5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు.. జియో టాప్! | Jio Dominates AP Telangana Telecom Market | Sakshi
Sakshi News home page

5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు.. జియో టాప్!

Jul 28 2026 7:23 PM | Updated on Jul 28 2026 7:31 PM

Jio Dominates AP Telangana Telecom Market

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రిలయన్స్ జియో తన మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జూన్ 2026కు సంబంధించిన భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

తాజా గణాంకాల ప్రకారం.. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA), అలాగే యాక్టివ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల పెరుగుదలలో జియో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తదుపరి తరం డిజిటల్ కనెక్టివిటీ సేవలపై వినియోగదారుల విశ్వాసం, ఆదరణ నిరంతరం పెరుగుతోందనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

జూన్ నెలాఖరు నాటికి జియో మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3.26 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ 36.9 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. ఒక్క జూన్ నెలలోనే 1,78,546 నికర వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు జియో నెట్‌వర్క్‌లో చేరారు.

వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ జియో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 42.7 శాతం మార్కెట్ వాటాతో రాష్ట్రంలో అతిపెద్ద వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థగా కొనసాగుతోంది. జూన్ నెలలో 28,267 కొత్త కనెక్షన్లు జోడించడంతో మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. వేగంగా విస్తరిస్తున్న హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.

5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవల్లోనూ జియో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. TRAI గణాంకాల ప్రకారం, ప్రాంతంలోని 5జీ FWA మార్కెట్‌లో జియో 70.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. మొత్తం దాదాపు 11 లక్షల మంది FWA వినియోగదారుల్లో 7,75,442 మంది జియో సేవలను వినియోగిస్తున్నారు. జూన్ నెలలోనే మరో 8,629 మంది కొత్త FWA సబ్‌స్క్రైబర్లు జియోతో అనుసంధానమయ్యారు.

అలాగే 5జీ అన్‌లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) విభాగంలో సబ్‌స్క్రైబర్లను నమోదు చేస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్గా జియో కొనసాగుతోంది. జూన్ చివరి నాటికి ఈ విభాగంలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 4,18,347కు చేరుకోగా, ఒక్క నెలలోనే 19,799 మంది కొత్త వినియోగదారులు చేరారు. అభివృద్ధి చెందుతున్న ఫిక్స్‌డ్ వైర్‌లెస్ టెక్నాలజీల్లో జియో సాధించిన ముందంజకు ఇది నిదర్శనం.

జూన్ 2026 TRAI గణాంకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియో బలమైన పోటీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. వైర్‌లెస్ సేవల్లో నిరంతర వృద్ధిని నమోదు చేస్తూనే, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, 5జీ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌కు పెరుగుతున్న ఆదరణ, యాక్టివ్ వైర్‌లెస్ వినియోగదారులలో అత్యధిక వృద్ధి ద్వారా అధిక విలువ కలిగిన బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో జియో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా, మొబైల్ మరియు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించాలన్న జియో సంకల్పాన్ని తాజా ఫలితాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement