సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెనుమంట్ర మండలంలో ఈ రోజు (ఆదివారం) టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడంతో పచ్చపార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.


