breaking news
Nara Lokesh Babu
-
‘‘వాటికి పుల్ స్టాప్ పెట్టాలంటే లోకేశ్తో రాజీనామా చేయించాలి’’
నగరి: నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ భ్రష్టుపట్టి పోయిందంటూ మాజీమంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి యువజన విభాగం టౌన్ హాల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా చీకటి జీవోలు తెచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వసతి దీవెన వెంటనే ఇవ్వాలి. ఇచ్చేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. అనర్హులైన వారికి ఇచ్చిన ఉద్యోగాలను క్యాన్సల్ చేస్తూ అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. 420 జీవోలు తీసుకువచ్చి ఎగ్జాం లేకుండా ఇంటర్వ్యూ లేకుండా దొంగ సర్టిఫికెట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకున్నారు. అర్హత ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పోరాడుతుంది. zలోకేశ్ విద్యా శాఖ మంత్రిగా ఉండి స్కూల్ పిల్లలకి నాణ్యమైన భోజనం, పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఎంతోమంది కలలు కన్నా తమ జీవితాన్ని కలలుగా మిగిల్చుకుని విద్యార్థులు కూలీ పనులకు వెళ్లే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఈ మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకల్ని మళ్లీ సరి చేసే విధంగా సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. అంతేగాకుండా ఇవన్నీటికీ పుల్ స్టాప్ పెట్టాలంటే లోకేశ్తో రాజీనామా చేయించాలి’’ అంటూ ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
బాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష ...! కొడాలి నాని మాస్ వార్నింగ్
-
జగన్ ను అరచేతితో ఆపేద్దాం అనే.. సొంత భార్య దుస్తులు చించేసే పార్టీ
-
‘బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాత్రమే లోకేష్కు తెలుసు’
ప్రకాశం: విద్యాశాఖ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించింది మాత్రం ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పట్టించుకున్నంతగా విద్యాశాఖని ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదన్నారు. అందుకే వైఎస్ జగన్ పాలనలో విద్యా దీవెన, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్లతో పాటు పోషక ఆహారం కోసం మెనూ రూపొందించి అమలు చేశారన్నారు. ఇప్పటి విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేష్కి ఇవేమీ తెలియదని, కానీ సకల శాఖలో మంత్రిగా ఉంటారని ఎద్దేవా చేశారు. బోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంలో పరిశ్రమ శాఖ మంత్రి భరత్ కనపడలేదు... సకల శాఖా మంత్రి లోకేష్ ఉన్నారు. అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ అబ్బాకొడుకులు గిన్నీస్ బుక్ రికార్డులకి ఎక్కారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ గురించి తెలిసే ప్రదానమంత్రి మోదీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు ప్రవృత్తి దొంగతనం. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. ఒక మాఫియాని లోకేష్ పెంచి పోషించారు. దగా డీఎస్సీలో డిస్ట్రిక్ట్ కమిటీ స్థానం లేదు. అంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. నీట్ పేపర్ లీక్పై జెన్ జెడ్ పోరాటంతో ఎన్డీఏ ప్రభుత్వం కూడా తల వంచింది. లోకేష్ కూడా తలవంచక తప్పలేదు. లోకేష్ చదివిన చదువు నిజమే అయితే ఆ చదువులో నిజాయితీ ఉంటే లోకేష్ రాజీనామా చేయాలి. బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాత్రమే లోకేష్కి తెలుసు. సూట్ కేసు పట్టు.. జాబ్ కొట్టు అనే విధంగా లోకేష్ ప్రవర్తన ఉంది. పేద పిల్లల చదువులకి విలువ లేకుండా చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
కన్న తల్లిని అడ్డంపెట్టుకొని రాజకీయం చేశావు.. నీది ఒక బ్రతుకేనా లోకేష్?
-
లోకేశ్ అవినీతి విలయతాండవం చేస్తోంది
తిరుపతి మంగళం: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండవం చేస్తున్నాయని, ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదలడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని, మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.టీటీడీ పరిధిలోని ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోళ్లలో అమలులో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేశ్ ఒత్తిడితో పాలక మండలి సడలించడం ద్వారా భారీ అవినీతికి తలుపులు తెరిచారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, పరికరాలు, ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని, దాన్ని ఇప్పుడు రూ.25 కోట్లకు తగ్గించారని, కొన్ని విభాగాల్లో రూ.15 కోట్ల టర్నోవర్ సరిపోతుందని నిర్ణయించడం వెనక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని చెప్పారు.నాసిరకం మందులు, వైద్య సామగ్రి సరఫరా చేసే సంస్థలకు అవకాశం కల్పించి కమీషన్లు దండుకోవడమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యమని తెలిపారు. రోగుల ప్రాణాలతో మంత్రి లోకేశ్ చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.ఏమిటా అజ్ఞాత కమిటీ..? మందుల సరఫరా సంస్థల టర్నోవర్ నిబంధన సడలింపునకు ఒక అజ్ఞాత కమిటీ సిఫారసు చేసిందని టీటీడీ పెద్దలు కల్ల»ొల్లి కబుర్లు చెబుతున్నారని, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని ఆ అజ్ఞాత కమిటీ సిఫారసుల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. అదే డాక్టర్ జగదీ‹Ùకు స్విమ్స్, చిన్నపిల్లల ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.టీటీడీ సభ్యురాలిగా ఉన్న ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ యాజమాన్య ప్రతినిధి ఈ అజ్ఞాత కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, లోకేశ్ ఆదేశాల పేరుతో తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. ఈ తీర్మానంపై కూటమి ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, అసలు కుట్రను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కరుణా కర రెడ్డి డిమాండ్ చేశారు. -
లోకేష్ రాజీనామా చేసే వరకు వదలొద్దు Gen-zకి పిలుపు
-
Vijayawada: నారా లోకేష్ పై దండయాత్ర
-
నీకు సిగ్గుంటే సారీ చెప్పు లోకేష్.. నీ వల్ల కంపెనీలు పారిపోయాయి!
-
రెచ్చిపోయిన ఖాకీ గూండాలు అర్ధరాత్రి కలకలం.. విరూపాక్షి ఇంటిపై దాడి
-
షాడో సీఎంగా లోకేష్.. మంత్రులు ఉన్నా.. లోకేష్ పెత్తనం
-
కొబ్బరి కాయ, గుమ్మడి కాయ కట్టింది నువ్వా..? లైవ్ లో సంచలన వీడియోలు వేసి..
-
మోదీ ముందే.. బాబు, లోకేష్ బండారం బట్టబయలు..!
-
వీళ్లేంటో.. వీళ్ళ అడవిడి ఏంటో.. KK రాజు మాస్ ర్యాగింగ్
-
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
లోకేష్ను ప్రశ్నించినందుకు వెంకట్రావుపై అక్రమ అరెస్ట్
-
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న.. పోకిరి డైలాగ్ తో లోకేష్ పై పేర్ని నాని సెటైర్లు
-
ఏం పీకావని శిలాఫలకంలో నీ పేరు పెట్టుకున్నావు.. GMR బదులు లోకేష్ అని పెట్టుకో...
-
దగా డీఎస్సీపై దండయాత్ర
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనల మార్పు, జీవోల మార్పులతో సహా వైఎస్సార్సీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతోపాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్హాల్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. -
దమ్ముంటే మీ బాబుతో రాజీనామా చేపించు లోకేష్ ని ఉతికారేసిన పేర్ని నాని
-
DSC టాపర్ ఉద్యోగం ఎక్కడ..? డబ్బులు తీసుకుని చర్చకు రమ్మంటావా..
-
ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి.. చంద్రబాబు.. లోకేష్ గతి ఏంటి!
-
‘డీఎస్సీ నియామకాల్లో క్రీడా కోటా పేరిట భారీ అక్రమాలు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు, పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నియామాకల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐ తో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...జీవోల రద్దు – అడ్డదారిలో సరికొత్త 'పచ్చ' క్రీడలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా అమలవుతున్న జీవో నెంబర్ 74, 75 ల ప్రకారం ఉద్యోగ నియామకాలలో 2% స్పోర్ట్స్ కోటా అమలు జరిగేది. కానీ, సరిగ్గా డిఎస్సీ ప్రకటన వెలువడే ఏప్రిల్ 19వ తేదీన ఆ పాత జీవోలను రద్దు చేసి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 4, జఏడీ ద్వారా జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. ఈ రెండు జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే... స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడానికి ఎలాంటి డిగ్రీ చదవక్కర్లేదు, టెట్ (TET) రాయక్కర్లేదు, ఆఖరికిడీఎస్సీ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు.టీడీపీ నాయకుల చేతుల్లో క్రీడా సంఘాలు – సర్టిఫికెట్ల విక్రయంఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం చేశారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చే క్రీడా సంఘాలు, అసోసియేషన్ల అధ్యక్షులుగా ఉన్నది ఎవరయ్యా అంటే... కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారి అనుచరులు, టీడీపీ జెండాలు మోసిన నాయకులే! జూడో, సాఫ్ట్ బాల్ వంటి క్రీడా సంఘాల నుంచి ఒక్కో దానికి 38, 39 చొప్పున సర్టిఫికెట్లు ఇప్పించుకుని తమ సొంత మనుషులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.అంతర్జాతీయ మెడలిస్టులకు సున్నామన దేశం, రాష్ట్రం గర్వపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు గ్రౌండ్లో అడుగుపెట్టకుండా, కేవలం నాలుగు కాలేజీలు కలిసి ఆడుకున్న ఆటల్లో బయట కూర్చుని నీళ్ల సీసాలు, బాల్స్ అందించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం.ద్వంద్వ నీతి..30-35 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పి, మరో రెండేళ్లలో రిటైర్ అయ్యే 60 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయులను మాత్రం నైపుణ్య పరీక్షల పేరిట 'టెట్ రాయండి' అని వేధిస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు మాత్రం తన కంటి సైగలతో డిఎస్సీలో 400 చిల్లర మందికి టెట్ లేదు, డిఎస్సీ పరీక్షా లేదు అని అడ్డదారి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇది నిరుద్యోగ యువతను, కష్టపడి చదివిన అభ్యర్థులను తీవ్రంగా మోసం చేయడమే. దొడ్డిదోవన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పొందిన 380కి పైగా నియామకాలను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతిభావంతులకు, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి.వైఎస్సార్సీపీ డిమాండ్లివే... ఈ నేపధ్యంలో జీవో నెంబర్ 4, 47 ల మరుగున జరిగిన ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. విద్యావ్యవస్థను, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
నిన్ను బజారున పెట్టింది నీ కొడుకే... భువనేశ్వరి కి గుబపగిలేలా లక్ష్మీ పార్వతి కౌంటర్
-
Ambati : లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ తీవ్ర డిమాండ్
-
సాక్ష్యాలున్నా లోకేష్ ను విచారించరా? DSC స్కామ్ పై YSRCP ఫైర్
-
లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్..!
-
దొంగ ఉద్యోగాలకు లోకేష్ టోకెన్లు ఇచ్చాడు
-
ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్సీపీ వినతి పత్రాలు
సాక్షి, కృష్ణా జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ.. ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పించింది.ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడుతూ.. డీఎస్సీలో అనర్హులలకు ఉద్యోగాలు ఇచ్చారని... లోకేష్ రికమండ్తో కొంత మంది ఉద్యోగం పొందారని.. నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నిలదీశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు లూటీ చేశారన్న పేర్ని నాని.. 16 వేల మందిలో దొంగ టీచర్లు కూడా ఉన్నారన్నారు.అన్నమయ్య జిల్లా: డీఎస్సీలో జరిగిన అక్రమాలను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. మదనపల్లి జాయింట్ కలెక్టర్కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారు. అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది’’ అని ఆయన మండిపడ్డారు.అనంతపురం జిల్లా: డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ టీడీపీ నేతలు అమ్ముకున్నారని.. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మంత్రి నారా లోకేష్కు పదవిలో కొనసాగేందుకు ఒక్క క్షణం కూడా అర్హత లేదని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు.వైఎస్సార్ జిల్లా: కడపలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరపాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్నపత్రాల అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనం. డబ్బులు ఇచ్చిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ నిలదీసింది. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. -
అవును జగన్ చేసాడు... భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు, లోకేష్ కు ఇచ్చిపడేసిన కారుమూరి
-
సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్
-
నారా లోకేష్ కు బిగ్ షాక్.. ప్లాన్ రెడీ చేసిన DSC అభ్యర్థులు
-
‘డీఎస్సీలో అక్రమాలు నిజం.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్నీ కోతలే.. ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘విద్యా వ్యవస్థను భష్టు పట్టించేందుకే లోకేష్కి ఆ శాఖ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి..? అక్రమాలు జరిగాయి కాబట్టే.. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. లోకేష్తో చర్చించేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని పంపిస్తాం.. లోకేష్ రాగలడా..?. మేము అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పాలి. అబద్ధానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబే. ఎమ్మెల్యే సోమిరెడ్డి జీవితం గురించి ఒక పుస్తకం రాయొచ్చు’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ నేతల విమర్శలకు భయపడే రోజులు పోయాయి. ధర్మేంద్ర ప్రధాన్కి నైతిక విలువ ఉన్నాయి కాబట్టే రాజీనామా చేశారు. నారా కుటుంబానికి నైతిక విలువలు ఉండవని లోకేశ్ నిరూపించారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి.. రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్నాం’’ అని కాకాణి పేర్కొన్నారు. -
కార్యకర్తల ముందు తొడ కొట్టడం ఏంటి.. ఇదేమన్నా నీ మామ సినిమా అనుకుంటున్నావా
-
మెగా డీఎస్సీ స్కామ్పై జెన్జీ వార్!
సాక్షి, అమరావతి: ‘నీట్’ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే.. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేశ్ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గు చేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు ఎన్నో ఉదంతాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాల పర్వం.. మెగా డీఎస్సీ 2025 ప్రక్రియ మొదలు పెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నియమితుడైన కన్వీనర్ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్ లోడింగ్ను, డిజిటలైజేషన్ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్ జిల్లా టాపర్గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? డీఎస్సీ రిక్రూట్మెంట్ను భ్రష్టు పట్టించడానికి లోకేశ్ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లో ప్రదర్శించాల్సిన మెరిట్లిస్ట్ ఎందుకు పెట్టలేదు? టాప్ ర్యాంకర్గా వచ్చిన నవీన్ను తీసేసి రెండో లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి నవీన్ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో దొడ్డి దారిన అమ్మేశారు.. స్పోర్ట్స్ కోటా కోసం జీవో 74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేశ్ మంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్ 19న ప్రకటన చేయటానికి గంట ముందు స్పోర్ట్స్ కోటా కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో జీఏడీ జీవో 47 ఇచ్చింది. అందరితోపాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్, డీఎస్సీలు రాయాల్సిన పని లేదని పేర్కొంది. మెగా డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని, 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి, మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు. అడ్డగోలుగా సర్టిఫికెట్లు.. వాటితో ఉద్యోగాలు కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా 38 మంది టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేశ్ తోడల్లుడు భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్ నంబర్ కనిపిస్తున్నా.. ఎఫ్ఐఆర్లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేశ్ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదు? సీబీఐ విచారణ జరగాల్సిందే: పేర్ని నానిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా వైఎస్ జగన్ ఇంటి గేటు బయట నిలబడ్డా! పిలిచాను! ఆయన రాలేదు! అని సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చిన డబ్బులతో స్కూల్ కడితే విద్యాశాఖను మార్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ‘రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది..?1. ప్రశ్నపత్రాల తయారీతోపాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించడం పారదర్శకతకు పాతర కాదా?2. ప్రశ్నల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం పేపర్ లీకేజీకి పునాది కాదా?3. ఔట్సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో ఆరో ర్యాంకర్గా నిలిచాడు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకులు రావడం పేపర్ లీకేజీని నిర్ధారిస్తోంది. ఆ తర్వాత నవీన్కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ లిస్టు నుంచి పేరు తొలగించారు. డేటాను మాయం చేసి కాల్లెటర్ కూడా పంపలేదు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన పేపర్తో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బు చేతులు మారింది? వీటిపై విచారణ ఏది?4. జీవో నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతంగా ఉండేది. ఇతర అభ్యర్థులతో సమానంగా అన్ని అర్హతలు కలిగి, సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరి. కానీ డీఎస్సీ 2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్షను ఎత్తివేశారు. కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేయగానే జీవో నంబర్లు 4, 47ను రద్దు చేసి, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 56 జారీ చేశారు.మొదట ఇచ్చిన జీవోలు సరైనవే అని అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దుచేస్తూ జీవోలు ఎందుకు తెచ్చారు? అంటే.. తమవారితో పోస్టులు నింపడానికి గేట్లు తెరిచి, పని పూర్తికాగానే మళ్లీ మూసేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి.. ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో సర్టిఫికెట్లు చూపించి నియామకాలు చేపట్టారు. 5. సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే. సర్టిఫికెట్లు ఇచ్చేదీ వారే. ఇక పారదర్శకత ఎక్కడుంది?6. ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యను 1 : 1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టారు.7. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపారు. వీడియోలో ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించినా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారు. బలమైన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై వదిలేశారు. ఇది కుంభకోణం వెనుక పెద్దల ప్రమేయానికి రుజువు కాదా? -
‘డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు.ఇసుక దోపిడీకి బాధ్యత వహిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను కూడా సిద్ధమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం:టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జీవోలను మార్చారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను మా పార్టీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ నియామకాలలో మెరిట్ లిస్టులు, రోస్టర్లు బహిరంగంగా ప్రకటించలేదు. ఇది పారదర్శకత లోపానికి నిదర్శనం. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.కొండపిలో టీడీపీ నాయకుల ఇసుక అక్రమ మైనింగ్:రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దోపిడీకి పాల్పడుతోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ఆధారాలతో అక్రమ ఇసుక తవ్వకాల అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.మైనింగ్ శాఖ అధికారులే స్వయంగా టిడిపి మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇంచార్జులు, మాజీ ఎంపిపిల పేర్లను (అనుమోలు సుధా, పోకూరి రవి, దాసరి కృష్ణారావు, ఎర్ర నరేంద్ర, కొండగుంట శ్రీనివాసరావు మొదలైనవారు) రాస్తూ, వీరిపై పిడి యాక్ట్ పంపాలని లేదా మండల బహిష్కరణ చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినా, స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ టీడీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల పేర్లతో పోలీసులకు లేఖలు రాసి, వారిపై పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ అవి అమలు కాలేదు. హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రాలేదు.మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాజీనామా చేయాలి:కొండేపి నియోజకవర్గంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్పై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. హైకోర్టు ఆదేశాలు, మైన్స్ శాఖ నివేదికలు, అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి ఆదేశాలతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా సీఎం చంద్రబాబే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి క్యాబినెట్ అంతా ‘దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నడుస్తోంది. యువత మరియు ప్రజల హక్కు సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. -
సీదిరి అప్పలరాజును కూటమి ఎందుకు టార్గెట్ చేసింది
-
నిజంగా దమ్ముంటే.. పేర్ని నాని ఓపెన్ ఛాలెంజ్
-
ఫస్ట్ ర్యాంక్ నవీన్ గురించి బయట పెట్టండి..! బాబు, లోకేష్ పై పేర్ని నాని ఫైర్
-
డీఎస్సీలో అక్రమాలు.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఎస్ఈఆర్టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్ఈఆర్టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్ని టాపర్గా ప్రకటించి మళ్ళీ లిస్ట్లో మార్పులు చేశారు. నవీన్ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్కి దమ్ముంటే దేవాన్స్కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
జగన్ కు ఛాలెంజ్ చేస్తావా..? ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేవి.. నీకు నేనే ఎక్కువ
-
లోకేశ్ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే..YS జగన్ ట్వీట్..
-
లోకేష్ కు ఏపీ జెన్ జీ వార్నింగ్
-
కదిలిన YSRCP యువత.. లోకేష్ వెన్నులో వణుకు.. రాజీనామా చేస్తాడా..?
-
కూటమి సర్కార్కు బిగ్ షాక్.. టాటా పవర్ గుడ్బై!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి టాటా పవర్ భారీ పెట్టుబడి ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోతున్నట్టు ఎకనామిక్ టైమ్స్లో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రానికి రావాల్సిన రూ.6,675 కోట్ల పెట్టుబడి చేజారిపోవడం పారిశ్రామిక విధానాల్లో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది.నెల్లూరులో ఏర్పాటు చేయాల్సిన టాటా పవర్ ఇంగాట్-వేఫర్ యూనిట్ (10 గిగావాట్ల సామర్థ్యం) కోసం గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఒడిశాకు తరలిపోతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులు తీసుకురావడంలో గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం.. ఇలా వచ్చిన పెట్టుబడులను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడింది.గతంలో టాటా పవర్ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అంటూ పచ్చ పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు ఇతర రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం, వాస్తవంగా ఉన్న పరిశ్రమలను నిలబెట్టడంలో విఫలమవుతోందని విమర్శించింది.ఏపీ కంటే ఒడిశా పారిశ్రామిక విధానాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు అక్కడికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యలు చేసింది. పారిశ్రామిక విధానాల్లో ఏపీ కంటే ఇతర రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో రాష్ట్ర స్థానం దిగజారడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించింది. అయితే, ప్రాజెక్టు మార్పునకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
చంద్రబాబులో టెన్షన్.. ఏపీలో యువత తిరుగుబాటు.. లోకేష్ రాజీనామా?
-
అసలు మెగా DSC స్కామ్ ఎలా బయటపడిందంటే.. విద్యార్థుల కళ్ళు తెరిపించే వీడియో..
-
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
-
లోకేష్ మేము రెడీ మీరు రెడీనా..? లైవ్ లో DSC అభ్యర్థి ఓపెన్ ఛాలెంజ్
-
ఢిల్లీ సీన్ రిపీట్.. జగన్ కు సవాల్ విసరడం కాదు.. దమ్ముంటే డిబేట్ కు రా
-
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలు విజయవంతమవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల వీడియోలను జతచేస్తూ ‘నారా లోకేశ్ మస్ట్ రిజైన్’ హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..‘డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్–జెడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు.ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వంం.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కానీ ఇప్పటి వరకు వాటిపై నోరు మెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు.రేపు శ్రీకాకుళానికి వైఎస్ జగన్ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పరామర్శసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. -
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని చంద్రబాబు, లోకేశ్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో వారికి మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్పై చూపలేదని చంద్రబాబు, లోకేశ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
DSC స్కాంపై సీబీఐ విచారణ..? లోకేష్ రాజీనామా..? ఏపీలో వేడెక్కిన రాజకీయం!
-
‘లోకేష్.. చాలెంజ్ చేసి పారిపోవడం సిగ్గుచేటు’
తాడేపల్లి : ఏపీ మంత్రి నారా లోకేష్వి ఉత్తర కుమార ప్రగల్భాలని, చాలెంజ్ చేసి పారిపోవడం ఆయనే చెల్లిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధథి పుత్తా శివశంకర్ విమర్శించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రగల్భాలు పలకడం నిజంగా సిగ్గుచేటన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే భయంతో సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేశారని, అదే ఎన్డీయేలో భాగమైన టీడీపీ మంత్రి డీఎస్సీ అక్రమాలపై ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ‘నారా లోకేష్ వ్యవహార శైలిపై జెన్ జీ ఆగ్రహంతో ఉంది. అందుకే ఈరోజు మా పార్టీ నిర్వహించిన నిరసనల్లో జెన్ జీ పెద్ద ఎత్తున పాల్గొంది. జెన్ జీ రెస్పాన్స్ చూసి టీటీడీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారలతో సహా బయట పెట్టారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయారు. నారా లోకేష్ ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప సరైన సమాధానమే చెప్పలేదు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే నారా లోకేష్ తోక ముడిచారు. జగన్కు ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్కు మా పార్టీ అధికార ప్రతినిధులు చాలు. మే8వ తేదీన నారా లోకేష్కు పేర్ని నాని ఓపెన్ చాలెంజ్ చేశారు. అయినా సరే లోకేష్ స్పందించలేదు. ఇప్పటికైనా లోకేష్ స్పందించి పేర్ని నానితో చర్చకు రావాలి.. లేదంటే జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
రాజీనామా చేసే వరకు.. తరిమితరిమి కొడతాం లోకేష్ కు యువజన విభాగం వార్నింగ్
-
రాజమండ్రిలో హైటెన్షన్.. YSRCP ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
-
మంత్రి పదవికి నువ్వు పనికిరావు లోకేష్పై తోపుదుర్తి ఫైర్
-
దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు)
-
మీరు మీరు ఒకటేగా... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నువ్వు కూడా
-
పేకాట అడినోళ్లకే ఉద్యోగం.. గుంటూరు యువత వినూత్న నిరసన
-
DSC స్కామ్ ను బట్టబయలు చేసిన నెల్లూరు YSRCP నేతలు
-
నేను వస్తా... దమ్ముంటే రా.. ఆఫాల్ మొదటి సారి ఎమ్మెల్యే గాడివి...!
-
డీఎస్సీపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
-
నారా లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణాజిల్లా: డిఫాక్టో సీఎం లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే చర్చకురండని సవాల్ చేయడం కాదు.. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.‘‘విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించా అంటాడు. రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జీ కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావ్. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాల పై నాతో చర్చకు రా. నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డీఎస్సీ దిక్కుమాలిన డీఎస్సీ. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లలో ఎందుకు మెరిట్ లిస్ట్లు పెట్టలేకపోయారు. గోల్డ్ మెడల్ కొట్టినోడికి కాకుండా పాల్గొన్నవారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా. మీరు రాజీనామా చేసి ఇవ్వండి ఆయనకు మంత్రి పదవి’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
ఒక అంబేద్కర్.. ఒక అబ్దుల్ కలాం.. ఒక నేను.. చంద్రబాబు పై కొండా రాజీవ్ గాంధీ మాస్ ర్యాగింగ్
-
కెమెరాకి కనపడకుండా ప్లేట్లు పైకి... తండ్రి కొడుకు నాటకాలు.. మొత్తం బయటపెట్టిన అడ్వకేట్ రజిని
-
జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు..! నీకు మంత్రి పదవి అవసరమా..?
-
‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై విచారణ జరిపించాలని.. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ఆమె మండిపడ్డారు. డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్సీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, రిక్రూట్ మెంట్లో అనర్హులకు పట్టం కట్టారు. 420 జీవో తీసుకొచ్చి.. 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని ఆర్కే రోజా తేల్చి చెప్పారు.‘‘191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు మూడు వేలు భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. కోటిన్నరకు పైగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జగనన్న ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబును అడుగు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళలు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చంద్రబాబు.. నీ కొడుకు లోకేష్తో రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది..లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుంది. జగనన్న పాలనలో లక్ష 30 వేల పోస్టులు. ఆంధ్రజ్యోతి పేపర్కు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం బయట పడింది. చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది. ఆడ పిల్లలలపై అత్యాచారం జరిగితే కేసులు లేవు. భజన పత్రికలు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్ర మంత్రికే ఈ పరిస్థితి.. లోకేష్ ఎంత?
-
యువత ఆందోళనలతో లోకేష్ కు టెన్షన్
-
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!
-
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్
-
ఏపీలో భారీగా మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
సాక్షి,అమరావతి: ఏపీలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా యుడైస్ (UDISE+) నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో పాఠశాలలు మూతపడటంతో పాటు, లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రంగా నిర్వీర్యమవుతోందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ కేంద్ర విద్యాశాఖ ఈ అధికారిక గణాంకాలను బయటపెట్టింది.యుడైస్ నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండేళ్లలో మొత్తం 972 పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలు కాగా, 194 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇందులో సింహభాగం.. అంటే ఏకంగా 644 పాఠశాలలు కేవలం గత ఒక్క ఏడాది కాలంలోనే మూతపడటం గమనార్హం. గతంలో 45,000 గా ఉన్న ప్రభుత్వ బడుల సంఖ్య ఇప్పుడు 44,222 కి పడిపోయింది. గతంలో 991గా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల సంఖ్య ప్రస్తుతం 797కి క్షీణించింది. పాఠశాలల మూతతో పాటు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు ఊహించని స్థాయిలో పడిపోయింది. 2023-24 విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు చదువుతుండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 34.93 లక్షలకు తగ్గిపోయింది. అంటే గడిచిన రెండేళ్లలోనే 5.86 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లిపోయారు.'నాడు-నేడు', 'మధ్యాహ్న భోజనం' నిర్వీర్యమే కారణమా?గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల రూపురేఖలను మార్చడానికి ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ మౌలిక వసతుల కల్పన కార్యక్రమం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ‘మధ్యాహ్న భోజన పథకం’ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. బడుల్లో కనీస మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే పేద తల్లిదండ్రులు సైతం అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు బండారాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికే క్షేత్రస్థాయి గణాంకాలతో సహా బహిర్గతం చేయడం గమనార్హం -
సమస్యలు చెప్పుకోవడాని వస్తే .. పట్టించి కోకుండా పారిపోయిన లోకేష్
-
సిగ్గులేని జన్మ.. దరిద్రపు పార్టీ.. నువ్వు నీ కొడుకు తప్పుడు మనుషులు...
-
ఏపీలో Gen-Z తుఫాన్ నారా మోసం అంతా ఇంతా కాదు
-
పేపర్ లీక్ చేసినందుకు శిక్ష పడాల్సిందే.. లోకేష్ కు రాజీనామా డిమాండ్స్
-
Dsc పరీక్షలో అవకతవకలు జరిగాయి.. స్కామ్ ని పిన్ టూ పిన్ వివరించిన నాగార్జున యాదవ్
-
లోకేష్ రాజీనామా చేయకుంటే AP దద్దరిల్లిపోద్ది..
-
లోకేశ్.. మీ సంగతేంటి!?
సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.లోకేశ్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
లోకేశ్.. మీరు రాజీనామా చేయరా?
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని జెన్ జీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్ పేపర్ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డీఎస్సీ–2025 కుంభకోణం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది.డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్మాల్పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, బాబు ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించక పోవడంపై ఏపీ జెన్ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీట్ తరహాలోనే డీఎస్సీ స్కామ్పై చంద్రబాబు ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీస్తోంది. సీబీఐ వంటి థర్డ్ పార్టీ దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని నినదిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, నష్టానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన్ను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏపీ జెన్ జీ పట్టుపడుతోంది. లీక్ను కప్పిపుచ్చే యత్నం 16 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహించింది. ప్రశ్నపత్రం రూపకల్పన నుంచే డీఎస్సీ స్కామ్కు బీజం వేసినట్టు జరిగిన తతంగం స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రం రూపకల్పన, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షల్లో కృష్ణా జిల్లా టాపర్గా నిలిచాడు. టీజీటీ పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టాప్ ర్యాంకర్గా నిలిచాడని తెలిస్తే డీఎస్సీ పేపర్ లీక్ బట్టబయలు అవుతుందని ప్రభుత్వమే లీక్ను కప్పిపుచ్చే ప్రయత్నానికి పూనుకుంది.నీట్ పేపర్ ఎన్టీఏ ప్యానెల్ సభ్యుల నుంచి లీక్ అయినట్టే ఏపీ డీఎస్సీ ప్రశ్నపత్రం తయారైన దగ్గరే లీక్ అయిందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర విచారణ చేపట్టలేదని, లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో ఎందుకు గుర్తించలేదని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నవీన్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు 1ః1 ప్రాతిపదికన సరి్టఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించాక కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మంది ప్రతిభావంతులకు వెన్నుపోటు పొడిచారు. నియామక ఉత్తర్వుల జారీలోను అర్హులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇలా నష్టపోయిన అభ్యర్థులు పక్కా ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. డీఎస్సీ–2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీచేసిన జీవో నెం.23 బేరసారాల సాక్ష్యాలు బయటపడ్డా గప్చుప్ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెగా స్కామ్ ఏపీలో చోటు చేసుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే స్కామ్ పాలసీలో భాగంగా జీవో 4.. 47 ప్రభుత్వం తెచ్చింది. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టులను కట్టబెట్టే దగాకోరు విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలతో సత్తా చాటిన వారిని కాదని చంద్రబాబు బంధువు ఎంపీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి వంటి వారు చైర్మన్లుగా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ పోస్టులు ఇచ్చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో సాక్ష్యాలు బయటపడ్డాయి. జిల్లా, కాలేజ్, విశ్వవిద్యాలయం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా, కేవలం పోటీల్లో పాల్గొన్నారనే సరి్టఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంతా స్కామ్గా మారినట్లు కళ్లెదుటే సాక్ష్యాలు, నష్టపోయిన అభ్యర్థులు కనిపిస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.స్పోర్ట్స్ కోటా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టే నీట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను నిందితులు అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వాట్సప్ గ్రూప్లు, డిజిటల్ ఆధారాలతోనే సీబీఐ నిందితులను పసిగట్టి జైలుపాలు చేసింది. ఇదే రీతిలో టీచర్ పోస్టుల అమ్మకానికి బేరసారాలాడిన వ్యక్తుల ఫోన్ నెంబర్, ఆడియో రికార్డింగ్తో సహా పక్కా ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై నిష్పపక్షపాత విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయట పడుతుందని జీవో 4.. 46 రద్దు చేసి అక్రమాలను ప్రభుత్వమే కప్పి పెట్టేందుకు పూనుకుందని యువత విమర్శిస్తున్నారు. జీవితాలతో చెలగాటంవైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించింది. ఏపీలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కల అయిన డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంది. డీఎస్సీ స్కామ్ గురించి ప్రజల్లో చర్చకు వచి్చనప్పుడల్లా డైవర్షన్ రాజకీయం చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలు, ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక అవాస్తవాలతో అసలు విషయాన్ని దాటవేస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి హామీతో గద్దెనెక్కి స్కామ్ల డీఎస్సీతో చంద్రబాబు సర్కారు తమ భవిష్యత్తో చెలగాటం ఆడిందని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. -
DSC పేపర్ లీక్.. నారా లోకేష్ రాజీనామ చెయ్యాల్సిందే.. పుష్ప శ్రీ వాణి డిమాండ్
-
‘లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
కాకినాడ: డీఎస్సీ స్కామ్పై అన్ని ఆధారాలు చూపించామని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ ఒక్కటే సరైనదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని ఆధారాలతో సహా చూపించామని, అయినా ఇప్పటివరకూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదన్నారు. లోకేష్ గతంలో చాలెంజ్ విసిరితే తాము సిద్ధమయ్యామని, మీరు మాత్రం తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. యువత పోరాటానికి కూటమిలో బీజేపీ మంత్రి నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. మరి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలిన తర్వాత లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. లోకేష్ నైతిక బాధ్యత లేదా? అని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని కన్నాబాబు ప్రశ్నించారు.డీఎస్సీలో స్కామ్ అనేది నిజంవిజయవాడ: డీఎస్సీలో పెద్ద స్కామ్ జరిగిందనేది వాస్తవమని, మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ అని యువతే అంటున్నారని ఎమ్మెల్యే కల్పలతరెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చింది ఆరోపణలు కాదని, నిజం అనే విషయం తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారని, అందుకోసం జీవోలు మార్చారని మండిపడ్డారు. నిజంగా డిఎస్పీ కోసం చదివిన అభ్యర్ధులు మాత్రం నష్టపోయారని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయడాలని డిమాండ్ చేశారు. ఒక్కో పోస్ట్కి రూ. 15 లక్షలు అంటూ ఆడియోలు కూడా వచ్చాయని, ఇది వాస్తవం కాదా? అని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ రాజీనామా..? కేంద్రంతో YSRCP చర్చ..!?
-
రాజీనామా చెయ్ లోకేష్... నువ్వు విద్య శాఖ మంత్రిగా పనికిరావు..!
-
‘తప్పు చేయకపోతే.. లోకేష్కు ఎందుకంత భయం’
సాక్షి, నెల్లూరు జిల్లా: నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఇంతపెద్ద అవినీతి జరిగితే నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరు? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ కోరితే కనీసం జరిగిన అక్రమాలపై స్పందన లేదని మండిపడ్డారు.‘‘డీఎస్సీ అక్రమాలపై గత 4 నెలలు నుంచి పోరాటాలు చేస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ వేయలేదు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున పోరాటం చేసింది. డీఎస్సీ అవకతవకల వైఎస్సార్సీపీ సాక్ష్యాధారాలతో చూపింది. నేటికి ఒక్క అంశంపై పారదర్శకమైన విచారణ కానీ.. స్పందన కానీ లేదు. లోకేష్ ఏ తప్పూ చేయకపోతే.. సీబీఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయం?’’ అంటూ చంద్రశేఖర్రెడ్డి నిలదీశారు. -
నీట్ తరహాలో ఏపీ డీఎస్సీలో అక్రమాలు
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువత తిరగబడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థి పోరాటాలు నిరూపించాయని భూమన గుర్తుచేశారు. దేశంలో నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షల్లోనూ అడ్డగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తూ.. డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులను కూడా వదలకుండా విక్రయించారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకుంటూ లోకేష్ రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. తప్పు చేయడం కంటే అవినీతికి పాల్పడటం అత్యంత ప్రమాదకరమని, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. -
ధర్మేంద్ర ప్రధాన్ సంగతి ఓకే.. పేపర్ లీకేష్ లోకేష్ రాజీనామా ఎప్పుడు?
-
బీజేపీని వదిలి సీజేపీతో టీడీపీ పొత్తు..? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
లోకేష్ రాజీనామా చేయాలంటూ జగన్ సంచలన ట్వీట్
-
AP బొద్దింకలు సిద్ధం! నెక్స్ట్ వేసేది నిన్నే.. Gen-Z గుప్పిట్లో బాబు, లోకేష్
-
ఎన్నో సాక్ష్యాలున్నా డీఎస్సీ స్కామ్పై బుకాయింపా?
సాక్షి, అమరావతి: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టెట్, డీఎస్సీ పరీక్ష, అసలు డిగ్రీనే లేకున్నా బరితెగించి టీచర్ పోస్టులు కట్టబెట్టడంపై సాక్షాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నాపత్నం అప్లోడ్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టు సిబ్బందే డీఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవడం.. మొదటి జాబితాలో ఉన్న వారి పేర్లు రెండో జాబితాలో మాయం కావడం.. ఆపై అభ్యర్థి కోర్టుకు వెళ్లడం.. అతని ఐడీని బ్లాక్ చేయడం.. ఒక్కో పోస్టు రూ.15 లక్షలు అంటూ అంగట్లో సరుకులా బేరం పెట్టి అమ్మిన ఆడియోలు బట్టబయలు కావడం.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం.. కేవలం జిల్లా, జోన్ స్థాయి ఆటల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం.. ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇవ్వడం.. ఇలా ఎన్నో సాక్ష్యాధారాలు స్కామ్ను బట్టబయలు చేశాయి. ఈ స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ చేసిన విన్యాసాలు.. తప్పుమీద తప్పులు చేయడాలు.. అధికారులతో అబద్ధాలు చెప్పించడాలు అందరికీ తెలిసిందే. ఇంత అరాచకంగా, లెక్కలేనితనంతో సాగించిన ఈ స్కామ్.. నీట్ పేపర్ లీక్ కంటే రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. డీఎస్సీ బాధితులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినప్పటికీ బాబు సర్కార్ కనీస బాధ్యత వహించలేదు. తాజాగా నీట్ లీక్కు బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేసిన క్రమంలో డీఎస్సీ స్కామ్కు లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు.జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్యాయం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2025ను బాబు ప్రభుత్వం నిర్వహించింది. 16 వేల పోస్టుల్లో 3 శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వు చేసింది. స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమాలకు పాల్పడి కావాల్సిన వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ కుంభకోణం కోసమే జీవో 4.. 47 తెచ్చారు. తద్వారా టెట్, రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టు కట్టబెట్టే దారుణానికి బరితెగించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ చంద్రబాబు బంధువు.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్మేసుకునే బేరసారాలకు సంబంధించిన వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చాయి. మరోవైపు సాధారణ డీఎస్సీ కింద టీచర్ పోస్టుల భర్తీలోను పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్పోర్ట్స్ డీఎస్సీ కుంభకోణంతో నిజమైన క్రీడాకారులం నష్టపోయామని ఎందరో రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన తనకు టీచర్ ఉద్యోగం రాలేదని పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు దుర్గయ్య వంటి వారెందరో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్లకు ఉద్యోగాలన్నీ ఇచ్చేసుకున్న తర్వాత జీవో 23.. 25.. 56 జారీ చేసి.. అంతకు ముందు ఇచ్చిన జీవో 4.. 47ను రద్దు చేసేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ రూపంలో జరిగిన స్కామ్ రాష్ట్ర ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దుర్గయ్య తరహాలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులెందరో స్పోర్ట్స్ డీఎస్సీలో దగాకు గురయ్యారు. నష్టపోయిన వీరంతా తమకు అన్యాయం జరిగిందని ఎక్కడికక్కడ నిలదీసినా చంద్రబాబు సర్కార్లో కనీస చలనం లేదు. ఐడీ బ్లాక్ చేసి.. వివరాలు తొలగించి..ఈ కుంభకోణం కోసమే పక్కా స్కెచ్లో భాగంగా డీఎస్సీ కన్వీనర్ను చంద్రబాబు ప్రభుత్వం తొలుతే పక్కన పెట్టేసింది. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించింది. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. డీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నవీన్ విషయం బయటకు వస్తే గుట్టురట్టు అవుతుందని అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని చెప్పింది. తీరా అతని ఐడీని బ్లాక్ చేసి.. వివరాలు డీఎస్సీ డేటాలోనే లేకుండా ప్రభుత్వం చెరిపేసి కుట్రకు పాల్పడింది. అయితే మెరిట్ సాధించినా తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ కోర్టును ఆశ్రయించడంతో బాబు సర్కార్ కుట్రలు బెడిసికొట్టాయి. ఈ ఘటన అనంతరం డీఎస్సీ పేపర్ లీక్.. నవీన్ ఒక్కడితో ఆగలేదని, సీబీఐ విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. 1:1 నిష్పత్తిలో పిలిచి మొండి చేయిడీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోస్టుల భర్తీకి 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని.. డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్ను సిద్ధం చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధన ఆధారంగా ఒక పోస్టుకు ఒకరి చొప్పున కాల్ లెటర్ పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచింది. ఈ క్రమంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చిన అభ్యర్థుల్లో పలువురికి పోస్టులు దక్కలేదు. సెలక్షన్ లిస్ట్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పించారు. ఇలా డీఎస్సీ ప్రక్రియలో ఆద్యంతం అక్రమాలు, అన్యాయాలు, బరితెగింపులు చోటు చేసుకున్నాయి. జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాలతో బట్టబయలు అయింది. నష్టపోయిన అభ్యర్థులు కళ్లెదుటే కనిపిస్తున్నారు. వారంతా సీబీఐ విచారణ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చాలని, లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయింది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో లోకేశ్ సైతం అదే బాటలో రాజీనామా చేసి, డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహించాలని రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు.వీటినేమంటారు?⇒ స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిఫేట్ చేసిన సర్టిఫికెట్స్తో 270 పోస్టులు ఇచ్చేశారు. ⇒ ఆయా గేమ్స్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటెన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.⇒ వివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వివిధ యూనివర్సిటీల నుంచి పార్టిసిపేట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ⇒ ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షలు అంటూ బేరసారాలు ఆడిన వీడియో బయటపడింది. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం అన్నింటికంటే దారుణం. ⇒ ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్లిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. అందుకే థర్డ్ పార్టీ ఎంక్వైరీ.. అంటే సీబీఐతో విచారణ జరిపించాలి. -
నారా లోకేశ్ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే..: వైఎస్ జగన్
తాడేపల్లి: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్లో చంద్రబాబును ప్రశ్నించారు.‘‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2026 -
‘నారా లోకేష్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి’
తాడేపల్లి: నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీనేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీనేతలు మీడియాతో మాట్లాడారు.వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీనేతలు ఏమన్నారంటే..డీఎస్సీ దగాకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలిగుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రినిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతూ డీఎస్సీ నియామకాలను వివాదాలమయం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక తప్పించుకోలేరు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత లోకేష్పై లేదా? డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? అభ్యర్థులకు న్యాయం చేసేది ఎవరు? లోకేష్ ఇంకా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? రాష్ట్ర నిరుద్యోగ యువత అడుగుతున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.ఎన్డీఏలో ఒక న్యాయం.. ఏపీలో మరో న్యాయమా?: పేట్ల ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యేనీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డీఎస్సీలో జరిగిన అక్రమాలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా చంద్రబాబు, లోకేష్ స్పందించడం లేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారుబింగి హరికిరణ్రెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీఅధికార ప్రతినిధిమెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థుల కలలను ఛిద్రం చేసింది. డీఎస్సీలో జరిగిన అవకతవకలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడటం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలి. యువత రోడ్డెక్కే పరిస్థితి రాకముందే నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలిమద్దూరు సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీరాష్ట్ర కార్యదర్శిడీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ సహా తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్కు ఏమాత్రం నైతికత ఉన్నా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ వ్యవహారంలోని వాస్తవాలను ప్రజల ముందుంచాలి.కేంద్రంలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా?: బెందాళం పద్మావతి, వైఎస్సార్సీపీరాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకల ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడకపోవడం దారుణం. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత ఆ డేటా తొలగించడం, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ప్రశ్నించినా చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.చంద్రబాబు, లోకేష్ స్పందించకపోవడం దారుణం: తాలే రాజేష్, వైఎస్సార్సీపీరాజాం నియోజకవర్గ సమన్వయకర్తడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు బయటపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిబంధనల మార్పు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, విద్యాశాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదుచిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యేడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు, విద్యాశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, నిబంధనలను మార్చి నియామకాలు చేపట్టారన్న అంశాలపై వాస్తవాలను బయటపెట్టాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. -
‘డీఎస్సీలో అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి’
ప్రకాశం: డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు. ఆంధ్రాలో డీఎస్సీలో అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ పదవిలో ఉండటానికి వీల్లేదన్నారు. లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత ఉద్యమించాలన్నారు. ఈ నెల 28వ తేదీన లోకేష్ రాజీనామా కోరుతూ ఆంధోళనలను ప్రారంభిస్తామన్నారు జూపూడి. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించి...లోకేష్ రాజీనామా కూడా చేయాలన్నారు. రాష్టంలోను కాక్రోచ్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జూపూడి. -
‘డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్’
సాక్షి, తాడేపల్లి: నీట్ పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ఏపీ జెన్-జి అడుగుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారు. చంద్రబాబు ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నారు.లోకేష్ కనీసం ప్రెస్మీట్ పెట్టలేకపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మేం స్వాగతిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ను ఆదర్శంగా తీసుకుని లోకేష్ కూడా రాజీనామా చేయాలి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. డీఎస్సీ అవకతవకలపై 300లకు పైగా కేసులు కోర్టులో ఉన్నాయి. డీఎస్సీ అభ్యర్ధుల ఎదురుచూపులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మాయమాటలు చెప్పి తమకు నచ్చిన అభ్యర్థులకు జీవోలు తెచ్చి ద్వారాలు తెరిచారు’’ అంటూ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.‘‘పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం ఉద్యోగాలిచ్చేశారు. డీఎస్సీలో మోసం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. నారా లోకేష్ ఏపీ జెన్-జికి సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై జూలై 28న నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తారో నారా లోకేష్ సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై మా పోరాటం కొనసాగిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని ఆదిమూలపు డిమాండ్ చేశారు. -
లోకేష్ రాజీనామా చేయకపోయితే ఏపీలో కూడా జంతర్ మంతర్ ధర్నా..
-
లోకేష్ తో వెంటనే రాజీనామా చేయించు చంద్రబాబు
-
LIVE: నారా లోకేశ్ రాజీనామా..!?
-
ధర్మేంద్ర ప్రధాన్ చేసినట్టే.. లోకేష్ కూడా రాజీనామా చేయాలి..!
-
‘ధర్మేంద్ర తరహాలోనే లోకేష్ రాజీనామా చేయాలి’
విజయవాడ: ఏపీలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. లోకేష్పై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఇప్పటివరకూ డీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు, లోకేష్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఆ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించింది. విచారణ నుంచి తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోందని, టీచర్ పోస్టుల కోసం బేరసారాల వీడియోలు బయటకొచ్చినా నామమాత్రపు కేసులతో విచారణను నీరుగార్చారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని, ఇందులో నిజాలు నిగ్గు తేల్చే వరకూ ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
‘నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి’
తూర్పు గోదావరి జిల్లా: నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి సీజేపీ ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన్ని అనుసరిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమేనని, దానికి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. జాతీయ నేత ధర్మేంద్ర ప్రధాన్ను ఆదర్శంగా తీసుకుని నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్య పార్టీ కాబట్టి వారిని అనుసరిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలని, ఆలా చేయకపోతే యువత ఆగ్రహానికి లోకేష్ గురి కావాల్సి వస్తుందన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా -
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చేతకాకపోతే బయటకు వెళ్లిపోండి..!
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీలో ఆధిపత్య పోరు, ముఠా కక్షలు పరాకాష్టకు చేరాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు స్థానిక అధికార కూటమిలో భూకంపం సృష్టించాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను తొక్కుకుంటూ, ఏకపక్ష రాజకీయం నడుపుతున్న ఆరోసారి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరిపై లోకేష్ వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే లోకేష్ ‘గేట్ పాస్’ వార్నింగ్‘కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని, కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిదే’ అని లోకేష్ స్పష్టం చేశారు. వరదరాజులరెడ్డి తన పక్కనే వేదికపై కూర్చొని ఉండగానే లోకేష్ అసలు ట్విస్ట్ ఇస్తూ.. ’ ఒకవేళ అందరినీ కలుపుకొని వెళ్లడం చేతకాకపోతే, అలాంటి వారు పార్టీ వదిలి బయటకు వెళ్లడానికి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అంటూ ‘గేట్ పాస్’ హెచ్చరిక ఇవ్వడం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో, వరదరాజులరెడ్డి బహిరంగంగా టీడీపీ జెండాలను తగలబెట్టించిన ఉదంతం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు వచ్చి టికెట్ దక్కించుకుని గెలిచారు. కానీ, గెలిచినప్పటి నుండి పాత తమ్ముళ్లను పక్కన పెట్టడంపై క్యాడర్ లోకేష్ దృష్టికి ఆవేదనను తీసుకెళ్లింది. గ్రూపుల కుమ్ములాటలు.. వేర్వేరుగా ఆఫీసులు! వరదరాజులరెడ్డి మొదటి నుంచీ తనదైన ఏకపక్ష శైలితో వ్యవహరిస్తారనే ముద్ర ఉంది. ఆయన ఏ పారీ్టలో ఉన్నా నెహ్రూ రోడ్డులోని తన సొంత కార్యాలయమే పార్టీ ఆఫీస్గా నడుస్తుంటుంది.పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం వల్లే ప్రొద్దుటూరులో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయింది. పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని వరదరాజులరెడ్డి ఏనాడూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మల్లెల లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వేర్వేరుగా కార్యాలయాలను నడుపుతున్నారు. ప్రవీణ్కుమార్రెడ్డికి పదవి గండం.. మరోవైపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డి ఐదేళ్లూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల సమయంలో ప్రవీణ్ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించలేదని, లోపాయికారీగా వ్యతిరేకంగా పనిచేశారని వరదరాజులరెడ్డి వర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కూటమి ముఖ్య నేతలు అమరావతికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు పదవి రాకుండా పోయింది. దీంతో ప్రవీణ్ నిరంతరం చంద్రబాబు, లోకేష్ లను కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరాకాష్టకు చేరిన కక్షలు.. తమ పదవిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిపై ప్రవీణ్కుమార్రెడ్డి బహిరంగంగానే ఎదురుదాడికి దిగారు. కొండారెడ్డికి చెందిన “ఎస్ఎస్ మాల్’, “సన్రైజ్ కౌంటీ’లపై ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలకు వచ్చారు. సొంత పార్టీ నేతే తమ వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పడాన్ని జీరి్ణంచుకోలేని వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరులు నేరుగా ప్రవీణ్కుమార్రెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడికి తెగబడ్డారు. తమ్ముళ్లలో అయోమయం.. కార్యకర్తల సమావేశానికి ప్రవీణ్ ఆహా్వనించిన పాత కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. లోకేష్ ఇచ్చిన వారి్నంగ్ తర్వాత ప్రొద్దుటూరు తమ్ముళ్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు ఇకనైనా కలిసి నడుస్తారా? అది సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎవరి వెంట నడవాలో తెలియక తీవ్ర అయోమయంలో కొట్టాడుతోంది. టీఢీపీప్రొద్దుటూరు: పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సబ్ స్టేషన్ నిర్మాణ స్థల వివాదం తారస్థాయికి చేరుకుంది. స్థానిక శ్రీనివాసనగర్లోని ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిధులు మంజూరు చేసి, సగం పనులు పూర్తి చేశారు. అయితే, ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పార్టీ పెద్దలకు విన్నవించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల పనులను నిలిపివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై విద్యుత్ శాఖ డీఈ చాంద్ బాషా మాట్లాడుతూ సదరు స్థలం ఎవరిదనేది తేల్చి, హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీస్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఆగిన పనులను పరిశీలించి చర్చించారు. -
నీకు 15 వేలు.. నీకు 5 వేలు.. నీకు లేదు బాబు ప్రభుత్వంపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
జనసేనకు మళ్లీ భంగపాటు.. టీడీపీ నిర్ణయమే ఫైనలా?
ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ పరిస్తితి ఏ విధంగా ఉండబోతోంది? గౌరవమైన స్థాయిలో పోటీ చేసే అవకాశాన్ని జనసేనకు టీడీపీ ఇస్తుందా?లేదా?అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. అసలు జనసేన బలం ఎంత అన్నదానిపై కూడా రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ వర్కింగ్ అద్యక్షుడు, కీలక మంత్రి నారా లోకేష్ వెల్లడించినట్లు వచ్చిన ఒక సమాచారం ప్రకారం 80:15:5 నిష్పత్తులతో శాతాల ప్రకారం ఆయా స్థానిక సంస్థలలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆయనే పార్టీ జోనల్ కోఆర్డినేటర్లకు స్పష్టం చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు ఈ మూడు పార్టీల సమన్వయ సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరి ఉండాలి. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదించి ఉండాలి. లేకుంటే లోకేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేసేవారా అన్న సందేహం వస్తుంది. ఈ వార్త మీడియాలో రాగానే జనసేన క్యాడర్ ఒక్కసారిగా నీరుకారిపోయిందని చెబుతున్నారు. పార్టీలో ఉన్న పలువురు స్థానిక నేతలు మంత్రి,పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దాంతో పార్టీ వైఖరిపై మనోహర్ కొంత వివరణ ఇచ్చారు. నిజానికి నాదెండ్ల మనోహర్ కూడా తమబలాన్ని బట్టే సీట్ల పంపిణీ ఉంటుందని ఎప్పుడో చెప్పారు. కాని పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయన తన స్వరం మార్చి అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు వర్తించదని పేర్కొన్నారు. జనసేన బలంగా ఉన్నచోట తమ పోటీ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.అంటే లోకేష్ చెప్పిన ఈ నిష్పత్తి ప్రకారం 15 శాతం సీట్ల ఫార్ములాను ఒప్పుకోవడం లేదని చెప్పినట్లయింది. సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని,ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇది నిజమే అయితే లోకేష్ ఆప్రకటన ఎలా చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీలు ఏకపక్షంగా వ్యవహరించడం కుదరదని, అంతా సమన్వయంతోనే నిర్ణయం తీసుకుంటటామని మనోహర్ అన్నారు. జనసేనకు ఎంత బలం ఉందన్నదానిపై ఎవరు అంచనావేస్తారు? 2019,2024 ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు,సీట్ల ఆధారంగా చూస్తే వారికి ఉన్న బలం కన్నా లోకేష్ ఎక్కువ శాతం సీట్లనే కేటాయిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని జనసేన క్యాడర్ అంతా దీనిని అవమానంగా భావిస్తున్నది. జనసేనకు ఆరేడుశాతం ఓట్లు మించి ఉండవన్నది ఒక అంచనా. గత ఎన్నికలలో జనసేన 21 సీట్లు గెలుచుకుంది. అంటే ఆ రకంగా చూసినా వారికి లభించిన ఎమ్మెల్యే సీట్లు 12 శాతంగా ఉన్నాయి.అందులో కూడా టీడీపీకి చెందినవారికే దాదాపు పదిమందికి అవకాశం ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి.ఉదాహరణకు అవనిగడ్డ,భీమవరం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు బలం ఎక్కడిది అని ప్రశ్నించారు. జనసేనకు యంత్రాంగం ఉందా?వనరులు ఉన్నాయా?అంటూ రకరకాల సందేహాలను లేవనెత్తి ఆయనే జనసేన బలహీనతలను బయటపెట్టారు. అది పార్టీకి పరువు తక్కువ అని పార్టీ నేతలు భావించినా, ఆనాడు ఉన్న పరిస్థితిలో ఎవరూ మాట్లాడలేకపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు కోరాలన్న ఒక ప్రతిపాదన నడిచింది. ప్రత్యేకించి బీజేపీ నాయకత్వం ఈ సలహా ఇచ్చిందని చెబుతారు. కాని పవన్ కళ్యాణ్ తనపై తనకే నమ్మకం లేకపోవడంతో ,ఎలాగైనా తాను ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరికతో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించారు. అప్పుడే కనుక ఏ నలభై,ఏభై సీట్లను డిమాండ్ చేసి ఉంటే,ఆనాడు ఉన్న వాతావరణంలో టీడీపీ అంగీకరించి ఉండేదని కొందరి అభిప్రాయం. అలాగే ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడగాలని చాలామంది జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సూచించారు. తద్వారా కాపులలో కూడా ఒకరికి సీఎం. అవకాశం వస్తుందని వారంతా ఆశించారు. ఇదే ప్రశ్నను అప్పట్లో లోకేష్ వద్ద మీడియా ప్రస్తావించగా, ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవడానికి టీడీపీ సిద్దంగా లేదని స్పష్టం చేసినట్లు కధనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని టీడీపీ పాలిట్ బ్యూరో లో చర్చించి నిర్ణయిస్తామని అన్నట్లుగా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ టీడీపీ నాయకత్వాన్ని నిలదీయలేకపోయారు. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్లుగానే సర్దుకుపోయినట్లు కనబడుతుంది. జనసేన క్యాడర్ కూడా పెద్దగా గొడవ చేయలేదు.ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కేవలం 15 శాతం సీట్లే కేటాయిస్తే ,చాలామంది ఆశావహులు నష్టపోయే అవకాశం ఉంటుందని వారు బాధపడుతున్నారు. ముందుగా కౌన్సిలర్, జడ్పీటిసి,ఎంపిటిసి స్తానాలలో 15 శాతం చొప్పున కేటాయిస్తే జనసేన ఎన్నిటిలో గెలుస్తుంది?మున్సిపల్ చైర్మన్ ,జడ్పి చైర్మన్,మండల అధ్యక్ష పదవులు ఎన్ని పొందగలుగుతుందన్నది చర్చనీయాంశం అవుతుంది. కనీసం 30 శాతం సీట్లు అయినా డిమాండ్ చేయాలని కొందరు జనసేన అబిమానులు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో టీడీపీతో పాటు జనసేనకు చెందినవారు కూడా పోటీ పడి తమ సత్తా చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఉంది.సెప్టెంబర్ నుంచి స్థానిక ఎన్నికల హడావుడి మొదలవుతుందని చెబుతున్నారు. ఈలోగానే ఆయా మున్సిపాల్టీలు, మండలాలు,జడ్పిల విషయంలో జనసేన క్లారిటీ తెచ్చుకోలేకపోతే ఆ పార్టీ కేవలం టీడీపీకి మద్దతు ఇచ్చే పార్టీగానే మిగిలిపోతుందన్న అనుమానం జనసేనకు చెందిన పలువురిలో ఉంది. ఏది ఏమైనా రాజకీయాలలో ముందుచూపు ఉండాలి. తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే అవి ఆ తర్వాత నష్టం చేసే అవకాశం ఉంటుందని జనసేన నాయకత్వానికి తెలిసి ఉండాలి. ఒకవేళ జనసేన కేవలం 15 శాతం స్థానాలకే పరిమితం కావల్సి వస్తే అది జనసేన స్వయంకృతాపరాధం అవుతుంది తప్ప మరొకటి కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్
-
నూర్ ఫాతిమా ఆగ్రహం.. "కొంచమైనా బుద్ధుందా?"
-
బయటపడ్డ నారా లోకేష్ అసలు బండారం
-
లోకేష్ రెడ్ బుక్ కి మించి.. ల జగన్ 2.0 సూపర్ యాప్ సంచలనం
-
ఈ రోజు నిన్ను ఏమనాలి లోకేష్..! తల్లి కి వందనం పథకానికి ఎగనామం
-
కూటమిలో లోకల్ వార్.. లోకేశ్ Vs నాదెండ్ల..
-
ఖాకీలా.. యమకింకరులా? పోలీసుల దాష్టీకానికి 2 నెలల్లో ఏడుగురు బలి
-
‘లోకేష్ కరెక్ట్గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’
ప్రకాశం: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్కు ఐదు వ్యవసాయం మొక్కలు చూపిస్తానని, ఆ మొక్కల పేర్లు ఆయన కరెక్ట్గా చెప్తే తాను రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని చాలెంజ్ చేశారు. ఇది తాను ఒంగోలు నుండి లోకేష్కి విసురుతున్న సవాల్ అన్నారు కాకాణి.రాష్ట్రానికి ఆదాయవనరులు జగన్ సమకూరిస్తే వాటిని చంద్రబాబు అమ్ముతున్నాడు. చంద్రబాబు రైతులకు అండగా ఉండడు. గ్రావెల్లో అవినీతి, దగా డిఎస్సీలో అవినీతి.. ఇలా ప్రతి దానిలో అవినీతి. అవినీతికి కాదేది అనర్హం అనే విధంగా కూటమి ప్రభుత్వం దోచుకొంటుంది. ప్రజల సొమ్ముని ప్రయివేటు పరం చేస్తూ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు లోకేష్లకు దోచుకోవడమే పరమావధి. ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్ట్ని ప్రయివేట్ పరం చేసేశారు’ అని ధ్వజమెత్తారు కాకాణి. -
రెడ్ బుక్ ని చూసుకుని రెచ్చిపోతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
ఇంకానయం గాంధీజీని చంపింది జగనే అని... బాబు, లోకేష్ పై రాచమల్లు నాన్ స్టాప్ సెటైర్లు
-
ప్యాక్ అప్ అంటున్న కూటమి నేతలు! జగన్ దెబ్బ.. కూటమి గుండెల్లో వణుకు!
-
‘చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు’
సాక్షి,గుంటూరు: చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏదో విధంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో జరిగిన ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏ విధంగా నన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. -
‘టీడీపీ నేతల తీరు మారకపోతే జనం తరిమికొడతారు’
సాక్షి, తాడేపల్లి: వేదిక ఏదైనా చంద్రబాబు, లోకేష్, కూటమి నేతల ధోరణి మారడం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో పేట్రేగిపోతున్నారని.. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ తిడుతున్నారు. వ్యక్తిగత దూషణలు మా విధానం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటన్నాడు. ప్రాజెక్టులు కట్టడం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకానికి తప్ప చంద్రబాబు ఖర్చు చేసిందేమీ లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్...వైఎస్ జగన్ సీఎం అయ్యాక వెలిగొండ టన్నెల్స్ ప్రారంభమయ్యాయి. నీ హయాంలో వెలిగొండకు ఎంత ఖర్చు చేశావో లెక్కలు చెప్పగలవా?. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వించింది వైఎస్సార్. పోలవరం కుడి, ఎడమలకు పేర్లు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. నాగార్జున సాగర్ నీరు రావడానికి కారణం బ్రహ్మనందరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా వస్తా మీరు రాగలరా?. నిధులు ఎంత ఖర్చు పెట్టావని అడిగితే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నాడు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నేనే పూర్తిచేశానని చెప్పుకుంటున్నాడు. వివేకా హత్య వైఎస్ జగన్ చేయించారని చెప్పడానికి లోకేష్కు కొంచెమైనా విజ్ఞత ఉందా? వివేకా హత్య జరిగింది మీ హయాంలో కేసు దర్యాప్తును సాగకుండా అడ్డుకున్నది మీరుకాదా?. నిందితుల తరపున న్యాయవాదులు మీవారేనా కాదా?. వాస్తవాలపై చర్చ జరగకుండా బూతులు తిడుతున్నారు. తిట్టడం కాదు ఎవరు చర్చకు వస్తారో రండి. మీరు ఇలాగే రోజూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పోతే మిమ్మల్ని ప్రజలు తరిమికొడతారు’’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. -
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో లోకేష్ అనుచరుడికి రిమాండ్
విశాఖపట్నం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకే‹Ùకు అత్యంత సన్నిహితుడైన యువ నేత ఆన్లైన్ బెట్టింగ్ దందాలో అడ్డంగా దొరికిపోయారు. జీవీఎంసీ 51వ వార్డు టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న పేడాడ మణికంఠ, మంత్రి లోకేష్కు అత్యంత ఆప్తుడనే ప్రచారం చేసుకుంటూ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మణికంఠ తన అనుచరుడు శాంతి స్వరూప్తో కలిసి మాధవధార సీతన్న గార్డెన్స్ వేదికగా ఈ ఆన్లైన్ జూదాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం సాయంత్రం ఆ శిబిరంపై దాడి చేసి వీరిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరు ఆడటంతో పాటు మరో 15 మందితో పెద్ద ఎత్తున బెట్టింగులు ఆడిస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో సోమవారం వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. పోలీసుల గోప్యత? అరెస్ట్ అయిన వ్యక్తి మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని నొక్కిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను రిమాండ్కు తరలించినా కూడా వివరాలు బయటకు పొక్కకుండా గుట్టుగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులను వివరణ అడిగినప్పటికీ వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. -
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
-
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
-
స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
లోకేష్ పై గుడివాడ లాస్ట్ పంచ్ అదుర్స్
-
నువ్వు, మీ బాబు కలిసి చేసే దందా మాకు తెలియదనుకున్నావా..!
-
ఖాళీ కుర్చీలతో చంద్రబాబు కేబినెట్ సమావేశం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
నీ మోకానికి ఒక్క సబ్జెక్టు పాస్ అయ్యావా.. రెడ్ బుక్ ఒకటి మాత్రం పట్టుకుని..
-
పోలీసులను కొడితే కేసులేదు కానీ మమ్మల్ని కలవాలంటే లోకేష్ పర్మిషన్ తీసుకోవాలా ?
-
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్డెత్లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
నువ్వు సౌత్ కొరియా వెళ్ళకు! బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు..
-
బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు.. దొంగ సర్టిఫికెట్ల వాడికి విద్యాశాఖా..?
-
కిర్రాక్ ఆర్పీ, సీమరాజా మాట్లాడేవేంటి..? లోకేష్ పై అంబటి ఫైర్
-
యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై సెటైర్లు
నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను ముగించేది ప్రజలే" అని వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్షన్తో రిమాండ్లోకి పంపడంపై మండిపడ్డారు. 'యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా?' అని, జనసైనికులు ఇప్పటికే ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ మొదలుపెట్టారని ఆరోపించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)'వరసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగుసార్లు కోర్ట్ బెయిల్ ఇస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైంది. తర్వాత ఏంటి? వ్యక్తిగత దూషణ. ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాడి ఫోన్ మీ దగ్గరుంది. అందులో సమాచారాన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వాళ్లని, ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత దిగజారతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z— Prakash Raj (@prakashraaj) July 6, 2026 -
టీడీపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది.. బాబు, లోకేష్ లు ప్రజలను మోసం చేస్తున్నారు
-
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
-
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం: కాకాణి
సాక్షి, ప్రకాశం: దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదు. పొగాకు ధర క్వింటాకు 16వేలకు పడిపోయింది. ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. పొగాకు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి. రెఫరెన్స్లు ఇవ్వడం దారుణం. తమకు అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.కర్ణాటకలో పొగాకు క్వింటా ధర 36 వేలు.. ఆంధ్రలో 16 వేలు. దీనికి కారణం ఎవరు?. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారు. తక్కువకు రైతుల దగ్గర కంపెనీలకు కట్టబెట్టి.. కంపెనీ నుండి చంద్రబాబు, లోకేష్ లబ్ది పొందే ప్రయత్నం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు వరి తినకపోతే ఇంకెవరు తినేవాళ్ళు లేరా?. ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టిస్తున్నాడు. పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. -
అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు: అమర్నాథ్ సెటైర్లు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. జేఎస్డ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే అన్ని అనుమతులు, రాయితీలు, నీటి సదుపాయం, రైల్వే కనెక్టివిటీ వంటి పనులు పూర్తయ్యాయి. అధికారం వచ్చి రెండేళ్లు గడిచినా వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పరిశ్రమలకే శంకుస్థాపన చేస్తే మీరు ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు. జేఎస్డ్ల్యూకి కావాల్సిన అన్ని అనుమతులు రాయితీలకు జీవో ఇచ్చాం. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారింది.జిందాల్ సంస్థ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఒక యాక్టర్ను వాడుకొని జిందాల్ను ఇబ్బందులకు గురి చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు. ఎటువంటి అనుమతులు, భూమి లేకుండా 2019లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి జేఎస్డ్ల్యూ స్టీల్ను తీసుకొచ్చారు. చంద్రబాబు శిలాఫలకాల ఏర్పాటుకు పెట్టింది పేరు. వేదిక ఏదైనా వైఎస్సార్సీపీని తిట్టడమే చంద్రబాబు లక్ష్యం. ప్రపంచ వేదిక అయినా జగన్నామస్మరణ చేస్తున్నారు..నా మాటలపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏ సైకో చెప్పాడని చింతమనేని మా ప్రభుత్వంలో మంత్రిని అలా అన్నాడు. బాలకృష్ణ మహిళల కోసం ఏ సైకో గాడు చెప్తే మాట్లాడారు. కృష్ణ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయమని ఏ సైకో చెప్పాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న సైకో ఎవడో అందరికీ తెలుసు. మహిళల పుట్టుక కోసం తప్పుగా మాట్లాడిన సైకోగాడు ఎవరో అందరికీ తెలుసు. టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల ఇంటికి వెళ్తే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ బీఎల్ఓలు ఎన్యూమరేషన్కు వెళ్లడం లేదు. వెన్నుపోటు, ద్రోహనికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకి, జన్మనిచ్చిన సీమకి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు..కోవిడ్ ఉన్నా.. మా ప్రభుత్వంలో మంచి ఆదాయాలు వచ్చాయి. మొదట సంవత్సరం ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. చదువు కొనుక్కోవచ్చు కాబట్టి లోకేష్ విదేశాల్లో చదివారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల కోసం మాట్లాడవచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మంత్రులు వారి శాఖల కోసం తప్ప మిగిలిన అన్ని శాఖల కోసం మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అట్టర్ ఫెయిల్యూర్.. రాష్ట్ర చరిత్రలో ఇది ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు. -
ఖబడ్దార్ లోకేష్.. టిప్పర్ తో నన్ను లేపేద్దాం అనుకున్నావా..? తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
-
దమ్ముంటే వేయ్ జైల్లో... నన్ను విప్పమంటావా నీ గుట్టు..?
-
TDP గూండాల కు లోకేష్ సపోర్ట్.. పవన్ చెప్పిందే నిజమైంది!
-
ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేశారు. అలాగే సెట్ చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్.మోహనరావు కూడా కాకినాడ జేఎన్టీయూలో ఈ ఫలితాలను వెల్లడించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేసుకోగా, 2,58,545 మంది పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) అర్హత సాధించారు. కాగా, ఇంజినీరింగ్లో గుంజూరు జిల్లా తాడేపల్లికి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్ నాయుడు టాపర్గా నిలిచాడు. ఫలితాలను https://cets. apsche.ap. gov.in/ EAPCETలో చూడవచ్చు.ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ టాప్ ర్యాంక్స్ ఇవే.. 1. జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (గుంటూరు జిల్లా) 2. కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం) 3. వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి (పల్నాడు) అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ టాపర్లు వీరే.. 1. శంబంగి జశ్వంత్ నాయుడు (విజయనగరం) 2. అక్షజ్ రెడ్డి (మేడ్చల్ మల్కాజిగిరి) 3. హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా) -
సమాధానం చెప్పడం చేతకానప్పుడు ఛాలెంజ్ లు ఎందుకు?
-
మహా మేధావి.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. లోకేష్ పై ధ్వజమెత్తిన లక్ష్మి పార్వతి
-
ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ర్యాంకుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా ఇవాళ విడుదలవుతాయని ప్రచారం జరిగినా.. ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జులై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. విడుదలయ్యే దాకా గ్యారెంటీ కనిపించడం లేదు. -
అబ్బ కొడుకుల నాటకం.. ఒకడు పోలీసులను పంపుతాడు.. ఇంకోడు రౌడీలను పంపుతాడు..!
-
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు


