నెటిజన్ల ఫైర్‌.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని బాబు, లోకేశ్‌ | CM Chandrababu, Nara Lokesh not responding to Jr NTR injuries | Sakshi
Sakshi News home page

నెటిజన్ల ఫైర్‌.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని బాబు, లోకేశ్‌

Jul 28 2026 11:37 PM | Updated on Jul 28 2026 11:37 PM

CM Chandrababu, Nara Lokesh not responding to Jr NTR injuries

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్‌ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్‌పై చూపలేదని బాబు, లోకేశ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement