Nara Lokesh Babu
-
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..
-
యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్
-
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి
-
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
రోశయ్య తాత గుర్తొస్తున్నాడట.. లోకేష్ పై తాడిపత్రి చంద్రశేఖర్ పంచులు
-
నోరు జారిన లోకేష్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
-
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
టైం ఇస్తున్న కేసులు క్లోజ్ చేయాలి.. పోలీసులకు లోకేష్ వార్నింగ్
-
99 పైసలకి కాకపోతే ఊరికే ఇస్తా, నా ఇష్టం అంటున్న నారా లోకేష్
-
లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకో!
తాడేపల్లి రూరల్: ‘మిస్టర్ లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రతిపక్ష నేతలను కించపరిచేందుకు జీతాలు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి లోకేశ్ను హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ పేరుతో సీమరాజ, జెట్టి రేణుక, కిరాక్ ఆర్పీ, కిరణ్ లాంటి వారితో దు్రష్పచారం చేయించడంపై శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేక అంజిరెడ్డి, అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
క్షమాపణలు చెప్పిన లోకేష్.. పరువు తీసిన ఎల్లో మీడియా
-
చంద్రబాబు, పవన్ కలిసి లోకేష్ ను జాకీలు పెట్టి మరీ లేపుతారు.. కానీ ఏం లాభం..
-
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నా ఇంటిపై దాడిని సీఎం, ఆయన కుమారుడు మానిటర్ చేశారు
-
మండలిలో పర్వత రెడ్డి స్పీచ్ కు కూటమి నేతల ఉక్కిరిబిక్కిరి
-
రండి చర్చకు సిద్ధం..ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు
-
జగన్ కు ఎదురు రావాలని చూడకు.. తట్టుకోలేవు
-
అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..
-
మా వరకు ఎందుకు.. మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి
-
సీఎం చేస్తే లక్ష్మీదేవమ్మ టికెట్ ఊడగొట్టారు
అన్నమయ్య జిల్లా: అవసరానికి వాడుకొని, ఆపై నిర్దాక్షిణ్యంగా గెంటేసే చంద్రబాబును నిన్ను నమ్మం ‘బాబూ’ అంటున్నారు తంబళ్లపల్లె టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే శంకర్ వద్దంటూ పక్కన పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు పారీ్టకి ఎవరూ దిక్కులేక మళ్లీ ఆయనకు వల వేయడంపై చర్చనీయాంశమైంది. రేపు మాపో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జిగా శంకర్ పేరును ప్రకటించే అవకాశం ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తంబళ్లపల్లె టీడీపీ నేతలను చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో గుర్తు చేసుకుంటున్నారు. తాను సీఎం అయ్యేందుకు మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శంకర్ విషయంలో చివరిదాకా అండగా నిలుస్తారా అని ప్రస్తావిస్తున్నారు. సీఎం చేస్తే లక్ష్మీదేవమ్మ టికెట్ ఊడగొట్టారు 1994లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యేగా ఏవీ లక్ష్మీదేవమ్మ రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికలో ఆ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1995 ఆగస్టు సంక్షోభంలో లక్ష్మీదేవమ్మ ఎన్టీఆర్ ను కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అందుకు చంద్రబాబు లక్ష్మీదేవమ్మకు ఇచ్చిన నజరానా రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టడం. 1999, 2004 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకుండా బీజేపీకి కేటాయించారు. 1999 ఎన్నికల్లో పొత్తు కారణంగా బీజేపీకి ఇచ్చినా ఆమె సర్దుకు పోయారు. కానీ 2004లో మళ్లీ బీజేపికి టిక్కెట్ ఇవ్వడంతో ఆమెకు కుట్ర అర్థమైంది. దాంతో 2004 ఎన్నికల్లో ఆమె స్వతంత్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాజకీయంగా ఆమెకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. తల్లిని కాదని ప్రవీణ్కు.. తనకు అండగా నిలిచిన లక్ష్మీదేవమ్మకు 2009లో టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అన్నారు. తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మకు టికెట్ ఇచ్చి ఉంటే టీడీపీ రాజకీయాలు మరోలా ఉండేవి. అయితే రాజకీయాలంటే ఇష్టం లేని ప్రవీణ్ పోటీ చేయాలంటూ చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఫలితంగా పోటీ చేసిన ప్రవీణ్ ఓటమి అంచులోకి వెళ్లి కేవలం రెండు వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం విషయంలో చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని జీర్ణించుకోలేని ప్రవీణ్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇలా లక్ష్మీదేవమ్మ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. ఒత్తిడి చేసి శంకర్ను రప్పించి..2014 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అప్పటి సీఎం కిరణ్ తో తీవ్రంగా విభేదించారు. ఆయన తీరు నచ్చకపోవడంతో కాంగ్రెస్ రాజకీయాలకు దూరమై బెంగళూరుకు పరిమితమయ్యారు. అప్పట్లో టీడీపీకి ప్రవీణ్ రాజీనామా చేసి వెళ్లడంతో ఆ పారీ్టకి నాయకత్వం లేకపోయింది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి లేకపోతే పరువు పోతుందని శంకర్పై ఒత్తిడి తెచ్చి పోటీ చేయించారు. అయితే ఆయనపై చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమైందనే చెప్పాలి. ముప్పుతిప్పలు పెట్టి..2019 ఎన్నికల్లో శంకర్కు ఎవరూ పోటీ లేకపోయినా టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు చుక్కలు చూపించారు. వేరొకరికి టికెట్ ఇవ్వాలని ప్రయతి్నంచి చివరి నిమిషం దాకా టికెట్ ఖరారు చేయకుండా ముప్పు తిప్పులు పెట్టారు. టికెట్ ఇవ్వాలంటూ పార్టీ కార్యకర్తలు బస్సుల్లో వెళ్లి అమరావతిలో తిష్ట వేయాల్సి వచ్చింది. అయినా భరోసా ఇవ్వలేదు. తర్వాత టికెట్ ఇవ్వడం, ఓడిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయింది. కొత్త వ్యక్తి దొరకి ఉంటే చంద్రబాబు వెన్నుపోటుకు శంకర్ బలికావాల్సి వచ్చేది. 2024లో తీరని పరాభవంటీడీపీలో శంకర్ ఎదుర్కొన్న అవమానాలు, పరాభవాలు ఏ నేతకు ఎదురు కాలేదు. 2023లో లోకేష్ పాదయాత్ర కోసం శంకర్ ఆర్థికభారం మోయాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం శంకర్ కు మాట మాత్రంగానైనా చెప్పకుండా, బుజ్జగింపు మాటైనా లేక.. కొత్తగాపార్టీలో చేరిన జయచంద్రారెడ్డికి టికెట్ ప్రకటించారు. ఈ అవమానం తట్టుకోలేక శంకర్ పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యారు. కొడుకు వివాహానికి ఆహ్వానించినప్పటికీ చంద్రబాబు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కుపోవడంతో ఇప్పుడు నాయకుడి అవసరం ఏర్పడింది. ఎవరూ లేకపోవడంతోనే..స్థానిక ఎన్నికలు, బాధ్యతలు అప్పగించడానికి కొత్త నాయకుడు దొరకకపోవడంతో చంద్రబాబుకు శంకరే దిక్కయ్యాడు. నిన్నటిదాకా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఆయనకే ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇంచార్జ్ పదవి ఇస్తే శంకర్ సామర్థ్యం చూసి ఇవ్వడం లేదని, చంద్రబాబు తెరవెనుక వేరే కుట్ర ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శంకర్ విషయంలో అండగా ఉంటారా అన్న అనుమానాలను కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల కోసం ఆర్థికంగా భరించే వ్యక్తి అవసరం ఉన్న కారణంగా శంకర్ను ఎంచుకొని ఉండవచ్చన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే పార్టీలో తనకు జరిగిన అవమానాలు, చంద్రబాబు తీరును మరిచిపోయి శంకర్ మళ్లీ టీడీపీ బాధ్యతలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశమైంది. చల్లపల్లెకు కూడా వెన్నుపోటే !చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బీజేపీ సీనియర్ నేత చల్లపల్లె నరసింహారెడ్డి కూడా బాధితుడే. 1999, 2004లో పొత్తులో తంబళ్లపల్లె నుంచి, 2914లో మదనపల్లె నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తు మాటేగాని చంద్రబాబు ఆయన గెలిపించేందుకు పార్టీ క్యాడర్ను సిద్ధం చేయలేదు. కనీసం క్యాడర్ కు సూచనలైనా చేయలేదు. సభలు జరిగినప్పుడు గెలిపించాలని మాట తప్పితే..పార్టీ అంతర్గత సమావేశాల్లో గట్టి ఆదేశాలు ఇచ్చింది లేదు. బీజేపీ ఓట్లతో టీడీపీ లాభపడినప్పటికి చల్లపల్లెకు వరుస ఓటములు తప్పలేదు. ఓడిపోయిన మూడుసార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆయనకు కనీస అధికారం, గౌరవం దక్కలేదు. -
మా వరకు ఎందుకు మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి
-
అంబటికి మళ్ళీ నోటీసులు
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
రెడ్బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమాగుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.రెడ్బుక్ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజురాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్బుక్ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. -
నేను ఆయనలా భయపడతా అనుకోకు.. లోకేష్కు జడ శ్రవణ్ వార్నింగ్
-
జగన్ పేరు రాస్తే భయమా? లోకేష్ కు పురుషోత్తం రెడ్డి సూటి ప్రశ్న
-
సైకిల్ కి ఓటు వేసి తప్పు చేశా! చెప్పుతో కొట్టుకున్న కార్యకర్త
-
లోకేష్ మైండ్ ఇట్.... గిల్టా.. గాడిద గుడ్డా... ఏకిపారేసిన జడ శ్రవణ్
-
తప్పు జరిగింది.. మండలికి వస్తే దొరికిపోతా
-
మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్
-
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి
-
హెరిటేజ్ నెయ్యి కల్తీనా? నిజం ఒప్పుకున్న లోకేష్
-
మరి మీరు అమ్మేది కల్తీనా?.. లోకేష్కు బొత్స కౌంటర్
సాక్షి, అమరావతి: నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వెయ్యిలోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘‘హెరిటేజ్ 750 ఎంఎల్ నెయ్యి రిలయన్స్లో 456కి దొరుకుతుంది. హెరిటేజ్లో లీటర్ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.‘‘హెరిటేజ్ వెబ్సైట్ని ఎందుకు మర్చారో లోకేష్ చెప్పాలి. మొదట ఇందాపూర్ని మ్యాన్ఫాక్చర్ అని చెప్పారు. తర్వాత కో మ్యాన్ఫ్యాక్చర్ అని ఎందుకు మర్చారు? అంటూ బొత్స నిలదీశారు.కాగా, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు. -
నారావారి హోమ్ కు మంత్రి కాదు.. హోమ్ మంత్రివి మంత్రి అనితపై సెటైర్లు
-
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
-
ఎడిటింగ్ వీడియోతో లోకేష్ డ్రామా మండలి ఫుటేజ్ కోసం YSRCP డిమాండ్
-
నారా లోకేష్ పక్కన ప్రమాదకర వ్యక్తులు
-
ఆ రోజు రాత్రి 12 గంటల వరకు.. లోకేష్ రెడ్ బుక్ కు కుక్కలు కూడా లెక్క చెయ్యవు
-
Jupudi: ఎవడి డబ్బుతో క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళావ్?
-
లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్
-
‘సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు లోకేష్’
సాక్షి,మచిలీపట్నం: నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్పై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ‘సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు. దమ్ముంటే ఫ్లైట్,బోర్డింగ్ వివరాలు బయట పెట్టాలి.మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్ వివరాలు తెలపండి. ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. -
చంపితే చస్తా కానీ.. తగ్గేదేలే... మరో సారి అంబటి మాస్ వార్నింగ్
-
ఫ్లైట్, మ్యాచ్ టికెట్ కి పెట్టిన దుడ్లు హెరిటేజ్ దా.. ఇందాపూర్ దా
-
కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?
-
లోకేష్.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. మంత్రి నారా లోకేష్కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్లో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారాయణస్వామి, కుమార్తె కృపాలక్ష్మి
-
లోకేష్ ఏం చేస్తున్నారు? ఘర్షణలపై AU విద్యార్థుల ఆగ్రహం
-
ఇసుక అక్రమ రవాణా బాబు, లోకేష్ కు ముడుపులు
-
RDTకి విదేశీ నిధుల అడ్డంకి? బాబు కుట్రలపై ప్రజాసంఘాల ఫైర్
-
సిగ్గుందా లోకేష్, చంద్రబాబు.. రేపిష్టికి పూలతో ఆహ్వానం పలుకుతారా.. ?
-
క్రికెట్ మ్యాచ్కు ప్రత్యేక ఫ్లైట్లలో!
సాక్షి, అమరావతి: సామాన్యులు ఎర్రబస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలను వినియోగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్థాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో శ్రీలంక వెళ్లి రావడం హాట్ టాపిక్గా మారింది. ఉదయం అమరావతిలో ఉన్న లోకేశ్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు. మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని బిల్గేట్స్తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తి కావడమే ఆలస్యం.. లోకేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రత్యేక విమానాల వ్యయం ఎవరు భరిస్తున్నారన్నది కీలకంగా మారింది. ఈ ఖర్చుల వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. ఒకపక్కన రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరోపక్క విహార యాత్రల్లో గడపడంపై విస్తుపోతున్నారు.సమస్యలు గాలికి వదిలేసి...!ప్రస్తుతం మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ విమానం అద్దె గంటకు రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ చార్జీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్ పోర్ట్ ట్యాక్స్లు అన్నీ కలిపి మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటాయి. వెరసి తాజాగా లోకేశ్ యాత్రలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.కోటి పైమాటే అని వైమానిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు సాధారణ బైక్ రైడ్లా విమానాలను వాడుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో మ్యాచ్లు చూడటానికి ఇంత సమయం, డబ్బులు వెచ్చించడం సబబేనా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చును ఎవరు చెల్లిస్తున్నారన్నది ముఖ్యం. -
పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం లోకేష్ క్రికెట్ మ్యాచ్ ఖర్చు కోటి పైనే
-
సంచలనంగా మంత్రి నారా లోకేష్ లగ్జరీ టూర్
సాక్షి,అమరావతి: మంత్రి నారా లోకేష్ విలాసవంతమైన టూర్ సంచలనంగా మారింది. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లు వెచ్చించి ప్రత్యేక విమానంలో ప్రయాణించిన లోకేష్ చక్కెర్లు కొట్టారు.ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ను స్టేడియంలో వీక్షిస్తున్న లోకేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించేందుకు నారా లోకేష్ కేవలం 24 గంటల్లోనే కొలంబో–విజయవాడ–ఢిల్లీ ప్రయాణాలు చేసినట్లు సమాచారం. మ్యాచ్ చూసేందుకు విజయవాడ నుంచి ఢిల్లీ.. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. ఇలా వెళ్లిన లోకేష్ విమానం అద్దెకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లోకేష్ ఈ మెరుపు ప్రయాణాలతో ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
నాసిరకం భోజనంతో ఇక్కడ పిల్లలకు చనిపోతుంటే శ్రీలంక వెళ్లి క్రికెట్ చూస్తున్న లోకేష్...
-
‘దుప్పటి.. చెట్టు.. ఆవు..’ లోకేష్, పవన్పై బైరెడ్డి చెప్పిన కథ
సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని బైరెడ్డి మండిపడ్డారు.అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.పవన్ కల్యాణ్, లోకేష్ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్ పవన్తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్ కల్యాణ్.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్కు ఉపయోగపడింది. పవన్కు ఉపయోగపడలేదు.తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్ కల్యాణ్.. కాసిన పండు తినేదంతా లోకేష్.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్ కల్యాణ్.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు. -
మండలిలో 'ఫీజు' మంటలు!
సాక్షి, అమరావతి: ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడేసింది. బాబుగారి అబద్దాల స్కూలులో మాస్టర్ డిగ్రీలు చేసిన మంత్రులిద్దరు ఫీజు బకాయిలపై శాసనమండలిలో నోటికొచ్చిన లెక్కలు చెప్పి అభాసుపాలయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రూ.4వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని మంత్రులు నారా లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించడంతో శాసనమండలిలో కలకలం రేగింది. ఆ ఆరోపణలను వైఎస్సార్సీపీ సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఒక్క క్వార్టర్ (జనవరి–మార్చి) ఫీజు బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షం అడ్డుపడకపోతే అవి కూడా చెల్లించేసేవారమని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేనెలలో ఇవ్వాల్సింది ఎన్నికల ప్రక్రియ వల్ల ఆ క్వార్టర్ ఒక్కటి ఇవ్వలేక పోయామని బొత్స వివరించారు. అధికారులను పిలవండి, దీనిపై సమాధానం చెప్పండి అని ఆయన మంత్రులను నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటుందా అని బొత్స ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ క్వార్టర్ పీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఆ క్వార్టర్లోనే చెల్లించే విధానం ఉందని, ఈ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించని కారణంగా కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎప్పటి లోగా ఆ బకాయిలు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రులు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు బకాయి పెట్టిందంటున్నారని తప్పుపట్టారు. ‘మేం అధికారంలో ఉండగా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆ క్వార్టర్లోనే చెల్లిస్తూ వచ్చాం. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి కేవలం ఒక్క క్వార్టర్ బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఈసీకి లేఖ రాయడం వల్ల చెల్లించలేకపోయాం. ఆ తర్వాత ఏడు క్వార్టర్లతో కలిపి మొత్తం 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. 20 నెలలుగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చదువు దినదినగండంగా మారిపోయింది. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడంలేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయడం లేదు. అన్ని కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది. రూ.6,300 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్ల బకాయిలున్నాయి. ఇపుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు హడావిడిగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని బొత్స వ్యాఖ్యానించారు. ఇవి మూడు క్వార్టర్ల బకాయిలకు సరిపోతాయి అనుకున్నా ఇంకా ఐదు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 6,300 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని, రూ. 700 కోట్లు ఇవ్వగా ఇంకా 5,600 కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు రూ. 3,300 కోట్ల వసతి దీవెన బకాయిలు (ఈ విద్యా సంవత్సరంతో కలిపి) ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ. 8,900 కోట్లు బకాయిలు పెండింగ్ అని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మాత్రమే ఇవ్వడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.రూ. 1,859 కోట్లు జమ చేశాం, ఇప్పుడు రూ. 1,200 కోట్లు: మంత్రులుఅయితే, బొత్స తర్వాత మాట్లాడిన మంత్రులు లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామిలు గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల బకాయిలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి రూ. 1,859.01 కోట్లు విడుదల చేసి విద్యార్థులు లేదా కాలేజీల ఖాతాలో జమ చేశామని.. 2024–25 సంవత్సరానికి సంబందించి ఈ నెల 10న రూ. 12 వేల కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి డోలా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే మంత్రి డోలా అన్నా క్యాంటీన్లపై మాట్లాడే ప్రయత్నం చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిలువరించారు.ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని విశ్వాసం లేదు: బొత్సమంత్రులు లోకేశ్, డోలా చెబుతున్న లెక్కలు తప్పని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాడు–నేడు స్కూళ్లను బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా’ అని నిలదీశారు. ‘‘ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ విద్య మనుగడ సాగిస్తుందని ప్రజలు ఎవరికీ నమ్మకం లేదు. అన్నీ దారుణమైన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిన ఒక క్వార్టర్ తప్ప మా ప్రభుత్వంలో బకాయిలు లేవు. అధికారులను పిలవండి.. సమాధానం చెప్పండి’ అని పట్టుబట్టారు. సభ నుంచి వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదు కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు చెప్పడానికి అదే మార్గమని అన్నారు. ‘ఇలాగైనా న్యాయం చేస్తారని, మీకు జ్ఞానం కలుగుతుందని, భగవంతుడు మంచి జ్ఞానం ఇస్తాడని తప్ప వాకౌట్ చేయడం మా ఫ్యాషన్ కాదు. మీరు చేస్తున్నది విద్యా ద్రోహం. ప్రైవేటు విద్యా విధానంతో పోటీ పడుతున్నామని చెబుతున్నారు, ఈ రెండేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు వచ్చాయి.. ఎన్ని ప్రభుత్వ కాలేజీలు మూసివేశారో తెలియదా? కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ కాలేజీలను మూసివేసి ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తున్నార’ంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.మిగిలిన నాడు–నేడు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? వైఎస్సార్సీపీరాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేస్తోందని, 80 శాతం పైగా నాడు–నేడు పనులు పూర్తయిన నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ బడులకు అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్రెడ్డి మనబడి నాడు–నేడు పనులపై మాట్లాడారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావని, 2020లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని 45,975 ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం నాడు–నేడు ఫేజ్–1లో 15,713 స్కూళ్లలో 14,133 స్కూళ్లను రూ.2,748 కోట్లతోపూర్తి చేశారని, ఫేజ్–2లో 22,311 స్కూళ్లను తీసుకున్నారన్నారు. ఈ స్కూళ్లల్లో 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, ఫేజ్–3లో 14,845 స్కూళ్లలో మైనర్ పనులు చేపట్టారన్నారు. గత ప్రభుత్వంలో రూ.8,524 కోట్లు ఖర్చు పెట్టి అద్భుత సంస్కరణలతో విద్యార్థులకు అవసరమైన 11 సదుపాయాలు కల్పించారన్నారు. ప్రభుత్వం మారడంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేదని, ఇవి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా స్కూళ్లకు విద్యుత్ సదుపాయం, కొన్ని స్కూళ్లకు పెయింటింగ్ వేయలేదని, కోట్లు ఖర్చుపెట్టి కట్టిన స్కూళ్లకు మిగిలిన పనులు పూర్తి చేయకపోతే ఎలా? అని నిలదీశారు. ఈ రెండేళ్లల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, దీంతో విద్యార్థులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడుతో విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని, ఇది దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. చేపట్టిన పనుల్లో దాదాపు 90% పూర్తయ్యాయని మిగిలిన 10 శాతంలో కిటికీలు, విద్యుత్ పనులకు డబ్బులు కూడా ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రెండేళ్లల్లో 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారన్నారు. ఈ ప్రశ్నకు మంత్రి లోకేశ్ జవాబిస్తూ, తమ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు లెర్నింగ్ అవుట్ కమ్పై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
Botsa : మీకు నచ్చినట్లు రాసుకోండి కానీ ఫోటో మాత్రం మంచిది వేయండి....
-
Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?
-
సూటిగా అడుగుతున్న చెప్పండి.. రఫ్ఫాడించిన మహిళా MLC
-
మంత్రి లోకేష్కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైఎస్సార్సీపీ సభ్యులు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని సభ్యులు నిలదీశారు. దీంతో, వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, డోలా బాల వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు.ఈ క్రమంలో మంత్రి లోకేష్.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కూల్స్లో మౌళిక సదుపాయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.అనంతరం, మండలిలో బొత్స మాట్లాడుతూ..‘మేం మీలాగా ఈనాడు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి.. ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్స్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో 8500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 7800 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో బకాయిలున్నాయి పేరుకుపోయాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు, నేడుతో రూపరేఖలు మార్చాం. అధునాతన స్థాయిలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు ఎక్కడివి అక్కడే ఆపివేశారు. కొత్త స్కీమ్స్ ద్వారా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేయాలి అని డిమాండ్ చేశారు. -
క్యాష్, లోకేష్, సూట్ కేసు.. అప్పిరెడ్డి సంచలన కామెంట్స్
-
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న.. లోకేష్ ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో భూములను కారుచౌకగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి లోకేశ్ విరుచుకుపడ్డారు. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున భూములు ఎన్ని కంపెనీలకిచ్చారని అడగడమే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పాపమైపోయింది. లోకేశ్కు తోడుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరుపేరులేని ఉర్సా కంపెనీకి తాము స్థలాలు ఇవ్వనేలేదని బుకాయించే ప్రయత్నం చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు? అని ప్రశ్నించారు. అలాగే...‘‘ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.మూడు వేల కోట్ల విలులైన భూమిని 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా?. విశాఖలోని ఓ విద్యాసంస్థ రూ.ఐదు వేల కోట్ల విలువైన భూములను తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము రూ.వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెబుతోంది. రూ.వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించకోవచ్చా?’’ అని నిలదీశారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారు. కానీ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములిస్తున్నారు. ఏపీఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు’’ అని ప్రశ్నించారు.అవును.. 99 పైసలకే భూములిచ్చాం.. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కేపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ... ‘‘151 సీట్లు ఉన్న మీకు 11 వచ్చాయి’’ అంటూ ఓవరాక్షన్కు దిగారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందే. వైజాగ్లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గీతంకి భూములు కేటాయింపులకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని బయటకు వచ్చారు. -
SFI: మిస్టర్ లోకేష్.. వినిపిస్తుందా..? కూటమిపై రెచ్చిపోయిన విద్యార్థులు
-
Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు
-
ఇలాగైతే కంపెనీలు రావు.. TDPలో దుమారం రేపుతున్న లోకేష్ వీడియో
-
కిలారు రాజేష్ కు ఎంపీ పోస్ట్! లోకేష్ పై సీనియర్లు సీరియస్
-
తప్పుడు ఫ్లెక్సీలు.. బూతులు.. రెచ్చగొడుతున్నదెవరు? జగన్ దబిడి దిబిడి
-
నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు
-
ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు
-
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
YSRCP Leaders : లోకేష్కు మాస్ వార్నింగ్
-
మీరెన్ని కుట్రలు చేసిన జగన్ ను, జనాన్ని ఎవరూ ఆపలేరు
-
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
-
రెండో రోజు కొనసాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్స్
-
Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..
-
బండబూతులు తిడుతూ దాడి చేశారు: అంబటి కుమార్తె
సాక్షి, గుంటూరు: తమపై పక్కా ప్లాన్ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా?. కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేశారు. బండబూతులు తిడుతూ లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్గా చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి?. తాగుబోతులను మాపై ఉసిగొల్పారు. మా నాన్నకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అలా మట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు. టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరమైనపై భాషతో కారుపై దాడి చేశారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు. దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు. హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. మేము వైఎస్సార్సీపీ అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.గల్లా మాధవికి కుటుంబం ఉంది. మీకు కుటుంబం ఉంది కదా?. కొంతమంది మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ అత్మ సాక్షికే వదిలేస్తున్నాను. రాంబాబు దేని గురించి భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబు గారిని స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమా?. దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్తోనే మాపై దాడి చేశారు అని చెప్పుకొచ్చారు. -
2029లో వచ్చేది జగనే... ఊహించని దెబ్బ ఖాయం!
-
అది దాడి కాదు.. నన్ను చంపాలనే ప్లాన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు? అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు.తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రక్షసానందం పొందుతున్నారా?. ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుక వినిపించడం తప్పా?. మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం ప్రశ్నిస్తే తప్పా?. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. నన్ను, నాకుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా?. మీ బుర్రలు పాడు కాకపోతే మా ఇంటిపైకి దాడులు చేయిస్తారా?. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ గూండాలను రప్పించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే మా ఇంటిపై దాడి చేశారు. పోలీసు అధికారులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే మా ఇంటిపై కుట్ర జరిగింది. టీడీపీ గూండాలకు పోలీసులే రక్షణ ఇచ్చారు. పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవు. పోలీసుల సమక్షంలోనే.. పోలీసుల సాక్షిగా మా ఇంటిపై దాడి జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు. లోకేష్ నీ రెడ్బుక్ తీసి మడిచిపెట్టుకో. నాపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత. నేను నిన్న మాట్లాడినందుకు మళ్లీ నాపై కేసులు పెట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సెంట్రల్ ల్యాబ్లే నిర్ధారించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. నాకు అండగా జగనన్న, వైఎస్సార్సీపీ సైన్యం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. జోగి రమేష్ ఎక్కడికీ పారిపోడు.. ఇక్కడే ఉంటాడు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు. నా ఇల్లు తగలబెట్టి లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొంతమంది సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతేదూరమని లోకేష్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. -
Jogi: ఇంట్లో మా నాన్న, భార్య, పిల్లలు ఉన్నారు.. లోకేష్ గుర్తుపెట్టుకో..
-
అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్
-
ఈ దాడి దేశం మొత్తం తెలిసేలా చేస్తా.. గెట్ రెడీ..
-
అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్
-
ముగిసిన అంబటి రాంబాబు విచారణ
అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. అరెస్ట్.. అప్డేట్స్అంబటి రాంబాబుకు రిమాండ్ మరో కేసులో 41ఏ నోటీసులిచ్చి విచారించాలన్న కోర్టుఈ సందర్భంగా కోర్టులో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదంమాకోర్టులోకి మమ్మల్ని రానివ్వరా అంటూ న్యాయవాదుల ఆగ్రహాంమాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.ఆయనపై రెండు కేసులు నమోదు కాగా, ఒక కేసులో రిమాండ్ విధించిందిపోలీసుల తీరును జడ్జికి వివరించిన అంబటిఅంబటి ఆవేదనను రికార్డు చేసిన జడ్జిశారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారునా రెండు కాళ్లు వెడల్పుగా చేసి నన్ను ఇబ్బంది పెట్టారునా కాళ్లు నొప్పి పెడుతున్నాయిమేం చేసే పని తప్పని సీఐ నాకు చెప్పారునల్లపాడు సీఐతో పాటు మరో ఇద్దర సీఐలు వేధించారునాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు అంబటిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కోర్టుకు తరలింపుగుంటూరు నల్లపాడు పీఎస్ నుంచి అంబటి తరలింపువైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి అంబటి తరలింపువైద్య పరీక్షల అనంతరం కోర్టుకు.. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు వద్ద ఉద్రిక్తతమాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులులోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుకోర్టులో పోలీసుల రూల్స్ ఏంటి అంటూ లాయర్ల ఫైర్కోర్టులో పోలీసుల పెత్తనమేంటని మండిపడ్డ లాయర్లుపోలీసులతో న్యాయవాదుల వాగ్వాదం జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తతజోగి రమేష్ ఇంటికి వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులురోడ్డుమీద బైటాయించిన దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావువైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులుపోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతజోగి రమేష్ ఇంటికి వెళ్లడానికి వీళ్లేదని పోలీసుల అరెస్ట్లువైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులుహైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్అంబటి ఇంటిపై దాడికేసులో హైకోర్టు సీరియస్శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ 24 గంటల భద్రత ఇవ్వాలని ఆదేశంఅంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై తీర్పు జోగి రమేష్ ఇంటిపై దాడిఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకంఇబ్రహీం పట్నంలో తీవ్ర ఉద్రిక్తతమాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడిరాళ్లు వేస్తున్నా చోద్యం చూస్తున్న పోలీసులుఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నంజోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. నివాసం నుంచి భారీగా పొగలుజోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు టీడీపీ శ్రేణుల యత్నం ధైర్యంగా ఉండండి.. రజిని, బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ ఫోన్టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుఇద్దరినీ ఫోన్లో పరామర్శించిన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ధైర్యంగా ఉండాలన్న వైఎస్ జగన్రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది: వైఎస్ జగన్చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారు : వైఎస్ జగన్శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి : వైఎస్ జగన్పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు : వైఎస్ జగన్ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేస్తున్నారు : వైఎస్ జగన్పార్టీ అండగా ఉంటుంది : వైఎస్ జగన్ఏపీలో కూటమి తాలిబన్ పాలన: సీదిరి అప్పల రాజుఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎదో ఒక రూపంలో దాడులు చెయ్యడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందిరాష్ట్రంలో మహిళలకు చిన్నారులకు రక్షణ ఉందా?అంబటి రాంబాబుపై జరిగిన హత్య ప్రయత్నం దారుణంచంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవంతో ఆంద్ర ప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చారు..తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్ లేదు అని సీబీఐ రిపోర్టు ఇచ్చిందిఇప్పుడు కూటమి నేతలు సిబిఐ రిపోర్ట్ తప్పు అంటూ మాట్లాడుతున్నారుహోం మంత్రి సైతం సిట్ రిపోర్ట్ తప్పు అంటుంది. అంటే సిబిఐ అయితే తప్పు మీ సిట్ అయితేనే కరేక్టా.. ఎంత దౌర్భాగ్యంచంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడం కోసమే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారుఆరోపణ చేసేది, కేసు పెట్టేది, దర్యాప్తు చేసేది వాదించేది, తీర్పు చెప్పేది చంద్రబాబు ఏనా..టీడీపీ అబద్దపు ప్రచారాలతో ఫ్లెక్సీలు కట్టారుపోలీసులు నేతలకు భయపడి ఫోన్ లు లిఫ్ట్ చేయడం లేదుకర్రలతో తిరుగుతుంటే.. కనీసం పోలీసులు అడ్డుకోలేకపోయారు... తాలిబాన్ పాలనలా ఉందిపోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. పలాస ఎమ్మెల్యే శిరీష ‘బాస్టర్డ్స్’ అంటున్నారు.. మరి అవి తప్పుకాదా?ప్రజలకు రాష్ట్రంలో స్వేచ్చ లేదు.. రాష్ట్ర భవిష్యత్ ని అందకారంలోకి నెడుతున్నారు:::మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కామెంట్స్మా నాన్నతోపాటు మమ్మల్ని చంపాలనుకున్నారు: అంబటి కుమార్తెమాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శటీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసంమీడియాతో మాట్లాడిన అంబటి కుమార్తె మౌనికమా నాన్నపై హత్యాయత్నం జరిగిందిమా నాన్నను రాడ్లతో చంపేందుకు ప్రయత్నించారుటీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారుఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసి మా ఇంట్లోకి చొరబడి దారుణంగా దాడులు చేశారుమాపై కూడా హత్యాయత్నం జరిగింది అంబటి నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన సజ్జలరాష్ట్రంలో అసలేం జరుగుతోందిప్రజలు మీకు(చంద్రబాబును ఉద్దేశించి..) అధికారం కట్టబెట్టింది దేనికి?ప్రశ్నించే గొంతులను వేధించడానికా?అంబటి ఇంట్లో టీడీపీ గూండాల విధ్వంసంపై సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజంసజ్జల మాట్లాడుతూ..లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పారుకానీ దర్యాప్తులో అలాంటిదేం లేదని తేలిందిఅలాంటప్పుడు సీఎం హోదాలో అంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?పైగా నెయ్యి కల్తీ నిజమని ఫ్లెక్సీలు పెట్టారుఆ తప్పుడు ఫ్లెక్సీలను మా నేతలు ప్రశ్నించారుఅంత మాత్రానికే వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు దిగారుసజ్జల మాట్లాడుతూ..దాడులకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదుపోలీస్ ఉన్నతాధికారులకు మా పార్టీ నేత బొత్స ఫోన్ చేసినా స్పందన లేదుదాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలిమా పోరాటం అహింసాయుతంగా ఉంటుందికోర్టును ఆశ్రయిస్తాం.. గవర్నర్ను కూడా కలుస్తాం సజ్జల మాట్లాడుతూ..అంబటితో పాటు విడదల రజని, భూమన, బ్రహ్మనాయుడిపై కూడా దాడి చేశారుమా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?డీజీపీ, హోం మంత్రి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలిచట్టం గూండాలను, అరాచక శక్తుల్ని రక్షించిందిగతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగా మాట్లాడారుచంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమేఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారుమాజీ హోం మంత్రిని ఎస్పీ గేటు బయట వెయిట్ చేయించారుటీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాంమేం అధికారంలోకి వచ్చాక అరాచకవాదులకు శిక్ష తప్పదుఅంబటి నివాసంలో..అంబటి ఇంటికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలునిన్న అంబటి నివాసంలో విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలుఅంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల,ఇతర పార్టీ నేతలుఅంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలుఅంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్సీపీ నేతలతో పాటు వచ్చిన కార్యకర్తలువైఎస్సార్సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుబారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులుఅంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలుటీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని పరిశీలించనున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి ఇంటికి వైఎస్సార్సీపీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్, డైమండ్ బాబు, గజ్జల భార్గవ్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్తో పాటు ఇతర పార్టీ నేతలు అంబటి నివాసం వద్ద ఉద్రిక్తతమాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్తతవైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు సజ్జల,అప్పిరెడ్డి ఇతర పార్టీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు అంబటి ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు నివాసానికి వైయస్సార్సీపీ ముఖ్యనేతలు పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేతలుపల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్, డైమండ్ బాబు, గజ్జల భార్గవ్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, ఎమ్మెల్సీ రూహుల్లా, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ ఇతర ముఖ్యనేతలు.నిన్న అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిపి.. బీభత్సం సృష్టించిన టీడీపీ గూండాలుఅడ్డుకోకుండా చోద్యం చూసిన పోలీసులుఖాకీల తీరుపై వైఎస్సార్సీపీ నేతల మండిపాటుకేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీఅమిత్ షాను కలిసి పరిస్థితి వివరించే అవకాశంఢిల్లీఅంబటి రాంబాబు పై హత్యాయత్నం పై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాంఫస్ట్ టీడీపీ వాళ్ళే అంబటి రాంబాబు పై దాడి చేసి పచ్చి బూతులు తిట్టారుఇది వరకు నాపై దాడి చేసినప్పుడు ఒక్క కేసు పెట్టలేదు-ఎంపీ మిథున్ రెడ్డితిరుపతిఅత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటిపై దాడి చేయించిందిఇంత దారుణమైన కూటమి ప్రభుత్వం పరిపాలన పక్కనపెట్టి, రెడ్ బుక్ ద్తౌర్జన్యాలను అమలు చేస్తుందిప్రజలు అందరు గమనిస్తున్నారురాబోయో రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనమారి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుందిఅతిగర్వంతో ఒళ్లు మరిచి కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణాలు పాల్పడుతుంది:::పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదీ చదవండి: అంబటిపై హత్యాయత్నం.. వైఎస్సార్సీపీ నేతల రియాక్షన్ ఇదినల్లపాడు స్టేషన్ వద్ద ఆంక్షలు..మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.అంబటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు.నల్లపాడు పీఎస్కు తరలింపు.నల్లపాడు స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు.మీడియాకు సైతం అనుమతి నిరాకరణ. జక్కంపూడి రాజా హౌజ్ అరెస్ట్.. తూగోలో టెన్షన్.. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనధికారిక హౌస్ అరెస్ట్ఇంటిముందు పోలీసుల మోహరింపుఅంబటి రాంబాబుకి సంఘీభావం తెలిపేందుకు జక్కంపూడి ప్రయత్నంబయటికి వెళ్లేందుకు రాజా అనుమతించని పోలీసులుతనను ఎందుకు నిర్బంధిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించిన జక్కంపూడి రాజా..ఇరు వర్గాలకు వాగ్వాదం👉ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్కు చేరుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు.👉పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు.👉టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు.👉కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సంఅప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. 👉కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు.👉అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. 👉ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. -
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
-
‘బాబు, పవన్, లోకేష్లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నారా లోకేష్ కార్యాలయ ముట్టడికి యత్నం
సాక్షి, విజయవాడ: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అందించాలని శుక్రవారం అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొందరు యువకులు మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. బారికేడ్లను అడ్డు వేయగా.. వాటిని తోసుకుని కొందరు యువకులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలంటూ ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మైలవరంలో జోగి రమేష్ గెలుపు ఆపేంత దమ్ముందా.. బాబు,లోకేష్ ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మీది ఒక బతుకేనా..? బాబు కుట్రలపై లక్ష్మీపార్వతి సీరియస్
-
ఆ డ్యాన్సులు ఏంటి? మంత్రి వాసంశెట్టిపై లోకేష్ సీరియస్
-
దావోస్ సదస్సు విహారయాత్ర?
దావోస్ సమావేశాలు నిజంగానే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయా? లేక అవి విహార యాత్రల్లా మారిపోయాయా? ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి సాధిస్తున్నది ఏమిటి? పదిహేనుసార్లు దావోస్కు వెళ్లి రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ భారీ కంపెనీ లేదా పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే నిరాశే ఎదురవుతుంది.ఎందుకంటే.. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న దావోస్ పర్యటనలు మొత్తం సొంత డబ్బాలకే వాడుకుంటున్న భావన కలుగుతుంది. ప్రజా ప్రయోజనం ఎంతో కాని, ప్రభుత్వ నేతలకు మంచి టైమ్పాస్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఇవి పూర్తిగా నిష్ప్రయోజనమనీ చెప్పలేము కాని కాలక్రమంలో షో బిజినెస్గా మారుతోందన్నది ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ప్రకటనలు కొన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.గత ఏడాది దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క ఒప్పందమూ చేసుకోలేకపోయింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలు ఓ మోస్తరు నుంచి భారీ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు చూడండి.. అచ్చం అలాగే.. చంద్రబాబు అప్పట్లో ‘దావోస్కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య’ అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని సాగతిస్తున్నానని తెలిపారు. విశేషం ఏమిటంటే ముందుగా ఆయన సరైన సూచన ఇవ్వాల్సింది తన కుమారుడు లోకేశ్కే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్లినప్పుడు గ్రీన్కో వంటి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకువచ్చారు. కానీ అప్పట్లో లోకేశ్ అండ్ కో ‘విదేశాలకెళ్లి దేశీ కంపెనీని తీసుకొస్తారా’ అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన నెగెటివ్ మైండ్సెట్ సరికాదని చంద్రబాబు.. లోకేశ్కు అప్పుడే చెప్పిఉండాల్సింది.తాజా పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ ఛైర్మన్తో సమావేశమైన సందర్భంలో మాట్లాడుతూ గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. అప్పుడేమో మిథ్య అన్నారు.. ఇప్పుడు మాత్రం బోలెడంత పెట్టుబడి వచ్చిందంటున్నారు. ఏది నిజం? ఈయన అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అది రాష్ట్రానికి అప్రతిష్ట కాదా?. ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు దావోస్లో తొమ్మిది సెషన్లు, సమావేశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలు అన్నీ ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈవోలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా!.కాకపోతే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ పెట్టుబడులు పెట్టాలని బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్.ఎమ్.జడ్ను కోరితే వారు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ రూ.91 వేల కోట్ల పెడుతుందని, లక్ష ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లు కూడా లేకపోగా ఉద్యోగుల సంఖ్య వెయ్యి మంది మించడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీతో లక్ష ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ ఇమేజీని చంద్రబాబు, లోకేశ్లు పెంచారా అంటే ఉన్న పరువు కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏమి చెబుతున్నానో మర్చపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది.‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త’ విధానం తెచ్చానని, కనీసం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది ఐదు లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని చంద్రబాబు మరో సమావేశంలో అన్నారు. ఈ లక్ష్యం సాధిస్తే తర్వాత పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్టిలో చెబితే వాళ్లు ఏమనుకుంటారు? పైకి ఏం అనకపోయినా తర్వాత అయినా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ను హైదరాబాద్ తెస్తానని అంటూ కొన్ని అతిశయోక్తులు చెప్పినా తన గురించి కాకుండా.. తెలంగాణ, హైదరాబాద్లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. సుమారు రూ.29 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. రేవంత్ తన ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్ కో సంస్థతో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం దావోస్లో ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోధాకు చెందిన కంపెనీతో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు చేశారు.2014-19 టర్మ్లో చంద్రబాబు దావోస్ పర్యటనలో చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్ హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరాంకో, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, అలీబాబా రెండో డేటా సెంటర్ ఏపీలోనే.. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ, ఏపీ బ్రాండింగ్ @దావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా! దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. గతంలో బ్రాండ్ ఇమేజీ లేదని మనమే దావోస్లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజీ పడిపోయిందో, పెరిగిందో ఆలోచించుకోవచ్చు.ఇక రెడ్బుక్ అరాచకాల విషయం జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. దావోస్ వరకు వెళ్లి తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. దావోస్లో తెలుగువారి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ను విమర్శించడం వల్ల ఏపీకి ఏం మేలు కలిగినట్లు!. సీపీఎం నేత బీవీ రాఘవులు దావోస్ పర్యటనలను ప్రజాధనంతో జరిగే తీర్ధయాత్రలుగా అభివర్ణించారు. దావోస్లో చంద్రబాబు, లోకేశ్లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజీతో కాకుండా, తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దలాల్ ఒక ట్వీట్ చేస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని వ్యాఖ్యానించారు. దావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఇబ్బందికర వ్యవహారంగా మారిన సంగతిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకోగల ఒప్పందాలను దావోస్లో చేసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ప్రచార ఆర్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత వ్యాఖ్యానించారు. ఏపీ అనుభవం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
సొమ్మొకడిది సోకొకడిది.. తండ్రీకొడుకుల భజన చూసి నవ్వుతున్న నెటిజన్లు
-
దావోస్ దారి ఖర్చులూ కలిసిరాలేదట.. నిజమేనా?
‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’ - సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’ - చంద్రబాబు నాయుడు ప్రశంస..‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’- నెటిజన్ల వ్యాఖ్య..పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.ఆంధ్రప్రదేశ్కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్లు అది మాని ఏపీ బ్రాండ్ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
యూనివర్సిటీలో విద్యార్థులను బెదిరించి లోకేష్ పుట్టినరోజు వేడుకలు
-
పోటీ పడుతున్న పవన్, లోకేష్ అభివృద్ధిలో కాదు.. ఆ విషయంలో..
-
లోకేష్ ఎవరు నువ్వు? రెడ్ బుక్ లో జనసేన నేతలు ఏకిపారేసిన శైలజానాథ్
-
రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!ఏపీ బ్రాండ్ ఇమేజ్ను రెడ్బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్ లేదు. సోషల్ మీడియాలో లైక్, కామెంట్ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు. -
వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. లోకేష్ కు జోగి రమేష్ మాస్ వార్నింగ్
-
బాబును చూసి కంపెనీలు పరార్.. దారి ఖర్చులు దండగే
-
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూములు
-
అబద్ధాల కోరు చంద్రబాబు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు.. దావోస్ వెళ్లి అబద్దాలు చెప్పారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలతో తండ్రి, కొడుకులు బతుకుతున్నారంటూ దుయ్యబట్టారు. కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూముల కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో గ్రీన్కో కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడితో ఉద్యోగి మరణించాడు. అదే నిజమైతే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ దేనికోసం?. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఎందుకు రాజీపడుతున్నారు. కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ కావాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం
-
లోకేశ్.. ఇది పాయె.. అదీ పాయె!
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే ఆంధ్రప్రదేశ్ సకల శాఖల మంత్రి నారా లోకేశ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఈయనేమో ఐటీ, విద్యాశాఖల మంత్రి. కానీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇతర శాఖలన్నీ తనవే అన్నచందంగా వ్యవహరిస్తూంటారు. ఒకపక్క రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షల్లో తగ్గిపోతూంటే దాన్ని పట్టించుకోకపోగా.. ఇతర శాఖలపై పెత్తనం ఏమిటన్నది ప్రశ్న. చిత్రంగా ఎల్లోమీడియా మాత్రం లోకేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చేశారని ఊదరగొడుతూంటుంది. అందుకే చాలామంది రెండు శాఖలలోను లోకేశ్ పనితీరు అంతంతమాత్రమేనంటున్నారు. తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది కూడా ఇదే. ఎలివేషన్ ఇచ్చేందుకేమో... చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్కు కీలకమైన విద్య ఐటీ శాఖల మంత్రిగా చేశారు. యువకుల్లో లోకేశ్కు ఒక గుర్తింపు వస్తుందని కూడా భావించి ఉండవచ్చు. తల్లికి వందనం స్కీమ్ లోకేశ్ ఐడియానే అని చంద్రబాబు చెప్పడం కూడా ఎలివేషన్లో భాగమే. కాకపోతే ఈ పథకాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ పేరుతో మొదలుపెడితే.. క్రెడిట్ లోకేశ్కు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఐటీ శాఖకు సంబంధించి కూడా.. ఇదే రకమైన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తెప్పించానికి లోకేశ్ కృషి చేసినట్టుగా చెప్పారు ఆయన. ఆసక్తికరంగా ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెడిసికొట్టాయి కూడా. చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు పరుగులు పెడతాయని ఒకప్పుడు ఊదరగొట్టిన లోకేశ్ ఆ తరువాత ఆ విషయం ఎత్తకపోగా.. ఐటీ అభివృద్ది పేరుతో 99 పైసలకే ఎకరాలకు ఎకరాల భూమి కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టారు. పోనీ అలాగైనా కంపెనీలు వచ్చాయా? ఊహూ లేదు. అది చాలదన్నట్టు మంత్రివర్గం స్థాయిలో తీసుకోవాల్సిన భూ కేటాయింపు నిర్ణయాలను తానే తీసుకుంటూ విమర్శలకు గురయ్యారు. తొంభై తొమ్మిది పైసలకే భూములెలా పంచుతారంటే అహంకారపూరిత ధోరణిలో తన నిర్ణయాలను సమర్థించుకుంటున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు. లోకేశ్ శాఖల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర శాఖల విషయంలో జోక్యం చేసుకోవడం ,ముఖ్యంగా రెడ్బుక్ అంటూ హోం శాఖను తానే నడుపుతున్నట్లుగా ప్రవర్తించడం, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి ఆయన ఇమేజ్ను డామేజీ చేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్య,ఆరోగ్య రంంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కాని కూటమి ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి.దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ బాధ్యులవుతారా? కాని ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులు ఏ మాత్రం బాగోలేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీడియా కథనం ప్రకారం.. 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో హైస్కూలు స్థాయి లోపు 18 లక్షల మంది విద్యార్ధులు చదువులకు దూరం అయ్యారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఐదు శాతం మంది తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో ఒక శాతం, హైస్కూలు దశలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. జగన్ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమాల ద్వారా, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై ఆసక్తి రేకెత్తించారు. పేదలు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్లకుండా స్కూళ్లలో చేర్చే అవకాశాలు కల్పించారు. ‘‘నాడు-నేడు’’ కింద ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి వాటికి కొత్త కళ తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడే డిజిటల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్లు ఇచ్చారు. ఎల్లో మీడియా విష ప్రచారం చేసేది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు.అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా రూ.14 వేల చొప్పున ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో మెనూ గురించి కూడా శ్రద్దపెట్టారు. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్, బూట్ల నుంచి అన్నింటినీ టైమ్కు అందించే ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాలు మాత్రం టీచర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి. టీచర్లు కూడా కొంత వరకూ వీరి ట్రాప్లో పడినట్లు చెబుతారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పద్దతులను యధాతధంగా పాటించినా మంత్రి లోకేశ్కు మంచి పేరే వచ్చేదేమో! కానీ.. ఏడాది పాటు తల్లికి వందనం ఎగవేయడం, రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేయడంతో విద్యార్థులు చదువులకు దూరమై ఉండవచ్చని చెబుతున్నారు. గ్రామాలలో, పట్టణాలలో మనీ సర్కులషన్ బాగా పడిపోయిందని అంటున్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు.దీని ప్రభావం కార్మికరంగంపై కూడా ఉంటుంది. వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. జగన్ హయాంలో వివిధ స్కీముల ద్వారా జనంలో డబ్బు చెలామణిలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో పనుల్లేక జనాలు వలస వెళుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా చూసేందుకు ప్రయత్నించడం అత్యవసరం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దావోస్ హీరోలు.. తెచ్చింది జీరో.. చంద్రబాబు, లోకేష్ బేతాళ కథలు
-
టీమ్ 11 తో జగన్ గేమ్.. లోకేష్ లో భయం స్టార్ట్
-
లోకేష్ రెడ్ బుక్ లోని మిగిలిన 97 పేజీలు మడిచి ఎక్కడైనా పెట్టుకో..
-
నమ్మరేంట్రా బాబు.. దావోస్ మ్యాన్.. కారుమూరి వెంకట్ రెడ్డి సెటైర్లే సెటైర్లు
-
మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు.. ఏం పీక్కుంటారో పీక్కోండి? రెచ్చిపోతున్న లోకేష్
-
దావోస్ సాక్షిగా పరువు పోగొట్టుకున్నారు
-
నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి
-
లోకేష్ కు బ్యాక్ ఎక్కువ.. మైండ్ తక్కువ.. లోకేష్ లింగం పై అమర్నాథ్ పంచులు
-
దావోస్ వెళ్లి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టామని చెబుతారా?
సాక్షి, విశాఖపట్నం: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు దావోస్లో కూటమి పెద్దలు చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారాయన. మంగళవారం మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ..వెన్నుపోట్లు, పొలిటికల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్లో నిజంగానే చంద్రబాబు యూనిక్ పీస్. చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ చోరీలో సిద్ధహస్తులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాదు నగరం, భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా అన్ని తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. నారావారి దిష్టిబొమ్మ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని చెప్పుకుంటోంది. దావోస్కు వెళ్ళింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో కాదు.. టీడీపీ బ్యాండ్ మేళంతో. వైఎస్సార్సీపి పై విమర్శలు చేయడానికి దావోస్ ను వేదికగా వాడుకోబోతున్నారు. అసలు దావోస్ వెళ్లి పెద్ద పెద్ద రికార్డింగ్ డాన్సులు పెట్టామని చెప్పుకుంటారా?.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దావోస్ వెళ్లి మీ డప్పు మీరు కొట్టుకుంటారా?. పండుగ పేరు చెప్పి అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినదా?..వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోనీ బతికింది మీరు. నారా రామ్మూర్తి నాయుడునీ గొలుసులతో కట్టేసిన చరిత్ర మీది. లోకేష్ కు బ్యాక్ ఎక్కువ మైండ్ తక్కువ. రెండేళ్లలో మీరు ఒక పరిశ్రమనైనా తెచ్చారా?. .ఏపీకి వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలు తాము తెచ్చినట్లుగా చంద్రబాబు లోకేష్లు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారు.చంద్రబాబు గొప్ప గురించి ప్రజల చెప్పాలి. అంతేగానీ తనకు తానే విజనరీ అని సొంత డప్పు కొట్టుకోవడం కాదు. చలి ఉంటుంది కాబట్టి మేము దావోస్ వెళ్లలేదని గతంలో నేను అన్నట్లు ప్రచారం చేశారు. అది లోకేష్ నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. నిరూపించలేక పోతే క్షమాపణ చెబుతావా. ఒక సీఎం కొడుకువై ఉండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా?..ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇష్టానుసారంగా భూమి కేటాయించారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుపై చర్యలు ఉంటాయి.. నిబంధన ప్రకారం భూ కేటాయింపు జరపమని కోర్టు చెబితే.. పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ భూములను ఇవ్వండి. అంతేగానీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాళ్లా పంచారు అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Kannababu : స్కామ్ బాబు.. లులు మాల్ అంటే ఎందుకంత ప్రేమ..?
-
లోకేష్ ఇప్పటికైనా మారాలి.. ఎవరూ కాపాడలేరు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీలో 18 నెలలుగా దళితుల మారణహోమం జరుగుతోందని కూటమి సర్కార్పై మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. దళితుల పట్ల దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎక్కడికి పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. ఇదే ఘటన మరో కులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కందుకూరులో కాపు-కమ్మలకు మధ్య దాడి జరిగితే హోం మంత్రి అనిత పరుగు పరుగున వెళ్లారు. పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మీరు వాళ్లకు సపోర్ట్ చేశారా?. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. తుని దుర్ఘటనలో 60 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపేస్తే.. చెరువులో దూకేశాడని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో ఆడవాళ్లను బట్టలు తీసేని డ్యాన్స్లు చేయమన్న జనసేన నేతను ఎందుకు అరెస్ట్ చేయలేదు?. జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు మీకు కనబడవా?. ప్రతీ కేసులో అరెస్టులు చేసి రోడ్ల పై నడిపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్ అని హడావిడి చేస్తున్నారు. కేసు విచారణలో నిర్దోషిలుగా తేలితే వారి గౌరవాన్ని తిరిగి మీరు ఇవ్వగలరా?.పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త చట్టాలు ఇవేనా?. మీరు ఎంత రోడ్లపై నడిపిస్తే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపిస్తే చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 60 శాతం మంది బాధితులు దళితులే. గ్రామాల్లోని నాయకుల ఇళ్లపై వేరే పార్టీ జెండాలు ఎగరేస్తే ఊరుకోవడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు ఎగరకపోతే వారిని బహిష్కరిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఇదేనా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. కూటమి కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలి.యరపతినేనిపై కేసు కట్టాలి.. సామాన్య కార్యకర్త చనిపోయాడని ఎమ్మెల్యే యరపతనేని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఏపీలో మర్డర్ చేస్తే మాట్లాడే వాడు లేడు. అత్యాచారం చేస్తే అడిగేవాడు లేడు. సాల్మన్ హత్య కేసులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడు. తక్షణమే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలి. 18 నెలల కూటమి పాలనలో 276 మంది దళిత ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి సమాధుల వద్దకు కూడా కుటుంబ సభ్యులను వెళ్లనివ్వడం లేదు. కుటుంబసభ్యులను కూడా రానివ్వకుండా పోలీసులే దహన సంస్కారాలు చేసేయడమేంటి?. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలిదళితులకు, ఆడబిడ్డలకు ఏం జరిగినా పరుగు పరుగున వస్తానని పవన్ చెప్పారు.. ఇప్పుడు ఏమైపోయారు?. సాల్మన్ కుటుంబానికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సహా హత్యకు కారకులైన వారిపై 302 సెక్షన్ పెట్టాలి. లేనిపక్షంలో బాధితుల పక్షాన కోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం. యరపతినేని శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఇప్పుడు తప్పించుకున్నా 2029లోనైనా యరపతినేని తప్పించుకోలేడు. ఈ కేసులో మా వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత ఉద్యమం తప్పదులోకేశ్ శాశ్వతంగా దావోస్కే.. లోకేష్ ఇప్పటికైనా మారకపోతే.. భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. ఇప్పుడు నెలకొకసారి నారా లోకేష్ దావోస్కి వెళుతున్నాడుఒక్కసారి ప్రభుత్వం మారితే నారా లోకేష్ పర్మినెంట్గా దావోస్కి పారిపోవడమే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం కోల్పోయిన పరిస్థితి తర్వాత మీ పరిస్థితి ఏంటి?. తాటతీస్తా.. ఒంగోబెట్టేస్తా.. నారతీసేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. సనాతన ధర్మాధికారి పవన్కు జనసేన నేతల చర్యలు కనిపించడం లేదా?. దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మానప్రాణాలను కాపాడతానని పవన్ కబుర్లు చెప్పారు.పవన్ ఏం చేశారు.. భారతదేశంలో ఈ స్థాయిలో కోడి పందాలు ఎప్పుడూ జరగలేదు. మీకు 164 సీట్లు ఇస్తే మందులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీ చూపించారు. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రికార్డింగ్ డ్యాన్స్లు వేశారు. రాజకీయాలను మార్చడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఏం మార్చారు. ఇంతకుముందు కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. గతం కంటే ఎక్కువ జూదం జరిగింది.. ఎక్కువ క్యాసినోలు జరిగాయి. క్యాసినో పేరుతో కొడాలి నానిపై వారం రోజులు డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు పెట్టిన క్యాసినోలు మీకు కనిపించడం లేదా?. -
చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం
-
గలీజు కతలు.. కూటమి పెద్దలది ఎంత తెలివో!
ఆంధ్రప్రదేశ్లో జూదాల జాతర! రెండు వేల కోట్ల పందాలు! మందు బాబులకు పండగే! మూడు రోజుల్లో 438 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! గోవా నుంచి క్లబ్ డాన్సర్లు! అశ్లీల నృత్యాలు! కాసినోలు, గుండాట! ఇలాంటి శీర్షికలతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఏమనుకోవాలి? రాష్ట్రం ముందుకెళుతోందనా? లేక దిగజారిపోతోందనా?.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, వినోదమని ప్రచారం చేసుకోవడం, పరోక్షంగా సమర్థిస్తూండటం చూసి ప్రముఖ సామాజికవేత్త సునీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు.. పరిస్థితి ఎంత నీచంగా ఉందో చెబుతున్నాయి. ‘ఏపీలో పలుచోట్ల రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే, సమాజం దానిని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి" అని సునీత కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్తకు తీసుకువెళ్లింది.. అనేది సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్ధ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తున్న చంద్రబాబు, సనాతని వేషం కట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేశ్లకు ఏపీలో సంక్రాంతి పండుగ పూట మూడు రోజులపాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు.. ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా?.. వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ కేసులు పెట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ మూడు రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు, వాటికి రక్షణగా నిలబడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టు ఒకరు ఈ వికృతాలను వివరిస్తూ ఉయ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి, గోవా నుంచి డాన్సర్లను అందుబాటులో ఉంచారని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంటిచోట్ల కళ్లెదుటే క్యాంపులు కనిపించినా పోలీసులు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు క్లబ్ డాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు వేస్తే, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వాటిని పండగ, సంబరమంటూ ప్రొజెక్టు చేసింది. పందాలు అనేవి నిషేధం. ఏపీలో పందాల వార్తలు, ఎవరు ఎంత పందెం కాసిందీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి?.. ఎల్లో మీడియా అంచనా ప్రకారమే ఈ పందాల విలువ రూ.2,000 కోట్లు. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఓ ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలలోనే రూ.500 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.800 కోట్ల పందాలు జరిగాయట. బాపట్లలో రూ.200 కోట్ల కోడిపందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందంలో రూ.1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే, మరో వ్యక్తి దానిని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పలేం. మొబైల్ వాన్లు తిప్పి మరీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్ట సమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటిని అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి కోడిపందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికి తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసింది. ఈసారి అంతకుమించి సెటప్లు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా వీటిని పర్యవేక్షించినా ఈ ఎల్లో మీడియాకు సంబరంగా కనిపించింది. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసులకు బాగా గిట్టుబాటైందని వార్తలు వచ్చాయి. జూదం, పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగిపోతుంటే, వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్ గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాలలో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి.. ఎంత తెలివో!.. ఒకపక్క అశ్లీల న్యత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జూద పందాలతో ప్రజలు ఆర్ధికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా.. ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీక్ ఇచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జూద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసిచూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపధ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసింది. అశ్లీల నృత్యాల హోరులో బ్రాండ్ ఇమేజీ కొట్టుకు పోయింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారా లోకేష్ అరెస్ట్ ఖాయం.!
-
మొదటి అరెస్ట్ నారా లోకేష్దే: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ మీదకు చెప్పులు వేయించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు వెన్ను పోటుకు 30 ఏళ్ళు గడిచాయి. ఆరోజు మహా నాయకుడు ఎన్టీఆర్ మీద చెప్పులు వేశాడు. మళ్ళీ ఇప్పుడు విగ్రహం పెడతాను అని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు ప్రతిష్ట పడిపోతున్నపుడు ఎన్టీఆర్ పేరు వాడుకుంటాడు. దుర్మార్గంగా ఎన్టీఆర్కు జరిగిన ద్రోహం అందరూ ఆలోచించాలి. బాబు చెప్పే అబద్దాలు నమ్మొద్దు. ఇప్పటికైనా ఎన్టీఆర్ చివరి క్షణంలో పడిన క్షోభను గమనించాలి. ఎన్టీఆర్ చివరి క్షణంలో ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ చూడండి. చంద్రబాబు లాంటి దుర్మార్గుడికా నేను పిల్లను ఇచ్చింది అని ఎన్టీఆర్ బాధ పడ్డారు. చంద్రబాబును రాజకీయాల్లో ఉంచకూడదు అని ఎన్టీఆర్ అన్నారు.చంద్రబాబు అబద్దాల చరిత్రను నమ్మొద్దు. మీరు ఎన్టీఆర్ చెప్పింది మరోసారి వినండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాన్ని నమ్మరు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును సహించరు. మొన్న కూడా ఈవీఎంల ద్వారా మోసం చేసి వచ్చాడు. అబద్దపు హామీలు చేసి అధికారంలోకి వచ్చాడు. అందరినీ మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నారు. తండ్రి కొడుకులకు దోపిడీ తప్ప హామీలు నెరవేర్చే ఆసక్తి లేదు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారు. మళ్ళీ ఆయన మీద కేసులు కొట్టి వేయించుకుంటున్నారు.జగనే నంబర్ వన్.. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రజల్లో ఎప్పటికీ నిలిచారు. భారత్లోనే పవర్ ఫుల్ స్థానంలో వైఎస్ జగన్ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దేశంలోనే నంబర్ వన్ వైఎస్ జగన్. మళ్లీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏపీలో ఎవరికీ పండగ సంతోషంగా జరగలేదు. పండగ పేరుతో రాష్ట్రాన్ని జూదం, పందేలు, రికార్డింగ్ డాన్సులు అనే విధంగా చేశారు. వైఎస్ జగన్ విశాఖను అందంగా తీర్చిదిద్దారు. కానీ, చంద్రబాబు, లోకేష్ మాత్రం.. విశాఖను అశ్లీల నృత్యాలకు వేదిక చేశారు.లోకేష్దే మొదటి అరెస్ట్..లోకేష్ రెడ్ బుక్ పాలనా ఆయన మెడకే చుట్టుకుంటుంది. నేను ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తాను. ఇలాంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. హంతకులను మీరు వెనుకేసుకురావొద్దు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన వారిన మీకు స్నేహితులా?. జగన్ అధికారంలోకి వచ్చాక మొదట అరెస్ట్ అయ్యేది లోకేష్. ఆయన అవినీతిలో కూరుకుపోయారు. ఎన్టీఆర్ బతికి ఉన్నఫుడు చంపేశారు. ఇపుడు విగ్రహం పెడుతామని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చాతనైతే ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించాలి అని డిమాండ్ చేశారు. -
Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు
-
జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
-
అభివృద్ధి ముసుగులో ఊరు పేరు లేని కంపెనీలకు విశాఖను అమ్మేస్తున్నారు
-
అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్
-
లోకేష్.. హెరిటేజ్ ఆస్తులను రూపాయికి ఇస్తారా?: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.వైఎస్ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు..
-
ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !
-
ఫార్చ్యూన్ 500కి భూమి ఫ్రీగా ఇవ్వడానికి నువ్వెవడివి కోన్ కిస్కా గొట్టం గాడివి
-
లోకేష్కు రిపోర్టర్ దిమ్మతిరిగే ప్రశ్న సమాధానం చెప్పలేక..
-
లోకేష్ కు రిపోర్టర్ దిమ్మతిరిగే ప్రశ్న సమాధానం చెప్పలేక..
-
వసూలు రాజా.. బాబు అపాయింట్మెంట్ కావాలంటే ముందు లోకేష్ కు..
-
బెదిరించి.. భయపెట్టి..
నంద్యాల: నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసు బలగాలతో డెయిరీ ఎన్నికలు సవ్యంగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాత్రెడ్డికి కట్టబెట్టేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్రెడ్డి ఎన్నిక చెల్లదని.. దానికి వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా.. డైరెక్టర్లు పీపీ మధుసూదన్రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్రెడ్డి, ఎండీ ప్రదీప్కుమార్లను బైండోవర్ చేసేందుకు నంద్యాలకు చెందిన ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నుంచే విజయ డెయిరీ వద్ద మోహరించారు. రవికాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీసుస్టేషన్లో ఉంచారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లతో పాటు ఎండీని బైండోవర్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే, నోటీసులు ఇవ్వకుండా స్టేషన్కు రమ్మంటే ఎలా వస్తామని వీరు ప్రశ్నించగా.. రావాల్సిదేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో.. డెయిరీ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, మధుసూదన్రెడ్డి తాను అయ్యప్ప మాల వేసుకున్నందున పూజకు వెళ్లాలని చెప్పి వెళ్లారు. సాయంత్రం డెయిరీ ఎండీ ఇతర డైరెక్టర్లపై బైండోవర్ కేసులు పెట్టి తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచారు.త్రిసభ్య కమిటీ ముందు హాజరుకాకుండా హైడ్రామా..బమరోవైపు.. భూమా విఖ్యాత్రెడ్డి విజయ డెయిరీకి రూ.1.20 కోట్లు అప్పు ఉన్నారు. ఆ అప్పు చెల్లించకపోవడంతో అతని సభ్యత్వాన్ని రద్దుచేశారు. దీంతో.. పాల సొసైటీ అధ్యక్షుడు కాకపోతే చైర్మన్ కావడం సాధ్యంకాదని భావించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం లేకుండానే అధ్యక్షుడిగా విఖ్యాత్రెడ్డి ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. అయితే, విఖ్యాత్ అప్పు చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ప్రకటించామని, అతని సభ్యత్వం కూడా రద్దుచేశామని.. మీరెలా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వాలని కమిటీ సభ్యులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఈ కమిటీలో డైరెక్టర్లు పీపీ మధుసూదన్రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్రెడ్డిలు ఉన్నారు. కానీ, విఖ్యాత్రెడ్డి వివరణ ఇవ్వలేదు. ఈనెల 10న వివరణ ఇవ్వాల్సి ఉండగా కమిటీ సభ్యులపైనే బైండోవర్ కేసులు నమోదుచేయడం చర్చనీయాంశమైంది.నిబంధనల ప్రకారం డైరెక్టర్గా వస్తే స్వాగతిస్తాం..భూమా విఖ్యాత్రెడ్డి డీఫాల్టర్ అయ్యాడు. ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండా అధ్యక్షుడు కావడం నిబంధనలకు విరుద్ధం. ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఎంపికపై సమాధానం ఇవ్వాలంటూ సభ్యులకు మూడుసార్లు నోటీసులిచ్చాం. ఈనెల 10న వివరణ ఇచ్చేందుకు మరోమారు అవకాశవిుచ్చాం. కానీ, మాపై బైండోవర్ కేసులు అంటూ పోలీసులు హడావుడి చేయడమేమిటి? నోటీసులిచ్చి ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లొచ్చు. అక్రమంగా ఎండీ ప్రదీప్కుమార్పై బైండోవర్ కేసు పెట్టడం దుర్మార్గం. కమిటీ రిపోర్టును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మాకు రాజకీయ ఉద్దేశాల్లేవు. రైతుల సంక్షేమమే ముఖ్యం. – డైరెక్టర్లు పీపీ మధుసూదన్రెడ్డి, విజయసింహారెడ్డిలోకేశ్ను కలిసిన వెంటనే సీన్ మారింది..ఇక ఈనెల 6న భూమా విఖ్యాత్రెడ్డి మంత్రి నారా లోకేశ్ను కలవడంతో డెయిరీ రాజకీ యం పూర్తిగా మారిపోయింది. త్రిసభ్య కమిటీ సభ్యులు, డెయిరీ ఎండీపై ఆ మర్నాడే బైండోవర్ కేసు పెట్టారంటే టీడీపీ అధిష్టానం నుండే పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు ఇక్కడ చర్చ జరుగుతోంది. -
లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు
-
సుప్రీం తీర్పు అంటే లెక్కలేదా? లోకేష్ పై జూపూడి ఫైర్
-
లోకేష్.. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తారా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాళీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో గొంతులు నులుమాలంటే కుదరదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం(రెడ్బుక్ రాజ్యాంగం) చేస్తారా?. దీనిపై ప్రజా పోరాటం చేస్తాం. అసలు సోషల్ మీడియా మీద సమీక్షలు, చర్యలకు మంత్రి లోకేష్కు ఏం అర్హత ఉంది?. సకల శాఖా మంత్రిగా లోకేష్ వ్యవహరించటం సబబు కాదు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా?.వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించటానికే సోషల్ మీడియా నియంత్రణా?. సాక్షి మీడియా, ప్రశ్నించే గొంతులను నులుమేయటమే మీ పనా?. ఆర్టికల్-19కి విరుద్ధంగా వ్యవహరించే వారందరిపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబాలపై ఐ-టీడీపీ పెడుతున్న పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు?. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పేరుతో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించినా కేసులు పెట్టటం ఏంటి?. ఐ-టీడీపీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టుకు వెళ్తాం. లోకేష్ గురివింద గింజ సామెత లాగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఏపీలో అమలు చేయని వైనంపై కోర్టులోనే తేల్చుకుంటాం. అభ్యంతరకర పోస్టులన్నీ టీడీపీ సోషల్ మీడియా నుండే వస్తున్నాయి. లోకేష్ ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
మా ఎమ్మెల్యే కనిపించడం లేదని మంగళగిరి నియోజక వర్గ ప్రజల ఆక్రోశం
-
నారా లోకేశ్ శాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్ప వారిగా, కోర్టుకన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది.కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంది. కేజీబీవీల్లో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు... విద్యాశాఖలో ఏదీ కూడా సక్రమంగా జరగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను, అలాగే సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి.శ్రీనివాస్రావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయనకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాస్రావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచి్చంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కేసు వివరాలు ఇవీ..⇒ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు గత ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు.⇒ ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.⇒ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్రావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.⇒ ఈ అప్పీల్పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.⇒ విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ⇒ పీజీటీల తరఫు న్యాయవాది జైభీమ్ రావు వాదనలు వినిపిస్తూ “ఒప్పందం ప్రకారం రిట్ పిటిషనర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగిస్తూ, వారికి ఆ మేర వేతనాలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సర్వశిక్షాభియాన్ అధికారులు మాత్రం పిటిషనర్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో పాటు నెలవారీ ఇచ్చే వేతనాన్ని పని గంటల ఆధారంగా చెల్లించేలా మార్పులు చేశారు. అంతేకాక సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తామంటూ ఈ కోర్టుకు ఇచ్చిన హామీని సైతం అధికారులు ఉల్లంఘించారు’ అని ధర్మాసనానికి విన్నవించారు. -
సూట్ కేసులతో.. రహస్యంగా విదేశాలకు?
-
పట్టాభిషేకం పంచాయితీ కోసమేనా విదేశీ పర్యటన?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. పర్యటించరాదని కాదు కానీ గతంలో వీరిద్దరూ వైఎస్ జగన్ లండన్ టూర్పై పిచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు ఈ రహస్య పర్యటన కాస్తా చంద్రబాబును రాష్ట్ర ప్రజల దృష్టిలో అభాసుపాలు చేసింది. కొందరు చేసిన పాపాలు ఎక్కడకు పోతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికారిక హోదాలో సీఎం లేదా మంత్రులెవరైనా విదేశీ పర్యటనకు వెళుతూంటే ముందుగానే టూల్ షెడ్యూల్ విడుదలవుతుంది. కొన్నిసార్లు ఈ పర్యటనల్లో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటూంటారు. పర్యటన వ్యక్తిగతమైందైనా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేశ్ల టూర్ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉండవచ్చు కానీ.. వ్యక్తిగత పర్యటనైనప్పటికీ ఏపీ ప్రజానీకానికి తెలియచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు పెద్దగా విలువలేకుండాపోయిందని, చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేశ్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ గోప్యంగా వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో ఉన్నప్పటికీ టెలికాన్ఫరెన్స్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారని ఎల్లోమీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ.. ఎక్కడున్నారో మాత్రం చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్ తన కుతుళ్ల గ్రాడ్యుయేషన్ ఉత్సవాలకు లండన్ వెళితే చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు. కన్న కూతుళ్లను చూడాలన్న అభిమానం పుట్టింది. ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. అక్కడ విమానం లాండింగ్ ఉండాలంటే విమానానికి గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే దగ్గర, దగ్గర రూ.30 - 40 కోట్లు మీ డబ్బు ఖర్చు పెట్టి, కూతుళ్లను చూడడానికి వెళ్లాడు’’అని ఆరోపించారు. లోకేశ్ కూడా ‘‘రూ.12 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. హాలిడేకి వెళ్లాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళతాడు. లండన్ వెళ్లి ఎక్కడ పడుకుంటాడు అని నేను అడిగానా? ఏ హోటల్కు వెళ్లాడని నేను అడిగానా?’’ అంటూ అనుచిత భాష వాడారు. ఖర్చు విషయంలో చెరోమాట మాట్లాడటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. వాస్తవం ఏమిటంటే అప్పట్లో జగన్ లండన్ వెళ్లింది తన సొంత డబ్బుతో. ప్రభుత్వ సొమ్ముతో కానేకాదు. కానీ ఆ టూర్ సమయంలో ఎడాపెడా తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు రహస్య టూర్ను సమర్థించుకోలేక నానా పాట్లు పడుతోంది. టీడీపీ సోషల్ మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అప్పట్లో నీచంగా ధంబ్ నెయిల్స్ పెట్టారు. ‘‘జగన్ ప్రత్యేక విమానంలో ఏమీ తీసుకువెళ్లారు?’’ ‘‘ఆ సూట్ కేసులలో ఏముంది? డబ్బు తరలించారా?’’ ‘‘మధ్యలో విమానం ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది?’’ ‘‘ఆ దీవుల్లో బ్లాక్ మనీ దాచుకోవచ్చని వెళ్లారా?’’ అంటూ ఇలా రకరకాలుగా కథనాలు వండి వార్చారు. మెయిన్ మీడియాలో సైతం ఈ అంశాలపై చర్చలు జరిపారు. జగన్కు ఎల్లో మీడియా వేసిన ప్రశ్నలన్నీ ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లకు కూడా వర్తిస్తాయి కదా! వాటి గురించి మాట్లాడలేకపోయారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆరుసార్లు, లోకేశ్ తొమ్మిదిసార్లు విదేశీ యాత్రలు చేశారు. పెట్టుబడుల కోసం అని చెబుతున్నా, ఇంకేదో కారణం ఉంటుందన్నది పలువురి సందేహం. టీడీపీ విశ్లేషకులు ‘‘జగన్కు చెప్పి వెళ్లాలా? అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఆ తరువాత కానీ జగన్ సీబీఐ కోర్టు అనుమతితోనే టూర్ వెళ్లారు. లండన్ ఎయిర్ పోర్టులో వైసీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన వారు, అభిమానులు పలువురు ఆయనకు స్వాగతం చెప్పారు. కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాపరికం ఏదీ లేదు. అయినా ఎల్లో మీడియా ప్రజలలో అనుమానాలు వచ్చేలా పిచ్చి వార్తలు ప్రచారం చేసింది. వదంతులు సృష్టించడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఇప్పుడు పరిస్థితి చూడండి. కొత్త సంవత్సరం రావడానికి మూడు రోజుల ముందే లోకేశ్ విదేశీయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్లారు.వారెందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారో చెప్పలేని స్థితి. కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్లారని ప్రచారం జరిగింది. అదే నిజమైతే అమరావతి, ఏపీ, విశాఖ లేదా తిరుపతి వంటి నగరాలలో వేడుక చేసుకోకుండా విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వస్తాయి. అయితే చంద్రబాబు, లోకేశ్లు లండన్ కే వెళ్లారా? సింగపూర్కు వెళ్లారా అన్నది తెలియదు. తనకు వెంటనే పట్టాభిషేకం జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని, అందుకే ఆ పంచాయతీ కోసం విదేశాలకు వెళ్లారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారా అని మాజీ ఎమ్మెల్యే సుధాకర బాబు నిలదీశారు. సీఎం పదవి ఇవ్వలేదని అలిగి లోకేశ్ ముందే విదేశానికి వెళితే, అతనిని బుజ్జగించడానికి చంద్రబాబు వెళ్లారా అని మరో నేత నాగార్జున యాదవ్ అడిగారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లారా? లేక హెరిటేజ్ డబ్బుతో వెళ్లారా? అన్నది ఎందుకు చెప్పడం లేదని ఆయన అన్నారు. ఈ ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నది వేరే విషయం. జగన్ టూర్కు రూ.నలభై కోట్ల ఖర్చయి ఉంటుందని చంద్రబాబు ఆరోపించినందున, ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన తమ టూర్కు అంతే ఖర్చు చేశారా? ఇంకా ఎక్కువ చేశారా? జగన్ను ఉద్దేశించి అప్పట్లో అనుచితంగా వ్యాఖ్యానించిన లోకేశ్కు కూడా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవుతుంది కదా! గతంలో చంద్రబాబు, లోకేశ్లు ఎలాపడితే అలా అసభ్యంగా మాట్లాడితే, జగన్ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడం సంస్కారయుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేశ్ల రహస్య విదేశీ యాత్ర వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కాని,తెలుగుదేశం పార్టీని,ఎల్లో మీడియాని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారా వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు, లోకేష్ ఎక్కడ?.. ప్రజలు అడుగుతున్నారు’
సాక్షి, నెల్లూరు జిల్లా: కూటమి సర్కార్ 19 నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడులు ఆకర్షించడంలో దిట్టలు అన్నట్టుగా బాకాలు ఊదుతున్నారు. రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారాలు, ట్వీట్లు ఏ ప్రాంతం నుండి చేస్తున్నారో చెప్పలేరా? మీరు ఉంది.. ఏమైనా రహస్య ప్రదేశమా?. తెలియపరచకూడదా?. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి పేర్కొన్నారు.‘‘వారం రోజులు నుండి లోకేష్ పత్తాలేడు, చంద్రబాబు నాలుగు, ఐదు రోజులుగా జాడ లేదు. మీకు వున్న అనుకూల ఎల్లో మీడియాకు కూడా పాపం సమాచారం లేదు. ప్రజల్లో మీ జాడ ప్రస్తావన వస్తుందంటూ ఈ ట్వీట్ల డ్రామా చేస్తున్నారు. గతంలో కుమార్తెను చూడటానికి వైఎస్ జగన్ లండన్కు వెళ్తే బాబు హంగామా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.‘‘నేడు రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు మాత్రం మొదటి స్థానం అని ఓ పత్రిక రాసింది. ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి అంటే ఐదు శాతం కూడా లేదు. 2014-19 మధ్యన 1761 కంపెనీలతో ఎంవోయూలు, 18.87 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. అందులో కార్యరూపం దాల్చింది 10 శాతం మాత్రమే, అంటే 90 శాతం అబద్ధాలే...అమరావతి నుండి విశాఖకు హైపర్ లూప్ అన్నాడు.. ఎక్కడ..?. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అన్నాడు.. ఎక్కడ ?. ఏవియేషన్, విమానాల తయారీ అన్నాడు.. ఎక్కడ బాబు..?. ఏయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్ రకరకాల పేర్లు చెప్పాడు. 2023 మా హయాంలో 394 ఒప్పందాలు చేసుకున్నాము. 13.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అంచనా వేశాం. తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. మొదటి సంవత్సరంలోనే 20 శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయి. జగన్ నిర్ణయాలు, సంస్కరణలతో 91.6 శాతం కార్యరూపం దాల్చాయి. కరోనా విపత్కర పరిస్థితిల అనంతరం 17.700 లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం చేశాం. వాస్తవాలు దాచి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
కడుపుకు అన్నమే తింటున్నావా? లోకేష్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
సీక్రెట్ ఫైల్స్.. బాబు మిస్సింగ్
-
Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు
-
చంద్రబాబు ‘కనబడుటలేదు’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ల ఆచూకీ లేకుండా పోవడంతో, సోషల్ మీడియాలోనూ ప్రజల్లో వీరి ఆచూకిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్ఫష్టీకరించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తమ విదేశీ పర్యటలపై తండ్రీకొడుకుల ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీసిన ఆయన... సీఎస్, డీజీపీలే ప్రజలకు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా.. తెచ్చిన అప్పంతా దోచుకుంటోందని మండిపడ్డారు. చివరకు టీడీపీ కార్యకర్తల నూతన సంవత్సర అభినందనలకు కూడా అందకుండా తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ ల కోసం టీడీపీ కార్యకర్తలు వెదుకుతున్నారని... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రహస్య పర్యటనలేంటని వెంకటరెడ్డి ఆక్షేపించారు.ప్రతి 3 నెలలకు చంద్రబాబు, 2 నెలలకు లోకేష్ ప్రత్యేక విమానాల్లో దోచుకున్నది దాచుకోవడానికే రహస్య పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఆచూకీ లేని సీఎం చంద్రబాబునాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఏమైపోయాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కనబడుట లేదు. ఆచూకీ ఎక్కడ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆచూకీ గురించి రాష్ట్ర డీజీపీ, సీఎస్ల వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు చెప్పాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఆచూకీ కనుగోనమని కోరాలి. సీఎం చంద్రబాబుతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ సైతం గడిచిన వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చంద్రబాబు ఆచూకీ గురించి ఎల్లో మీడియా సైతం పలు దేశాల పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఎవరూ క్లారిటీగా ఫలానా దేశం వెళ్లాడని కూడా చెప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు, ఇలా రహస్యంగా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడం లేదు.శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో జంప్రాష్ట్రమంతా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకుంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం అదే రోజు (30.12.2025)న శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉదయం 10.28 గంటలకు వీజేటీ 101 అనే స్పెషల్ ఫ్లైట్లో బాలి వెళ్లాడని తెలుస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్లాడని ప్రచారం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ మీటింగ్ కూడా వదిలేసి 28-12-2025న శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్లాడని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగా కీలకస్థానాల్లో ఉండి ఇలా రహస్య పర్యటనలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేకుండా కేబినెట్ మీటింగ్లు కూడా వదిలేసి ప్రత్యేక విమానాల్లో ఎందుకు వెళ్లారు? వారి పర్యటన వివరాలు ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారు? కనీసం వారు తిరిగి ఎప్పుడోస్తారో కూడా చెప్పకపోవడానికి ఏవైనా కారణాలున్నాయా? ఇవన్నీ ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.ప్రతి మూడు నెలలకు చంద్రబాబు, రెండు నెలలకు లోకేష్చంద్రబాబు సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఆరుసార్లు విదేశీ పర్యటనలు చేస్తే, అందులో రెండుసార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి చేసిన రహస్య పర్యటనలే ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ పర్యటనలకు వెళ్లాడు. ప్రస్తుతం బాలి వెళ్లినట్టు తెలుస్తోంది. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఇప్పటికే 9 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. ప్రతి రెండు నెలలకోసారి ప్రత్యేక విమానాల్లో ఆయన విదేశాల్లో విహరించి వస్తున్నాడు. యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఏ దేశ పర్యటనలో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయకులకే క్లారిటీ లేదు.దోచుకున్నది దాచుకోవడానికేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రూ. 2.93 లక్షల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ సంపదను తన బినామీలకు అప్పనంగా దోచిపెడుతున్నాడు. ఆ డబ్బును విదేశాల్లో దాచుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఏపీ ప్రజల సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకోవడానికే తండ్రీకొడుకులు రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు.అరాచకాలకు కేరాఫ్గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేల బాగోతాలు చూస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి దారుణాలన్నీ కూటమి ఎమ్మెల్యేల కేంద్రంగానే జరుగుతున్నాయి. మహిళలను వేధిస్తూ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోల సాక్షిగా దొరికిపోయారు. మరికొందరి బాగోతాలు బాధితుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి.ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు పోలీసులు ఆయనతోపాటు అతడి అనుచరుడు సుజిత్ రెడ్డి, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన, టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో ఒక అమాయకుడు బలైపోయాడు. డ్రైవర్ రాయుడి హత్యలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పూనుకున్నాడని అభియోగాలున్నాయి. ఆ కుట్రలో పావుగా మారిన డ్రైవర్ రాయుడు హత్యకు గురైనట్టు తెలుస్తోందని వెంకటరెడ్డి తెలిపారు. రాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినా.. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు. -
క్యాబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టి లోకేష్ హాంకాంగ్ వెళ్లారు: కారుమూరి


