరిగే చారిత్రక పుస్తకం. అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ ఆసక్తిని రేకెత్తించే పుస్తకం.ఉత్తరాలమ్మ‘ఉత్తరాలు రాయడానికే జన్మించిందా!’ అన్నట్లుగా ఉంటుంది సిబిల్ వాన్. ప్రతి ఉదయం ఉత్తరాలు రాయడానికి కూర్చుంటుంది. తన సోదరుడికి, ప్రాణస్నేహితురాలికి, విశ్వవిద్యాలయ అ«ధ్యక్షుడికి, తన అభిమాన రచయితల తాజా పుస్తకాలపై అభి్రపాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు రాస్తుంటుంది. డెబ్బై మూడు సంవత్సరాల సిబిల్ చమత్కారమైన, వివేకవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వర్జీనియా ఇవాన్స్ రాసిన ‘ది కరస్పాండెంట్’ ఒక వృద్ధ మహిళ దృష్టి కోణం నుంచి ఉత్తరాల రూపంలో వినూత్నంగా, భావోద్వేగ తీవ్రతతో రాసిన నవల. ‘సిబిల్ ఉత్తరాలు అసాధారణమైనవి కాకపోవచ్చు. అయితే మీకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె ఒకరు కావచ్చు’ అన్నారు విమర్శకులు.దొంగా... సంరక్షకులు!ఒక వారం వ్యవధిలో సాగే పరిణామాలతో ‘ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్’ రెండు కథలను చెబుతుంది. మా, బూంబా అనే రెండు పాత్రల కేంద్రంగా నడిచే పుస్తకం ఇది. ఈ రెండు పాత్రలు తమ కుటుంబం కోసం ఒకే సమయంలో సంరక్షకుడిగా, దొంగగా ప్రవర్తిస్తాయి. తన కుటుంబాన్ని పోషించాలనే ఆరాటం బూంబాను దొంగగా మారుస్తుంది. వరుస నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ప్రగాఢమైన తల్లిదండ్రుల ప్రేమ, మెరుగైన జీవితం కోసం ఆరాటం, లోపిస్తున్న నైతిక విలువల చుట్టూ తిరిగే నవల ఇది. తమ ప్రియమైన వారిని రక్షించుకునే నేపథ్యంలో నిస్సహాయ పరిస్థితులు ప్రజలను విలన్ లేదా హీరోగా ఎలా మారుస్తాయో ఈ నవల కళ్లకు కడుతుంది. ‘మేఘా మజుందార్ రాసిన ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్ మానవజాతి నైతిక సందిగ్ధతల గురించి పాఠకులను నిరంతరం సవాలు చేసేలా రాసిన అద్భుతం పుస్తకం’ అన్నారు విమర్శకులు.లింగ వివక్ష ను నివారించడానికి...మహిళల రచనలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలి, కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ ప్రారంభమైంది. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షను నివారించడానికి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి యూకేలో 1996లో ఈ పురస్కారానికి శ్రీకారం చుట్టారు. విజేతకు నగదు బహుమతితోపాటు కళాకారిణి గ్రిజెల్ నివెన్ తయారు చేసిన ‘బెస్సీ’ అనే కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. బాగా పుస్తకాలు చదివే, వివిధ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న అయిదుగురు మహిళలతో కూడిన ప్యానెల్ ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ విజేతను ఎంపిక చేస్తుంది. లాంగ్లిస్ట్కు ఎంపికైన పుస్తకాలలో కొన్ని షార్ట్ లిస్ట్కు ఎంపిక అవుతాయి. షార్ట్ లిస్ట్ నుంచి విజేతను ఎంపిక చేస్తారు. -
నాకు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్.. నిన్ను చూస్తే ఫీలింగ్స్ రావడం లేదు..
-
హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్కు చెందిన వృజేశ్ కుమార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అద్దె బస్సులు.. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో పోలీసు ఎస్కార్ట్ వాహనాల నడుమ రోడ్డెక్కాయి. అయితే.. ఆ బస్సులు ఎక్కిన మహిళలకు పెద్ద షాకే తగులుతోంది. సమ్మె నేపథ్యంలో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కుదరదని.. టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఆధార్ కార్డు చేతబట్టిన మహిళలకు నోట మాట రావడం లేదు. కొన్ని రూట్లలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీపై భారం పడకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. -
మేమూ చేయగలం హజ్ యాత్ర
హజ్ యాత్ర చేసేందుకు స్త్రీలు ‘మెహ్రమ్’ పాటించాలి. ‘మెహ్రమ్’ అంటే ఏ విధంగా చూసినా వివాహానికి వీలులేని బంధుత్వం ఉన్న పురుషుడి తోడు. అయితే ఒంటరి స్త్రీలు, వితంతువులు, పిల్లలు దగ్గర లేని వారు హజ్ చేసే హక్కు కలిగి ఉన్నారని భారత ప్రభుత్వం, సౌదీ గుర్తించాయి. 45 ఏళ్లు పైబడ్డ స్త్రీలు 2023 నుంచి మెహ్రమ్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి అనుమతి దొరికింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 5,446 మంది స్త్రీలు ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ హజ్ యాత్ర చేస్తున్నారు. హజ్ చేయాలనుకునే స్త్రీలకు ఇది స్ఫూర్తి.మే 25 నుంచి మే 30 వరకూ హజ్ ప్రధాన రోజులు. అందుకే దేశంలో హజ్ యాత్రికులు ప్రయాణ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఏప్రిల్ 18న మొదటి హజ్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి మొత్తం లక్షా డెబ్భై ఐదువేల మంది హజ్ యాత్ర చేస్తున్నారు. అయితే వీరిలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ విభాగం కింద 5,446 మంది మహిళలు ఉండటం విశేషం. వీరిలో మళ్లీ అత్యధికంగా కేరళ నుంచి 4,477 మంది అనుమతి పొందడం మరో విశేషం.మెహ్రమ్ అంటే?హజ్ యాత్రకు వెళ్లే ఆడవారితో పాటు తప్పకుండా వెళ్లాల్సిన మగతోడుని ‘మెహ్రమ్’ అంటారు. ఇస్లాం ప్రకారం ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేని దగ్గరి బంధువు (తండ్రి, కన్నకొడుకు, అన్న, తమ్ముడు, తాత, మనవడు, బాబాయి, మేనల్లుడు) మెహ్రమ్ గా వెళ్లవచ్చు. భర్త తోడు వస్తే ఇక ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు. ఆ రోజుల్లో స్త్రీల భద్రత కోసం ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఎడారి ప్రయాణంలో స్త్రీల రక్ష కోసం, కొత్త ప్రాంతంలో వారు ఆందోళన చెందకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలం మారినా, ఆధునిక సురక్షిత పద్ధతులు వచ్చినా మెహ్రమ్ వీలు కాని స్త్రీలు హజ్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది.2023 నుంచి మార్పుమన ప్రభుత్వం 2018 నుంచి 45 ఏళ్లు పైబడిన స్త్రీలు నలుగురేసి చొప్పున గ్రూప్గా హజ్ యాత్ర చేయవచ్చని సడలింపు చేసింది. అయితే 2023 నుంచి సౌదీ అరేబియా అధికారికంగా ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ను వెసులుబాటు కల్పించింది. దాంతో 2023 నుంచి మన దేశంలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ పేరుతో స్త్రీలు హజ్ యాత్రను చేస్తున్నారు. కేరళ నుంచి 2023లో పెద్ద సంఖ్యలో స్త్రీలు ఈ విభాగం కింద హజ్ యాత్ర చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి వీరి సంఖ్య ఈ సంవత్సరం పెరిగింది. 45 ఏళ్ల లోపు స్త్రీలు హజ్ చేయాలంటే ఇప్పుడూ ‘మెహ్రమ్’ తప్పనిసరి.జుబేదా ముహమ్మద్ కల నెరవేరిందిమలప్పురంకు చెందిన 58 ఏళ్ల జుబేదా మహమ్మద్కి ఎన్నో ఏళ్లుగా ఒకటే కల. భర్త చేయి పట్టుకుని హజ్ యాత్ర చేయాలి. కానీ విధి వేరేలా రాసింది. 2019లో భర్త హఠాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడంతో ఆమె హజ్ కల సమాధి అయ్యింది అనుకున్నారు అందరూ. ‘ఆడదానివి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తావ్? మెహ్రమ్ లేకుండా హజ్ కుదరదు’ అని చుట్టాలు, బంధువులు చె΄్పారు. కొడుకులు విదేశాల్లో ఉన్నారు. ఇంట్లో ఒంటరి. కానీ 2023లో ఒక వార్త ఆమె జీవితాన్ని మార్చేసింది. భారత ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం కలిసి 45 ఏళ్లు పైబడిన మహిళలు నలుగురు గ్రూప్గా మెహ్రమ్ లేకుండా హజ్కి వెళ్లొచ్చు అని ప్రకటించాయి.కొడుకులకు జుబేదా ఒక్కటే చెప్పింది – ‘మక్కాకు వెళ్లకుండా నేను కళ్లు మూయలేను. నా భర్త ఆత్మ శాంతించదు’ అని. హజ్ ఖర్చు దాదాపు 4 లక్షలు. భర్త పెన్షన్, కొంత పొదుపు, కొడుకులు పంపిన డబ్బు కలిపింది. వైద్య పరీక్షలు, వ్యాక్సిన్లు, పాస్ పోర్ట్, శిక్షణా తరగతులు – అన్నీ ఒంటిచేత్తో చేసుకుంది. ‘రాత్రిళ్లు మోకాళ్ల నొప్పులతో ఏడ్చేదాన్ని. కానీ కాబాను తలచుకుంటే నొప్పి మాయం అయ్యేది’ అందామె. విమానం జెద్దా ఎయిర్ పోర్టులో దిగగానే కళ్లలో నీళ్లు. 40 ఏళ్ల కల నెరవేరిన క్షణం. హజ్ చేసి వచ్చాక జుబేదా మాటలు ఇవి: ‘ఒంటరిని అని భయపడకండి. ప్రభుత్వం దారి ఇచ్చింది. నలుగురు తోడు దొరుకుతారు. అడుగు ముందుకు వేయండి. కాబా మిమ్మల్ని పిలుస్తోంది.’ -
USAలో ఇమ్మిగ్రేషన్ ఆగడాలు.. భారత మహిళ అరెస్ట్
ప్రపంచాన్ని ఓ వైపు యుద్ధం కుదిపేస్తుంటే అమెరికాలో మాత్రం ఇమ్మిగ్రేషన్ నిబంధనల పేరుతో అధికారులు ఆగడాలు ఏంతమాత్రం ఆగడం లేదు. అమెరికాలో 35 ఏళ్లుగా నివాసముంటున్న భారత్కు చెందిన ఒక మహిళను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.మీనూ బాత్రా అనే 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ వేరే ప్రాంతానికి ప్రయాణం కోసం మార్చి 17 న హర్గింగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తన విమానం కోసం ఎయిర్పోర్టు వద్ద ఎదురుచూస్తుండగా హఠాత్తుగా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు వచ్చి తన చేతికి సంకెళ్లు వేసి తనను అరెస్టు చేశారు. అనంతరం రేమండ్ విల్లాలోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. తనకు చట్టపరమైన పరిమితి ఉందని ఎంత వాదించినా వారు పట్టించుకొనే యత్నం చేయలేదు.అయితే దీనిపై మీనూ బాట్రా స్పందించారు. " నన్ను ఒక ఖైదీలా చూశారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విచారణ సమయంలో 24 గంటలపాటు ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. కనీసం మంచినీరు కూడా అందించలేదు. అరెస్టు తర్వాత తనను చేతులు వెనక్కి పెట్టి బేడీలు వేసినట్లు కనిపించేలా ఫోటోలు తీయించుకోవాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో నేను చాలా అవమానానికి గురయ్యాను, నన్ను ఒక నేరస్థురాలిలా ట్రీట్ చేశారు" అని ఆమె మీడియా ఎదుట వాపోయారు.దీంతో బాత్రా అనే మహిళ తన అరెస్టును సవాలు చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు మొదటి 24 గంటల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా నిర్బంధించారని, కనీసం తన మందులను కూడా ఇవ్వడానికి నిరాకరించారని పిటిషన్లో పేర్కొన్నారు.కాగా బాత్రా 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్నారు. టెక్సాస్లో పంజాబీ, హిందీ మరియు ఉర్దూ భాషలకు గుర్తింపు పొందిన ఏకైక కోర్టు ఇంటర్ప్రెటర్గా (అనువాదకురాలిగా) ఇమ్మిగ్రేషన్ కోర్టులో కొన్నేళ్లుగా వందలాది మందికి సహాయం చేశారు. ఇలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడ అరెస్టు చేస్తే సాదారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్రాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై, చైతన్యవంతంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2029లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కోటా అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మహిళలకు మంగళవారం లేఖ రాశారు. లేఖను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. విధానాల రూపకల్పన, కీలక నిర్ణయాల్లో మహిళామణులు క్రియాశీలక పాత్ర పోషిస్తే ‘వికసిత్ భారత్’దిశగా మన ప్రయాణం మరింత బలం పుంజుకుంటుందని వెల్లడించారు.అందువల్ల మన అభివృద్ధి పథానికి మరింత ఊపునిచ్చేందుకు చేయగలిగినదంతా చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. 2023లో ’నారీశక్తి వందన్ అధినియం’ఆమోదానికి దారితీసిన పరిణామం ఇదేనని వివరించారు. వచ్చే ఎన్నికల్లో చట్టం అమలుకు వీలుగా రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మహిళల ఇప్పటికే బహుళ రంగాల్లో రాణిస్తున్నారని, చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు. బిల్లు ఆమోదం కోసం మహిళల ఎదురు చూపులు ‘నారీశక్తి వందన్ అధినియం’సవరణను ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా ఆమోదించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా మహిళలకు అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం దేశంలోని మహిళలంతా ఎదురు చూస్తున్నారని తాను కచ్చితంగా నమ్ముతున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పెంచడం చాలా ముఖ్యమని, అందుకోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం ఆడబిడ్డలను ఇంకా వేచి ఉండేలా చేయలేమని తెలిపారు. లోక్సభ, అసెంబ్లీలో మహిళల గళం బలపడినప్పుడు ప్రజాస్వామ్య గళం కూడా బలపడుతుందన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం కోట్లాది మంది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్నామని మోదీ స్పష్టంచేశారు. స్థానిక ఎంపీలకు లేఖలు రాసి, చరిత్రాత్మక ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రోత్సహించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.శతాబ్దాల పాటు పెపుప్రభావం చూపే గొప్ప పని చేయబోతున్నారంటూ ఎంపీలకు గుర్తు చేయాలని కోరారు. ఇది కచ్చితంగా వారిలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం నారీశక్తి వందన్ అధినియం పట్ల మహిళల్లో అపారమైన ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. -
వెలుగులోకి ‘లేడీ కెప్టెన్’ లీలలు.. టీసీఎస్లో సంచలనం
ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి. ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్వాష్ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్ఆర్ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.హెచ్ఆర్ మేనేజర్ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్ఆర్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు ‘లేడీ కెప్టెన్’గా పేరున్న హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. -
పోలీస్ అధికారినంటూ.. ఏకంగా 67 పెళ్లిళ్లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్కామ్లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్పోర్ట్లో హల్చల్ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
ntr జిల్లా కలెక్టరేట్లో అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు
సాక్షి,విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం అధికారులు ఆమె భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బదులుగా ఇవ్వాల్సిన రూ.24 లక్షల నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని వృద్ధురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అనేక సార్లు కలెక్టరేట్లో వినతిపత్రాలు సమర్పించినా, అధికారులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్కు వచ్చిన బాధితురాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కారం చల్లారు. తన భూమి తీసుకుని వేరే వారికి డబ్బులు చెల్లించారని ఆరోపించారు. అధికారుల తీరుతో విసుగెత్తి ఈ చర్యకు దిగినట్లు వృద్ధురాలు మీడియా ఎదుట వెల్లడించారు. -
నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
అప్పుడప్పుడూ కిట్టీ పార్టీలు, ఏ పార్క్కో, చిన్నపాటి తీర్థయాత్రకో వెళ్లడం తప్ప మహిళలకు పెద్దగా రిక్రియేషన్ ఏమీ ఉండదు. అందుకే మహిళల కోసం, మహిళల ద్వారా నిర్మితమైన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్రాన్స్లో ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేయడానికి సుమారు 300 మంది మహిళల ప్రయత్నం, వీడియో ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. అదేంటో తెలుసుకుందాం. ఒక చారిత్రక కట్టడాన్ని కొనుగోలు చేసి, దానిని మహిళల కోసం ఒక ప్రత్యేక హేవెన్గా మార్చాలనే 300 మంది మహిళల సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, తోటి మహిళలతో కలిసి సరదాగా గడపడానికి, కొత్త ఉత్సాహం పొందేలా దాదాపు 300 మంది మహిళలు కలిసి ఫ్రాన్స్లోని ఒక పురాతన మధ్యయుగ కోటను (Medieval Chateau) కొనుగోలు చేశారు. దాని పేరే 'క్యాంప్ చాటో' (Camp Chateau).ముఖ్య విశేషాలుమహిళలు దైనందిన ఒత్తిళ్లకు దూరంగా, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి, ఒకరితో ఒకరు అనుబంధాన్ని పంచుకోవడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది 100 శాతం మహిళల సొంతం. వారి నిధులతోనే నడుస్తుంది. 'ఫౌండర్ మెంబర్' అనే ప్రత్యేక మోడల్ ద్వారా దీనిని కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ మగపురుగు కూడా ఉండదన్నట్టు.. ఉండేదంతా సిస్టర్ హుడ్. ఇక్కడ సమ్మర్ క్యాంప్స్, విశ్రాంతి గదులు, ఆన్లైన్ కమ్యూనిటీ ద్వారా మహిళలకు ఒక 'వర్చువల్ స్వర్గాన్ని' అందిస్తున్నారు. ఈ కోట రోజువారీ ఒత్తిళ్ల నుండి దూరంగా,ఒక స్లీప్ అవేలా, రిట్రీట్గా పనిచేస్తుంది. ఇక్కడ మహిళలు కలిసి సమయం గడపవచ్చు. అలాగే ఒక చారిత్రక ప్రదేశంలో గడిపిన అనుభూతి పొందవచ్చు.ఈకోటలో ఎలాంటి భయాలు, ఆటంకాలు లేకుండా పచ్చని ప్రకృతి మధ్య, ఇష్టమైన నెచ్చెలులతో ఆడి పాడవచ్చు. నిస్సంకోచంగా నచ్చిన పని చేసుకోవచ్చు. “మీరు మీ ప్రాణస్నేహితురాలు, పెద్ద కుమార్తె , మరో 300 మంది మహిళలతో కలిసి ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేశారు. ఇప్పుడు మీరంతా ఒకచోట చేరి, ఆలింగనం చేసుకుని, వేడుకలు జరుపుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక స్థలాన్ని సృష్టించారు. స్వేచ్ఛగా. ఆనందంగా. మనస్ఫూర్తిగా.” అనే క్యాప్షన్తో దీనికి సంబంధించిన వీడియో షేర్ అయింది. దీనిపై బోలెడు ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు మీ దేశంలో కూడా మీరు ఇలాంటి కోటనొకదాన్ని ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్నను సంధించడం విశేషం.నెటిజన్ల స్పందనఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చాలా మంది మహిళలు దీన్ని "రిటైర్మెంట్ ప్లాన్" అని కొనియాడుతోంటే, "ఇది చాలా అద్భుతమైన ఆలోచన, ఇలాంటి కలయికలు, కమ్యూనిటీలు మనశ్శాంతిని ఇస్తాయి" అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది అని మరి కొంతమంది ఆరా తీశారు.మరోవైపు కొందమంది నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు. "ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు లేదా పైకప్పు కారితే ఎవరు బాగు చేస్తారు? ఖచ్చితంగా మగవారిని పిలవాల్సిందే కదా" (ఇలాంటి పనులు ఆడవాళ్లు చేయలేరు అన్నట్టు) అంటూ కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు మేల్ చావనిస్ట్లేమో ఇలాంటి ఆడోళ్లు సమాజం నుండి విడిపోవడమే మంచిది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.A group of 300 women buy a Medieval French Chateau so they can have a place for women to gather. Would you buy a castle with other people in another country? pic.twitter.com/C8VlKKvj3a— Richie Rich (@gofishh77) April 7, 2026ఏది ఏమైనా "మహిళలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఉత్సాహంగా, స్వేచ్ఛగా గడిపే ఒక వేదికను సృష్టించడమే మా ఉద్దేశ్యం." అని క్యాంప్ చాటో వెబ్సైట్ చెప్పినట్టు, ఆడవారి దుస్తులు, వేషధారణమీద ఎలాంటి జడ్జ్మెంట్లు, విమర్శలు, విరుపులు లేని ఒక ఉత్సాహపూరిత క్షణాలు నిజంగానే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏమంటారు? -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
నువ్వు రోడ్డు మీదకు వస్తే చెప్పు తీసుకొని కొడతాం... మహిళలు వార్నింగ్
-
‘సుప్రీం’లో కొనసాగుతున్న ‘శబరిమల’ విచారణ
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా విచారణ కొనసాగుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సున్నితమైన వివాదంపై తాజాగా ‘మహిళలను నెలలో మూడు రోజులు అంటరానివారిగా చూడలేము’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ సుదీర్ఘ వివాదంపై తుది విచారణను చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పించే మత స్వేచ్ఛ పరిధిని న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేవలం శబరిమల కేసుకే పరిమితం కాకుండా, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, మతాంతర వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, పలు మతపరమైన వివక్షతలకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ కలిపి ధర్మాసనం విచారిస్తోంది.మంగళవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని ‘వివక్ష’గా పరిగణించలేమని, అది వారి మత విశ్వాసాల పరిధిలోని అంశమని ఆయన వాదించారు. ప్రాథమిక హక్కుల కింద రక్షణ పొందాలంటే ఒక ఆచారం కేవలం మూఢనమ్మకం కాకుండా, ఆ మతంలో ‘అత్యవసర ఆచారం’ అని నిరూపించుకోవాలని గత కోర్టు తీర్పులను ఉదహరించారు.ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘సామాజిక రుగ్మతలను మతాచారాలుగా ముద్రవేయలేం’ అని తేల్చిచెప్పింది. ధర్మాసనంలోని జస్టిస్ బి.వి నాగరత్న స్పందిస్తూ, రుతుక్రమం ఆధారంగా మహిళలను పవిత్ర స్థలాల్లో అంటరానివారిగా చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ, చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ శతాబ్దాల నాటి ఆచారం రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మతపరమైన అంశాలన్నింటినీ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! -
శబరిమలలో మహిళలపై నిషేధం సబబే
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం సబబేనని కేంద్రం పేర్కొంది. ‘‘మతపరమైన విశ్వాసానికి సంబంధించిన విషయమిది. కనుక న్యాయపరమైన సమీక్షకు అతీతమైనది’’అని స్పష్టం చేసింది. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఒకరకమైన అంటరానితనమేనంటూ 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.‘‘అది తప్పుడు తీర్పు. కనుక దాన్ని పునఃపరిశీలించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రసాదించిన మతపరమైన స్వేచ్ఛను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. మతపరమైన విశ్వాసం ముసుగులో కొనసాగే సామాజిక రుగ్మతలను పరిశీలించే అధికార పరిధి కోర్టులకు ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దానితో ఏకీభవిస్తున్నట్టు మెహతా చెప్పారు. మతపరమైన ఆచారాలు శాంతిభద్రతలకు, ఆరోగ్యానికి, నైతికతకు విఘాతం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. మహిళలను నెలలో మూడు రోజుల పాటు అంటరానివారిగా చూడటం సరికాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయమై తానొక మహిళగా మాట్లాడుతున్నట్టు చెప్పారు.శబరిమల ఆలయంలోకి మహిళలపై నిషేధం వయసుకు సంబంధించిందే తప్ప రుతుస్రావానికి సంబంధించిన అంశం కాదని మెహతా బదులిచ్చారు. ‘‘దీనిపై స్పష్టత అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాల్లోకీ మహిళలకు ప్రవేశముంది. ఒక్క శబరిమల ఆలయంలో మాత్రమే దానిపై ఆంక్షలున్నాయి’’అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘భారత్లో మహిళలు ఎప్పుడూ పురుషులతో సమానంగా హోదా, మన్నన అందుకున్నారు. కొన్నిసార్లు వారికే ప్రాధాన్యం దక్కింది. మహిళలను పూజించే ఏకైక సమాజం మనదే. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరమూ దేవీ విగ్రహాలకు మొక్కుతాం.కనుక పురుషాధిక్యత, లింగ సమానత్వం వంటి అంశాలను ఈ కేసులో చొప్పించరాదు’’అని వాదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని 2018లో ఐదుగరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. అంతేగాక నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు కూడా వెలువరించింది. ‘‘మేమిప్పుడు ఆ తీర్పు తాలూకు మంచిచెడుల్లోకి పోదలచుకోలేదు. ఈ అంశానికి సంబంధించి రూపొందించిన ఏడు ప్రశ్నలకు మాత్రమే విచారణ పరిధిని పరిమితం చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆయనకు 40, ఆమెకు 19.. కోర్టు సంచలన తీర్పు
భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక వివాహిత తన ఇష్టానుసారం ప్రియుడితో వెళ్లవచ్చని పేర్కొంది. తన భర్తను విడిచి ప్రియుడితో వెళ్లాలని 19 ఏళ్ల యువతి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ విషయమై ఆ మహిళకు ప్రియుడితో వెళ్లడానికి అనుమతినిస్తూ తీర్పు ఇచ్చింది.వివరాల్లోకి వెళితే.. అనూజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను అపహరించాడని ఆరోపిస్తూ యువతి భర్త అవదేష్ హెచియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని పట్టుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి సదరు మహిళను ఎవరితో ఉండాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు.దీనికి సదరు మహిళ సమాధానం ఇస్తూ" నా భర్త వయస్సు 40 సంవత్సరాలు, నావయస్సు 19 సంవత్సరాలు మా ఇద్దరి మధ్య 19 ఏళ్ల తేడా ఉంది. నా వైవాహిక జీవితం సరిగ్గా లేదు. నా భర్త సరిగ్గా ప్రవర్తించడం లేదు". అని కోర్టుకు తెలిపింది. అనంతరం ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమె తన ప్రియుడితో వెళ్లడానికే అంగీకరించింది. దీంతో కోర్టు ఆమె అభ్యర్థనను అంగీకరించింది. -
నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్ ఆమె..!
సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అనే పారా ఆర్చరీ కథను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. అయితే పాయల్ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్ వేద్వాన్ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. అలా అలుపెరగని పట్టుదలతో పాయల్ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్ 2026లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్. ఆ పోటీల్లో ఫైనల్కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్ దేవిని ఎదుర్కొని, ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. Here is that moment!! Payal Nag receives her GOLD medal at Bangkok and the national anthem plays.And right beside her, Sheetal - gracefully helping move her wheelchair.Two champions. One podium. One unforgettable frame.Pure inspiration. ❤️ pic.twitter.com/wrobtOCSIL— Manas Muduli (@manas_muduli) April 6, 2026 అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్గా ఘనత అందుకుంది పాయల్. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్ మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్, శీతల్ సక్సెస్ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!
పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్ చదువులు, కాలేజ్ లైఫ్ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ని ఆశ్రయిస్తున్నారట.5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 7. కొందరైతే ఫ్యామిలీ లైప్, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్లో సర్చ్ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. (చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం..
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తలుపు కొట్టి దాహమని నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నన్ను ఆ ఎమ్మెల్యే టార్గెట్ చేశారు.. టీడీపీ మహిళా సంచలన కామెంట్స్
-
కీలక పదవులన్నీ మహిళలకే.. ముంబైలో కొత్త చరిత్ర
సాక్షి ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక పదవుల పగ్గాలు మహిళల చేతుల్లోకి వచ్చాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్, ప్రతిపక్ష నేతతో పాటు మరో 8 కమిటీలు మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులకు ద క్కాయి. ప్రస్తుతం ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 11 మంది మహిళలు అధికార బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో మహిళా రాజ్ ప్రారంభమైందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ ముంబై మేయర్లుగా ఎంతో మంది మహిళలు ఎన్నికయ్యారు. కానీ ముంబై మున్సిపల్ కమిషనర్ పదవి మాత్రం వారికి దక్కలేదు. ఈ పదవి కోసం పలువురు మహిళా అధికారుల పేర్లు ప్రస్తావనకు వచి్చనప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 161 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా, సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి అశ్విని భిడేకు కమిషనర్ అయ్యే అవకాశం లభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం బీఎంసీ తొలి మహిళా కమిషనర్గా అశ్విని భిడే బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు తొలిసారిగా మహిళా కార్పొరేటర్ కిషోరి పెడ్నేకర్ ప్రతిపక్ష నాయకురాలిగా నియమితులయ్యారు. అలాగే బెస్ట్ కమిటీకి ఛైర్పర్సన్గా తొలిసారిగా తృష్ణ విశ్వస్ రావ్ కూడా నియమితులయ్యారు. వీటితోపాటు మున్సిపాలిటీలోని వివిధ కమిటీల ఛైర్పర్సన్షిప్లు కూడా మహిళలకే దక్కాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..
ఇల్లు ఆమెదే! ఆ ఇంటికి ఆమే యజమానురాలు! ఉదయం లేచింది మొదలు భర్త, పిల్లలు, అత్త, మామ..ఇంటిల్లిపాది అవసరాలు చూడటంలో క్షణం తీరికలేనట్టు ఉరుకులు, పరుగులు.. కానీ, ఆమె ఎప్పుడూ ఒంటరితనం మూటను భుజాన వేసుకునే ఉంటుంది. ఎవ్వరితోనూ చెప్పుకోలేని సమస్యల నిశ్శబ్దాన్ని మోస్తుంది.శరీరంలో వచ్చే మార్పులు, కుటుంబ బాధ్యతల చిక్కులు, ఆర్థిక అవసరాలు, సామాజిక ఒత్తిళ్లు... వీటిల్లో తనను తాను ఎక్కడో పోగొట్టుకున్నట్టు తెలియని శూన్యం ఆవరించినట్టు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తుందా..?! ఈ రోజుల్లో వివిధ దశలలో మహిళలు ఒంటరితనం అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకునే శాతం పెరుగుతోందని నివేదికలు చూపుతున్నాయి. కారణాలు ఉంటే.. పరిష్కారమూ ఉంటుంది..యాభై ఏళ్ల కిరణ్మయి చెన్నైలో తన కుమార్తె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్త రిటైర్ అయిన తర్వాత ఆమె కుమార్తె కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఓరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో గండం నుంచి బయటపడింది. ఎందుకిలా చేశావని అడిగితే – ‘నా ఇంట్లో నేనే కనిపించకుండా పోయినట్టుగా అనిపించింది. నా మాటకు ఎక్కడా విలువలేదు’ అని చెబుతూ ఎంతో బాధపడింది. మెనోపాజ్ సమయంలో ఆమె భావోద్వేగ సంబంధ మార్పులు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంది. తన పరిస్థితిని ఎవరికైనా చెప్పుకోబోతే ‘అతిగా ఆలోచిస్తున్నావు, అంతే’ అని తేలికగా కొట్టిపారేసేవారు ఇంట్లో. అందుకే, ఆ నిర్ణయం తీసుకుందామె. రవీనా శరణ్ అనే న్యాయవాదికి నాల్గవ నెల ప్రెగ్నెన్సీలో గర్భస్రావం జరిగింది. ఆ బాధకన్నా ‘మేం ముందే చెప్పాం, జాగ్రత్తగా ఉండమని..’ అనే మాటలు తరచూ వినాల్సి రావడమే పెద్ద బాధ. దానిని అధిగమించలేక... ఎవరితో కలవలేక ఒంటరితనంతో బాధపడుతూ ‘ఈ గిల్ట్తో నేను చనిపోయేదాన్నే’ అంటోంది.ఈ మహిళల వయస్సు, పరిస్థితులు వేరయినా, వారి బాధ ఒకటే. భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్య సమస్యలకు సామాజిక ఒత్తిళ్లు, హార్మోన్ల మార్పులు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కొన్ని హెల్త్ సర్వేల ప్రకారం ఇటీవల మహిళల్లో డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషుల కంటే మహిళల్లోనే కుంగుబాటు ఎక్కువగా ఉందట.నిశ్శబ్దానికి బ్రేక్...ఆత్మహత్యల్లో 15–34 సంవత్సరాల లోపు మహిళలు 63 శాతం ఉండగా, తల్లుల మరణాల్లో ఈ శాతం 39గా ఉంది. ప్రతి 5గురిలో ఒక తల్లి మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.70–80 శాతం మందికి తగిన చికిత్స అందట్లేదు. మహిళలు మౌనంగా బాధపడుతూ ‘బలంగా’ ఉండాలని చెప్పే గతకాలపు సూక్తుల వల్ల కూడా బయటకు చెప్పుకోలేని మధనంలో కాలం వెళ్లదీస్తున్నారనేది నిపుణుల మాట. మహిళల్లో సాధికారత పెరిగితే, ఒంటరితనం సమస్యలు తగ్గుముఖం పడతాయి.గుర్తించకపోవడమే అసలు సమస్య...మన దేశంలో మనస్తత్వ నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మానసిక వ్యాధుల ఆర్థిక భారం దేశంలో 2030 నాటికి లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మహిళల మానసిక సమస్యలను ఒక సమస్యగా గుర్తించకపోవడం కూడా దీనికి ప్రధానకారణం.ఎందుకు ఒంటరితనం అంటే...జీవితం అంతా కుటుంబానికే అంకితం చేయడం. వ్యక్తిగత ఆసక్తులు, స్నేహితులను, కెరియర్ను వదిలేయడం. భర్త బిజీగా ఉండి, ఎమోషనల్గా కనెక్ట్ అవకపోవడం. చుట్టూ అందరూ ఉన్నా మనసులో ఎవరూ లేనట్టుగా అనిపించడం. ఇది చాలా చిన్న విషయం, ఎవరో దీనికన్నా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించడం. ఇవి ఇలాగే కొనసాగితే, జీవితంలో ఉత్సాహం స్థానంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎలా అధిగమించాలంటే..ముందు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సమస్యను ఒక బలహీనతగా చూడకూడదు. నచ్చిన పనులవైపు దృష్టి పెట్టమని చెప్పే ఒక సంకేతంలా భావించాలి. స్వీయ ఆసక్తులు, అభిరుచులవైపు మనసు మళ్లించుకోవాలి. కొత్తగ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలి. అంటే, ఉదయం వేళల్లో యోగా, వాకింగ్ గ్రూప్లలో చేరడం, అభిరుచికి తగిన క్లాసుల్లో చేరితే కొత్త నైపుణ్యాలవైపు దృష్టి మరల్చవచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. దీనివల్ల మైండ్లో చేరిన గ్యాప్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతుంది.ఉద్యోగినులైతే సాయంకాలం ఇంటికి చేరుకున్నాక వెంటనే తమ ఒంటరి ప్రపంచంలోకి వెళ్లకుండా, గంటసేపైనా ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పగలగాలి. లేదా, తమవారితో ఫోన్లోనైనా మనసు విప్పి మాట్లాడగలగాలి. ఎంత పెద్దసమస్య అయినా తన భావాలను ఎవరితోనైనా పంచుకోవాలి. మనసుకు నచ్చిన విషయాలను రాయడం, చదవడం వంటివి కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మహిళలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు. కానీ, తమకోసం తాము జీవించడం నేర్చుకున్నప్పుడు జీవనశైలి కూడా మెరుగవుతుంది. కొత్త గ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలిమనిషి ఇంట్లో ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టు ఫీలయితే ఒంటరితనాన్ని మోస్తున్నట్టే. మనిషి ఎంత దూరంలో ఉన్నా మనసు తమ వారికి దగ్గరగా ఉంటే ఒంటరి కానట్టే. ఇంట్లో తమ ప్రాధాన్యత తగ్గిందనో, ఎవరూ పట్టించుకోవడం లేదనో, ఏదైనా అపరాధన భావనో, సన్నిహితులు దూరమయ్యారనో, ఆర్థిక పరిస్థితులు బాగా లేవనో, బతుకు భారంగా మారిందనో.. అందరిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించే రోజులు పెరిగితే, ఇక జీవితాన్ని చాలించాలనుకునే ఆలోచనలూ పెరుగుతుంటాయి. సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్లలో రెండు నెలల ముందు నుంచే ఆత్మహత్య చేసుకుంటామన్న విషయాన్ని బయటకు ఏదో ఒక రూపకంగా చెబుతుంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంట్లోనూ, సన్నిహితులు అలెర్ట్ అయ్యి, కౌన్సెలర్ సాయం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. – డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కార్ల తయారీలో మహారాణులు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్ను కంపెనీ ప్రారంభించింది.మహిళల చేతుల్లోనే కార్ల తయారీసాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.VIDEO | Manesar: Maruti Suzuki deploys first batch of 200 women employees on car manufacturing assembly line at Manesar plant.India’s largest carmaker has introduced a fully women-run assembly line for producing multiple models, marking a significant step towards inclusion in… pic.twitter.com/OGOzZRs4Wh— Press Trust of India (@PTI_News) March 27, 2026తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
క్షమాపణలు చెప్పనక్కర్లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.ఆ అలవాటుని మార్చుకోవాలిఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.ఆ రోజులు రావాలిసినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.సారీ..అక్కర్లేదుపురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది. -
ఇంకానా... ఇకపై చెల్లదు!
లింగ వివక్ష అనేది ప్రత్యక్షంగా, కనిపించే రూపంలోనే కాదు... చాపకింద నీరులా కూడా తిష్టవేసి ఉంటుంది. అయితే కాలమే ఆ వివక్షను తొలగిస్తూ వెళుతుంది అనే ఆశాభావానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు బలాన్ని ఇస్తోంది. భారత సాయుధ దళాలలో మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హులు అని చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు...‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకునే సందర్భం ఇది!సాయుధ దళాల్లో లింగసమానత్వాన్ని బలోపేతం చేసే చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మహిళా షార్ట్ సర్వీస్ కమీషన్ (ఎస్ఎస్సీ) అధికారులకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హత ఉందని స్పష్టం చేసింది. వ్యవస్థాగత పక్షపాతాన్ని ప్రస్తావించింది. మహిళా ఎస్ఎస్సీ అధికారులకు శాశ్వత కమిషన్ను నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ఉన్నత న్యాయస్థానం ఈ చారిత్రాత్మక సంచలన తీర్పును ఇచ్చింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శాశ్వత కమిషన్కు సంవత్సరానికి 250 మంది మహిళా అధికారులకే అవకాశం ఇవ్వాలనే నిబం«ధన సరికాదు అని చెప్పింది. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకొని ముందుకు సాగేలా, మహిళలకు సమాన అవకాశాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.శాశ్వత కమిషన్ ప్రకారం...షార్ట్ సర్వీస్ కమిషన్లో పది నుంచి పద్నాలుగేళ్లు పనిచేస్తారు. పై స్థాయికి వెళ్లే అవకాశాలు తక్కువ. ఉద్యోగ విరమణ తరువాత పూర్తిగా పెన్షన్ రాదు. ఇక శాశ్వత కమిషన్ విషయానికి వస్తే పదవీ విరమణ చేసే వరకు సేవ చేసే పూర్తి కెరీర్ను అందిస్తుంది. ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చు. సీనియర్ నాయకత్వ స్థానాలలో పలు హోదాలలో చేరవచ్చు. పింఛన్తో సహా అన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులు అవుతారు.లోపాలు ఉన్నాయి...మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడం వివక్షపూరితమని పేర్కొంటూ సైన్యం, నావికాదళం రెండింటిలోనూ మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానం సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కూడా కోర్టు ఎత్తి చూపింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్కు ఎప్పటికీ అర్హులు కారంటూ ముందుగా ఏర్పర్చుకున్న అంచనా ఆధారంగా సరైన ఆలోచన లేకుండా, అజాగ్రత్తగా వార్షిక గోప్య నివేదికలను(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్–ఎసీఆర్) రూపొందించారని కోర్టు పేర్కొంది. మహిళల శాశ్వత కమిషన్కు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని, దీని ప్రభావం మహిళా అధికారులపై పడింది అని చెప్పింది.అలా చేయలేదు...‘తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే కోర్సులు చేయడానికి మహిళా అధికారులను పంపలేదు, అర్హతా ప్రమాణాల ఆధారంగా నియామకాలు (క్రైటీరియా అపాయింట్మెంట్స్) చేయలేదు. వృత్తిలో వారి పురోగతిపై ఇది ప్రభావం చూపింది’ అని లింగవివక్షతను ఎత్తిచూపింది. శాశ్వత కమిషన్కు అర్హులైన మహిళా అధికారులు 20 సంవత్సరాల అర్హత సర్వీస్ను పూర్తి చేసినట్లుగా పరిగణించబడతారని, వారు పింఛన్తోపాటు తత్సంబంధితమైన అన్ని ప్రయోజనాలకు అర్హులు అవుతారని కోర్టు తెలియజేసింది.ఇక ముందు అలా జరగకూడదునిర్మాణాత్మక పక్షపాతాలను తొలగించడానికి, మహిళా అధికారులు నష్టపోకుండా చూసేందుకు సాయుధ దళాలన్నింటిలోనూ అధికారుల పనితీరును అంచనా వేసే విధానాలపై సమగ్ర సమీక్ష జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. మహిళా అభ్యర్థులను ఎన్డిఎ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించాలని 2021లో సుప్రీం కోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. విధాన నిర్ణయం ‘లింగ వివక్షత’పై ఆధారపడి ఉందని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ, సైన్యం వైఖరిని ఖండించింది. అత్యున్నత స్థాయి సైనికాధికారులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఎన్డీఏ 2022లో తొలి విడతగా 10 మంది మహిళా క్యాడెట్లకు స్వాగతం పలికింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. -
‘సుప్రీం’ తీర్పు: మహిళా సైనికాధికారులకు బిగ్ రిలీఫ్
న్యూఢిల్లీ: భారత సైన్యంలో లింగ సమానత్వం దిశగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళా సైనిక అధికారులకు శాశ్వత కమిషన్ (Permanent Commission) కల్పించే విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ, మహిళా అధికారుల హక్కులను కాపాడుతూ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.పెన్షన్ కష్టాలకు చెక్..ఈ తీర్పుతో ముఖ్యంగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లకు (SSCOs), ఈ న్యాయపోరాటంలో భాగస్వాములైన అధికారులకు భారీ ఊరట లభించింది. కేసు విచారణ దశలో ఉండగా, వివిధ కారణాలతో సర్వీస్ నుండి తప్పుకున్న లేదా విడుదలైన మహిళా అధికారులు కూడా ఇకపై పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులని కోర్టు స్పష్టం చేసింది. వారు 20 ఏళ్ల సర్వీసును పూర్తి చేసినట్లుగానే పరిగణించాలని కేంద్రానికి దిశానిర్దేశం చేసింది.ముఖ్యమైన అంశాలుశాశ్వత కమిషన్: మహిళా అధికారులకు ఇప్పటికే మంజూరు చేసిన శాశ్వత కమిషన్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్వర్క్లో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది.పెన్షన్ అర్హత: సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పెన్షన్ సమస్యకు ఈ తీర్పుతో పరిష్కారం లభించింది.బకాయిలు ఉండవు: పెన్షన్ ప్రయోజనాలు కల్పించినప్పటికీ, గత కాలానికి సంబంధించిన జీతభత్యాల బకాయిలను మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.లింగ సమానత్వానికి మరో విజయంసాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని, వారి సేవలను గుర్తిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలవనుంది. కేవలం ఉద్యోగ భద్రత మాత్రమే కాకుండా, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా పెన్షన్ హక్కును కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత సైన్యంలో మహిళా అధికారుల సేవా నిబంధనలను బలోపేతం చేయడంలో ఈ తీర్పు కీలకం కానుంది.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
వేదికపై ఫోటో దిగుతూ గుండెపోటుతో మహిళ మృతి
-
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు. -
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తన పాత వైఖరిని మార్చుకుని, ఇప్పుడు ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయాన్ని అధికారికంగా వివరించనున్నదని తెలుస్తోంది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంటూ ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. ఇటీవలే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కూడా శబరిమల పురాతన ఆచారాలను కాపాడాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు వదిలివేశారు. సీపీఎం నాయకత్వం, ఇతర మిత్రపక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఫలానా వారు ఆలయానికి వెళ్లకూడదని ఏ ఒక్క వర్గం నిర్ణయించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మా వైఖరిలో మార్పు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటేరియట్ నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ఓటర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఉగ్గు’తో ఉసురు తీయకండి! -
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్లను నిర్మించారు. బౌల్డర్ చెక్లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది. -
మహిళా రైతులకు మద్దతిస్తే..!
ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్ మార్కెట్లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ చెబుతోంది.ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.సాధికార మహిళా రైతులువారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఆహార కొరత తగ్గుతుంది.అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది. (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!) -
భార్య ఉరి వేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసిన భర్త.. చివరికి..


