సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించిన మంత్రి నారా లోకేష్కు మహిళలు షాకిచ్చారు. అవనిగడ్డలో బెల్టు షాపుల బాగోతాన్ని లోకేష్ ముందే మహిళలు బయటపెట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకేష్ను మహిళలు నిలదీశారు. మద్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు.
మీ గ్రామంలో మద్యం షాపు ఉందా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. అవనిగడ్డలోని వైన్ షాపు నుంచి తెచ్చి తమ గ్రామంలో మద్యం అమ్ముతున్నారని మహిళలు చెప్పారు. తమ గ్రామంలో బెల్టు షాపు లేకుండా చేయాలని మహిళలు కోరగా.. తాను చూసుకుంటానంటూ అక్కడ్నుంచి మంత్రి లోకేష్ జారుకున్నారు.


