breaking news
Delhi
-
నేడు ప్రధానితో ఫిన్లాండ్ అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: భారత్లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం. -
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం.గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్. -
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్న్యూస్..
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భీకర యుద్ధం నేపథ్యంలో గల్ప్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశం చేరుకుంటున్నారు. అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకున్న వంద మందిని ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానం కొచ్చి విమానాశ్రయానికి చేర్చింది. మరోవైపు.. నేడు గల్ఫ్ దేశాలకు 58 విమానాలు నడపనున్న విమానయాన సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.వివరాల మేరకు.. నేడు గల్ప్ దేశాలకు ఇండిగో 30, ఎయిరిండియా 23 విమానాలు నడపనున్నట్లు విమానయానశాఖ వెల్లడించింది. అలాగే, గల్ఫ్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అదనపు విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు పెరగకుండా నిరంతరం కేంద్రం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల కొచ్చి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన 31 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి.#WATCH | Kochi, Kerala: Malayalam Actress Swasika, who arrived at Cochin International Airport from Abu Dhabi, says, "Heavy panic situation is not there, but still, as we are from another country, so definitely we will get a little panic... I was supposed to come on 28th… pic.twitter.com/AS5XloeHTT— ANI (@ANI) March 4, 2026ఇక, యుద్ధం కారణంగా ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 1,221 విమానాలు, విదేశీ విమానయాన సంస్థల నుంచి 388 విమానాలు రద్దు అయినట్టు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.a అలాగే, ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. గల్ప్ దేశాల నుంచి భారత్ చేరుకున్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణంలో తాము భయానక పరిస్థితులను వెల్లడిస్తున్నారు.#WATCH | Delhi: A passenger, who arrived at IGI Airport from Dubai, says, "I was in Dubai for three days, so there were problems at some places, but the administration there managed everything well. Sounds of explosives were coming from some places, but there was not much… pic.twitter.com/5RNZdJjtvS— ANI (@ANI) March 3, 2026 -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే పశ్చిమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు.‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కన్పించింది.‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్కు వచ్చేందుకు అక్కడి ఎయిర్పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు. -
హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!
న్యూఢిల్లీ: మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1వ తేదీన ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా హోలీ పండగ తరువాత అంటే మార్చి 7 నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గంటకు సుమారు 33 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పటికీ, అవి ఎండ తీవ్రత నుంచి ఉపశమనాన్ని కలిగించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ గాలుల వేగం తగ్గే అవకాశం ఉండటంతో ఉష్ణతాపం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే పైస్థాయికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. సమీప భవిష్యత్తులో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, పగటివేళ బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఈ తరహా వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 91శాతం వైద్యుల షాకింగ్ డెసిషన్! -
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్కు చెందిన ఆర్ఎంపీగా పనిచేసే విసర్జీత్గా గుర్తించారు. ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్కు చెందిన అమీనా ఖాతూన్తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్లోని కటిహార్ ప్రాంతం. -
కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 21 మందిని కోర్టు ఈ కేసు నుండి విముక్తి చేసింది. ఈ కేసులో ఉద్దేశ పూర్వక కుట్ర ఏదీ లేదని తీర్పు చెప్పింది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని తప్పుబట్టింది. దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్వాగతించారు. న్యాయ వ్యవస్థే అత్యున్నతమై నదని, కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని హజారే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విలేకరులతో మాట్లాడుతూ "మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది. దాని కారణంగనే పలు రాజకీయ పార్టీలు, అనేక కులాలు,మతాలతో కూడిన మన దేశం సవ్యంగా నడుస్తోందని హజారే వ్యాఖ్యానించారు. బలమైన న్యాయవ్యవస్థ లేనప్పుడు, నేరస్థులు పైచేయి సాధిస్తారు, దేశంలో అల్లర్ల లాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన విమర్శలు అప్పట్లో ఉన్న ఆరోపణల ఆధారంగా చేసినవేనని, ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందున దానిని అంగీకరిస్తున్నానని చెప్పారు. అంతేకాదు 2011 నాటి 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంలో వీరంతా కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేజ్రీవాల్, సిసోడియాలు తన వాళ్లేనని హజారే అభివర్ణించడం విశేషం. అన్నా హజారే సలహాకోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్కు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు హజారే ఒక ముఖ్యమైన సూచన చేశారు. సొంత పార్టీ లేదా స్వ ప్రయోజనాల కోసం లేదా పార్టీ కోసం కాకుండా, సమాజం మరియు దేశం కోసం పని చేయాలని సూచించారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమచంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తి ఇలాంటి కేసులో చిక్కుకోవడంపై హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని కూడా ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజా కోర్టు తీర్పుతో తన వైఖరిని మార్చుకున్నారు.కాగా మార్చి 21, 2024న ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ అరెస్టు చేసింది. తరువాత అవినీతి ఆరోపణలను విచారిస్తున్న CBI అరెస్టు చేసి, 155 రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్ -
ఏడు కిలోమీటర్లు.. బైక్ను ఈడ్చుకెళ్లిన థార్
లక్నో: ఓ ఎస్యూవీ వాహనం టూవీలర్ను ఏడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో మహీంద్రా థార్ ఎస్యూవీ పెద్ద కలకలం రేపింది. పెట్రోల్ బంక్లో ఇంధనం నింపుకుని డబ్బులు చెల్లించకుండా థార్ యజమాని వాహనంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఉద్యోగి థార్ యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.వేగంగా వెళ్తున్న థార్ను వెంబడించాడు. తప్పించుకునేందుకు థార్ యజమాని సదరు పెట్రోల్ బంక్ ఉద్యోగి బైక్ను ఢీకొట్టాడు. ఆపకుండా ఏడుకిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థార్ యజమానికి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఎస్యూవీ బైక్ను లాగుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఘటన జరిగే సమయంలో మోటార్ సైకిల్ మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. -
Liquor Scam Case మోదీ, అమిత్షా కుట్ర : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన స్కాంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్నేత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం కుట్ర పన్నిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగంకేజ్రీవాల్కు క్లీన్ చిట్ రావడంతో అటు ఆప్ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. -
భార్య, పిల్లలను హత్తుకొని ఎమోషనలైన కేజ్రీవాల్
-
న్యాయం గెలిచింది.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
-
ED విచారణకు అంబానీ.. 17 అంతస్తుల ఇల్లు అటాచ్
-
ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది. వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయిపోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీలో గత రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కేవత్ ఆజాద్పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30), మూడు, నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.ఈ సంఘటనతో పొరుగువారు కూడా ఒక్కపారిగా షాక్కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని, ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఐదు మంది ప్రయాణిస్తున్న ఒక కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) మధుర్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదు మంది సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి దాడి జరిగింది. సీటు వెనుక కూర్చున్న సందీప్ అనే వ్యక్తి భుజం దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న మరో వ్యక్తి దీపక్ ఖత్రి, తాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు అడ్వకేట్ అని పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో ఆయన భార్య రాజ్ని ఖత్రి బిష్ణోయ్కు న్యాయవాది అని, సందీప్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు స్కూటర్పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కారులో ఉన్నవారి వాంగ్మూలాలు, స్థానికుల స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్ను సంఘటనా స్థలానికి తరలించారు. స్థానికి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఎర్రకోటకు ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం హఠాత్తుగా హై అలర్ట్ ప్రకటించారు. చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి (అసెంబ్లీ) బాంబు బెదిరింపులు రావడంతో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా పంపిన హెచ్చరికలతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపు ఈమెయిల్ ఒక ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు పేరుతో వచ్చినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.రాజధానిలోని అత్యంత కీలకమైన ఎర్రకోట, సచివాలయం ప్రాంతాలను బాంబులతో పేల్చివేస్తామన్న సందేశం అందగానే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ సచివాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గమనిస్తున్నారు.ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగానే, మరోవైపు ఈ-మెయిల్ మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నాయి. ఖలిస్థానీ సానుభూతిపరుల పేరిట వచ్చిన ఈ బెదిరింపుల వెనుక అసలు కుట్రదారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. -
రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో 24న ఈసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో మరింత సమన్వయం పెంచే దిశగా అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)లతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. చివరగా 1999 ఏడాదిలో ఇలాంటి భేటీ జరగ్గా 27 ఏళ్ల విరామం అనంతరం ఈ రౌండ్టేబుల్ సమావేశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24న ఢిల్లీలోని భారతమండపంలో నిర్వహించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషి పాల్గొననున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు, వారి న్యాయ–సాంకేతిక నిపుణులు, అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం ప్ర ధానంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం. ఎన్నికల ప్రక్రియలు, సాంకేతిక వనరుల వినియోగంలో చర్చించనున్నారు. సహకార సమాఖ్య స్పూర్తిని మరింత బలపరచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో ఈవీఎంల భద్రత, ఓటర్ల జాబితా తయారీలో చట్టపరమైన మార్గ దర్శకాలు, రాష్ట్రాల వారీగా ఓటరు అర్హతలపై తులనాత్మక సమీక్ష, ఈసీఐనెట్ డిజిటల్ ఫ్లాట్ఫారమ్లపై చర్చించనున్నారు. దేశవ్యా ప్తంగా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. -
డేటింగ్ యాప్.. సహజీవనం.. చివరికి..
డేటింగ్ యాప్లో పరిచయం.. సహజీవనం.. అనుమానం.. చివరకు పైశాచిక చేష్టలు.. గురుగ్రామ్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి త్రిపుర నుండి గురుగ్రామ్ వచ్చిన 19 ఏళ్ల యువతి.. ఓ యువకుడితో సహజీవనం సాగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న శివం.. యువతిపై అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. చిత్రహింసలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన శివమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.యువతికి గత ఏడాది సెప్టెంబర్లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి సెక్టార్-69లో ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించాడు. స్టీల్ బాటిల్తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో కూడా దాడి చేశాడు.మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి.. తన తల్లికి ఫోన్ చేసిన జరిగిన ఘోరాన్ని వివరించింది.. తల్లి ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. అంనతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు శివంను అరెస్ట్ చేసిన పోలసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఫిబ్రవరి 16న జరిగిన గొడవ తర్వాత శివం తనపై అత్యంత క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె తలపై స్టీల్ బాటిల్తో, మట్టి కుండతో కొట్టాడు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు వివరించింది. దారుణమైన దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఫిబ్రవరి 18 రాత్రి ఆమె నిందితుడి ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఆమె బెంగాలీ భాషలో తన బాధను వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి కాపాడండంటూ ఆమె తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే 112 హెల్ప్లైన్కు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్ భయం?
న్యూఢిల్లీ: ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ నేపధ్యంలో భారత్ నేతృత్వంలో ‘ఢిల్లీ డిక్లరేషన్’ రూపొందింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. అమెరికా, చైనా తదితర అగ్రరాజ్యాలు సహా 88 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంలో పాకిస్తాన్, తైవాన్ దేశాలు భాగస్వాములుగా చేరకపోవడం చర్చనీయాశంగా నిలిచిందిదౌత్యపరమైన విబేధాలతో..భారత్ ప్రతిపాదించిన ఈ అంతర్జాతీయ ఏఐ ఫ్రేమ్వర్క్కు పాకిస్తాన్ దూరంగా ఉండటం వెనుక ప్రధానంగా దౌత్యపరమైన విబేధాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలను గుర్తించడానికి పాక్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సదస్సులో భారత్ పోషించిన పాత్రపై పాకిస్తాన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇదే ఈ ఒప్పందానికి పాక్ను దూరం చేసింది. సాంకేతిక పురోగతి కంటే రాజకీయ ప్రాధాన్యతలే గొప్ప అనే ధోరణితో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.తైవాన్కు ‘వన్ చైనా’ అడ్డంకిమరోవైపు సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచానికే తలమానికంగా నిలిచిన తైవాన్ ఈ సదస్సుకు హాజరుకాకపోవడం వెనుక ‘వన్ చైనా’ (One China) విధానం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఢిల్లీ డిక్లేరేషన్పై సంతకం చేసిన దేశాలలో చైనా ఒకటి. అంతర్జాతీయ వేదికలపై తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించే ఏ ప్రయత్నాన్నైనా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తైవాన్ గైర్హాజరుకు సాంకేతిక కారణాల కంటే చైనా ఒత్తిడి, అంతర్జాతీయ గుర్తింపు సమస్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్ల సరఫరాలో 90 శాతానికి పైగా వాటా కలిగిన తైవాన్ ఈ ఒప్పందంలో లేకపోవడం సాంకేతికంగా పెద్ద లోటుగా మిగిలింది. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సు 88 దేశాల అఖండ మద్దతుతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి వరకు సాంకేతికతను తీసుకెళ్లాలనే సంకల్పాన్ని చాటిచెప్పింది. -
సమస్య అబ్బాయిలది కాదు..! 1950ల నాటి ఆలోచనలనే..
మహిళా సాధికారత అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పేస్తుంటాం. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడతాం. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పాతధోరణికే వంతపాడతాం. అందులోనూ అత్తగా హోదా రావడంతోనే మహిళలు వెనుబడిపోతున్నారా..?లేక ఏళ్ల నాటి కుచించిత మనస్తత్వం వల్లనో తెలియదు..కానీ అప్పటి వరకు ఉన్న స్త్రీత్వం అత్త అన్న పదం కారణంగా తక్కువగా మారిపోతోంది. చూడటానికి సింపుల్గా కనిపించే ఈ రెండు అక్షరాల పదబంధం తెలియకుండానే తనలోని స్త్రీకి తానే హాని చేసుకుంటూ..ఎవరో తొక్కేస్తున్నారు అని అనుకుంటోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట వైరల్ అవుతోన్న ఓ అత్త డిమాండ్ చూస్తే..ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామనిపిస్తుంది.ఏఐ టెక్నాలజీ, రోబో టెక్నాలజీతో దూసుకుపోతున్న తరుణంలో పెళ్లి విషయంలో కాస్త అప్గ్రేడ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదేమో అంటున్నారు గురుగ్రామ్ సీఈఓ జస్వీర్ సింగ్. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆధునిక కుటుంబాల ఆలోచనలు ఈకాలంలో కూడా ఇలానా అన్నట్లుగా ఉన్నాయంటూ రాసుకొచ్చారు. యువత సైతం కెరీర్ వరకు ఎంత బాగా ఆలోచించినా..కొన్నివిషయాల్లో ఆలోచనలు పాతధోరణికే వంతపాడుతున్నారని అన్నారు. మాట్రిమోనియల్ యాప్ నాట్. డేటింగ్ సీఈవో ఓ మాట్రీమోనిల్ ప్రొఫెల్ని షేర్ చేస్తూ..వారి డిమాండ్లు గురించి రాశారు. డిల్లీ చందిన ఓ తల్లి తన కొడుకు రూ. 75 లక్షలు సంపాదిస్తున్నాడని, కాబట్టి కాబోయే కోడలు..మంచి పేరున్న యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయి అయ్యి..ఉద్యోగం చేసే ఆలోచన ఉండకూడదని కండిషన్ పెట్టారామె. పైగా..అందంగా ఉండాలి, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అయ్యి ఉండాలి. ఇంటికి, కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తన కొడుకు భార్య పెళ్లి తర్వాత పనిచేయడం తమకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. వాళ్లు ముఖ్యంగా డిమాండ్ చేస్తోంది ఏమిటంటే..కెరీర్కి అంత ప్రాధాన్యత ఇవ్వని అమ్మాయి కావాలని చెబుతున్నారు. అయితే సీఈవో జస్వీర్ సింగ్ మాత్రం వాళ్లకి కావాల్సింది మంచి డిగ్రీ, అందమైన శరీరం ఉన్న పనిమనిషి కోసం చూస్తున్నారని అన్నారు. ఇటీవల ఇలాంటి డిమాండ్లో కూడిన కేసులను చాలానే చూస్తున్నామని అన్నారు. ఆధునికులు కానీ సాంప్రదాయవాదులు, తెలివైనవారు కానీ విధేయులు, కార్పొరేట్ తరహా రేంజ్ కానీ కావాల్సింది 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారంటూ నేటి మగపిల్లల కుటుంబాల ఆలోచన తీరుని విమర్శించారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అసలు మనం సమాన భాగస్వామ్యానికి సిద్ధంగా లేం కదూ..!. చదువుల్లోనూ, సంపాదనలోనూ అప్గ్రేడ్ అవుతాం కానీ..పెళ్లి విషయంలో మాత్రం కాలం చెల్లిన ధోరణిలో ఉండటానికే ఇష్టపడుతుండటం బాధకరం. ఇక్కడ సమస్య అబ్బాయిలది కాదు..పెద్దలు తమ ఆలోచన తీరు బ్లూప్రింట్నే వారిలో నాటేస్తుండటం వల్ల వస్తున్న సమస్య ఇది. వివాహాలు చేసే విధానంలో డెవలప్మెంట్ ఉంది, కానీ మనస్తత్వాలను మార్చుకోవడం లేదా అప్గ్రేడ్ అవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నారు.(చదవండి: ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..) -
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్
ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్– భత్కల్లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన సాదిక్ ఇష్రార్ షేక్ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్కు చెందిన అన్నదమ్ములు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లకూ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది. రియాజ్, ఇక్బాల్లు ముంబైలో ఉంటూ గ్యాంగ్స్టర్స్గా మారారు. అక్కడే ‘ఆర్ఏఎన్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్ సోదరులు, సాదిక్ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్లో శిక్షణ పొంది వచ్చారు. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. వారణాసిలోని దశాశ్వమేధఘాట్లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్జీవి ఎక్స్ప్రెస్, అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్ రైళ్లు, 2007 మే 22న గోరఖ్పూర్లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్క్ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్ను టార్గెట్ చేశారు. అహ్మదాబాద్లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్కు ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్లో 17 పేళ్లకు పాల్పడ్డారు. సూరత్లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్ భత్కల్ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్ ఫ్యామిలీ రెస్టరెంట్ నిర్వహించే అఫ్జల్ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి. అహ్మదాబాద్లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్ ఆదేశాల మేరకు ఆతిఫ్ అమీన్ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్లోని బాట్లా హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్బ్రాంచ్లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్లోనే రియాజ్ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్కు వెళ్లానని, అక్కడి ఎల్–18 ఫ్లాట్లో డెన్ ఉందని బయటపెట్టాడు. ఆ అపార్ట్మెంట్పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్ 19న ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్ చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్ పడింది.(బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్!’ వచ్చే వారం)-శ్రీరంగం కామేష్ -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
11 ఏళ్ల వయసు, అర్థరాత్రి క్యాబ్లో వెళ్తుంటే.. : ప్రియాంక చోప్రా
తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి క్యాబ్లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్ డ్రైవర్ సడెన్గా రూట్ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్కట్’ అని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్ డ్రైవర్ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్ వయసున్న నా కూతురితో ఉన్నాను. మర్యాదగా మెయిన్ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు. బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తోంది. -
AI సమ్మిట్లో నిరసనలు.. యూత్ కాంగ్రెస్పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో యూత్ కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అంటూ మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే AI సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అంటూ.. నిరసనలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. It is absolutely deplorable that members of the Youth Congress chose the AI Impact Summit 2026 as a venue for petty political theatricsUsing such a global platform for protests will project our great nation India in a poor light internationallyWhile difference of opinion is… pic.twitter.com/sM3MmIb8UJ— KTR (@KTRBRS) February 21, 2026 -
ఢిల్లీలో హై అలర్ట్.. ఆలయాలకు భద్రత పెంపు
ఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు అప్రతమ్తమై, హై అలర్ట్ ప్రకటించారు. పాక్ మసీదు వద్ద పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థలు శనివారం మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరం (ఐఈడీ)తో దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిఘా వర్గాలు సూచించాయి. చాందినీ చౌక్లోని ఒక ప్రముఖ ఆలయంపై ప్రత్యేకంగా దాడికి ప్రణాళిక వేస్తున్నాన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడు తర్వాత, ఆ సంస్థ భారతదేశంలో భారీ ఉగ్ర దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ఎర్రకోట, చాందినీ చౌక్, చుట్టుపక్కల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రత్యేక నిఘాలో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోని ఒక ప్రధాన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
సీఈఓలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్టెక్ స్టార్టప్ల వ్యవస్థాపకులతో రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, లీచెన్స్టైన్ రాకుమారుడు అలోయిస్తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. గుటెరస్తో సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్కు హామీ ఇచ్చారు. -
పాక్స్ సిలికాలోకి భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్సిలికా కూటమిలో భారత్ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్బర్గ్ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్మెయిలింగ్ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. కూటమి మరింత బలోపేతం: గోర్ 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్సిలికా కూటమి పునర్ నిర్వచిస్తుందని గోర్ జోస్యం చెప్పారు. భారత్ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్కూ బాగా తెలుసు’’అని గోర్ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కీలక నిర్ణయం: వైష్ణవ్ పాక్స్సిలికా కూటమిలో చేరికను భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్ చిప్స్ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు. ఏమిటీ పాక్స్సిలికా? ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్లో పాక్స్సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్సిలికా కూటమిలో చేరేలా భారత్ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ మారథాన్ దిగ్గజాలతో షురూ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్’కు రంగం సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్ రేస్ (ఏఐఎంఎస్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్. 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్ మారథాన్ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. దేశీ క్రీడాకారులు అనిశ్ థాపా, బెలియప్ప, మన్ సింగ్, అక్షయ్ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్ ఠాకూర్, అశ్విని మదన్ జాదవ్, దిస్కెట్ డోల్మా, స్టాన్జిన్ డోల్కర్ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్ టైమింగ్ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఈ మారథాన్ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ను నిషేధించి... రీ సైక్లింగ్కు ఉపయోగపడే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు. -
ఏఐ మంత్రిత్వ శాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు.మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వార్ రూమ్ నిర్వహిస్తాం.. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్ల కోసం జాతీయ ఏఐ నిధి స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
పగలు సెలూన్ యజమాని.. రాత్రి లేడీ డాన్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున డ్రగ్స్ సిండికేట్ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలియాస్ నేహాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన కీలక షూటర్, ఆయుధ సరఫరాదారుడు బాబీ కబూతర్కు చిరకాల భాగస్వామి. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నేహా ఉత్తర-తూర్పు ఢిల్లీలో బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తూ సాధారణ మహిళగా చలామణి అయ్యేది. అయితే, బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, పోలీసుల విచారణలో నేహ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో వీరిని అరెస్ట్ చేసినప్పుడు భారీ మొత్తంలో డ్రగ్స్ లభించాయి. నేహా, బాబీ గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.బాబీ కబూతర్.. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ప్రధాన లాజిస్టిక్స్ లింక్గా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. దాదాపు ఏడేళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బాబీ కబూతర్ చివరికి పోలీసులకు చిక్కాడు. నేపాల్-భారత సరిహద్దు సమీపంలో ఇటీవల అరెస్ట్ అయిన దేశంలోనే అతిపెద్ద అక్రమ ఆయుధ వ్యాపారిగా పేరున్న సలీం పిస్టల్ నుంచి ఆయుధాలను సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడు. సలీం పిస్టల్ వద్ద నుంచి బాబీ కబూతర్ ఆయుధాలను సేకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సలీం పిస్టల్ను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అధికారులు వెల్లడించారు.బాబీ కబూతర్.. మొదట నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నాసిర్ గ్యాంగ్లో ఉండేవాడు. ఆ తర్వాత హషీమ్ బాబాతో కలిసి లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్లో చేరాడు. పలు సంచలన కేసులలో నిందితుడిగా ఉన్నాడు. బరేలీలోని నటి దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఢిల్లీలోని జాఫ్రాబాద్లో ఇద్దరు సోదరులపై జరిగిన కాల్పుల్లో బాబీ కబూతర్ స్వయంగా పాల్గొన్నట్లు సమాచారం. ఆ ఘటనలో సుమారు 48 రౌండ్ల కాల్పులు జరిగాయి. 2024లో గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన ఈ హత్యలో షూటర్లకు లాజిస్టిక్ సాయం అందించాడని పోలీసుల విచారణలో తేలింది. -
ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్. ఏఐ రంగంలో ఢీ అంటే ఢీ అంటున్న ప్రత్యర్థులు. వాటి సీఈఓలు శామ్ ఆల్ట్మన్, దరియో అమొదెయ్ గురువారం ఒకే వేదికపైకి వచ్చారు. కానీ చేతులు కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు! ఈ ఇబ్బందికర క్షణాలకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికైంది.ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టెక్ దిగ్గజాలంతా వేదికపైకి వెళ్లారు. గ్రూప్ ఫొటో సందర్భంగా అందరూ చేతులు కలిపి పైకెత్తారు. యాదృచ్ఛికంగా పక్కపక్కనే నిలబడ్డ ఆల్ట్మన్, అమొదెయ్ మాత్రం అందుకు నిరాకరించారు. ఎవరికి వారు విడిగా పిడికిళ్లు బిగించి పైకెత్తి సరిపెట్టారు. పైగా నిలబడ్డంతసేపూ ఇద్దరూ చాలా అసౌకర్యంగా కూడా కన్పించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం ఈ ఉదంతంపై ఆల్ట్మన్ స్పందించారు. ‘నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. మోదీ నా చేతిని పట్టుకుని పైకెత్తారు. దాంతో ఏం జరుగుతోందో కాసేపటిదాకా అర్థమే కాలేదు’ అని చెప్పుకొచ్చారు."I didn't know what was happening on stage. I was confused. Modi grabbed my hand and put it up, and I just wasn't sure what we were supposed to be doing." - Sam Altman pic.twitter.com/Hs6nlRuSsP— Mini Nagrare (@MiniforIYC) February 20, 2026మాజీ సహోద్యోగులే..కాగా, ఆల్ట్మన్, అమొదెయ్ ఒకప్పుడు సహోద్యోగులే కావడం విశేషం. ఆల్ట్మన్తో పాటు అమొదెయ్ కూడా ఓపెన్ ఏఐలోనే పని చేశారు. ఆయనతో విభేదాల నేపథ్యంలో 2020లో కంపెనీని వీడారు. ఇక, అంతకుముందు శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా అని కుండబద్దలు కొట్టారు. ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు. -
ఏఐ ‘విండోస్’!
ఒకట్రెండేళ్లలో ‘ఏఎస్ఐ’: ఆల్ట్మన్ ‘‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా’’అని దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఏఐ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్వత్రా చర్చనీయంగా మారిన ఆరి్టఫిíÙయల్ సూపర్ ఇంటలిజెన్స్ (ఏఎస్ఐ) తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి మరో ఒకట్రెండేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాల్లోనూ మానవ మేధను మించిపోయే ఏఎస్ఐని కృత్రిమ మేధ ప్రస్థానంలో కీలకమైన తదుపరి అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం’’అని స్పష్టం చేశారు. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.మా పెట్టుబడుల గమ్యస్థానం భారతే: మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్కు అతి పెద్ద ఏఐ పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్ది అగ్ర స్థానమని సంస్థ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు. ఏఐ వినియోగంలో గ్లోబల్ సౌత్ దేశాలు భారత్ను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఈ విషయంలో గ్లోబల్ సౌత్ చేయాల్సింది ఎంతో ఉంది. డేటా సెంటర్లతో పాటు కనెక్టివిటీ, విద్యుత్... ఇలా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నీ ఎంతగానో మెరుగవ్వాలి. ఇందుకు భారీ పెట్టుబడులు కావాలి. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగమూ ముందుకొస్తేనే ఇది సాధ్యం. గ్లోబల్ సౌత్లో ఏఐ విస్తరణకు వచ్చే పదేళ్లలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడానికి కారణం కూడా అదే’’అని వెల్లడించారు. తమ పెట్టుబడి ప్రణాళికల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ అంతరాలను పూడ్చేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ముఖ్యమే అయినా మానవ నైపుణ్యాలే అత్యంత కీలకమని స్మిత్ చెప్పారు.ఏఐ దుర్వినియోగ కట్టడిలో భారత్దే కీలకపాత్ర: దరియో ఏఐ వాడకం ఎన్నో సవాళ్లను తెరపైకి తెస్తోందని ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్ అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్ల స్వతంత్ర ప్రవర్తన మరిన్ని సమస్యలకు దారితీస్తోందన్నారు. ‘‘వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారనుంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. దాన్ని కట్టడి చేయడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. చారిత్రకంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అన్ని విషయాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలాలు ఆయా దేశాలకు అందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచి్చందన్నారు. ‘‘తొలి ఏఐ సదస్సు 2023లో జరిగింది. ఈ మూడు నాలుగేళ్లలోనే ఏఐ రంగం అనూహ్య ప్రగతి సాధించింది. వాణిజ్యపరంగానే గాక సామాజికంగా కూడా ఏఐ వాడకాన్ని దేశాలన్నీ పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు నైతిక సమస్యలు, సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి తక్షణం సమాధానాలు కనిపెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ సాంకేతికత పలు విషయాల్లో మానవ మేధను అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏఐ మోడళ్లు సూపర్ హ్యూమన్ సామర్థ్యాలతో పనులు చక్కబెట్టనున్నాయి. దేశాల మేధో సామర్థ్యమంతా ఇకపై డేటా సెంటర్లలో నిక్షిప్తం కానుంది. కనీవినీ ఎరగని ఈ పరిణామాలు మానవాళికి అవకాశాలతో పాటు మరెన్నో సవాళ్లను కూడా తేనున్నాయి. ఏఐతో అందివచ్చే అవకాశాల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా చికిత్స లేని రోగాలకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఏఐ వ్యవస్థల స్వతంత్ర పనితీరు విపరిణామాలకు దారి తీయవచ్చు. వ్యక్తులు, వ్యవస్థలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా వాటిని దుర్వినియోగం చేయవచ్చు’’అని అమొదెయ్ హెచ్చరించారు.గ్లోబల్ లీడర్గా భారత్: రషీద్ ప్రేమ్జీ ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగే సువర్ణావకాశం భారత్ ముందు ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్జీ అన్నారు. ఈ విషయమై వచ్చే కొన్నేళ్లలో భారత్ తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలు కీలకమని అభిప్రాయపడ్డారు. దానిపైనే దేశ ఆర్థిక ప్రగతి, 140 కోట్ల ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారాలు ఆధారపడతాయన్నారు. ‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఏఐ టాలెంట్ పూల్ భారత్ సొంతం. ఇది తిరుగులేని సానుకూలత. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐకి, టాలెంట్కు మన దేశం గమ్యస్థానంగా మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా ఏకంగా 6.5 లక్షల మంది నిపుణులు ఏఐ, సంబంధిత రంగాల్లో నిత్యం కృషి చేస్తున్నారు. మరో ఏడాదిలో వారి సంఖ్య రెట్టింపు కానుంది. యూపీఏ పేమెంట్ల విధానం భారత్లో ఎంతగా సక్సెస్ అయిందో ప్రపంచమంతా చూస్తోంది. డీప్టెక్, ఏఐ స్పేస్లో 4,000 పై చిలుకు స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఏఐ పటిమను పెంచుకోగలిగితే అద్భుతాలు సాధ్యపడతాయి’’అని ప్రేమ్జీ చెప్పారు.ఏఐ ఎడ్యుకేషన్లో భారత్ భేష్: యాక్సెంచర్ విద్యా వ్యవస్థలో ఏఐని అంతర్భాగంగా తీర్చిదిద్దడంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘‘ప్రాథమిక విద్యలోనే ఏఐని భాగంగా చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని అన్ని దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది’’అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఐ వర్క్ఫోర్స్ విషయంలో కూడా భారత్ అగ్ర స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘అభ్యసన నిరంతర ప్రక్రియ అన్నది ఏఐ రాకతో మరింత వాస్తవంగా మారింది. సంస్థలైనా, దేశాలైనా కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటేనే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయి’’అని స్పష్టం చేశారు.భారత ఏఐ మోడల్స్ ప్రపంచానికి ఆదర్శం: ఫిలిప్స్ వైద్య రంగంలో భారత్ తయారు చేస్తున్న ఏఐ మోడళ్లు ప్రపంచానికి ఆదర్శమని రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ అన్నారు. ఈ రంగంలో గ్లోబల్ మోడల్స్లో సంస్కరణలకు దారి చూపగల సత్తా వాటి సొంతమని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ సాంకేతికత అత్యంత ప్రభావం చూపగల రంగాల్లో ఆరోగ్యం కీలకమైనది. ఈ రంగంలో ఏఐ వాడకంలో భారత్ చాలా ముందుంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటివి నిదర్శనం. ఆరోగ్య రంగంలో భారత్ను గ్లోబల్ ఇన్నొవేషన్ ఇంజన్గా ఫిలిప్స్ పరిగణిస్తోంది’’అని చెప్పారు.దూకుడైన వ్యూహాలే మార్గం: మెటా ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే సరైన విధానాలు, భారీ పెట్టుబడులతో పాటు దూకుడైన వ్యూహాలు కూడా చాలా కీలకమని టెక్నాలజీ దిగ్గజం మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ అన్నారు. దేశాలన్నీ దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ టూల్స్ అన్ని అవసరాలనూ తీర్చేందుకు అనువుగా రూపొందాలి. అంతే తప్ప అన్నింటికీ ఒకే టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాంతం, భాష, సంస్కృతి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రజలంతా ఏఐ టెక్నాలజీని సులువుగా వాడుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఒక్కతాటిపైకి వస్తేనే అది సాధ్యం’’అన్నారు. ఇందుకోసం ‘పర్సనల్ సూపర్ ఇంటలిజెన్స్’దిశగా మెటా కృషి చేస్తోందని గుర్తు చేశారు. మనుషుల బిజీ జీవితాలను చక్కగా ప్లాన్ చేయడం తదితరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.ఇన్నొవేషన్కు భారత్ సారథ్యం: ష్నీడర్ ‘‘దేశాల ప్రగతి ప్రస్థానంలో కృత్రిమ మేధతో పాటు ఇంధన మేధ (ఎనర్జీ ఇంటలిజెన్స్–ఇంధన మేధ) పాత్ర కూడా నానాటికీ కీలకంగా మారుతోంది. ఆ రెండు రంగాలూ పరస్పరం అవిభాజ్యంగా రూపొందుతున్నాయ. అలాంటి ఈ కీలక రంగాల్లో గ్లోబల్ ఇన్నొవేషన్కు సారథ్యం వహించే సువర్ణావకాశం భారత్ ముందుంది’’అని ష్నీడర్ ఎలక్ట్రిక్ సీఈఓ ఒలివియర్ బ్లుమ్ అభిప్రాయపడ్డారు. ఆ రంగాలకు ప్రభుత్వ, పరిశ్రమపరంగా లభిస్తున్న బలమైన మద్దతే ఇందుకు కారణమని చెప్పారు. ఏ రంగంలోనైనా భారత్లో నిలదొక్కుకోగలిగిన సంస్థ ప్రపంచంలో మరెక్కడైనా రాణించవచ్చని చెప్పారు. ‘‘వ్యయ నియంత్రణ, ఇన్నొవేషన్, తిరుగులేని నైపుణ్యం, అపార మానవ వనరులతో ఏఐ విప్లవానికి భారత్ సారథిగా మారుతోంది. ఇంధనం, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ తదితరాల్లో తిరుగులేని సామర్థ్యాలు ఆ దేశానికి ఎంతగానో కలిసొస్తున్నాయి’’అని చెప్పారు.వికటించే రిస్కుతో జాగ్రత్త: నీలేకని ‘‘ఏఐ రంగంలో శరవేగంగా సాధిస్తున్న ప్రగతి అన్ని రంగాలకూ విస్తరించేలా చూడటం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు అది ఉపయోగపడాలి’’అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏదో ఒక దశలో ఏఐ టెక్నాలజీ వికటించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ తదితర వృత్తి నిపుణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ ఇండియా సదస్సులో భాగంగా ఏఐ ప్రభావం తదితరాలపై ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్తో నీలేకని ముచ్చటించారు. డీప్ఫేక్ సమస్య వంటి ఏఐ తాలూకు ప్రతికూల పార్శా్వలను కూడా ఆయన ఉదాహరించారు. -
ఏఐ ‘విండోస్’!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్స్ ఎక్స్పోకు సందర్శకులు పోటెత్తుతున్నారు. వారితో పాటు పలు అంతర్జాతీయ దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులతో బుధవారం ఎక్స్పో వేదిక, స్టాళ్లు కళకళలాడాయి. ఏఐ భవితవ్యంతో పాటు పలు కీలక అంశాలపై ఔత్సాహికులతో ప్రముఖులంతా తమ అభిప్రాయాలను పంచుకుంటూ కని్పంచారు. అంతేగాక సరికొత్త స్టార్టప్లు, పెట్టుబడులు తదితరాలకు సంబంధించి పలు ఏఐ కంపెనీల సీఈఓలు ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. సముద్రగర్భంలో ఇండో–యూఎస్ కేబుల్ రూ.272 కోట్లతో ఏఐ సైన్స్ చాలెంజ్ ∙గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన భారత్లో దాగున్న అపారమైన ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే తమ లక్ష్యమని ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని మరింత పెంపొందించే లక్ష్యంతో సముద్రగర్భంలో కేబుల్ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ ఎక్స్పో వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కర్మయోగి భారత్ పథకంలో గూగుల్ భాగస్వామి కానుంది. అంతేగాక 1.1 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య సాధనలో మద్దతుగా నిలుస్తుంది. గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ కోర్సులు అందజేస్తుంది. దీనికోసం 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో సమన్వయంతో గూగుల్ పని చేస్తుంది’’అని వెల్లడించారు. కృత్రిమ మేధను మన జీవితకాలాల్లో చోటుచేసుకుంటున్న అతి పెద్ద పరిణామంగా పిచాయ్ అభివరి్ణంచారు. అలాంటి కీలక రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందంటూ పిచాయ్ ప్రశంసించారు. భిన్న రంగాల్లో ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.272 కోట్లతో ‘ఏఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్’చాలెంజ్ను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలను మరింతగా ఒడిసిపట్టేందుకు గూగుల్ డీప్మైండ్ సాయంతో ఐఐటీ మద్రాస్తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. గూగుల్ ఏఐ మోడ్ ఇప్పటికే 200 దేశాల్లో 35 పై చిలుకు భాషల్లో అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. మున్ముందు వాయిస్, కెమెరా ఆధారిత రియల్టైమ్ లైవ్ సెర్చ్ వంటి అధునాతన ఆప్షన్లను కూడా తేనున్నట్టు వెల్లడించారు. మోదీతో పిచాయ్ భేటీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో పిచాయ్ భేటీ అయ్యారు. భారత్లో వ్యవసాయం, ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి ఏఐ వాడకంలో గూగుల్ పోషిస్తున్న కీలక పాత్రపై మోదీతో చర్చించా. సమాచారాన్ని అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తేవడం, స్టార్టప్లకు దన్నుగా నిలవడం వంటివి కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏఐలో భారత్ చేస్తున్న కృషి, ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగుల నైపుణ్యాల పెంపులో గూగుల్ పాత్ర గురించి చర్చించాం’’అని వివరించారు. పిచాయ్తో భేటీ ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టులో మోదీ పేర్కొన్నారు.పదేళ్లలో రూ.45 లక్షల కోట్లు! మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడి ప్రణాళికలు కృత్రిమ మేధ రంగంలో వచ్చే పదేళ్లలో గ్లోబల్ సౌత్లో ఏకంగా రూ.45 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్ల) మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటన చేసింది. గ్లోబల్ సౌత్లో ఏఐ యాక్సెస్ను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చిస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, సంస్థ వైస్ చైర్మన్ నటాషా క్రాంప్టన్ ఈ మేరకు వెల్లడించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో వారు మాట్లాడారు. ‘‘గ్లోబల్ సౌత్తో పోలిస్తే ఉత్తరార్ధ గోళంలో ఏఐ వాడకం దాదాపు రెండింతలుగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’అని తెలిపారు. కీలకమైన ఈ సవాలును ఏఐ సదస్సు అజెండాలో కీలకంగా ఉంచడం అభినందనీయమని స్మిత్ అన్నారు. తద్వారా సరైన సమయంలో దీన్ని తెరపైకి తేవడం తీసుకొచ్చారన్నారు. విద్యుత్ సదుపాయం విషయంలో కూడా దక్షిణ, ఉత్తరార్ధ గోళాల నడుమ శతాబ్దానికి పైగా అంతరాలు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. ఏఐ అంతరాలు పెరిగితే వర్ధమాన దేశాలకు ఆర్థిక వృద్ధి తదితర అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్య పెంపు, భిన్న భాషల్లో ఏఐ అభివృద్ధి, స్థానిక ఇన్నొవేషన్లు, ఏఐ అడాప్షన్ మెజర్మెంట్... ఇలా తమ భారీ పెట్టుబడులను ఐదంచెల్లో వెచ్చిస్తామని స్మిత్ వెల్లడించారు.ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్, మెక్సికో సహా మొత్తం గ్లోబల్ సౌత్లో మౌలిక సదుపాయాల డేటా సెంటర్లపై మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.72 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. క్లౌడ్, ఏఐ, డిజిటల్ స్కిల్లింగ్ తదితరాలపై ఈ ఏడాది రూ.18 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 2030 నాటికి భారత్లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 2 లక్షల సంస్థలకు చెందిన 20 లక్షల మంది టీచర్లకు ఏఐ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ఎలివేట్ ఫర్ ఈక్వేటర్స్’కార్యక్రమాన్ని కూడా స్మిత్ ఈ సందర్భంగా ప్రకటించారు.వర్సిటీలతో జట్టు: ఓపెన్ఏఐ కృత్రిమ మేధ విస్తృతిని రెండు చేతులతోనూ అందిపుచ్చుకునేందుకు భారత్కు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో కలిసి పని చేస్తామని ఐఏ దిగ్గజం ఓపెన్ఏఐ ప్రకటించింది. ‘‘మేనేజ్మెంట్, ఆరోగ్యం, ఇంజనీరింగ్ వంటి పలు రంగాల్లో యువతలో, విద్యార్థుల్లో ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా పెంపొందించడమే మా లక్ష్యం. ఇందుకోసం ఆయా ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం అవుతాం’’అని ఓపెన్ఏఐ విద్యా విభాగం సారథి రాఘవ్ గుప్తా వెల్లడించారు. తొలి దశలో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్–న్యూఢిల్లీ, మనిపాల్ అకాడెమీ, యూపీఈఎస్, పెరల్ అకాడెమీతో జట్టు కట్టనున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి పైగా విద్యార్థులు, బోధన సిబ్బందిని ఏఐ, సంబంధిత టూల్స్ వాడకంల నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ‘‘ప్రస్తుతం మానవ వనరులపై ఆధారపడుతున్న కోర్ స్కిల్స్లో కనీసం 40 శాతం 2030 నాటికి ఏఐ ఆధారితంగా మారిపోతాయని పలు అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి. కనుక అందుకు తగ్గట్టుగా మన భావి తరాలను ఏఐ నైపుణ్యాలతో తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఇందులో విద్యా సంస్థలదే కీలక పాత్ర’’అని గుప్తా అభిప్రాయపడ్డారు. తమతో భాగస్వామ్యానికి ఓపెన్ఏఐ ముందుకు రావడం పట్ల ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్ ఢిల్లీ హర్షం వెలిబుచ్చాయి. ఎడ్టెక్ వేదికల రూపకల్పన నిమిత్తం ఫిజిక్స్వాలా, అప్గ్రేడ్ వంటి విద్యా సంస్థలతో కూడా ఓపెన్ఏఐ జట్టు కట్టనుందని గుప్తా తెలిపారు.నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదుఎయిర్బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వాడకానికి అవకాశాల అన్వేషణ తదితరాలకు భారత అంతరిక్ష రంగ కంపెనీ ఇన్స్పేస్ రూ.6 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. ఇన్స్పేస్ తాలూకు సీడ్ ఫండ్ పథకం ‘ఏఐ ఇన్సై్పర్డ్’(ఇన్నొవేటింగ్ స్పేస్ ప్రోగ్రాం విత్ ఇంటలిజెంట్ రెజీలియంట్ ఇంజన్స్ డెవలప్మెంట్) కింద ఈ నిధులను అందజేయనున్నట్టు సంస్థ డైరెక్టర్ వినోద్కుమార్ వెల్లడించారు. ఎంపిక చేసిన సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా దేశ ప్రాథమ్యాలకు అవసరమైన ఏఐ పరిష్కరాలను అభివృద్ధి చేసే సంస్థలకు గ్రాంట్ అందిస్తాం. కనీసం ఆరు సంస్థలను ఎంపిక చేస్తాం. ఒక్కో సంస్థకు గరిష్టంగా రూ.కోటి మేరకు చెల్లిస్తాం’’అని ఆయన వివరించారు.భారత యువతకు సువర్ణావకాశం డీప్మైండ్ సీఈఓ హస్సబిస్ కృత్రిమ మేధ వృద్ధికి సారథులుగా మారే సువర్ణావకాశం భారత యువత ముందుందని గూగుల్ డీప్మైండ్ సీఈఓ డెమిస్ హస్సబిస్ అభిప్రాయపడ్డారు. సరికొత్త ఏఐ టూల్స్లో తిరుగులేని నైపుణ్యం సాధించడమే అందుకు కీలకమని సూచించారు. వచ్చే పదేళ్లలో ఇది భారత్ను అన్ని రంగాల్లోనూ సూపర్ పవర్గా నిలుపుతుందని జోస్యం చెప్పారు. ఇండియా ఏఐ ఎక్స్పో వేదికగా ఔత్సాహికులతో ఆయన ముచ్చటించారు. సాంకేతికత నానాటికీ అనూహ్య మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో యువత తమ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘భారత్లో దాగున్న ఎనలేని శక్తి సామర్థ్యాలు చూసి ఎంతో ముచ్చటేస్తోంది. ముఖ్యంగా ఏఐ విషయంలో ఇక్కడి యువత సానుకూల భావనతో ఉరకలెత్తుతోంది. రానున్న దశాబ్దాల్లో ఇది భారత్కు గొప్ప సానుకూలత కానుంది’’అని అభిప్రాయపడ్డారు. -
నేడు ఏఐ కీలక సదస్సు
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ కీలక సదస్సు గురువారం ఢిల్లీలో జరగనుంది. రంగాలవారీగా ఏఐ ప్రభావం, దాని సమర్థ వినియోగం, ప్రతికూల ప్రభావాల కట్టడి తదితరాలపై పలువురు దేశాధినేతలు, దిగ్గజ ఏఐ కంపెనీల సారథులు, విద్యావేత్తలు, పరిశోధకులు సదస్సు వేదికగా లోతుగా మేధోమథనం జరపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ సౌత్లో జరగనుండటం ఇదే తొలిసారి. గురువారం ఉదయం ఢిల్లీలోని భారత్ మండపంలో సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అందులో పాల్గొంటున్న పలువురు దేశాధినేతలు, ప్రముఖులతో విడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా సదస్సులో మాట్లాడతారు. పలు ఏఐ దిగ్గజ సంస్థల సీఈఓలు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’నినాదంతో సదస్సు జరగనుంది. ప్రధానంగా ఏడు వర్కింగ్ గ్రూప్లు ఏర్పాటు చేసి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు. అవి ఆర్థిక ప్రగతి, సామాజిక హితానికి ఏఐ; ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ; సామాజిక సాధికారతకు చోటు; సురక్షిత, విశ్వసనీయ ఏఐ; మానవ వనరుల పెట్టుబడి; సైన్స్; పుంజుకునే సత్తా, ఇన్నొవేషన్, సామర్థ్యం. ఈ చర్చలన్నీ ‘ప్రజలు, భూమి, ప్రగతి’ప్ర«దానాంశాలుగా సాగుతాయి. పలువురు దేశాధినేతలతో పాటు 500 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి ఏఐ సారథులు, 100 మందికి పైగా సీఈఓలు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీఓలు, ఉపాధ్యక్షులు, దాతలు సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఏఐ రంగంలో భారత్ను సారథ్య స్థానంలో నిలిపే లక్ష్యసాధనలో భాగంగా ఈ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది. బిజీ బిజీగా మోదీ సదస్సును ప్రారంభించి అనంతరం పలువురు దేశాధినేతలు, సీఈఓలు, ప్రముఖులతో కలిసి ఏఐ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను మోదీ సందర్శిస్తారు. సోమవారం భారత్ మండపంలో ప్రారంభమైన ఎక్స్పోకు విశేష ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి అదే వేదిక వద్ద లీడర్ల సదస్సులో ప్రధాని పాల్గొంటారు. దేశాధినేతలు, పలు దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు ఇందులో భాగస్వాములు కానున్నారు. పాలన, మౌలిక సదుపాయాలు, సహకారంతో పాటు పలు అంశాలకు సంబంధించి ఏఐలో జాతీయ, అంతర్జాతీయ ప్రాథమ్యాలపై వారంతా మేధోమథనం జరుపుతారు. సాయంత్రం 5:30 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు, సీఈఓలతో రౌండ్టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఏఐ, సంబంధిత వ్యవస్థల్లో పెట్టుబడులు, పరిశోధనలు, కొలాబరేషన్, సరఫరా వ్యవస్థలు తదితరాలపై వారితో చర్చిస్తారు.ఎల్లుండి దాకా ఎక్స్పో ఏఐ సదస్సుకు దేశాధినేతలు, సీఈఓలు, వీఐపీల రాక నేపథ్యంలో ఏఐ ఇండియా ఎక్స్పోను గురువారం మూసేయనున్నారు. అయితే ఎక్స్ పోకు లభిస్తు న్న విశేష ఆదరణ నేపథ్యంలో దాన్ని శనివారం దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఎక్స్పో శుక్రవారం ముగియాల్సి ఉంది. అధినేతలకు మోదీ స్వాగతం న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని భారత్ మండపం వద్ద స్వయంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోతకిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓప్రో, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్ గులాం, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, గయానా ఉపాధ్యక్షుడు భారత్ జగ్దేవ్ తదితరులు వీరిలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియెవా తదితరులను కూడా ప్రధాని ఆప్యాయంగా స్వాగతించారు. ఆహూతులందరికీ ఈ సందర్భంగా మేళతాళాలు, పూలు, అక్షింతలతో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం లభించింది. -
ఢిల్లీ AI సదస్సులో చైనా రోబో వివాదం
-
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్లో ఏఐ ప్రభావంపై మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు బుధవారం భారతదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత మాతృభూమికి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడ లభించిన సాదర స్వాగతం నా మనసుని తాకింది’ అంటూ పిచాయ్ తన 'ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ‘ఇండియా ఏఐ మిషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సామాన్యుల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురావచ్చనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టెక్ సీఈఓలు, దేశాధినేతలు పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు.ఈ సదస్సు ప్రారంభానికి ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సుందర్ పిచాయ్.. భారత్తో ఏఐ రంగంలో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ దేశాల్లో భారత్ ఒకటి అని, ఇక్కడ ఏఐ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన ఇంధన వనరుల పెట్టుబడులు, ఓపెన్ డేటాసెట్స్, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తదితర అంశాల్లో భారత్కు గూగుల్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ మెగా సదస్సులో సుందర్ పిచాయ్తో పాటు ప్రపంచ స్థాయి దిగ్గజాలు తమ గళాన్ని వినిపించనున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోడై తదితర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న ఉదయం 9:30 గంటలకు సుందర్ పిచాయ్ తన కీలక ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు, దీనిపై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి. Nice to be back in India for the AI Impact Summit - a very warm welcome as always and the papers looked great too:) pic.twitter.com/szM9g2wB4d— Sundar Pichai (@sundarpichai) February 18, 2026 -
ఢిల్లీ రోడ్డు ప్రమాదం.. మాది తప్పే
కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్ష పూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో ‘రీల్స్’ కోణం లోనే అని బహిర్గతమైంది. దీంతో ఆయువకుడి తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ ఘటనపై నిందితుడి తండ్రి క్షమాపణలు తెలిపాడు.టీనేజర్ తండ్రి మాట్లాడుతూ.. "ఇది చాలా తప్పు ఆరోజు నా భార్యకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. నా కుమారుడికి యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. దీంతో ఎంతో భయానికి గురయ్యా. నా భార్యను అడిగా ఇది ఎలా జరిగిందని, అప్పుడు తను చెప్పింది. కారుతో ప్రమాదం జరిదిందని చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను." అని ఆయన అన్నారు.మైనర్ బాలుడికి కారు ఇవ్వడం కరెక్టేనా?ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆయనకు కారు ఇవ్వడం తప్పేకారుపై 13 చలాన్లు ఉన్నాయిగా?అది బిజినెస్ కోసం తిరిగే కారు దానిపై చలాన్లు ఉండడం సహజంమీరు మీ మైనర్ కుమారున్ని డ్రైవింగ్ చేయకుండా ఆపలేదా?అసలు అతను డ్రైవ్ చేస్తున్నట్లు నాకు తెలియదు. అతను నన్ను చూసి చాలా భయపడేవారు. ఆ కారులో మీ కూతురు రీల్స్ చేస్తున్నారుగా?లేదు వారు రీల్స్ చేయడం లేదు ఫోటోలతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు. అని ఆయన బదులిచ్చారు.అయితే డబ్బున్న వాళ్లు చేేసే సరదాలకు తన కుటుంబం రోడ్డుపాలయిందని ప్రమాదంలో మృతిచెందిన సాహిల్ ధనేశ్ర తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కారుతో ఢీకొట్టాక కనీసం వారు బ్రేకులు కూడా వేయలేదని అంత నిర్లక్షంగా ఉన్నారని తెలిపింది.. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే ప్రస్తుతం ఆ టీనేజర్ బెయిల్ పై ఉన్నాడు. పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్కు చెందిన క్యాబ్నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు. -
టీనేజర్ రీల్స్ మోజు.. తలకిందులైన మరో యువకుని జీవితం
న్యూఢిల్లీ: ఫిబ్రవరి మూడో తేదీన 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్షపూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా ‘రీల్స్’కోణం బహిర్గతమైంది. టీనేజర్ వాహనం నడిపేటప్పుడు పక్కనే అతని సోదరి కూర్చుని స్మార్ట్ఫోన్లో రీల్స్ చిత్రీకరించింది. సంబంధిత వీడియో తాజాగా బహిర్గతమైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతయ్యారు. ‘‘కనీసం డ్రైవింగ్ లైసెన్స్లోని 17 ఏళ్ల బాలుడు ఎస్యూవీ నడుపుతూ రీల్స్ చేస్తూ మా అబ్బాయిని ఢీకొట్టాడు.కారుతో ఢీకొట్టాక కనీసం బ్రేకులు కూడా వేయలేదు’’అని ఆమె అన్నారు. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. టీనేజర్కు పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్కు చెందిన క్యాబ్నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు.తర్వాత ఏమాత్రం పనిచేయగలనో నాకే అర్థంకావట్లేదు. నెలకు పాతిక వేలరూపాయల్లోపే సంపాదిస్తా. ద్వారకా సెక్టార్ 19 సమీప గ్రామంలో నివసిస్తున్నా. నా ఇంట్లో సంపాదించేది నేనొక్కడినే. డ్రైవింగ్ జీవనోపాధి పోయక ఇకపై ఎలా బతకాలి?. ధనికులకు ఇలాంటి ప్రమాదంతో పోయేదేం ఉండదు. కానీ నాలాంటి పేదల పరిస్థితి ఏంటి?’’అని అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. -
Sahil Dhaneshra: అక్క రీల్స్ చేస్తుండగా.. తమ్ముడు ప్రాణం తీశాడు
ఢిల్లీ: ఓ అక్కా, ఆమె తమ్ముడు కలిసి ఓ యువకుడి ప్రాణం తీశారు. డ్రైవింగ్ సీట్లో తమ్ముడు కారు నడుపుతుండగా, అక్క అతడితో రీల్స్ చేస్తోంది. రీల్స్ చేస్తుండగా కారు అదుపు తప్పింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు కొన్ని గంటల్లోనే మధ్యంతర బెయిల్పై విడుదలయ్యాడు. కారణం నిందితుడు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన సాహిల్ ధనేశ్రా (23). గుండె నిండా ఆశలు, కళ్ల నిండా కోరికలు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు. ఫిబ్రవరి 3న సాహిల్ తన ఇంటి నుంచి బైక్పై బయల్దేరాడు. ఉదయం 11:57 గంటలకు ద్వారకాలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల సమీపంలో ఉండగా సాహిల్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమయంలో అక్క రీల్స్ చేస్తుండగా డ్రైవింగ్ సీట్లు ఉన్న ఆమె తమ్ముడు ఎదురుగా బైక్పై వస్తున్న సాహిల్ను బలంగా డీకొట్టాడు. అతడి బైక్ నుజ్జునుజ్జైంది. మూడు భాగాలుగా విడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, స్కార్పియో, స్విఫ్ట్ డిజైర్ టాక్సీ, అలాగే సాహిల్ బైక్ చెల్లాచెదురుగా పడినట్లు గుర్తించారు. రోడ్డు పక్కనే రక్తమోడుతూ సాహిల్ పడి ఉన్నాడు. అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.In a devastating Delhi road acc!dent on February 3, 2026, 23-year-old Sahil Dhanera (also referred to as Sahil Dhaneshra or Kabir), a property dealer and only child, was k!Iled when his bike was allegedly struck by a Mahindra Scorpio in Dwarka. The SUV, driven by a 17 year-old… pic.twitter.com/A7eahZJhMt— Weapon. (@sk465g) February 17, 2026కేసు నమోదు చేసుకున్న ద్వారకా సౌత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, రాంగ్ రూట్లో వచ్చిన స్కార్పియో ఎదురుగా వస్తున్న సాహిల్ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత అక్కడే నిలిపి ఉంచిన టాక్సీని ఢీకొట్టినట్లు తేలింది. టాక్సీ డ్రైవర్ అజిత్ సింగ్ కూడా గాయపడి ఐజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతని వాంగ్మూలం పోలీసులు నమోదు చేశారు.నిందితుడికి తాత్కాలిక బెయిల్స్కార్పియో నడిపిన వ్యక్తి మైనర్. అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ప్రమాదం అనంతరం అదుపులోకి తీసుకుని, జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు హాజరుపరిచారు. కోర్టు మొదట అబ్జర్వేషన్ హోంకి పంపారు. కానీ ఫిబ్రవరి 10న జేజేబీ ఆ బాలుడికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కారణం అతడు 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండటమేనని తెలిపింది. అటాప్సీ రిపోర్టులో ఏముందంటే?తాజాగా విడుదలైన ఆటాప్సీ రిపోర్టులో కూడా ప్రమాద తీవ్రత కారణంగానే సాహిల్ మరణించినట్లు తేలింది. అక్కా–తమ్ముడు రీల్స్ పిచ్చి కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ తల ఎడమ వైపు కపాలం పగిలింది. తలలో రక్తం గడ్డకట్టింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మెదడు వాసింది. ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరింది. గుండెకు రక్షణగా ఉండే ఎముకలు విరిగాయి. గుండె లోపల తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గాయాల కారణంగానే సాహిల్ మరణించినట్లు ఆటాప్సీ రిపోర్టులో తేటతెల్లమైంది. స్టంట్స్ చేస్తూ రీల్స్ సాహిల్ మరణంపై అతని తల్లి ఇన్నా మకాన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీ ఆనందం కోసం నా కొడుకు బలితీసుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాహిల్ మరణంపై ఇన్నా మకాన్ మాట్లాడుతూ... ప్రమాదం జరిగే సమయంలో స్కార్పియోలో ఉన్న నిందితుడు అతని సోదరి రీల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే కారణమని అన్నారు. ‘నా కొడుకు ఫిబ్రవరి 3న ఆఫీసుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మైనర్ నిందితుడు తన సోదరితో కలిసి సరదా రీల్స్ చేయడానికి స్కార్పియోలో బయటకు వచ్చాడు. స్కార్పియోను నడుపుతున్న నిందితుడు వేగంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. బస్సు వస్తుంటే.. ఎదురుగా వెళ్లి కట్ కొట్టాడు. మీ ఆనందం కోసం నా కొడుకును బలితీసుకుంటారా? అని ప్రశ్నించారు. సాహిల్ మరణంలో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. A chilling video has emerged showing the moments before a speeding Mahindra Scorpio, allegedly driven by a 17-year-old without a valid licence, collided head-on with a motorcycle, killing 23-year-old Sahil Dhaneshra on February 3 near Lal Bahadur Shastri College. The victim’s… pic.twitter.com/uMnargen22— Orissa POST Live (@OrissaPOSTLive) February 17, 2026 -
ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. బిల్గేట్స్కు నో ఎంట్రీ?
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్గేట్స్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్గేట్స్పై ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్కు బిల్ గేట్స్కు చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన బిల్గేట్స్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్గేట్స్కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్గేట్స్ తన పొడ్రక్ట్స్కు భారత్ ల్యాబ్గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్లో బిల్గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్టాగ్లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలు కంపెనీలు, స్టార్టప్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన కలియదిరిగారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులతో మాటలు కలిపారు. వారి పరిశోధనలు తదితరాలను గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ దాకా జరిగే ఈ ఐదు రోజుల సదస్సులో 600కు పైగా భారీ స్థాయి స్టార్టప్లు పాలుపంచుకోనున్నాయి. వాటితో పాటు 13 దేశాలకు చెందిన ఏఐ పెవీలియన్లు తమ ప్రత్యేకతను చాటేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ సౌత్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు 20 మందికి పైగా దేశాధినేతలు, 60కి పైగా దేశాల నుంచి మంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు పలు ఏఐ దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు కూడా హాజరై ఈ రంగంలో విస్తరణకు అమలు చేయదలచిన ప్రణాళికలు తదితరాలను ఆహూతులతో పంచుకోనున్నారు. 19వ తేదీన సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే తేదీన మాక్రాన్ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. భారత్కే గాక ప్రపంచమంతటికీ పలు రంగాలకు సంబంధించిన కీలక సవాళ్లకు ఈ సదస్సు సమర్థమైన పరిష్కారాలు చూపగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. ఇన్నొవేటర్లు, పరిశోధకులు, టెక్ ఔత్సాహికుల నడుమ గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచి్చనట్టు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇండియా ఏఐ ఎక్స్పోను ప్రారంభించా. ఇంతటి కీలకమైన సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండటం హర్షణీయం’’అన్నారు. ‘గ్లోబల్ ఏఐ గవర్నెన్స్’కు ఈ సదస్సు స్పష్టమైన రోడ్మ్యాప్ను అందజేస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. అంతకుముందు వేదిక వద్ద జియో ఏఐ ఎకో సిస్టమ్స్ స్టాల్ను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. తొలి రోజు విస్తృత చర్చలు ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోకు కేంద్రం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్ మండపంలో 10 వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయానికే భారీ సంఖ్యలో తరలివచి్చన పలు ప్రఖ్యాత ఏఐ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు తదితరులతో వేదికతో పాటు పరిసరాల్లోని హాల్లన్నీ నిండిపోయాయి. వారంతా బృందాలుగా ఏర్పడి పలు రంగాల్లో ఏఐ ప్రభావం, దాని మంచిచెడులను గురించి చర్చోపచర్చల్లో మునిగితేలారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ స్థాయి దిగ్గజ ఏఐ సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నాయి. ఏఐ దెబ్బకు పలు రంగాల్లో భారీగా కొనసాగుతున్న కొలువుల కోత మొదలుకుని బాలల భద్రత దాకా భిన్నమైన అంశాలు, సమస్యలపై చర్చలు, పరిష్కార మార్గాల అన్వేషణకు సదస్సు వేదిక కానుంది. 13కు పైగా దేశాలు ఇప్పటికే మండపంలో ప్రత్యేక పెవీలియన్లు ఏర్పాటు చేశాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజకిస్తాన్ వంటివి వీటిలో ఉన్నాయి. 300కు పైగా క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ పెవీలియన్లు ఆకట్టుకోనున్నాయి. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ థీమ్తో కూడిన లైవ్ డెమాన్్రస్టేషన్లు కంపెనీల ఏఐ ప్రణాళికలను కళ్లకు కట్టనున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా ఏఐ సదస్సును సందర్శిస్తారని భావిస్తున్నారు. -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్సీక్పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! -
ఒకే ఒక్కడు..!
ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది. కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘ఆసిఫ్ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. ‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్ ప్యాకెట్ లేదా ప్లాస్టిక్ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్సెట్ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది. రేపటి కల.. సంయుక్త పోరాటం ఆసిఫ్ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్ ఆల్టమన్ (ఓపెన్ఏఐ), బిల్ గేట్స్, డేరియో అమొదెయ్ (ఆంత్రోపిక్) తదితరులున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్ తదితర నగరాల్లో జరిగాయి. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: దేశ రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది. నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.అదే విధంగా 61 కిలోమీటర్ల మేర నోయిడా గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో నెట్వర్క్ నిర్మాణానికి కేటాయింపులు చేపట్టనున్నట్లు తెలిపింది. రూ. లక్ష కోట్ల కేంద్ర సహాయంతో రూ. 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఫైనాన్స్ మార్కెట్ క్రియేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో రెండు లక్షల స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింతగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. -
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు. -
సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్బి శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! -
నేనే రాజు.. నేనే మంత్రి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘జనగణన 2027కు పూర్తి అవుతుంది...2029 కల్లా మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి. అదే ఏడాది ఏప్రిల్లో జమిలి ఎన్నికలు ఉంటాయి. సీఎంగా నాకు మరో 6 నెలల సమయం అదనంగా లభిస్తుంది. ఇలా ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. మొత్తం పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. నేనే రాజు.. నేనే మంత్రిని. నేను ఎవరితోనూ పోల్చుకోను. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. నేను నా ఊరు దాట..’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటులో ప్రధాన దోషి అప్పటి సీఎం కె.చంద్రశేఖర్రావు అని దానిపై విచారణ జరిపిన కమిషన్ స్పష్టంగా చెప్పినప్పటికీ దీనిపై సీబీఐ విచారణలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జాతీయ నేత అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని అన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ను అరెస్టు చేస్తామని గతంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుండబద్దలు కొట్టారు. అలాంటిది రెండేళ్లుగా కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ఆయన కోరారు కాబట్టే కాళేశ్వరంపై విచారణ చేయమని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రతిపాదనను సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందజేశాం. ప్రధాని కార్యాలయం వరకు విషయం వెళ్లింది. అయినప్పటికీ అతీగతీ లేదు. ఇంతవరకు విచారణ జరపలేదు.. కేసీఆర్ను జైల్లోనూ వేయలేదు. దీనికి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీ, సోనియా గాం«దీలను విచారించారు. ఈ–ఫార్ములా కేసును కూడా ఈడీకి ఇచ్చాం. కానీ మాజీమంత్రి కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్రావును విదేశాల నుంచి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఆయనను తీసుకొచ్చేందుకు 20 నెలలు పట్టింది. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా మిగతావాళ్లకు నోటీసులు ఇచ్చాం ఇందులో రాజకీయం ఏమీలేదు. నేను ఇందులో జోక్యం చేసుకుంటే ఎవరూ బయట ఉండరు. ‘నైనీ’పై అసెంబ్లీలో ఆధారాలు వెల్లడిస్తా.. నైనీ కోల్ బ్లాక్లో సైట్ విజిట్ అనే నిబంధన కేంద్రమే పెట్టింది. ఒక్క సింగరేణిలోనే ఆ రూల్ ఉందని కిషన్రెడ్డి చెబుతున్నారు. నేను చెప్పింది నిజమైతే కిషన్రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను చెబుతా. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని ఆధారాలను వెల్లడిస్తా. కిషన్రెడ్డి లేఖ రాస్తే విద్యుత్ కొనుగోళ్లు సహా అన్ని కేసులూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం. రాష్ట్ర పోలీసులపై కిషన్రెడ్డికి విశ్వాసం లేదంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలా? ‘పాలమూరు, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో ఉన్నవే. వీటిపై ఏపీవాళ్లు పిటిషన్లు వేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టుకోకుండా మాకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. గోదావరిలో వాళ్లకు కావాల్సింది వాళ్లు అడుగుతున్నారు. కృష్ణాలో మాకు కావాల్సింది కూడా ఇవ్వాలి కదా. మా ప్రాజెక్టులు అడ్డుకుంటే ఊరుకుంటామా? వాళ్లకు ఏది నచ్చితే అది తీసుకుంటామంటే ఎలా? గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలు అంటే కుదరదు. వాళ్ల ప్రాజెక్టులకు ఏ రూలు వర్తిస్తుందో అదే రూలు మాకూ వర్తిసుంది. ఇక్కడ ప్రధాన సమస్య కృష్ణా జలాలే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే.. వాళ్లు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ ‘రాష్ట్రంలో కేంద్రం మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో, ఫ్యూచర్ సిటీకి దగ్గర్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం భూమిని కూడా పూలింగ్ చేస్తున్నాం. ఎయిర్ట్పోర్ట్ని బుల్లెట్ రైళ్లకు అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 లోపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మెట్రో ఫేజ్–2కు మార్చి 31 డెడ్లైన్గా పెట్టుకుని పని చేస్తున్నాం. జూన్ 2కు మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నాం..’ అని సీఎం తెలిపారు. ఎఫ్ఎస్ఎల్పై విపక్షాల విష ప్రచారం ‘ఎఫ్ఎస్ఎల్లో కీలక కేసులకు సంబంధించిన రికార్డులు కాలిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. అసలు విషయం వాళ్లకు తెలియదు. ఒక కేసుకు సబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత.. అవి తిరిగి దర్యాప్తు సంస్థకే అప్పగిస్తారు. 2021లో ‘ఓటుకు నోటు’ కేసు రిపోర్టు కూడా అలాగే తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ రికార్డులు కూడా అందులో ఉన్నాయంటే ఎలా?..’ రేవంత్ అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్కు భాష, రాష్ట్రాల సరిహద్దులు లేవు. ఆయన ఏ ఒక్కరి సొత్తూ కాదు.. జాతీయ సొత్తు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అందుకు నేను మద్దతిస్తా. ఇది నా వ్యక్తగత అభిప్రాయం, డిమాండ్. త్వరలో హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా..’ అని రేవంత్ చెప్పారు. -
18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి: సీఎం రేవంత్
ఢిల్లీ: వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు.వానా కాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటీ) అనుమతించారని.. కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎల్ఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్ సీఐ సేకరించాలని కేంద్ర మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.2024-25 వానా కాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్కు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థకు (ఎఫ్సీఐ) 2014-15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి కోరారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని.. దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..?
ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI)కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడాబడా కార్పోరేట్ కంపెనీలతో పాటు సాధారణ ప్రజలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే భారత్ ఈనెలలో దీనికి సంబంధించి ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. దీంతో దీని కున్న క్రేజ్ దృష్యా ఢిల్లీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటాయి.సాధారణంగా న్యూఇయర్ సందర్భంగానో లేదా క్రికెట్ మ్యాచులు, సెలబ్రేటీల ఈవెంట్స్ సాధారణంగా ఇటువంటి సందర్భంలోనే హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. అది కూడా వేలల్లో లేదా రూ. లక్ష ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకూ ఢిల్లీలోని భరత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? ఏఐ సమ్మిట్ దృష్ట్యా ఆ రోజుల్లో అక్కడి ఢిల్లీలోని హోటళ్ల ధరలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పెరిగిపోయాయి. ది ఇంపీరియల్ అనే ఫైవ్స్టార్ హోటల్లో బాత్హాబ్తో ఉన్న లగ్జరీ సూట్ ధర అక్షరాల రూ. 11.64 లక్షలుగా ఉంది. దీంతో కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. లీలా మహాల్లోని మహారాజ సూట్ ధర రూ.7.34 లక్షలు పలికింది. అదేవిధంగా ఒబేరాయిలో రూ.5.84లక్షలు, తాజ్ ప్యాలెస్లో రూ.4 లక్షలుగా ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ మేక్ మైట్రిప్లో ధరలు ఈ విధంగా చూపించాయి దీంతో యూజర్స్ ఆ ధరలు చూసి కంగుతిన్నారు.అయితే ఏఐ సమ్మిట్ దృష్యా ఆ ప్రాంతంలోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో విపరీతంగా పెరిగాయని ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్పేయ్ తెలిపారు.కాగా ఫ్రాన్స్లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్లో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసమ్మిట్ గ్లోబల్ సౌత్లో నిర్వహించబడుతున్న మొట్టమొదటి గ్లోబల్ AI సమ్మిట్. -
ముంబై వదిలి ఢిల్లీకి.. ప్రతి నెలా రూ. 75 వేలు ఆదా!
ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరొక నగరానికి మారడం చాలా మందికి సాధారణమే అయినప్పటికీ, ఆ పరిస్థితి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసిందంటే మనం నమ్మలేం. దీనిని సంబంధించిన ఉదంతంలోనికి వెళితే.. ముంబై లోకల్ రైళ్ల రద్దీని వదిలి.. ఢిల్లీ మెట్రో సౌకర్యాన్ని ఎంచుకున్న ఒక బ్యాచిలర్, తన తాజా అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.రెండింతల తృప్తిఉద్యోగ రీత్యా ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ అయిన కారణంగా తనకు డబ్బు ఆదా అవడమే కాకుండా, విశాలమైన నివాసాలు, పరిశుభ్రమైన వాతావరణం లభించడంతో తన తృప్తి రెట్టింపు అయ్యిందని ఆ బ్యాచిలర్ పేర్కొన్నారు. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో లభించే సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.మరింతగా పెరిగిన పొదుపునెలకు రూ. 1.4 లక్షల వేతనం పొందుతున్న అతను ముంబైలో ఉన్నప్పుడు ఒక సాధారణ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం రూ. 40,000 అద్దె చెల్లించేవారు. అంత ఖర్చు చేసినా అక్కడ అంత సౌకర్యవంతంగా ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే తాను ఢిల్లీకి మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన వివరించారు. ముంబైలో నెలకు రూ. 40 నుంచి 50 వేలు మాత్రమే పొదుపు చేయగలిగిన ఆయన, ఇప్పుడు ఢిల్లీలో అంతకంటే మెరుగైన జీవనశైలిని గడుపుతూ, నెలకు సుమారు రూ. 75,000 ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. విశాలమైన రోడ్లు, సులభంగా లభించే ఇంటి పనివారు, మెరుగైన వైద్య సేవలు ఢిల్లీలో తన ఖర్చులను భారీగా తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.ఈ వైరల్ పోస్ట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో అద్దెలు భరించలేనంతగా ఉన్నాయని ఒకరు వ్యాఖ్యానించగా, ఢిల్లీలోని కాలుష్య సమస్యను మరొకరు గుర్తు చేశారు. ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు ఉండే కాలుష్యాన్ని ఎలాగోలా భరించగలిగితే మిగిలిన విషయాల్లో ఢిల్లీ ఎంతో మెరుగైనదని కొందరు అభిప్రాయపడ్డారు. తరతరాలుగా ఆస్తులు ఉన్నవారికే ముంబై సరిపోతుందని, మధ్యతరగతి, బ్యాచిలర్లకు ఢిల్లీ సరైన ఎంపిక అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.‘ఢిల్లీ కంటే హైదరాబాద్ బెటర్’ఈ చర్చలో భాగంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరం ఎంతో ఉత్తమమని ఒక నెటిజన్ చేసిన కామెంట్కు సదరు బ్యాచిలర్ కూడా మద్దతు పలికారు. తాను ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ను సందర్శించానని, భారతదేశంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. సౌకర్యవంతమైన జీవితానికి హైదరాబాద్ సరైన వేదిక అని ఈ చర్చలో పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత! -
హోటల్లో ఒక్క రోజుకి రూ.30 లక్షలు.. ఎందుకంటే?
భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది. -
ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు.అంతకుముందు సీషెల్స్ అధ్యక్షుడితో భేటీ ఎంతో ఆనందంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సముద్ర పొరుగు దేశాలుగా, ఈ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సు మరియు భద్రత కోసం విజన్ మహాసాగర్ ని విజయవంతం చేయడంతో ఆయన మద్దతు చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా చైన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనెజ్ మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహాకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు.కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలాతో పాట్రిక్ హెర్మీని భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. భారత పర్యటన నిమిత్తం వచ్చిన పాట్రిక్ హెర్మీని ఫిబ్రవరి 10 వరకూ దేశంలో ఉండనున్నారు. ఇటీవల భారత్, సిీషెల్స్ ద్రైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం?
ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్రం గా రాజకీయం వేడెక్కింది. సభలో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయన వైఖరిపై నిరసన చేపట్టన ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాజ్యాంగంలో 94సీ ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.Opposition to move no-confidence motion against Lok Sabha Speaker Om Birla: Sources pic.twitter.com/e8PsUKw2Wp— ANI (@ANI) February 9, 2026లోక్ సభలో చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్న రాహుల్ ఆరోపించారు. ఆర్మీ జనరల్ నరవానే పుస్తకంలో ఉన్న విషయాలను రాహుల్ లోక్ సభలో ప్రస్తావించడాన్ని స్పీకర్ ఓం బిర్లా , బిజెపి ఎంపీలు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.గతంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దంకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేసిింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీలుకు కోర్టు సమయం ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో కాంగ్రెస్ ఆందోళన చేసింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. #UPDATE | According to Sources, the opposition will move it in the second part of the budget session, as it needs 20 days' notice. The grounds identified for the move include: Lok Sabha LoP not allowed to speak; women MPs named by the Chair; certain Treasury Bench MPs always… https://t.co/GoEY5mpWlR— ANI (@ANI) February 9, 2026 -
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త
టీ20 వరల్డ్కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అనూహ్య రీతిలో..దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన సిరాజ్ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్కప్ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్ విజయంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.టీమిండియాకు శుభవార్తఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన సుందర్ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. -
ఘోరం.. పార్కింగ్ కారులో మూడు మృతదేహాలు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ చేసిన కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు ఎవరియా? అక్కడికి ఎలా వచ్చాయా? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని నమూనాలు స్వీకరించాయి. మృతదేహాలు లభించిన కారు పీరాగఢి ఓవర్ వద్ద పార్కు చేసి ఉంది. అయితే చనిపోయిన వారిలో ఒకరు యువతి కాగా మరోకరు యువకుడు, ఓ పెద్దాయన ఉన్నారు. రణ్ధీర్(52), శివనరేష్(42) లక్ష్మీ(41)లుగా గుర్తించారు.#BreakingNews #DelhiPolice #DelhiCrime Piragarhi Incident | DelhiThree bodies were found inside a parked car near the Piragarhi flyover, causing panic in the area.The deceased include one woman and two men, identified as Randhir (62), Shivnaresh (42), and Laxmi (40). The car… pic.twitter.com/EkrutMTGsE— Manmeen Walia (@ManmeenWalia) February 8, 2026 -
యువతుల మిస్సింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.దేశ రాజధాని రీజియన్లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.— Delhi Police (@DelhiPolice) February 6, 2026గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. -
ఇంట్లో కొరియన్ భూతాలు
పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఫోన్లు వారిని ఏ మూలకు నెడుతున్నాయో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చేసే స్నేహం, సంభాషణ, చర్చ మాత్రమే వారిని మంచి దారిలో పెట్టగలదు. ఢిల్లీలో ముగ్గురు ఆడపిల్లలు ‘కొరియన్ గేమ్స్’లో పడి ప్రాణాలు తీసుకున్నారు. మన దేశంలో టీనేజ్ పిల్లలు కె–పాప్ కోసం వెర్రెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇళ్లల్లోని ప్రేమ, స్నేహాల కొరత వల్లేమోనని చెక్ చేసుకోవడం అవసరం. ఇంతకు కొరియన్ లవ్ గేమ్స్ అంటే ఏమిటి? పిల్లలకు వీటి గురించి ఎలా జాగ్రత్త చెప్పాలి?‘వాస్తవంలో ఏదీ దొరకకపోతే ఊహలనే వాస్తవం అనుకోవాల్సి ఉంటుంది’ఇది నిపుణుల మాట.నిజజీవితంలో తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులు, ఆటలు, హాబీలు, స్కూల్లో క్లాస్మేట్లతో అనుబంధం, టీచర్ల నుంచి వాత్సల్యం... వీటిలో ఏవీ లేని పిల్లలు... టీనేజ్లో వచ్చిన వారు ఊహల్లో కాకుండా వేటిలో సాంత్వన వెతుక్కుంటారు.ఇవాళ దేశాన్నే కాదు... ప్రపంచంలోని యువతను కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, గేమ్స్ ఆకర్షిస్తున్నాయంటే కారణం... అక్కడ ఊహలు చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు రాకుమారుల్లా ఉంటారు. అమ్మాయిలు రాకుమార్తెలుగా ఉంటారు. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని కాలు కందకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ల జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది... ఈ అద్భుత ప్రపంచం చూసే కొద్దీ టీనేజ్లోని అమాయకత్వం, ఆకర్షణ వల్ల యువతీ యువకులు తాము అలాగే ఉన్నట్టూ, తమకూ అలాంటి లోకం కావాలన్నట్టు ఉంటుంది.మానసిక నిపుణులు ఏమంటున్నారంటే కొరియన్ ప్రపంచాన్ని ఇష్టపడే వారు ఎక్కువగా భ్రమాజనిత ప్రపంచంలో ఉంటున్నారు... వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నారు అని. దీనికి తార్కాణం తాజాగా ఢిల్లీలో జరిగింది.ఢిల్లీ విషాదం...ఢిల్లీలో ముగ్గురు అమ్మాయిలు (ఇద్దరు ఒక తల్లికి, మరొకరు మరో తల్లికి జన్మించారు– తండ్రి ఒకడే) కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు, గేమ్స్కు, పాప్కు అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలు కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు. వాళ్లలో మధ్య అమ్మాయిని గేమ్స్లోలానే ‘లీడర్’గా ఎంచుకున్నారు. మధ్య అమ్మాయి అన్నం తినకపోతే వారు తినరు. మధ్య అమ్మాయి స్కూలుకు వెళ్లొద్దంటే వాళ్లు వెళ్లరు. తండ్రి, అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురూ ఒక జట్టు, కొడుకు ఒక జట్టుగా మిగిలారు. ‘మా సోదరుడంటే మాకు ఇష్టం లేదు’ అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్లు వెళ్లకుండా పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఏనాటికైనా కొరియా వెళ్లి అక్కడ జీవించాలని వారి కోరికట. ‘మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపగలరా’ అని రాసి తాము నివాసం ఉంటున్న తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మరణించారు.కొరియన్ లవ్ గేమ్స్...కొరియన్ ఆన్లైన్ గేమ్స్ కేవలం బయట ఉండి ఆడేవి కావు. ఆటగాళ్లు ఆ గేమ్లో భాగం అవుతారు. ఆ ఆటగాళ్లకు కొరియన్ నేమ్స్ ఇవ్వబడతాయి. అలాగే గేమ్లోని ఒక వర్చువల్ (కృత్రిమ) యువకుడు లేదా యువతి గేమ్ ఆడే నిజమైన అమ్మాయి లేదా అబ్బాయికి సోల్ మేట్స్ అవుతారు. ఈ సోల్మేట్స్ ఈ నిజమైన అమ్మాయిని అబ్బాయిని చాలా పేంపర్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ల్లో పలకరిస్తారు. రహస్యంగా కబుర్లు చెబుతారు. వీరి మాయలో పడ్డ టీనేజ్ యువతీ యువకులు ఇక మెల్లగా తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరమవుతారు. ఆ తర్వాత ఈ వర్చువల్ యువకుడు లేదా యువతి నిజ యువకుడు యువతికి టాస్క్లు ఇవ్వడం మొదలెడతారు. ఫలానా టైమ్లో మేల్కోమని, ఫలానా టైమ్లో చాట్లో రమ్మని, ఫలానా విధంగా డ్రస్సు వేసుకొని ఫోటోలు పెట్టమని... ఇలా నెమ్మదిగా బానిసలుగా మార్చి స్క్రీన్ టైమ్ను దారుణంగా పెంచేస్తారు. పిల్లలు ఇలా ఫోన్కు అతుక్కుని పోవడం ఎప్పటికైనా తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారు మందలించి ఫోన్ లాగగానే ఒక్కసారిగా భ్రమాత్మక ప్రపంచం మాయమై, డ్రగ్స్ అందని అడిక్ట్స్లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఢిల్లీలో జరిగింది ఇదే. మరో విధంగా చెప్పాలంటే ఈ గేమ్స్లోని వర్చువల్ పాత్రలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు.బ్లూవేల్ తర్వాత...గతంలో బ్లూవేల్ గేమ్ ఆత్మహత్యలకు పురిగొల్పి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత పరోక్షంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను దివాలా తీయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కొరియన్ ప్రపంచం వారిని అతలాకుతలం చేస్తోంది. వాస్తవానికి కొరియాలో శారీరక కరెక్షన్స్ ఒక తప్పనిసరి. వారు సన్నగా ఉండటానికి అందంగా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకు ‘బ్యూటీ లోన్స్’ ఇచ్చే బ్యాంకులూ ఉంటాయి. పాప్ సింగర్లను సన్నగా కనిపించడం కోసం స్కూల్ వయసు నుంచే ఎంచుకుని ఆహారం ఇవ్వకుండా మాడుస్తారు. దాంతో యుక్తవయసులోనే చనిపోయిన సింగర్స్ ఉన్నారు. ఇన్ని తెర వెనుక వ్యవహారాలుండగా తెర మీద అందంగా కనిపిస్తూ కొరియన్ అబ్బాయిలు, అమ్మాయిలు భారత దేశ టీనేజ్ పిల్లలను పూర్తి భ్రమాత్మక ప్రపంచంలోకి ఈడుస్తున్నారు.తల్లిదండ్రులూ జాగ్రత్త...1. పిల్లలతో పదే పదే మాట్లాడండి. 2. జరుగుతున్న విషాదాలను మెల్లగా వివరించండి.3. ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించండి.4. కౌన్సిలర్ల సాయంతో వారిని మెల్లగా ఫోన్ నుంచి భ్రమాత్మక జగత్తు నుంచి బయట పడేయండి.5. విపరీతమైన ప్రేమ, స్నేహితులు, ఆటపాటలు, సొంత ఊర్లూ పరిసరాలు ఇవి వారిని వాస్తవిక ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తాయి. ఓపికగా పిల్లలను మార్చుకోండి.– ఫ్యామిలీ డెస్క్ -
తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకంపై తేల్చాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇవాళ (ఫిబ్రవరి 5, గురువారం) విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలన్న ధర్మాసనం.. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ ఆలస్యం వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందన్న సుప్రీంకోర్టు.. యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదని పేర్కొంది. ‘‘రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే.. త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. -
అంబటి.. జోగిపై దాడులు.. పార్లమెంట్ లో YSRCP నినాదాలు
-
సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..
డబ్బుంటేనే సాయం కాదు..మంచి మనసు ఉంటే ఎలాగైనా సాయం అందించొచ్చు అని నిరూపిస్తున్నాడు ఈ 24 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్. అతడి చేసేది చాలాకష్టమైన పని. పైగా అది సేవ రంగానికి చెందింది. అందులో వచ్చే సంపాదన అతడి కుటుంబ బాధ్యతలకు అక్కరకు రావు. అయినా..అందులో సగం పేదల కోసం ఖర్చు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. సాధారణ ఆదాయమే అయినా..ఇంత సేవాతత్పరత..! అని అందరూ విస్తుపోతున్నారు. ఇంతకీ ఎవరా యువకుడు అంటే.. అతడే ఢిల్లీకి చెందిన యువకుడు ఆకాశ్ సరోజ్. అతడి ఉదారతకు హద్దులు లేవు. స్విగ్గీ డెలివరి బాయ్గా పనిచేస్తూ..వచ్చే ఆదాయంలో సగం జీతం పేదల కోసం ఖర్చుపెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగని మనోడుకి ఏమి బాధ్యతలు లేవా అంటే..కుటుంబాన్ని పోషించుకోవాలి, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆకాశ్దే. అయినప్పటకీ..సంపాదనలో 50% పేద ప్రజల కోసం ఉపయోగిస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj)డెలివరీ బాయ్గా ఎంతలా కష్టపడితే డబ్బులు వస్తాయో తెలిసిందే. కానీ ఈ యువకుడు..రిక్షా కార్మికుడు నుంచి వీధిల్లో బిచ్చమెత్తుకునే అభాగ్యులు వరకు.. తనకెదురైనా ప్రతి వ్యక్తికి తన ఆదాయంలో ఎంతో కొంత ఖర్చు చేసి మరి సాయం చేస్తాడు. ఎందుకింత ప్రయాస అని ఆకాశ్ని ఎవరైనా ప్రశ్నిస్తే..ఇది తన తండ్రి కల అని, తాను ఒక కొడుకుగా..మంచి వ్యక్తిగా ఉండాలన్నదే అతడి కోరిక అని చెబుతుంటాడు. మరో వీడియోలో కుక్కలకు, పిల్లులకు ఆహారం పెడుతూ కనిపిస్తుంటాడు. పైగా ఇది తన బాధ్యత అని పోస్టులో పేర్కొంటూ..వీడియోకి "ఎక్కవ ఆశీర్వాదాలు సంపాదించు..నీకు మించిన ధనవంతుడు లేడు". అనే క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇక్కడ ఆకాశ్ పేదలకు సాయం చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వాటికి ఇచ్చే క్యాప్షన్లు కూడా నెజన్లను అత్యంత ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేసేలా ఉంటాయి కూడా. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj) (చదవండి: వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత) -
చాంపియన్ హరియాణా థండర్స్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో హరియాణా థండర్స్ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్ వారియర్స్పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్లో హరియాణా జట్టు టైటిల్ నెగ్గింది. తాజా లీగ్లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్ విజేతగా నిలిచింది. అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్లో బైరమోవ్ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్ (హరియాణా)పై... రెండో బౌట్గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్ పురుషుల 65 కేజీల ఈవెంట్లో సుజీత్ కల్కల్ (ఢిల్లీ) 8–6తో తుముర్ ఒచిర్ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్ 11–0తో అశిరోవ్ అష్రఫ్ (హరియాణా)పై... ఆరో బౌట్ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్ (ఢిల్లీ)పై... ఏడో బౌట్గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్ 12–1తో అనిరుధ్ (హరియాణా)పై గెలిచారు.ఎనిమిదో బౌట్ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన యువ రెజ్లర్ తురాన్ బైరమోవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్లలోనూ విజయాలు సాధించడం విశేషం. హరియాణా థండర్స్ రెజ్లర్ నేహా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన రోనక్ (125 కేజీలు) ‘ఫైటర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్ రాయల్స్కు చెందిన చంద్రమోహన్ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్గా నిలిచాడు. హరియాణా థండర్స్కు చెందిన అక్షయ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. -
సీఎం రేసులో ఇద్దరు కాదు.. ఆరుగురు!
దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నాం మణిపూర్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. రేసులో ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారని ప్రచారం జరిగినా.. ఇప్పుడా సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం. మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు(2023 మే 3న మొదలై..) కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. ఈ మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి తేవాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్కు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డ సమావేశం.. తరుణ్ చుగ్కు బాధ్యతలు అప్పగించింది. అయితే అంతకుముందు.. ఆదివారమే బీజేపీ, మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే బీజేపీ మణిపూర్ అధ్యక్షురాలు శారదా దేవి సహా పలువురు నేతలు హస్తినకు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఇవాళో, రేపో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇక్కడే మరో ట్విస్ట్!మణిపూర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. బీజేపీకి 37 ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలైన ఎన్పీపీకి 6, ఎన్పీఎఫ్కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కల్లోల ప్రాంతంగా దేశం దృష్టిలో మణిపూర్ మిగిలిపోవడంతో.. ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ పార్టీ నాయకత్వం పర్వత ప్రాంతాలు–లోయ ప్రాంతాల కీలక వర్గాలకు ప్రాతినిధ్యం కలిగిన సమగ్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటునకు కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు మోకాలు అడ్డుపెడుతున్నారు. రాజకీయంగా, మణిపూర్ అసెంబ్లీలో 10 మంది కుకి ఎమ్మెల్యేలు(వీరిలో 7 మంది బీజేపీకి చెందినవారు) ఉన్నారు. జనవరి 13వ తేదీన ఈ వర్గం గువాహటిలో కుకీ సంఘాలతో కలిసి ఓ భేటీ నిర్వహించి.. ప్రత్యేక పరిపాలన (లెజిస్లేటివ్ ఉన్న యూనియన్ టెరిటరీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన వేళ.. వ్రాతపూర్వక హామీ కోరుతోంది. మణిపూర్లో ప్రభుత్వ పునరుద్ధరణకు బీజేపీ తొలి అడుగు వేసినా, కుకి వర్గం ప్రత్యేక పరిపాలన డిమాండ్ తీర్చకపోతే ఈ ప్రయత్నం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇద్దరు కాదు.. ఆరుగురు సీఎం రేసులో తొలుత ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి థోక్చోమ్ సత్యబ్రత సింగ్ తో పాటు మరో మంత్రి థోంగమ్ బిస్వజిత్ సింగ్ పేర్లు ఈ రేసులో తొలుత తెరపైకి వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంఖ్య ఆరుకి చేరింది. ఆ లిస్ట్లో ఉన్న పేర్లు, వాళ్ల ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయి.. థోక్చోమ్ సత్యబ్రత సింగ్ – ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, యైస్కుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2020–22లో మంత్రి కూడా అయ్యారు.థోంగమ్ బిస్వజిత్ సింగ్ – 2012 నుంచి ఎమ్మెల్యే, పర్యావరణ మరియు పిడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు.యుమ్నం ఖేమ్చంద్ సింగ్ – సింగ్జమేయి నియోజకవర్గం ఎమ్మెల్యే, 2017–22లో స్పీకర్, తరువాత మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు.గోవిందాస్ కాంతౌజామ్ – బిష్ణుపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు.థౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్ – నాలుగు సార్లు ఎమ్మెల్యే, నంబోల్ నియోజకవర్గం ప్రతినిధి. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో క్రీడల సహాయ మంత్రిగా పని చేశారు.థోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ – హైరోక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రిటైర్డ్ IPS అధికారి. గల్లంట్రీ, మెరిటోరియస్ సర్వీస్ కోసం రాష్ట్రపతి పోలీస్ మెడల్ పొందారు. మొత్తంగా, బీజేపీ పై ఆరుగురిలో ఒకరిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఈ ఉత్కంఠకు తెరపడే చాన్స్ ఉంది. -
‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు శీతల గాలుల తీవ్రత కొనసాగుతుండగా, మరోవైపు సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విజిబిలిటీ (దృశ్యమానత) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా అక్షరధామ్, ధౌలాకువాన్ వంటి కీలక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. #WATCH | Delhi wakes up to a layer of dense fog in some parts of the city this morning. Visuals from Mahipalpur, near IGI Airport. As per IMD, the area is experiencing 'Moderate Fog' today. AQI in the area recorded at '134' in 'moderate' category, as claimed by CPCB. pic.twitter.com/kSHcsZoBIa— ANI (@ANI) February 2, 2026విపరీతమైన పొగమంచు కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)హై అలర్ట్ ప్రకటించింది. విమానాల రాకపోకల్లో జాప్యం తప్పదని ఎయిర్పోర్ట్ యంత్రాంగం తెలిపింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని లేదా అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని సూచించింది. కాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.#WATCH | Delhi wakes up to a layer of dense fog in some parts of the city this morning. Visuals from Mother Teresa Crescent Marg. As per IMD, the area is experiencing 'Moderate Fog' today. AQI in the area recorded at '118' in 'moderate' category, as claimed by CPCB. pic.twitter.com/svtkviu5sd— ANI (@ANI) February 2, 2026శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే 1.7 డిగ్రీలు తక్కువ. పాలం (8.1°C), లోధి రోడ్ (7.1°C), అయానగర్ (6.6°C) వంటి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో పొగమంచు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం కలవరపెడుతోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)318గా నమోదై ‘అత్యంత పేలవమైన’ (Very Poor) విభాగంలో కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం -
సవాళ్లపై సవారీ!
అమెరికా టారిఫ్లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు.. జీడీపీ వృద్ధి మందగమనం, ప్రపంచ దేశాల్లో అనిశి్చతితో రూపాయి పతనం, భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు, ఉపాధిని మింగేస్తున్న ఏఐ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మరికొన్ని గంటల్లో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. నేటి బడ్జెట్ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉత్సాహాన్ని కలిగించేలా, మౌలిక రంగాలను మెరిపించేలా గేమ్ చేంజింగ్ విధానాలతో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్లో నజరానాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తయారీ నుంచి మౌలిక సదుపాయాల వరకు.. ఉద్యోగ సృష్టి నుంచి గ్రామీణాభివృద్ధి వరకు.. పునరుత్పాదక శక్తి నుంచి డిజిటల్ ఆవిష్కరణల వరకు.. దేశ ఆర్థిక ఇంజన్ను నడిపించే అనేక వ్యూహాత్మక విధానాలను కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే వృద్ధి వేగాన్ని కొనసాగించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలను ఈ బడ్జెట్ చేపడుతుందని భావిస్తున్నారు. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి పార్లమెంటులో 2026–27 బడ్జెట్ను ప్రవేపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెడుతుండటం విశేషం. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐటీ, జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులకు తోడు మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటివి ఇప్పటివరకు అమెరికా సుంకాలను తట్టుకోవడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి కేంద్రం సరికొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. సవాళ్లు ఎన్నో.. ఈసారి కేంద్ర బడ్జెట్ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య వస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరంగా మారిన కమోడిటీల ధరలు, ప్రధాన బ్యాంకులు అనుసరించిన ద్రవ్య విధానాల వంటి సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కమ్ముకున్నాయి. దేశీయంగా ఆర్థిక లోటును తగ్గించుకుంటూనే వినియోగాన్ని పెంచడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, మూలధన వ్యయాన్ని పెంచాలన్న ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల కొత్త బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రానికి ఉన్న అవకాశాలను పరిమితం చేసింది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశి్చత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆర్థిక వృద్ధి చోదకాన్ని కనుగొనడం నిర్మలా సీతారామన్కు అతిపెద్ద సవాల్ కానుంది. అమెరికాతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలను విక్రయిస్తుండటం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కూడా ఆమె ముందున్న మరో కష్టతరమైన లక్ష్యమని ఆర్థికవేత్తలు అంటున్నారు. బడ్జెట్ టీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కొన్ని ఊరటలు..⇒ కేంద్రం ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా అంతర్గతంగా సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. ⇒ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేర ళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాలను ప్రకటించొచ్చు. ⇒ రైల్వే, పునరుత్పాదక ఇంధన, పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మూలధన వ్యయం పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ⇒ పన్నుల విషయంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. కార్పొరేట్ పన్ను రేట్లు మారకపోవచ్చు. ⇒ ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత లభించనుంది. నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు ఉండవచ్చు. ⇒ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ రంగాలకు మరింత చేయూత అందించే అవకాశం ఉందని అంచనా. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్ కేటయింపులు పెంచడమో లేదా క్రెడిట్ గ్యారెంటీలు ఇవ్వడమో ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మ బడ్జెట్ పద్దు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ప్రభుత్వ మూలధన వ్యయం రూ. 12 లక్షల కోట్లు దాటొచ్చు. బడ్జెట్ క్వీన్ సీతారామన్దేశ చరిత్రలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా రికార్డుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. నేరుగా ‘బడ్జెట్’ను వీక్షించనున్న 30 మంది విద్యార్థులుకేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను కళాశాల విద్యార్థులు లోక్సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాగే ఆర్థిక శాఖ కార్యకలాపాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులు ఆదివారం బడ్జెట్ను నేరుగా వీక్షిస్తారు. అలాగే ఆర్థిక శాఖ కార్యాలయం ఉన్న కర్తవ్య భవన్–1ను సందర్శించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ శాఖ కార్యకలాపాలు, విధానాల రూపకల్పన, సంస్థల పాత్ర గురించి తెలుసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఆయా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యకలాపాలు, ప్రభుత్వ పరిపాలన, ప్రజాస్వామిక ప్రక్రియల గురించి అవగాహన కల్పించడంతోపాటు యువతను అందులో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది. -
తీహార్ జైల్లో కలకలం.. ఉమర్ ఖలీపై తోటి ఖైదీల దాడి?
ఢిల్లీ: తీహార్ జైల్లో ఉమర్ ఖలీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితుడు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్పై తోటి ఖైదీలు మూకుమ్మడి దాడి చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఉమర్ ఖలీపై దాడి జరిగిందంటూ పలు సోషల్ మీడియా పోస్టులు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా దాడి జరిగిందా? దాడి చేసిన వారు ఎవరు? దాడి చేయడానికి కారణం ఏమిటి? దాడి తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వంటి వివరాలపై స్పష్టత కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే కేసులో ఇదే కేసులో జనవరి 5న సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆరేళ్ల క్రితం దేశ రాజధాని భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ తిరస్కరించింది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాములుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. 11 షరతులు విధించిన కోర్టుఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.వీళ్లది కీలక పాత్ర..‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు.ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది.సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు. -
పుట్టింటికి వచ్చేయమన్నా వినలేదు
అత్తింట ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం.. మాకు తెలిసే సరికి ఆలస్యమైంది. అతను చెయ్యి చేసుకున్న విషయం తెలిసి పంచాయితీ పెట్టాం. క్షమాపణలు చెప్పి.. ఇంకొసారి కొట్టానంటూ బిడ్డ మీద ఒట్టేశాడు. అయినా వేధించడం ఆపలేదు. కడుపుతో ఉందని చూడకుండా గొడ్డు చాకిరీ చేయించాడు. చనిపోయే ముందు కూడా నా సోదరి తన కష్టం చెప్పుకుంది. పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదు.. కాజల్ కేసులో ఆమె సోదరుడు నిఖిల్ భావోద్వేగంగా జరిగింది వివరించాడు. అసలేం జరిగింది?.. ఢిల్లీ స్వాట్(Special Weapons and Tactics) కమాండో అయిన కాజల్ చౌద్రి.. జనవరి 22న భర్త అంకుర్ చేతిలో దారుణ హత్యకు గురైంది. అంకుర్ రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్. కాజల్ సోదరుడు నిఖిల్ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో కానిస్టేబుల్. హత్యకు కొన్ని నిమిషాల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడిన నిఖిల్.. సిబ్బందితో హుటాహుటిన అంకుర్ నివాసానికి చేరుకున్నాడు. ఒక పక్క పెద్ద డంబెల్.. మరో పక్క రక్తపు మడుగులో పడి ఉన్న సోదరి.. ఇంకోపక్క అంకుర్, అతని కుటుంబ సభ్యులు నిల్చుని ఉన్నారు.ఆలస్యం చేయకుండా కాజల్ను ఆస్పత్రికి తరలించాడు నిఖిల్. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిందామె. ఆమె మరణించిన కొద్ది గంటలకే అంకుర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడతను. అయితే.. ఈ కేసు వెనుక వరకట్న వేధింపుల కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం కాస్త..అంకుర్, కాజల్ చౌద్రీ పానిపట్లో కాలేజీలో చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 2023 నవంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పగింతల సమయంలో అంకుర్ కోరినవన్నీ కాజల్ తల్లిదండ్రులు అప్పగించారు. అయినా కూడా అంకుర్ సంతృప్తి చెందలేదు. కాజల్ ద్వారా తనకు కావాల్సినవన్నీ అత్తింటి నుంచి కానుకల రూపంలో అందుకున్నాడు. ఈ క్రమంలో పిల్లనిచ్చిన మామ దగ్గర విడిగా అప్పు కూడా చేశాడు. ఆపై కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. ఆ తర్వాతే ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా ఓపికగా భరించింది. ఈలోపు కాజల్ మరోసారి గర్భం దాల్చింది. అయినా కూడా భర్త ఆమెతో అన్ని పనులు చేయించేవాడు. ఒకపక్క స్వాట్ డ్యూటీ.. మరోపక్క ఇంటి పనులు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి విషయాలను చేరవేసింది. అప్పటిదాకా ఆ విషయాలేవీ తెలియని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు నిఖిల్ షాక్ తిన్నారు. బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చేయమని బతిమాలారు. ఆమె వినలేదు. చావైనా బతుకైనా భర్తతోనేనని తేల్చేసింది. దీంతో కాజల్ తల్లిదండ్రులు పెద్దలను కూర్చోబెట్టి పంచాయితీ ద్వారా అంకుర్కు సర్దిచెప్పించారు. ఆ రాత్రి ఏం జరిగిందంటే.. ఇంత జరిగినా.. అంకుర్ వేధింపులు ఆపలేదు. జనవరి 22న రాత్రి కాజల్తో గొడవపడ్డాడు. 10గం. ప్రాంతంలో అంకుర్ తన బావమరిది నిఖిల్కు ఫోన్ చేశాడు. ‘‘ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకో. ఆధారాంగా పనికొస్తుంది. నీ అక్కను చంపేస్తున్నా’’ అంటూ ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు. దీంతో కంగారుపడ్డ నిఖిల్ శాంతంగా ఉండమని, ఫోన్ తన సోదరికి ఇవ్వమని కోరాడు. అయితే అంకుర్ అరుస్తూ ఫోన్ పెట్టేశాడు. దీంతో నిఖిల్ తన సోదరికి కాల్ చేశాడు. ఆమె మాట్లాడుతున్న.. ఫోన్ లాక్కుని కట్ చేసేశాడు. మరో ఐదు నిమిషాలకు నిఖిల్ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి ఆమెను చంపేశానని.. ఆస్పత్రికి రావాలని చెప్పాడు. భయపడ్డ నిఖిల్ తన సిబ్బందితో వెస్ట్ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ఎక్స్టెన్షన్లోని అంకుర్ కుటుంబం ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సింది జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. జనవరి 22వ తేదీన రాత్రి 10-10.30 గం. ప్రాంతంలో ఘటన జరిగింది. కాజల్ నాలుగు నెలల గర్భిణి అని, మృతదేహాంపై మరిన్ని గాయాలు ఉన్నాయని పోస్ట్మార్టం నివేదికలో తేలింది. కాజల్ బిడ్డను తామే పెంచుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లో అంకుర్ కుటుంబం నీడ కూడా పడనివ్వబోమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
‘90 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో’..
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్తో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి శశి థరూర్ చెక్ పెట్టారు.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సుమారు 90 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర వ్యక్తిగత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా పార్టీతో తన అనుబంధం బలంగా ఉందని, విభేదాల ఊహాగానాలకు తావు లేదని థరూర్ స్పష్టంచేశారు.శశి థరూర్ ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను సమర్ధించినట్లు చెప్పారు.ఆ తర్వాత పలు పత్రికల్లోని గెస్టు కాలమ్స్లో ఆపరేషన్ సిందూర్ను కీర్తించారు.దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో విభేదాలు మరింత పెరిగాయని, ముఖ్యంగా కేరళ యూనిట్లో అసమ్మతి ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాహుల్, ఖర్గేలను కలవడం ద్వారా పార్టీ లోపల ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమావేశం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ భేటీని సానుకూలంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలు థరూర్తో చర్చలు జరిపి, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం అత్యవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం.ముఖ్యంగా కేరళలలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్లోని అన్ని వర్గాలు ఒకే దిశగా కదలాలని ఈ సమావేశం సంకేతం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మీ ఎమ్మెల్యే సంగతేంటి? పవన్ పరుగో పరుగు
-
కర్తవ్యం మరచి కథలు చెబుతున్నారా?: సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: వీధి శునకాల సంతతి వృద్ధిని కట్టడిచేసే లక్ష్యంతో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును చాలా రాష్ట్రాలు గాలికొదిలేశాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాలు ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నాయో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనానికి నివేదించారు.ఈ సందర్భంగా ‘జంతువుల జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వీధి శునకాలకు కు.ని. ఆపరేషన్లు చేయాలని సూచించారు. వాటికి షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోకి వీధికుక్కలు రాకుండా కంచెలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇవేమీ రాష్ట్రాలు సరిగా అమలుచేయట్లేదు’’ అని గౌరవ్ వెల్లడించారు. రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.మేం ఇచ్చిన తీర్పును అమలుచేసే కర్తవ్యాన్ని రాష్ట్రాలు గాలికొదిలేసి గాల్లో కోటలు కడుతున్నాయి. కథలు చెబుతున్నాయి. అస్సాం మినహా ఏ రాష్ట్రం కూడా కుక్కకాటు ఘటనలు ఎన్ని జరిగాయో నమోదుచేయలేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను గురువారం కోర్టుకు నివేదిస్తానని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. -
ఢిల్లీలో దారుణం : ఆరేళ్ల బాలికపై మైనర్ల అఘాయిత్యం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల లోపు ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ ముగ్గురూ గత ఏడాది చనిపోయిన బాలిక సోదరుడికి స్నేహతులే. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో జనవరి 18న ముగ్గురు బాలురు ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుల వయస్సు 10, 13 , 14 సంవత్సరాలు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మూడో నిందితుడు, అతని కుటుంబం పరారీలో ఉంది.ఏం జరిగిందంటే..బాధితురాలి తల్లి అందించిన వివరాల ప్రకారం జనవరి 18న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి తిరిగి వచ్చింది. మొదట తాను కింద పడిపోయానని చెప్పింది. పక్కింటి 13 ఏళ్ల అబ్బాయి కూడా అదే కథ చెప్పాడు. అయితే బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమె తట్టి లేపిన తల్లి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 13 ఏళ్ల పక్కింటి అబ్బాయి, మరో ఇద్దరు బాలురు ఆహారం ఇస్తామని ఆశ చూపి తనను తీసుకెళ్లారు. ఆ అబ్బాయిలు అక్కడే ఆమెను పట్టుకుని చావ్మిన్ ఇస్తామని చెప్పారు. ఆ తరువాత సమీపంలోని ఖాళీగా ఉన్న రెండు అంతస్తుల భవనంలోకి తీసుకెళ్లి, ఆమె చేతులు కట్టి, నోటికి గుడ్డ కట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో వారు వెంటనే జాఫరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికకు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య నివేదికలో ఆమె నడవలేకపోతోందని,తీవ్ర రక్తస్రావం అవుతోందని పేర్కొన్నారు. హెచ్ఐవి, ఇతర వ్యాధుల కోసం పరీక్షలు చేయించుకోవాలని కూడా వైద్యులు సూచించారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!విచారణ సమయంలో బాలిక కూడా ఈ వివరాలను పంచుకుందని ధృవీకరించారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను జనవరి 19న అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచినట్టు చెప్పారు. ప్రస్తుతం బాధిత బాలిక నిలకడగా ఉందని, ఇంట్లోనే కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటుఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. నిందితులు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు ముస్లిం అబ్బాయిలు కావడంతో హిందూ కార్యకర్తలు న్యాయం కోరుతూ రహదారిని దిగ్బంధించారు. సోమవారం, హిందూ మితవాద సంఘాలు మూడవ నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపాయి. దీంతో పోలీసులు కేసును భజన్పురా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తు అధికారులు ఆ భవనాన్ని సందర్శించి,ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.నడవలేక నరకయాతన పడుతోంది : బాధితురాలి తల్లిబాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. నడిచినా లేదా ఆడినా రక్తస్రావంతో, నొప్పితో ఇబ్బందిపడుతోందని తల్లి వాపోతోంది. ఆ బాలిక తండ్రి, రిక్షా కార్మికుడు, నిందితులను వయోజనులుగా పరిగణించి విచారించాలని డిమాండ్ చేశాడు. వారికి కఠినమై శిక్షపడాలని డిమాండ్ చేశాడు. తన బిడ్డను అలా చూసి కుమార్తెల భద్రతపై భయంతో తాను ఇంకా పనికి తిరిగి వెళ్లలేదని ఆ తండ్రి చెప్పాడు. ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు -
ఖర్గే, రాహుల్కు మూడో వరుసా?
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్లో పంచుకున్నారు.తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026 -
గణతంత్ర వేడుకల్లో ‘సిందూర’ స్ఫూర్తి!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ శకటం, ఆ పోరాటంలో పాక్ పీచమణచిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, అతి శక్తిమంతమైన క్షిపణులు, కొత్త తరం యుద్ధ విమానాలు, సరికొత్త సైనిక విభాగాలు... ఇలా అమేయమైన భారత సైనిక శక్తిని 77వ గణతంత్ర దిన వేడుకలు కళ్లకు కట్టాయి. సిందూర్ థీమ్తో రూపొందిన భారత సైన్య శకటం అందరినీ ఆకట్టుకుంది. ఇక దేశీయంగా రూపొందించిన పలు ప్రళయ భీకర ఆయుధాలు ఆహూతులను ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా 150 ఏళ్ల వందేమాతరం థీమ్ ఉర్రూతలూగించింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికగా నిలిచాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారిని వెంటబెట్టుకుని సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు విచ్చేశారు. అనంతరం త్రివిధ దళాధిపతి హోదాలో సైనిక వందనం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. పలు రంగాల ప్రముఖులతో పాటు మొత్తం 10 వేల మందికి పైగా వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘సారే జహా సె అచ్ఛా’, ‘కదం కదం బఢాయె జా’వంటి దేశభక్తి గీతాలతో పాటు వందేమాతరం అందరిలోనూ స్ఫూర్తి నింపాయి. 90 నిమిషాల పాటు జరిగిన వేడుకలో 18 సైనిక దళాలు, 13 సైనిక బ్యాండ్లు అలరించాయి. వేడుక అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక అతిథులతో పాటుగా గుర్రపు బగ్గీలోనే వెనుదిరగడం విశేషం. సాయుధ పాటవం సాహో... త్రివిధ దళాల సైనిక పాటవ ప్రదర్శనకు గణతంత్ర వేడుకలు వేదికగా నిలిచాయి. గణతంత్ర పరేడ్కు పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ సారథ్యం వహించారు... → బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకు, ధనుష్ ఆర్లిటరీ గన్స్, దివ్యాస్త్ర బ్యాటరీ వంటివి అందరినీ అలరించాయి. → 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’థీమ్ ఆకట్టుకుంది. → స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా సైన్యం ‘యుద్ధ వ్యూహ అమరిక’ద్వారా తన పాటవాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడం విశేషం. → ఆ క్రమంలో, గత మేలో పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిన క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను కళ్లకు కడుతూ రూపొందించిన త్రివిధ దళాల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. → ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో శకటం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిందూర్ ఆపరేషన్ వేళ బ్రహ్మోస్ క్షిపణులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర వ్యవస్థలతో పాటు పాక్లోని కీలక నగరాల్లో ఎయిర్ బేస్లను నేలమట్టం చేయడం, ఎస్–400 డిఫెన్స్ వ్యవస్థలు పాక్దాడులను పూర్తిస్థాయిలో అడ్డుకోవడం తెలిసిందే. → టీ–90 భీష్మ, అర్జున్ యుద్ధట్యాంకులు, బీఎంపీ–2 పదాతి దళ వాహనం, నాగ్ క్షిపణి వ్యవస్థ ముందు నడుస్తుండగా తేలికరకం అత్యాధునిక ధ్రువ్, అపాచీ ఏహెచ్–64ఈ, ప్రచండ్ హెలికాప్టర్లు వాటికి రక్షణగా సాగాయి. రోబోటిక్ శునకాలు, మానవరహిత యుద్ధ వాహనాలు వాటిని అనుసరించాయి. → భారీ వాహనాలపై తరలివచ్చిన శక్తిబాణ్, దివ్యాస్త్ర తర్వాత తరపు అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి అద్దం పట్టాయి. → కొత్తగా ఏర్పడిన భైరవ్ పదాతి దళ బెటాలియన్ కవాతు ఆకట్టుకుంది. సంప్రదాయ పదాతి దళం, ప్రత్యేక దళాల మేలుకలయికగా దీన్ని రూపొందించారు. → నేవీ, వాయు సేన నుంచి 144 మంది చొప్పున యువ సిబ్బందితో జరిగిన కవాతులు అలరించాయి. → క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన నావ థీమ్తో రూపొందించిన నావిక దళ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. → డీఆర్డీఓ రూపొందించిన అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎంను అంతా ఆసక్తిగా తిలకించారు. → సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డేర్డెవిల్ మోటార్సైకిల్ రైడర్ బృందాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. → ఇక ఆహూతులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఏరియల్ ఫ్లైపాస్ట్ విన్యాసాలు ఉర్రూతలూగించాయి. 29 విమానాలు ఇందులో పాల్గొన్నాయి. వాటిలో 16 యుద్ధ విమానాలు కాగా నాలుగు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు. → రాఫెల్, మిగ్–29, సెఖోయ్–30 జాగ్వార్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సిందూర్ను తలపించేలా స్పియర్హెడ్ ఆకృతిలో ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాయి. → కర్తవ్య పథ్లో కవాతు చేసిన 30 శకటాలు దేశ సాంస్కృతిక ఘనతకు, వైవిధ్యానికి అద్దం పట్టాయి. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి 17 కాగా, 19 కేంద్ర ప్రభుత్వ శాఖలు, త్రివిధ దళాలకు చెందినవి. రక్షణ పాటవానికి అద్దం: మోదీ గణతంత్ర వేడుకలు భారత రక్షణ పాటవానికి అద్దం పట్టాయని మోదీ పేర్కొన్నారు. మన సన్నద్ధతకు, సాంకేతిక సామర్థ్యానికి, పౌరుల భద్రత పట్ల తిరుగులేని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచాయని ఎక్స్ పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ‘‘ఈ వేడుకల్లో ఈయూ అధినేతలకు ఆతిథ్యమివ్వడం భారత్కు గొప్ప గౌరవం. నానాటికీ బలపడుతున్న భారత్, ఈయూ బంధానికి ఇది అద్దం పట్టింది’’అన్నారు.ఎన్నెన్నో ‘తొలి’ఘనతలు! ఈ గణతంత్ర వేడుకలు పలు ‘తొలిసారి’ఘనతలకు వేదికగా నిలిచాయి... → కొత్తగా ఏర్పాటైన పదాతి దళ భైరవ్ లైట్ కమెండో బెటాలియన్, శక్తిబాణ్ రెజిమెంట్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ వంటివెన్నో వీటిలో ఉన్నాయి. శక్తిబాణ్ను డ్రోన్, కౌంటర్ డ్రోన్ రెజిమెంట్గా తీర్చిదిద్దారు. → రెండు మూపురాల బ్యాక్ట్రియన్ ఒంటెలు, జన్స్కార్ అశ్వాలు తొలిసారి పరేడ్లో పాలుపంచుకున్నాయి. → 61వ అశ్వికదళ సభ్యులు కూడా తొలిసారి కవాతులో పాల్గొన్నారు. → లద్దాఖ్, డోగ్రా, అరుణాచల్, కుమాయూన్, ఘడ్వాల్, సిక్కిం స్కౌట్స్ సభ్యులతో కూడిన మిశ్రమ స్కౌట్స్ దళం కూడా సైనిక దుస్తుల్లో తొలిసారిగా అలరించింది. → డీఆర్డీవో రూపొందించిన నౌకా విధ్వంసక హైపర్సోనిక్ క్షిపణి ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎం కూడా తొలిసారి పరేడ్లో పాల్గొంది. → రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ తరఫున సైనిక శునకాలు, డేగలు కూడా ఈసారి పరేడ్లో భాగస్వాములు కావడం విశేషం. → సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సాగిన కవాతుకు మహిళా సైనికాధికారి సారథ్యం వహించారు. ఈయూ సైనిక దళాలు ఈసారి గణతంత్ర కవాతులో యూరోపియన్ యూనియన్కు చెందిన సైనిక దళాలు కూడా పాల్గొనడం విశేషం. ఈయూ సైనిక పతాకతో పాటు ఆపరేషన్ అట్లాంటా, ఆస్పిడెస్ నేవీ ఆపరేషన్ల తాలూకు పతకాలతో అలరించాయి. యూరప్ బయట ఇలాంటి వేడుకల్లో ఈయూ దళాలు పాల్గొనడం ఇదే తొలిసారి!నారీ శక్తిని చాటిన సిమ్రన్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాల ఈసారి గణతంత్ర పరేడ్లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచారు. పూర్తిగా పురుషులతో కూడిన 147 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ దళానికి ఆమె సారథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ‘దేశ్ కే హమ్ రక్షక్’గీతం నేపథ్యంలో విని్పస్తుండగా ఆమె నాయకత్వంలో సీఆర్పీఎఫ్ దళం కవాతు సాగింది. గణతంత్ర వేడుకల్లో పూర్తిగా పురుషులతో కూడిన సైనిక దళానికి మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల సిమ్రన్ గతేడాదే సీఆరీ్పఎఫ్లో చేరారు. ఆ జిల్లా నుంచి ఆఫీసర్ హోదాలో అందులో చేరిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. సిమ్రన్ స్వగ్రామం నౌషేరా నియంత్రణ రేఖకు కేవలం 11 కి.మీ. దూరంలోనే ఉంటుంది. ఆమె తాత కూడా సైన్యంలో పని చేశారు.ఆకట్టుకున్న మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ఈసారి ఆయన బంగారు జరీతో నేసిన నెమలీక ముద్రలతో కూడిన ముదురు ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన తలపాగా ధరించారు. ముదురు నీలం, తెలుపు రంగుల కుర్తా పైజామా, తేల నీలం రంగు హాఫ్ జాకెట్ ధరించారు. పదేళ్లకు పైగా పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల్లో మోదీ రంగుల తలపాగాలు ధరిస్తూ వస్తుండటం తెలిసిందే. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ కూడా భారత సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. సాధారణ ప్యాంటు, సూటుకు బదులుగా ఆమె ముదురు ఎరుపు, బంగారు రంగులతో కూడిన పట్టు బంద్గలా ధరించారు. నదుల పేర్లు ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లకు ఈసారి వీవీఐపీ, వీఐపీ వంటి పేర్లకు బదులుగా నదుల పేర్లు పెట్టడం విశేషం. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసీ, కృష్ణ, మహానది, నర్మద, పెన్నా, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తీస్థా, వైగై, యమున పేర్లతో ఎన్క్లోజర్లను రూపొందించారు. జనవరి 29న రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు కూడా ఆహూతుల ఎన్క్లోజర్లకు వినూత్నంగా వేణువు, డమరుకం, ఎక్తారా, మృదంగం, నగాడా, పఖావజ్, సంతూర్, సారంగి, సరోద్, షెహనాయ్, సితార్, తబలా, వీణ వంటి భారత సంప్రదాయ సంగీత వాయిద్యాల పేర్లు పెట్టనున్నారు.వందేమాతరం స్ఫూర్తి ఈసారి వేడుకల్లో వందేమాతరం థీమ్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ గేయంలోని తొలి చరణాలకు అద్దం పట్టే తేజేంద్రకుమార్ మిత్రా వంటి కళాకారుల పురాతన పెయింటింగుల నమూ నాలను ఆహూతుల ఎన్క్లోజర్లపై ప్రద ర్శించారు. జాతీయోద్యమంలో దేశమంతటా స్ఫూర్తి నింపిన ఈ గేయ రచనకు ఈ సంవత్సరమే 150 ఏళ్లు నిండటం తెలిసిందే. ఆ సందర్భంగా ‘150 ఏళ్ల వందేమాతరం’థీమ్కు గణతంత్ర వేడు కల్లో ప్రాధాన్యం దక్కింది. ఆహ్వానపత్రికల నుంచి పరేడ్ల దాకా అన్నింట్లోనూ వందేమాతరం లోగో దర్శనమిచ్చింది. -
ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
Watch Live: రిపబ్లిక్ డే పెరేడ్ 2026
-
అక్క కోసం దాచిన డబ్బుల్ని దొంగిలించి.. గోవాలో తమ్ముడు ఎంజాయ్
ఢిల్లీ: పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, మంచి కెరీర్ నిర్మించుకోవాలని విద్యార్థులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు భరించలేని ఒత్తిడితో ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించే పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఓ విద్యార్థి మాత్రం అలా చేయలేదు. ఒత్తిడిని దూరం పెట్టి, ఎంజాయ్ చేయాలని గోవాకు వెళ్లిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నా.. గోవాకు వెళ్లే ముందు ఆ విద్యార్థి చేసిన పనికి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలుడు పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే తన అక్క యూపీఎస్సీ ఫీజు కోసం ఇంట్లో దాచి పెట్టిన రూ.3లక్షల్ని దొంగిలించాడు. అనంతరం, ఎంజాయ్ చేసేందుకు గోవా వెళ్లాడు.అయితే, కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులు సైబర్ ట్రాకింగ్ ద్వారా బాలుడిని గుర్తించారు. గోవాలో ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక గోవా పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు. గోవా వెళ్లేందుకు తన అక్క కోసం దాచిన మూడు లక్షల్ని దొంగించినట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. సరిహద్దుల్లో అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తమైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా మోహరించాయి. డ్రోన్లతో ఎల్ఓసీ వెంట బలగాలు నిఘా పెట్టాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం అంతటా భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురుగ్రామ్, చిల్లా, టిక్రీ, సింఘు, కాపషేరా, బదర్పూర్ మరియు ధౌలా కువాన్ సరిహద్దుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నట్లు తెలిపాయి.గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి, సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధాన్ని ప్రతిబింబించేలా పేరేడ్ సాగుతోంది. పరేడ్లో ఆరువేల మంది సైనికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ముజాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముగణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర,భిన్నత్వంలో ఏకత్వం థీమ్పై 100 మంది కళాకారులతో సంగీత నృత్య కార్యక్రమంపరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర, అశోక చక్ర విజేతలుప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానంపరేడ్లో పాల్గొన్న ఐరోపా సమాఖ్య చెందిన సైనిక బృందం150 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్తో 21 సార్లు పేల్చి గౌరవ వందనంశుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానంపూల వర్షం కురిపించిన 4 ఎంఐ-17 హెలికాఫ్టర్లుప్రత్యేక ఆకర్షణగా భారతీయ న్యాయ సంహిత శకటంవేడుకల్లో తొలిసారి జంతు దళం కవాతు జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముమొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్వేడుకల్లో భాగంగా వార్ మెమోరియాల్ వద్ద అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మురాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్కు ద్రౌపదీ ముర్ము ద్రౌపదీ ముర్ముతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సైనికులతో పరేడ్ 6,050 మంది సైనికులతో పరేడ్ 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శన 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా జరిగే కవాతు ఆయుధ ప్రదర్శన వైమానిక విన్యాసాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో నిఘా ఏర్పాట్లు #WATCH | Preparation visuals from Kartavya Path ahead of the 77th Republic Day Parade. pic.twitter.com/j3LY0Xdzfj— ANI (@ANI) January 26, 2026 -
Republic Day 2026: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (జనవరి 26, సోమవారం) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీని నిఘా నీడలోకి తెచ్చారు. ఉగ్రముప్పు హెరేపు (జనవరి 26, సోమవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలుచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. కర్తవ్య పథ్లో ఏఐ (AI) పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు.ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు.. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను ఉపయోగించనున్నారు. అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.చరిత్రలో తొలిసారిగా..అన్ని సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా పోలీసులు స్మార్ట్ గ్లాసెస్ ధరించి విధుల్లో పాల్గొంటారు. రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, జుట్టు పెంచినా, ముఖంపై గాయాలు ఉన్నా.. పాత, కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. స్మార్ట్ గ్లాసెస్లో ఉండే కెమెరా మొబైల్ యాప్తో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో దాదాపు 65,000 మంది నేరస్తుల డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా నేరస్తుడు కనిపిస్తే ఈ పరికరం వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.థర్మల్ స్కానింగ్:ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వ్యక్తులు దాచుకున్న ఆయుధాలను, అనుమానాస్పద వస్తువులను కూడా గుర్తించవచ్చు. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10 వేల పోలీసులు, 3 వేల పైగా సీసీటీవీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మూడు అంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.కాగా, జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. -
61 వేల ఉద్యోగాలు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా నియామక పత్రాలు
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు (శనివారం) జరిగిన 18వ ‘రోజ్గార్ మేళా’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ నియామక పత్రం కేవలం ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదు.. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఒక ఆహ్వానం. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) కలను సాకారం చేయడానికి, దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి ఇది ఒక సంకల్ప పత్రం వంటిది’ అని ఆయన యువతకు పిలుపునిచ్చారు. #WATCH | PM Narendra Modi distributes appointment letters to more than 61000 youthSource: DD pic.twitter.com/mjnWCBfXpM— ANI (@ANI) January 24, 2026కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రక్షణ రంగంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు పంపిణీ చేసిన నియామక పత్రాల్లో 49,200 హోం మంత్రిత్వ శాఖ, పారామిలటరీ దళాలకు సంబంధించినవే కావడం విశేషం. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. సరిహద్దుల్లోని జీరో లైన్ వద్ద బీఎస్ఎఫ్ మహిళా దళాలు పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే జనవరి 26న కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఆర్పీఎఫ్ పురుషుల దళాలకు ఒక మహిళా అసిస్టెంట్ కమాండెంట్ నాయకత్వం వహించనున్నారు’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, దీనివల్ల భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. జనవరి 24వ తేదీకి ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉందని మోదీ గుర్తుచేశారు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ సభ ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ఆమోదించింది. ఈ పవిత్రమైన రోజున నియామక పత్రాలు అందుకోవడం రాజ్యాంగం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
పలు నగరాల్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావద్దేశం సిద్ధమవుతున్న వేళ అహ్మదాబాద్, నోయిడాలలోని పలు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఆ ప్రాంతాలలో తీవ్రకలకలం రేపింది. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన భద్రత బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు చేపడుతున్నాయి.శుక్రవారం ఉదయం గుజరాత్లోని పలు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లలో పేలుడు పదార్థాలు పెట్టామంటూ ఫోన్లతో పాటు మెయిల్స్ రావడంతో స్కూల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలతో పాటు సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి బాంబ్స్క్వాడ్, డాగ్స్క్వాడ్ బృందాలతో గాలింపులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇదే తరహా బాంబు బెదిరింపు నోయిడాలోని శివనాడర్ పాఠశాలకు వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పిల్లలను వారి ఇండ్లకు తరలించారు. బాంబ్స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని సోదాలు జరుపుతున్నాయి.అయితే గతేడాది ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడుల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అనంతరం జరిపిన విచారణలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. -
ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం
ఢిల్లీ: ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. వర్షం, పొగ మంచు కారణంగా ఢిల్లీలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, గాలివేగం గంటకు 40–60 కిమీ వరకు చేరే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుండి వచ్చే వాతావరణంలో అవంతారాలు(వెస్ట్రన్ డిస్టబెన్స్) కారణంగా ఈ ఆకస్మిక వర్షానికి కారణమని ఐఎండీ స్పషం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షం, మంచు, చలి ఉంటుందని తెలిపింది. హిమాలయ పర్వత రాష్ట్రాలలో భారీ వర్షాలు, మంచు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. జనవరి 27 వరకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. -
చికెన్ ముక్క చిక్కుల్లో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా విమానం ఎక్కారా? అయితే మీ ఆకలిని అణచుకోండి.. లేదంటే ’కోడ్ ఆఫ్ కాండక్ట్’ హెచ్చరిక లేఖ అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న అభిషేక్ చౌదరి అనే ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా సిబ్బంది చుక్కలు చూపించారు. ముందుగా బుక్ చేసుకున్న మీల్ అడిగినందుకు తనను వేధించారంటూ ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబర్ ఫ్రెండ్ ఆకాష్ గుప్తాతో కలిసి దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నాన్వెజ్ భోజనం బుక్ చేసినా.. జనవరి 19న జరిగిన ఈ ప్రయాణంలో అసలు రచ్చ అంతా నాన్ వెజ్ భోజనం దగ్గర మొదలైంది. అభిషేక్ తన తమ్ముడి కోసం ముందుగానే నాన్–వెజ్ భోజనం బుక్ చేసుకున్నాడు. కానీ ఆహారం అందించే సమయానికి.. అది అయిపోయిందని సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే, కనీస మర్యాద లేకుండా ‘నీ టికెట్ చూపించు’అంటూ ఎయిర్ హోస్టెస్ మొరటుగా ప్రవర్తించిందని అభిషేక్ ఆరోపించాడు. పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్ ప్రయాణికుడికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘క్షమాపణ చెప్పాల్సింది పోయి, చాలా దురుసుగా మాట్లాడారు’.. అని ఆ విదేశీ ప్రయాణికుడు కూడా వీడియోలో వాపోయాడు. బెదిరింపులు.. ఆంక్షలు అభిషేక్ ఈ విషయాన్ని సీనియర్ క్రూ మెంబర్ దృష్టికి తీసుకెళ్తే, ఆమె ఇంకా సీరియస్గా ‘నువ్వు నోరు మూసుకో’అని గద్దించిందట. విచిత్రం ఏంటంటే, అభిషేక్ ఈ గొడవను వీడియో తీస్తున్నాడని తెలియగానే, ఫ్లైట్లో లైట్లు డిమ్ చేసేశారట. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక అభిషేక్ దిగకుండా గ్రౌండ్ స్టాఫ్ ఆపేశారు. అతని ఫోన్ లాక్కుని చెక్ చేశారు. ‘జరిగిందేదీ సోషల్ మీడియాలో పెట్టను’.. అని బలవంతంగా రాయించుకున్నారట. పైగా అతను తాగి ఉన్నా డని తప్పుడు ఆరోపణలు చేశారట. చివరగా, పైలట్ సంతకంతో కూడిన ఒక ‘కోడ్ ఆఫ్ కండక్ట్ వార్నింగ్ లెటర్’కూడా చేతిలో పెట్టారు. మొక్కుబడి స్పందన ఈ వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ కమిషనర్గా ‘డాగ్ లవర్’ ఐఏఎస్!
ఢిల్లీ: సంజీవ్ ఖిర్వార్.. సీనియర్ ఐఏఎస్ అధికారి. మూడేళ్ల కిందట తన పెంపుడు కుక్కల వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. నాడు వాటి మార్నింగ్ కోసం ఏకంగా స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారాయన. ఈ ఘటన తర్వాత కేంద్రం ఆయన్ని బదిలీ చేసింది. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ సీన్లోకి వచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న కమిషనర్ అశ్వనీ కుమార్ను జమ్మూ కశ్మీర్కు బదిలీ చేశారు. త్వరలో ఢిల్లీ కార్పొరేషన్ బడ్జెట్ సమర్పణ ఉంది. సరిగ్గా దీని ముందరే.. ఖిర్వార్కు బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. అదే సమయంలో ఆయన డాగ్ లవర్ కావడం ఇక్కడ మరో చర్చకు దారి తీసింది. 1994 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్కి చెందిన ఖిర్వార్.. 2022లో ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులను బయటకు పంపించి, తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించాడనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొందరు అథ్లెట్లు ఆనాడు మీడియా ముందు వాపోయారు కూడా. అయితే తానే తప్పూ చేయలేదని.. తానొక శునక ప్రియుడ్ని అని ఆ టైంలో గర్వంగా ప్రకటించుకున్నారాయన. ప్రస్తుతం వీధి కుక్కల అంశం ఢిల్లీతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు విచారణ సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఖిర్వార్ నేతృత్వంలో కార్పొరేషన్ కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఒక కేసులో సజ్జన్కు విముక్తి
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. జనక్పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సజ్జన్ కుమార్ కారణమని సందేహానికి తావులేని రీతిలో నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. బాధితులు, వారి కుటుంబాల ఆవేదనను తాము అర్థం చేసుకోగలమన్న స్పెషల్ కోర్టు జడ్జి దిగ్ వినయ్ సింగ్..భావోద్వేగాలకు అతీతంగా తీర్పు ఉండాలంటూ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసులో నిందితుడి నేరాన్ని కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ధారించాలి. దురదృష్టవశాత్తూ సాక్షులలో ఎక్కువ మంది విన్న మాటలను చెప్పిన వారు, కనీసం నిందితుడి పేరును చెప్పడంలో విఫలమైన వారు ఉన్నారు’అని జడ్జి పేర్కొన్నారు. ఇటువంటి సాక్షులు నిందితుడిని గుర్తించారన్న అంశంపై ఆధారపడటం ప్రమాదకరం, న్యాయం పక్కదారి పట్టడానికి దారితీయవచ్చునని ఆయన అన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సజ్జన్ కుమార్ ఉన్నాడని లేదా అతడిని అక్కడ ఎవరైనా చూశారని చెప్పడానికి ఎటువంటి నమ్మదగిన సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన గుంపును సజ్జన్ కుమార్ రెచ్చగొట్టినట్లు, ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కుట్ర జరిగినట్లు కూడా ఆధారాలు లేవని 60 పేజీల తీర్పులో తెలిపారు. అందుకే, అతడిని అన్ని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నామని తీర్పు వెలువరించారు. సజ్జన్ కుమార్కు ఇదివరకే ఇటువంటి నేరాలతో ప్రమేయం ఉందన్న వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఒక వ్యక్తి 100 నేరాలలో దోషిగా తేలి ఉండవచ్చు, కానీ 101వ నేరంలో కూడా అతడిని దోషిగా నిర్ధారించాలంటే సందేహానికి తావు లేని బలమైన సాక్ష్యం కచ్చితంగా ఉండాలన్నారు. ఇక్కడ అనుమానాలకు తావుండరాదని తెలిపారు. నిందితుడు సామాన్యుడైనా లేదా పలుకుబడి కలిగిన వ్యక్తయినా చట్టం అందరికీ సమానమేనన్నారు. ‘నిందితుడికి భయపడే పరిస్థితులు తగ్గినప్పటికీ, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన, ఆ ఘటనను స్వయంగా చూసిన సాక్షులు, ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా నిందితుడి పేరును చెప్పడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పడానికి తగిన కారణం ఏదీ కనిపించడం లేదు’అని జడ్జి దిగ్ వినయ్ సింగ్ పేర్కొన్నారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక వేదన అర్థం చేసుకోగలం. కానీ, ఆ వేదన ఈ కోర్టు నిర్ణయానికి అడ్డంకి కాకూడదు. ఈ నిర్ణయం భావోద్వేగాలకు అతీతంగా ఉండాలి’అని ఆయన తెలిపారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడంతో ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. ఢిల్లీలోని జనక్పురి, వికాస్పురి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన అల్లర్లకు అప్పటి ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సజ్జన్ కుమార్ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. వికాస్పురి కేసులో కోర్టు ఇప్పటికీ ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, సరస్వతీ విహార్ ప్రాంతంలో అల్లర్ల సమయంలో జరిగిన హత్యల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు గతేడాది సజ్జన్ కుమార్కు యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో, ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.బాధిత కుటుంబాల తీవ్ర ఆవేదన1984 అల్లర్ల కేసు తీర్పు వెలువడుతుందన్న విషయం తెలిసిన బాధితులు, వారి కుటుంబీకులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు తరలివచ్చారు. సజ్జన్ కుమార్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేనందున, ఆయన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించగా వారంతా షాక్కు గురయ్యారు. ‘దుండగులు నిప్పంటించడంతో మా నాన్న నా కళ్లెదుటే మంటలకు ఆహుతయ్యారు. కోర్టుల చుట్టూ తిరిగా. న్యాయం జరుగుతుందని 42 ఏళ్లపాటు ఎదురు చూశా. దశాబ్దాల తరబడి ఆశతో ఎదురుచూసినా, ఇప్పటికీ న్యాయం అందనంత దూరంలోనే ఉంది’అని నిర్మల్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఢిల్లీ హై అలర్ట్: ఈ ఆరుగురు ఉగ్రవాదులు కనిపిస్తే..
న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.దీనిలో ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. కాగా కర్తవ్య పథ్, న్యూఢిల్లీ జిల్లా అంతటా విస్తృతమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గణతంత్ర వేడుకల భద్రత కోసం సుమారు 10 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ మహాలా తెలిపారు.ఢిల్లీ సరిహద్దులు, జిల్లా చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతా సిబ్బందితో ఇప్పటికే తొమ్మిది రౌండ్ల బ్రీఫింగ్, రిహార్సల్స్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. ఆహ్వానితులు తమ పాస్లపై ఉన్న సూచనలను గమనించి, నిర్దేశిత మెట్రో స్టేషన్లను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్ -
ఢిల్లీలో హై అలర్ట్.. ‘26-26’ ఉగ్రదాడులకు ప్లాన్
ఢిల్లీ: దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో, ఢిల్లీ, కశ్మీర్, బోర్డర్లో భద్రతా బలగాలు హై అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నారు. పాక్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు ప్లాన్ చేసుకున్నారు అని తెలిపాయి. దీంతో, అలర్ట్ అయిన భద్రతా బలగాలు.. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.ఇదే సమయంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. నిందితులు సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. జమ్మూ కశ్మీర్, పంజాబ్, దిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.పోలీసుల మాక్ డ్రిల్స్ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత రద్దీగా ఉండే, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎర్రకోట, ISBT కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలీ, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో ప్రజలు, ఏజెన్సీలు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. -
ఢిల్లీలో వాయు కాలుష్యం అందుకే.. AQMB నివేదిక
ఢిల్లీ వాయుకాలష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాయుకాలుష్యం తీవ్రముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని, నాలుగు వారాల్లో ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రాజధాని నగరంలో గాలి కాలుష్య నివారణకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బోర్డు కీలక ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణమని తెలిపింది. కనుక అధిక కాలుష్యాన్ని కలిగింపజేసే వాహనాలను దశలవారిగా తొలిగించాలని AQMB కోర్టుకు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు విధానాలను సవరించాలని పేర్కొంది. పాత వాహనాలను మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహాకాలు అందించాలని తెలిపింది.అంతేకాకుండా ప్రస్తుతమున్న మెట్రో నెట్వర్క్ను మరింతగా విస్తరించాలని AQMB కోర్టుకు నివేదించింది. అయితే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బోర్డు ప్రతిపాదనలు విన్న కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. -
ఢిల్లీ ప్రజలకు గుడ్న్యూస్
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని వాసులకు వాసులకు ఎయిర్ క్వాలిటీ మెనేజ్మెంట్ శుభవార్త తెలిపింది. అక్కడి వాయికాలుష్య తీవ్రత గతంతో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు పేర్కొంది. దీంతో గ్రేడ్-4 నేపథ్యంలో విధించే కఠిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీ నగరం తీవ్రమైన గాలికాలుష్య సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గాలి నాణ్యత గత ఆదివారం 440కి చేరుకొని అత్యంతప్రమాదర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రేడ్-4కు విధించే కఠిన ఆంక్షలు విధిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉదయం గాలినాణ్యత 378గా నమోదైంది. దీంతో ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇచ్చింది.అయితే గ్రేడ్-4 ఆంక్షల సమయంలో నగరంలో కఠిన ఆంక్షలు ఉంటాయి. నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసరమైతే తప్ప డీజిల్ ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. జనరేటర్లతో నడిచే పరిశ్రమలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సిపారసు చేస్తారు. కాగా సాధారణ సమయంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో శీతాకాలంలో దాని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. -
కమల దళపతిగా నితిన్ నబీన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది. -
Delhi : 5.7 తీవ్రతతో భారీ భూకంపం..
-
6 గంటలకుపైగా విజయ్ను ప్రశ్నించిన సీబీఐ
సాక్షి, చెన్నై: తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 27న 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ను ఇరికించే కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని వెంటనే ముగించి జనాన్ని పంపేయకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేశారని, అందుకే జనం అక్కడే ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్న కోణంలో నేరాభియోగాలు మోపాలని, ఆ చార్జ్షీట్లో విజయ్ పేరును చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. విజయ్తోపాటు అదనపు డీజీపీ, మరో తమిళనాడు సీనియర్ పోలీస్ అధికారి పేర్లనూ చార్జ్షీట్లో చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకధాటిగా ఆరు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు విజయ్ ఢిల్లీ లోథీ రోడ్లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం 10.20 గంటలకువచ్చారు. ర్యాలీని ఏ తరహాలో చేయాలని ప్రణాళిక వేశారు?. షెడ్యూల్ సమయం కంటే చాలా ఆలస్యంగా ఎందుకు ర్యాలీకి రావాల్సి వచ్చింది? జనం విపరీతంగా వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు?. జనం అదుపుతప్పుకున్నారని అర్థమయ్యాక కూడా జనాన్ని కట్టడిచేసే చర్యలను మీ పార్టీ శ్రేణులు ఎందుకు తీసుకోలేదు? వంటి పలు రకాల ప్రశ్నలకు విజయ్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి సమాధానం చెప్పిన విజయ్ మరికొన్నింటికి వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విచారణ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ను నుంచి బయటకు వచ్చి తాను బసచేస్తున్న హోటల్కు వెళ్లిపోయారు. ఈ కేసులో ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ తన తొలి నేరాభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించనుంది. -
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
ప్లీజ్ హెల్ప్ మీ నాన్న… నాకు చావాలని లేదు. నేను నీటితో నిండిన లోయలో పడిపోయాను. నీటిలో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు, నాన్న…”ఈ మాటలు ఆ తండ్రి గుండెను ముక్కలు చేశాయి.ఒక యువకుడి కలలు, ఆశలు, భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.మంచు కమ్ముకున్న రాత్రి, రక్షణా చర్యలు లేని రహదారి, ఊహించని లోయ. ఈ మూడు కలిసి ఓ టెక్కీ జీవితాన్ని క్షణాల్లో ముగించాయి.ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్ మొహతా (27) ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని కారులో తన ఇంటికి బయలు దేరాడు. సరిగ్గా నోయిడా సెక్టార్ 150 వద్ద మంచు విపరీతంగా కురుస్తోంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రమాదం అని తెలిపే సంకేతాలు లేవు. రిటైనింగ్ వాల్ లేదు. సైన్ బోర్డులు లేవు. బారికేడ్లు లేవు. ఇతర రక్షణా చర్యలు లేవు. రిఫ్లక్షన్స్ లేవు. అయినా సరే ఇంటికి సురక్షితంగా వెళ్తున్నామనే ధీమా. సరిగ్గా అలాంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది. ఫలితంగా 70 అడుగుల లోతులో యువరాజ్ కారు పడిపోయింది. ఎదో ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నానని అర్ధం చేసుకున్న యువరాజు.. ప్లీజ్ హెల్ప్ మీ.. ప్లీజ్ సేవ్ మీ అని కేకలు వేశాడు. లాభం లేకపోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరిగిందే అర్ధం కాని పరిస్థితి. వెంటనే ఆ టెకీ తన తండ్రి రాజ్కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు’అని ఆందోళన వ్యక్తం చేశాడు. కొడుకు ఫోన్ కాల్తో హతాశుడైన రాజ్ కుమార్ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాజ్ కుమార్ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. సుమారు ఐదుగంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును అందులో చిక్కుకున్న యువరాజ్ను వెలికి తీశారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఊపిరాడక యువరాజ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణంపై రాజ్కుమార్ మెహతా ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు లేనందు వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనికి మద్దతుగా స్థానికులు సైతం ఆందోళన చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న నోయిడా సెక్టార్ 150 వద్ద వార్నింగ్ బోర్డుల పెట్టాలని,రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆందోళన మరింత ఉదృతం చేశారు. దీంతో పోలీసులు ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
బాంబు బెదిరింపు.. ‘ఇండిగో’ ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రాకు వెళ్తున్న 6ఈ 6650 విమానాన్ని, ముందస్తు జాగ్రత్త చర్యగా దారి మళ్లించారు. విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.ఈ ఘటనపై ఏసీపీ రజనీష్ వర్మ మాట్లాడుతూ, విమానంలోని టాయిలెట్లో ఉన్న ఒక టిష్యూ పేపర్పై బాంబు ఉన్నట్లు రాసి ఉన్న సందేశం దొరికిందన్నారు. సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా లక్నోకు మళ్లించాల్సి వచ్చింది. ఘటనా సమయంలో విమానంలో పైలట్లు, సిబ్బందితో కలిపి మొత్తం 238 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు వార్తతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.విమానం లక్నోలో సురక్షితంగా దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం లక్నో విమానాశ్రయంలో భద్రతా దళాలు విమానాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో అణువణువూ గాలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలలో జీరో విజిబులీటీ నమోదైంది. పొగమంచు తీవ్రంగా ఉండడంతో విమానాలతో పాటు పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు నగరంలో గాలికాలుష్య తీవ్రత సైతం మరోసారి పెరిగింది.దేశరాజధాని నగరంలో గాలికాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం గాలి కాలుష్య స్థాయి 439 పాయింట్ల నుంచి 500 కు చేరుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం గ్రేడ్-4 కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో విమాన రాకపోకల సమయాలు ప్రయాణికులకు వెబ్సైట్లలో చుసుకోవాలని ఇండిగోతో పాటు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి.బేర్లీ, లక్నో, కుశీనగర్ ప్రాంతాలలో జీరో విజిబులిటీ నమోదుకాగా అమృత్ సర్, గోరఖ్పూర్లలో 100మీటర్లు, ప్రయాగ్రాజ్లో 200 మీటర్ల విజిబులిటీ నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. -
భయంగా బతికాం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉది్వగ్న పరిస్థితులు కనిపించాయి. ఇరాన్ నుంచి క్షేమంగా తిరిగివచ్చిన తమ కన్నబిడ్డలను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలతో స్వాగతం పలికారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల కోసం పెద్ద సంఖ్యలో జనం ఎయిర్పోర్టుకు తరలిచ్చారు. ఇరాన్లో కొన్ని రోజులుగా ప్రజల ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండడం, శాంతి భద్రతలు దిగజారుతుండడంతో అక్కడున్న భారతీయులు కమర్షియల్ విమానాల్లో శుక్రవారం అర్ధరాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుంచి తిరిగిరావాలని భారత ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారు లు, పవిత్ర క్షేత్రాల దర్శనానికి వెళ్లిన భక్తులు ఇరాన్లో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారు స్వదేశానికి తిరిగిరావడానికి భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సహకరించాయి. అతిత్వరలో మరికొందరు భారతీయులు ఇరాన్ నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం. వ్యవస్థలు స్తంభించిపోయాయి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత పలువురు తమ భయానక అనుభవాలను వ్యక్తంచేశారు. ఇరాన్లో అక్షరాలా యుద్ధ వాతావరణమే నెలకొందని వెల్లడించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిక్షణం భయంభయంగా బతికామని అన్నారు. అక్కడ పరిస్థితులు నానాటికీ భీకరంగా మారుతున్నాయని, బయటకు వెళితే ప్రాణాలతో తిరగి వస్తామన్న గ్యారంటీ లేదని తెలిపారు. వ్యవస్థలన్నీ దాదాపు స్తంభించిపోయాయని, ఇంటర్నెట్ సేవలను ఆపేశారని, ఫోన్లలో మాట్లాడుకొనే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అక్కడ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తోందని వివరించారు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది ‘‘నెల రోజుల క్రితం ఇరాన్ వెళ్లాం. కానీ, రెండు వారాల క్రితమే సమస్యలు మొదలయ్యాయి. బయటకు వెళితే నిరసనకారులు అడ్డుకొనేవారు. మా వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చేవారుకాదు. చేసేది లేక మా నివాసానికి తిరిగి వచ్చేవాళ్లం. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఎక్కడేం జరుగుతోందో తెలిసేది కాదు. మా క్షేమ సమాచారాలను ఇండియాలోని కుటుంబ సభ్యులకు చేరవేసే అవకాశం కూడా దక్కలేదు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది. అది నిజంగా చాలా కష్టమైన సమయం. మొత్తానికి భారత ఎంబసీ సహకారంతో బయటపడ్డాం’’అని ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు. సొంత ఖర్చుతోనే వచ్చా.. ‘‘నేను ఇరాన్లో షిరాజ్ నగరంలో ఉన్న మెడికల్ కాలేజీలో చదుకుంటున్నా. కానీ, ఇంటర్నెట్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అసలేం జరుగుతోందో తెలిసేదికాదు. భారత ప్రభుత్వ సూచనతో స్వదేశానికి తిరిగివచ్చా. నేను సొంత ఖర్చుతోనే వచ్చా. ప్రభుత్వం మాకోసం ప్రయాణ ఏర్పాట్లు చేయలేదు’’అని ఓ వైద్య విద్యారి్థని తెలియజేశారు. 9 వేల మంది భారతీయులు ఇరాన్ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇరాన్లో ప్రస్తుతం దాదాపు 9 వేల మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ చెప్పారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎవరూ ఇరాన్కు వెళ్లే ప్రయత్నం చేయొద్దని కోరారు. -
Republic Day 2026: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలేంటంటే..
భారత్.. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి ప్రధాన కవాతు థీమ్ వందేమాతరం. 'స్వాతంత్ర్య మంత్రం -వందేమాతరం, శ్రేయస్సు మంత్రం - ఆత్మనిర్భర్ భారత్' అనే ఇతివృత్తం ఆధారంగా కర్తవ్య పథ్లో 30 శకటాలను ప్రదర్శించనున్నారు. ప్రధాన వేదికపై పూలతో వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీకి నివాళులర్పిస్తారు.ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటారు. కవాతులో తొలిసారిగా బాక్ట్రియన్ ఒంటె, కొత్త బెటాలియన్ భైరవ్ కూడా మార్చ్ పాస్ట్ చేయనున్నారు. అయితే ఈసారి ఫ్లైపాస్ట్లో రాఫెల్, ఎస్యూ-30, అపాచీ వంటి 29 విమానాలు ఉన్నాయి. అయితే, ఈసారి తేజస్ యుద్ధ విమానం పరేడ్లో ఉండదు.ఈసారి పరేడ్లో కొత్తగా ఏమున్నాయంటే?👉ఆహ్వాన పత్రికలపై వందేమాతరం 150 ఏళ్ల లోగో ఉంటుంది. పరేడ్ ముగిశాక వందేమాతరం బ్యానర్లతో కూడిన బెలూన్లను గాల్లోకి వదులుతారు👉పాత పద్ధతికి భిన్నంగా వివిఐపీ లేబుళ్లకు బదులుగా, ఎన్క్లోజర్లకు భారతీయ నదుల పేర్లు పెట్టారు👉మొదటిసారిగా ఆర్మీకి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ వింగ్ జంతువులు పాల్గొంటాయి. ఇందులో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు జాస్కరీ గుర్రాలు, నాలుగు వేట పక్షులు, 10 మిలిటరీ డాగ్స్ ఉంటాయి.👉అక్టోబర్ 2025లో ఏర్పాటు చేసిన 'భైరవ లైట్ కమాండో బెటాలియన్' మొదటిసారి పరేడ్లో పాల్గొంటుంది. ఇది ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తుంది.👉జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేదికపై ఎన్క్లోజర్లకు భారతీయ వాయిద్యాల (ఫ్లూట్, డమరుకం, వీణ, తబలా మొదలైనవి) పేర్లు పెట్టనున్నారు👉రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 17, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి 13 శకటాలు ప్రదర్శిస్తారు👉బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ గన్లు, డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది👉సైనికులు యుద్ధ క్షేత్రంలో ఏ విధంగా ముందుకు సాగుతారో అదే తరహాలో (Battle Gear) ధరించి కర్తవ్య పథ్పై మార్చ్ చేస్తారు👉దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారుభైరవ బెటాలియన్ అంటే..ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారతీయ సైన్యపు కొత్త విభాగం. 2025లో సరిహద్దుల రక్షణ కోసం రుద్ర బ్రిగేడ్, దివ్యాస్త్ర బ్యాటరీ, భైరవ బెటాలియన్లను ఏర్పాటు చేశారు. ప్రతి బెటాలియన్లో సుమారు 250 మంది సైనికులు ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి 15 బెటాలియన్లు సిద్ధంగా ఉన్నాయి. వీరిని రాజస్థాన్, జమ్మూ, లడఖ్ మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో మోహరించారు.రిహార్సల్స్ కారణంగా జనవరి 17, 19, 20, 21 తేదీల్లో ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భవన్ (సర్క్యూట్ 1) జనవరి 21 నుండి 29 వరకు ప్రజలను అనుమతించరు. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
-
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
ఇరాన్లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. ఇరాన్లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇరాన్లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. -
సుప్రీం కోర్టులో వర్మకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో.. జస్టిస్ యశ్వంత్వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. గతేడాది మార్చిలో.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా యశ్వంత్ వర్మ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక గదిలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఆపై ఈ అంశంపై దర్యాప్తునకు అంతర్గత త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది. లోక్సభ స్పీకర్ జడ్జెస్ (Inquiry) Act, 1968 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చట్టబద్ధం కాదని వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అయితే.. లోక్సభ సెక్రటేరియట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కమిటీ చట్టబద్ధమేనని కారణాలతో సహా వివరించారు. వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం జనవరి 8వ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ జస్టిస్ వర్మ పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. -
స్పీకర్ కాదన్నారు.. ‘సుప్రీం’ ఏమంటుందో?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి వాళ్ల నుంచి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. శీతాకాల విడిది తర్వాత ఇవాళ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం పిటిషన్ను విచారణ జరపనుంది. ఫిరాయింపుల పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ తరఫు లాయర్లు ఇవాళ్టి విచారణ సందర్భంగా వాదించే అవకాశం ఉంది. -
విమానం ఇంజిన్లో ఇరుక్కున్న లగేజ్ కంటైనర్..!
ఢిల్లీ–న్యూయార్క్ ఎయిర్ ఇండియా AI101 విమానంలో లగేజ్ కంటైనర్.. ఇంజిన్లో ఇరుక్కుపోయింది. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా టాక్సీ(రన్ వే మధ్యలో భూమి మీద సడిచే సమయంలో) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదు కానీ విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది విమానంలో 250 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానం క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూవిమానం సురక్షితంగా గ్రౌండ్ (ఎగరడానికి అనుమతి లేకుండా నిలిపివేయడం)చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. आज दिल्ली एयरपोर्ट पर एयर इंडिया के एयरबस A350 के इंजन में एक बैगेज कंटेनर फंस गया. फ्लाइट दिल्ली से न्यूयॉर्क जा रही थी. #AviationNews pic.twitter.com/LG1dDA6dLM— Versha Singh (@Vershasingh26) January 15, 2026 ఇదీ చదవండి:ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం -
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటింది: ప్రధాని మోదీ
ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్ దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. -
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది. Will Supreme Court allow euthanasia for man in coma for 13 years? Verdict todayIndia allows passive euthanasia ( withdrawing life support) recognising the right to die with dignity while active euthanasia remains illegal Parents of harsh have sought passive euthanasia from… pic.twitter.com/AfTaaQhrzj— Sneha Mordani (@snehamordani) January 15, 2026 -
Harish Rana: హరీష్ భవిష్యత్తుపై దేశం కళ్లన్నీ సుప్రీం వైపే!
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ ఉపసంహరించాలా? కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సుప్రీం లైఫ్ సపోర్ట్ చికిత్స ఉపసంహరణకు ఆమోదిస్తే.. 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసు ఇది అవుతుంది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు.తీర్పును నేటికి (జనవరి16,2026) వాయిదా వేశారు. జనవరి 13న న్యాయమూర్తులు హరీష్ తల్లిదండ్రులను కలుసుకుని వారి వేదనను విన్నారు. ఇవాళ హరీష్ కేసులో తీర్పును వెలువరించనుంది. ఇది దేశంలో పాసివ్ యూతనేషియా చరిత్రలో కీలక మలుపు అవుతుంది. -
పొగమంచు అలర్ట్.. పలు విమానాలు ఆలస్యం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఢిల్లీ-ఎన్సీఆర్లో గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో, విజిబులిటీ తగ్గిపోయింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి నౌకాస్ట్ ఢిల్లీపై రాబోయే రెండు గంటల పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని హెచ్చరించింది. అనేక చోట్ల విజిబులిటీ 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లను కూడా పొగ మంచు ప్రభావితం చేసింది. ఉదయం 7 గంటల తర్వాత పొగమంచు తీవ్రమవుతుందని.. ఇది వాహనాలు, విమానాల రాకపోకలను ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు.#WATCH | Ghazipur, UP: Dense fog engulfs Ghazipur area as cold wave prevails throughout the city. pic.twitter.com/bAS7ST9JBW— ANI (@ANI) January 15, 2026 ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా.. ప్రయాణీకులను అలర్ట్ చేసింది. పొగ మంచు కారణంగా పలు ఎయిర్ ఇండియ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. విమానాల మళ్లింపు, రద్దులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుందని.. ప్రయాణికులు సహకరించాలని కోరింది.#WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from Moti Bagh. pic.twitter.com/Db74gScuYO— ANI (@ANI) January 15, 2026మరోవైపు.. ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో ఈ సీజన్లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత కూడా. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. #WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from Dwarka Sector 16. pic.twitter.com/g4rhHi504A— ANI (@ANI) January 15, 2026 -
గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇది ప్రపంచ స్థాయి పండుగగా మారిందని ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, కె.రామ్మోహన్ నాయుడితోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గోపూజ చేశారు. స్వయంగా పొంగలి వండారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొంగల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని పొంగల్ ఇస్తోందని తెలిపారు. ప్రపంచంలో తమిళులు ఎక్కడున్నా సరే పొంగల్ను ఉత్సాహంగా నిర్వహించుకుంటారని, తమిళ సంస్కృతిని సుసంపన్నం చేసుకోవడంలో వారు ముందుంటారని గుర్తుచేశారు. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్గా మారడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం ‘‘కృతజ్ఞత అనేది కేవలం మాటలకే పరిమితం కావొద్దని, నిత్య జీవితంలో అది అంతర్భాగం కావాలని పొంగల్ మనకు గుర్తుచేస్తుంది. మనం జీవించడానికి ఎన్నో ఇస్తున్న భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. పొంగల్ పండుగలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఇప్పటికీ మనుగడలో ఉన్న ప్రాచీన నాగరికతల్లో తమిళ నాగరికత, సంస్కృతి ఉన్నాయి. ఇది శతాబ్దాల జ్ఞానం, సంప్రదాయాల సమ్మేళనం. చరిత్ర నుంచి పాఠాలను స్వీకరిస్తూ భవిష్యత్తుకు దారిచూపుతున్న మహోన్నత సంస్కృతి ఇది. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం. సాంస్కృతిక మూలాల ద్వారా బలోపేతం అవుతూ మున్ముందుకు సాగుతున్నాం. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సుహృద్భావ బంధం ఉండాలన్న పొంగల్ సందేశాన్ని మనమంతా స్వీకరిద్దాం. భవిష్యత్తు తరాల బాగు కోసం భూమి నిస్సారం కాకుండా రక్షించుకోవడం, జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వనరులను తెలివిగా, పరిమితంగా ఉపయోగించుకోవడం అత్యవసరం. ఇందులో భాగంగానే మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి పథకాలు తీసుకొచ్చాం. ఐక్యత, విశ్వాసం మన బలం. భూమిని గౌరవించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. సందడి చేసిన ‘పరాశక్తి’ టీమ్ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో తమిళ సినీ నటులు కూడా సందడి చేశారు. తమిళ చిత్రం ‘పరాశక్తి’లో నటించిన శివకార్తికేయన్, రవి మోహన్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ పొంగల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పొంగల్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసన కార్యక్రమాల ఆధారంగా పరాశక్తి చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ఇందులో ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు పొంగల్ సందర్భంగా ప్రధాన మోదీ తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రజలకు బుధవారం లేఖ రాశారు. కష్టపడి పనిచేస్తూ మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగే పొంగల్ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యంతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగతో వ్యవసాయం, అన్నదాతలు, గ్రామీణ, జీవితానికి బలమైన అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా కుటుంబాలు కలుస్తుంటాయని, ప్రజలు కష్టసుఖాలు కలబోసుకుంటారని, వారి మధ్య బంధం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఐక్యతా స్ఫూర్తిని పొంగల్ మరింత బలోపేతం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అయిన తమిళం మన దేశంలో ఉన్నందుకు మనం గర్వించాలని మోదీ ఉద్ఘాటించారు. -
Delhi: పొంగల్ వేడుకల్లో ప్రధాని
-
‘ఆ ఇద్దరితో ఎఫైర్.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి’
భారత బాక్సింగ్ దిగ్గజం, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీ కోమ్కు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు. అదే విధంగా.. ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు.మణిపూర్కు చెందిన మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచారు. వ్యక్తిగత విషయానికొస్తే.. కరుంగ్ ఓన్కోలర్ను 2005లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.అయితే, 2023లో తమకు సంప్రదాయం (కోమ్ చట్టాలు) ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయని గతేడాది మేలో మేరీ కోమ్ ప్రకటించింది. అయితే, వీరిద్దరికి కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా IANSతో మాట్లాడిన కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చాడు.జూనియర్ బాక్సర్తో‘‘లోక్ అదాలత్లో నేను తనను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో!. మొదట 2013లో ఓ జూనియర్ బాక్సర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము.వాట్సాప్ మెసేజులు ఉన్నాయి2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. సాక్ష్యంగా వాళ్లిద్దరి వాట్సాప్ మెసేజులు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు ఎవరితో సంబంధం ఉందో నాకు కచ్చితంగా తెలుసు. అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఆమె ఒంటరిగా బతుకుతూ.. అతడితో రిలేషన్షిప్లో ఉండాలనుకుంది.అందుకే విడాకులు తీసుకున్నాం. ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను. ఆధారాలు ఉంటేనే నాపై ఆరోపణలు చేయాలి. పద్దెనెమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు.కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదుఆమె ఓ సెలబ్రిటీ. అయినా సరే నేను ఇప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను. తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది. మేము సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు.అయినా నేను కోర్టుకు వెళ్లను. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తన డబ్బులు దొంగిలించానని.. రూ. 5 కోట్లు కొట్టేశానని అంటోంది. ఒక్కసారి నా అకౌంట్ చూడండి. నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది.నన్ను వాడుకొని వదిలేసిందినన్ను వాడుకొని వదిలేసింది. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ ఇప్పుడు చైర్మన్గా ఎవరు ఉన్నారో చూడండి. ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నా పిల్లలు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె సంపాదిస్తోంది కాబట్టి.. వారి ఫీజులను చెల్లిస్తోంది. కానీ వాళ్లను పెంచింది నేను.హాస్టల్లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు. వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది. నిజానికి వాళ్లు నా రక్తం కూడా. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నేను ఆల్కహాల్ తీసుకుంటానని తను చెబుతోంది. ఆమె కూడా వోడ్కా, రమ్ తాగుతుంది.గుట్కా తింటుంది. అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది’’ అంటూ మేరీ కోమ్పై కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధం ఉందని వార్తలు రాగా.. ఆమె తరఫు లాయర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు.చదవండి: ‘నిశ్చితార్థం చేసుకున్నాం’ -
రాష్ట్రాలకు సుప్రీం కోర్టు హెచ్చరిక
ఢిల్లీ సాక్షి: దేశవ్యాప్తంగా వీదికుక్కల బెడద తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు విధిస్తామని ప్రకటించింది. శునకాలు కరవడం వల్ల పిల్లలు లేదా పెద్దలు ఎటువంటి ప్రమాదానికి గురైనా దాని సంబంధించి రాష్ట్రాలే పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరగడంతో ప్రజలలో రేబీస్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అయితే తాజాగా ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు( మంగళవారం) మరోసారి విచారించింది.ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు "వీధి కుక్కల బెడద నివారణకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకుంటే పెద్దలను, పిల్లలను కుక్కలు కరిస్తే అధిక మెుత్తంలో రాష్ట్రాలు పరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. అదేవిధంగా కుక్కలకు పుడ్ పెట్టేవారు వారి ఇంట్లోని వాటిని పెంచుకొని అక్కడే వాటికి తిండిపెట్టండి". అని జస్టిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జంతు ప్రేమికులము అని చెప్పుకునే సంస్థలు తొమ్మిదేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేసినప్పుడు ఏందుకు బాధ్యత తీసుకోలేదు అని జస్టిస్ ప్రశ్నించారు.అదే విధంగా కుక్కలకు ఆహారం ఇచ్చేవారిపై వేదింపులకు గురవుతున్నాయి అని వచ్చిన పిటిషన్ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతిభద్రతల సమస్యని అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని యనిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కాని వాటిని షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. -
ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు
సాక్షి, ఢిల్లీ: శీతాకాలం చలి గాలులు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీనికి తోడు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో ఢిల్లీలో 13 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైంది.కాగా, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా కంటే ఢిల్లీలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. సిమ్లాలో 9 నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఢిల్లీలో మాత్రం 3 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని రోజులపాటు తీవ్రమైన చలిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Dense Fog engulfs Jammu City, visibility drops to 0 meters.Video Courtesy: @THAKURTAWSEEF pic.twitter.com/lsMwg9JHoN— Kashmir Weather (@Kashmir_Weather) January 13, 2026మరోవైపు.. చలి గాలుల కారణంగా ఉత్తరాదిలో అనేకచోట్ల సున్నా కంటే తక్కువ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటున్నాయి. ప్రతాప్గఢ్ (రాజస్థాన్)లో ఇది మైనస్ 2 డిగ్రీలకు, బాడ్మేడ్లో మైనస్ ఒక డిగ్రీకి పడిపోయింది. అదే రాష్ట్రంలోని పిలానీ (1.2), సీకర్ (1.7), బీకానేర్ (1.9), చురు (2 డిగ్రీల సెల్సియస్) వంటివి వణికిపోతున్నాయి. VIDEO | Thick layer of fog blankets Jammu as bone-chilling cold tightens its grip. The city recorded the coldest day and night temperatures of the season yesterday. Visuals show people huddle around bonfires to keep themselves warm.#WeatherUpdate(Full video available on PTI… pic.twitter.com/HkW3heo9pQ— Press Trust of India (@PTI_News) January 13, 2026 పంజాబ్, హర్యానాల్లోనూ అనేకచోట్ల ఇది సున్నాగా ఉంది. అత్యంత చలి, పొగమంచు వల్ల నోయిడాలోని పాఠశాలలకు ఈ నెల 15 వరకు సెలవులు ప్రకటించారు. కశ్మీర్లో అత్యంత చలికాలం మొదలైంది. శ్రీనగర్లో మైనస్ 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంది. మైనస్ 8.6 డిగ్రీల సెల్సియస్తో లోయలోనే అత్యంత శీతల ప్రాంతంగా శోపియాన్ నిలిచింది. #WATCH | Delhi: Visuals around the Akshardham area as a layer of smog engulfs the national capital. AQI (Air Quality Index) around the area is 405, categorised as 'Severe', as claimed by CPCB (Central Pollution Control Board). pic.twitter.com/qs0600M5pD— ANI (@ANI) January 13, 2026 -
కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా సిప్ చేస్తారా?
పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన ప్రాంతీయ ఆహారాలు లభించకపోతే నిరాశ కలుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ లోటు కనిపించదు. ఎందుకంటే రాజధానిలోని స్టేట్స్ భవన్ ఆ కొరత తీరుస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను అందిస్తోంది.సకల రుచుల సమాగమందేశ రాజధాని ఢిల్లీ అంటే కేవలం రాజకీయాలకే కాదు.. అద్భుతమైన రుచులకు కూడా నిలయం. ముఖ్యంగా చాణక్యపురిలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అతిథి గృహాలు (స్టేట్ భవన్స్), పర్యాటకులకు అద్భుతమైన వివిధ ప్రాంతాల ఆహార రుచులను అందిస్తున్నాయి. ఇక్కడి కాంటీన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన నిపుణులైన వంటగాళ్లు, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాంతీయ వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ లభించే ఆహారాలు.. దేశంలోని ఆహార ప్రియులు ఢిల్లీని సందర్శించినప్పుడు వారి ‘అభిరుచి’ని పరిపూర్ణం చేస్తాయి.ఆంధ్రప్రదేశ్ భవన్: రూ. 200కే వెజ్ థాలీఅశోకా రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోనే అత్యంత ప్రసిద్ధ స్టేట్ భవన్ కాంటీన్. ఇది దశాబ్దాలుగా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు, పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ లభించే అన్లిమిటెడ్ వెజ్ థాలీలో అన్నం, పప్పు, సాంబార్, రసం, కూరలు , పెరుగు కేవలం రూ. 200లకే లభిస్తాయి. నాన్-వెజ్ ప్రియుల కోసం స్పైసీ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ చెట్టినాడ్ వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ సమయంలో లభించే దోశలు ఇక్కడ చాలా ఫేమస్.కర్ణాటక సంఘం-కేరళ హౌస్: పరిపూర్ణతనిచ్చే పాయసంఆర్.కె. పురంలోని కర్ణాటక సంఘంలో లభించే అద్భుతమైన రాగి దోశ, మసాలా దోశ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఆహార ప్రియుల నోరు ఊరిస్తాయి. ఇక్కడ దక్షిణాది సంగీతం వింటూ, ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయవచ్చు. జంతర్ మంతర్ రోడ్డులోని కేరళ హౌస్ ‘సమృద్ధి’ కాంటీన్.. కేరళ సంప్రదాయ ఎర్ర బియ్యం (రెడ్ రైస్), అవియల్ (కొబ్బరితో చేసిన కూరగాయల మిశ్రమం), కేరళ ఫిష్ కర్రీకి పెట్టింది పేరు. ఇక్కడ దొరికే కొబ్బరి పాలు, బియ్యంతో చేసే ‘పాయసం’ ఇక్కడి భోజనానికి పరిపూర్ణతనిస్తాయి.బీహార్ నివాస్- గుజరాత్ భవన్: నెయ్యి వంటకాలు తింటుంటే..బీహార్ నివాస్లోని ‘ది పాట్బెల్లీ’ రెస్టారెంట్ అద్భుతమైన ‘లిట్టీ చోఖా’తో అత్యంత ప్రాచుర్యం పొందింది. మట్టి వాసనతో కూడిన ఈ రుచి ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక కౌటిల్య మార్గ్లోని గుజరాత్ భవన్ తన అద్భుతమైన వెజ్ థాలీతో రుచులూరిస్తుంటుంది. ఇందులో ఖిచ్డీ, కఢీ, ధోక్లా, తెప్లా,నెయ్యితో చేసిన వంటకాలు గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తీపి, వగరు రుచుల కలయికతో ఇక్కడి భోజనం ఇంటి వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.మహారాష్ట్ర సదన్- బెంగాలీ రుచులు: ‘బిజోలి గ్రిల్’ ఒక్కసారి తింటే..ఇండియా గేట్ సమీపంలోని మహారాష్ట్ర సదన్ పరిపూర్ణ రెస్టారెంట్ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించే మిసల్ పావ్, సాబుదానా ఖిచ్డీ, మహారాష్ట్ర థాలీలోని జుంకా (శనగపిండి వంటకం) చాలా అద్భుతంగా ఉంటాయి. తూర్పు భారత్ రుచుల కోసం బంగా భవన్లోని ‘బిజోలి గ్రిల్’ ఉత్తమమైనది. బెంగాలీ సంప్రదాయ చేపల వంటకాలు, ముఖ్యంగా ఆవాల ఘాటుతో కూడిన 'షోర్షే హిల్సా', స్టీమ్డ్ ఫిష్ (భాపా హిల్సా), కోషా మాంగ్షో (మటన్ కర్రీ) ఇక్కడి సిగ్నేచర్ వంటకాలుగా చెబుతుంటారు.ఒడిశా నివాస్- అస్సాం భవన్: రొయ్యల వేపుడు ఫేమస్ఒడిశా నివాస్లో లభించే ప్రత్యేకమైన ‘ప్రాన్ కాషా మసాలా’ (రొయ్యల వేపుడు), ఆవాలతో చేసే చేపల కూర అద్భుత సీ ఫుడ్ రుచులను అందిస్తాయి. ఇక్కడి ఛేనా పోడా (జున్ను స్వీట్) అస్సలు మిస్ కాకూడదు. అస్సాం భవన్ విషయానికొస్తే ఇక్కడ ఆవనూనె ఘుమఘుమలతో కూడిన అస్సామీ ఫిష్ కర్రీ, లూచీ, అచ్చమైన అస్సామీ చాయ్ లభిస్తాయి. ఇక్కడి వంటకాలు తక్కువ మసాలాలతో, సహజ సిద్ధమైన రుచులతో ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.లడఖ్-కశ్మీర్: సాల్టీ టీతో కొత్త అనుభూతిచలికాలంలో లడఖ్ భవన్లో లభించే వేడివేడి తుక్పా (నూడిల్ సూప్), మోమోలు, దెన్తుక్ (హ్యాండ్ పుల్డ్ నూడిల్స్)లను తినకుండా ఎవరూ ఉండలేరు. ఇక్కడి బట్టర్ టీ (సాల్టీ టీ) ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. జమ్ముకశ్మీర్ భవన్లో లభించే రాజరికపు వంటకాలైన రోగన్ జోష్ (మటన్), యఖ్ని (మీట్ బ్రోత్), దమ్ ఆలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. కశ్మీరీ సంప్రదాయ వంటకాల్లోని అద్భుత రుచులు ఇక్కడ కనిపిస్తాయి.ఇది కూడా చదవండి: 8 నెలల్లో 834 బాల గర్భిణులు.. షాకింగ్ నిజాలివే.. -
ఆయుశ్ బదోనికి తొలి పిలుపు
న్యూఢిల్లీ: భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో జరిగే తర్వాతి రెండు వన్డేలకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో సుందర్ తప్పుకోవాల్సి వచ్చింది. ‘తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో సుందర్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అతడికి పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రతను బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ ప్రకటించింది. కివీస్ ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో 27 పరుగులిచి్చన అనంతరం మైదానం నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సుందర్ మళ్లీ ఫీల్డింగ్ కోసం రాలేదు. అయితే ఛేదనలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చి రాహుల్కు చివరి వరకు అండగా నిలిచాడు. సుందర్ స్థానంలో ఢిల్లీ ఆటగాడు ఆయుశ్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు. బదోనికి టీమిండియాలో చోటు దక్కడం ఇదే మొదటి సారి. బుధవారం జరిగే రెండో వన్డే వేదిక రాజ్కోట్లో అతను భారత బృందంతో చేరతాడు. టీమిండియాకు ఆయుశ్ ఎంపిక కావడం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ టీమ్ను బలహీనంగా మార్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భతో ఢిల్లీ ఆడనుండగా ...ఈ మ్యాచ్కు బదోని దూరమయ్యాడు. ఐపీఎల్తో గుర్తింపు... 26 ఏళ్ల బదోని ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటర్. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అతనికి మంచి గుర్తింపు లభించింది. దేశవాళీ క్రికెట్లో అతను ఢిల్లీకి కెపె్టన్గా కూడా వ్యవహరించాడు. గత 12 ఏళ్లుగా బదోని బౌలింగ్లో ఎంతో మెరుగయ్యాడని ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ వెల్లడించాడు. కెరీర్లో 27 లిస్ట్–ఎ మ్యాచ్లలో అతను 36.47 సగటుతో 693 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 29.72 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన 4 సీజన్లలో కలిపి 56 మ్యాచ్లలో 138.56 స్ట్రయిక్ రేట్తో 963 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాడు. -
ఏడాదిలో రూ.1,250 కోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1,250 కోట్ల డబ్బును అమాయకుల నుంచి దోచుకున్నారు. తాజాగా, ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఏకంగా రూ.15 కోట్ల వరకు దోచుకోవడం తెల్సిందే. చైనా హ్యాండ్లర్ ఆదేశాల మేరకు కాంబోడియా, వియత్నాం, లావోస్లు కేంద్రంగా పనిచేస్తున్న నేరగాళ్లు 2024లో ఢిల్లీ వాసుల నుంచి రూ1,100 కోట్ల మేర కొల్లగొట్టారు. 2025కు వచ్చే సరికి ఈ మొత్తం రూ.1,200 కోట్లకు పెరిగిందని ఓ అధికారి తెలిపారు. అయితే, 2024లో రికవరీ 10 శాతం మాత్రమే ఉండగా, 2025కు వచ్చే సరికి ఇది 24 శాతానికి పెరగడం కాస్తంత ఊరట కల్గించే విషయమన్నారు. మోసం విషయం తెల్సిన వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని ఆయన కోరారు. -
అప్డేట్స్: కొనసాగుతున్న విజయ్ సీబీఐ విచారణ
అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీబీఐ విచారణ కొనసాగుతోంది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ర్యాలీ అనుమతులు, టైమింగ్, విజయ్ హాజరైన టైం.. ఆ టైంలో ఏం జరిగింది?.. నిర్వహణలో లోపాలు తదితర అంశాలపై ఆయన నుంచి వివరాలు రాబడుతన్నట్లు సమాచారం. విజయ్ సీబీఐ విచారణ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్ట్ కావొచ్చంటూ నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే విచారణకు విజయ్ పూర్తిగా సహకరిస్తారని.. అలాంటిదేం ఉండకపోవచ్చని టీవీకే కీలక నేతలు అంటున్నారు. మరోవైపు ఢిల్లీ సీబీఐ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను విషాదాన్ని మిగిల్చింది. అదే సమయంలో ర్యాలీ నిర్వహణలో టీవీకే విఫలం కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ ఎన్నికల ర్యాలీ వాహనాన్ని సీబీఐ సీజ్ చేసింది. పలువురు నేతలను సైతం ప్రశ్నించింది. ఇక సీబీఐ విచారణను చెన్నైలో కాకుండా ఢిల్లీలో నిర్వహించడంపై రాజకీయ పరమైన చర్చ నడుస్తోంది. ప్రత్యేక విమానంలో ఈ ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లారాయన. ఆయన వెంట పార్టీ కీలక నేతలు కొందరు ఉన్నారు. సీబీఐ దర్యాప్తు దరిమిలా విజయ్ నల్ల దుస్తులతో రావడంతో.. నిరసనకు ప్రతీక అనే అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి: అటు సెన్సార్బోర్డు.. ఇటు సీబీఐ! -
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఘరానా మోసం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వృద్ధ దంపతులు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.14.85 కోట్లు దోచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకు వచి్చంది. 81 ఏళ్ల ఓం తనేజా, ఆయన భార్య, డాక్టర్ అయిన 77 ఏళ్ల ఇందిర దశాబ్దాల పాటు అమెరికాలో పనిచేశారు. భారత్కు తిరిగి వచ్చి 2016 నుంచి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పిల్లలు విదేశాల్లోనే స్థిరపడ్డారు. దంపతుల పరిస్థితిని, ఒంటరితనం, వయస్సు, ఆరోగ్య సమస్యలను ముందే తెలుసుకున్న నిందితులు వారిని బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు దోచుకోవాలని పథకం పన్నారు. డిసెంబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినంటూ ఒక వ్యక్తి తనేజాకు కాల్ చేశాడు. వారి ఇంటినుంచి అశ్లీల కాల్స్ వెళ్లాయని, 26 మంది తనకు ఫిర్యాదు చేశారని చెప్పాడు. దంపతులు మనీలాండరింగ్కు పాల్పడ్డారని, మహారాష్ట్రలో ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరించాడు. కేసును మొబై పోలీసులకు బదిలీ చేస్తున్నామని చెప్పి.. అనంతరం కాల్ను వీడియో కాల్ మోడ్లోకి మార్చాడు. పోలీసు యూనిఫాంలో ఉన్న విక్రాంత్సింగ్ రాజ్పుత్ అనే వ్యక్తి లైవ్లోకి వచ్చాడు. వృద్ధులు రూ.500 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడ్డారని బెదిరించాడు. వెంటనే ముంబైకి రావాలని హెచ్చరించాడు. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తాము రాలేమని చెప్పడంతో.. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పాడు. డిసెంబర్ 24 నుంచి జనవరి 9 వరకు వీడియో కాల్ ఆన్లోనే ఉంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చివరికి అమెరికాలో ఉన్న వారి పిల్లలకు కూడా చెప్పవద్దని హెచ్చరించాడు. డబ్బులు బదిలీ చేయాలని తనేజా దంపతులను డిమాండ్ చేశాడు. మొత్తం మీద, వారినుంచి రూ.14.85 కోట్లు తీసుకున్నారు. ఇదంతా ఆర్బీఐ నుంచి వాపస్ వస్తుందని నమ్మబలికారు. వారి వెరిఫికేషన్ 97 శాతం పూర్తయిందని చెప్పి జనవరి 8న మరో రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. జనవరి 9న కాల్స్ ఆగిపోవడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. -
చలికి వణుకుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 13 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయనగర్లో 2.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ శీతాకాలంలో ఢిల్లీలో చలిగాలులు వీచడం ఇదే తొలిసారని, 2013 తర్వాత ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతని ఐఎండీ వెల్లడించింది. 2013 జనవరి 7న పాలెంలో 2.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 1967 జనవరి 11న పాలెంలో 2.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఆల్టైమ్ రికార్డ్. ఆదివారం నగరంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత శీతల గాలులు వీచాయి. రిడ్జ్ స్టేషన్లో 3.7 డిగ్రీలు, లోధిరోడ్లో 4.6 డిగ్రీలు, ఢిల్లీ ప్రధాన వాతావరణ కేంద్రం ఉన్న సఫ్దర్గంజ్లో ఉష్ణోగ్రత 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధానిలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. -
అప్పుడు భర్త హత్య .. ఇప్పుడు భార్యను కాల్చి చంపేశారు!
ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న షాలిమార్ బాగ్లో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్యను కూడా హత్య చేశారు దుండగులు. శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్లో రేంజ్లో గన్ గురిపెట్టి కాల్చి చంపేశారు. రచనా యాదవ్.. ఆమెకు 44 ఏళ్లు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె భర్త విజేంద్ర యాదవ్ను కోల్పోయింది. 2023లో విజేంద్ర యాదవ్ను కొంతమంది హత్య చేశారు. ప్రస్తుతం ఆ కేసు అండర్ ట్రయల్లో ఉంది. ఆ కేసులో భార్య రచనా యాదవ్నే కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కూడా గుర్తుతెలియని పలువురు గన్తో కాల్చి హత్య చేశారు. అయితే భర్తను హత్య చేసిన నిందితులే.. ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె షాలిమార్ బాగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్డబ్యూఏ)కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమెను తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విజేంద్ర యాదవ్ కేసులో ఐదుగురు నిందితులురచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. భరత్ యాదవ్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న క్రమంలో భార్య రచనా యాదవ్ను కూడా హత్య చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను అప్పుడు హత్య చేసిన వారే ఇప్పుడు భార్యను కూడా అడ్డులేకుండా తొలగించుకోవాలని చూశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ యాదవ్.. ఇంకా పరారీలో ఉన్నాడు. భరత్ యాదవ్ అనే వ్యక్తి ప్రకటిత నేరస్థుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
అరియానా ఆఫ్గన్ విమాన ప్రమాదం: ఆ ఒక్క పొరపాటుతో..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 2025 నవంబర్ 23న జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కాబూల్ నుండి ఢిల్లీకి వస్తున్న అరియానా ఆఫ్గన్ ఎయిర్లైన్స్ విమానం (ఏఎప్జీ311), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచించిన రన్వే 29ఎల్ కు బదులుగా పొరపాటున రన్వే 29ఆర్పై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మరొక విమానం అదే రన్వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఏఏఐబీ.. విమానంలోని పైలట్-ఇన్-కమాండ్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరికీ చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా అర్హతలు కలిగి ఉన్నారని పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని నావిగేషన్ వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ల్యాండింగ్కు కేవలం నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 'ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్' (ఐఎల్ఎస్)సిగ్నల్ కోల్పోయామని, వాతావరణం సరిగా లేకపోవడంతో రెండు సమాంతర రన్వేల మధ్య తేడాను గుర్తించలేక పొరపాటు పడ్డామని విమాన సిబ్బంది విచారణలో వెల్లడించారు.ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలోని రన్వే 29ఎల్, 29ఆర్ మధ్య కేవలం 360 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. డీజీసీఏ (డీజీఏసీ) నిబంధనల ప్రకారం వీటిని ఒకేసారి ల్యాండింగ్ కోసం వాడకూడదు. ఘటన సమయంలో రన్వే 29ఆర్ పై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా, అఫ్గాన్ విమానం అదేచోట ల్యాండ్ అయింది. ఆ సమయంలో ఆ రన్వేకు సంబంధించిన అప్రోచ్ లైట్లు, ఐఎల్ఎస్ వ్యవస్థలు కూడా ఆపివేసి ఉన్నాయి. విచారణలో భాగంగా డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్)ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, విమానం తదుపరి ప్రయాణం సాగించడంతో కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లోని పాత డేటా పోయిందని అధికారులు గుర్తించారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏఏఐబీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కీలక భద్రతా సిఫార్సులను చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని ఏటీసీ టవర్లలో వీడియో, ఆడియో రికార్డింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. కంట్రోలర్లు విధుల్లో ఉన్నప్పుడు వారి సంభాషణలు, కదలికలను రికార్డ్ చేయడం వల్ల ప్రమాదాల విచారణలో ఖచ్చితత్వం పెరుగుతుందని ఏఏఐబీ అభిప్రాయపడింది. అయితే ఈ రికార్డింగులను కేవలం విచారణ అవసరాల కోసమే తప్ప, సిబ్బందిని ఇబ్బందిపెట్టడానికి వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నది.ఇది కూడా చదవండి: పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ -
సెపక్టక్రా బంగారు పతకాలు వీరికే
ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026లో ఘోగ్లా బీచ్లో సెపక్టక్రా ఫైనల్స్లో హర్యానా మహిళల జట్టు, ఢిల్లీ పురుషుల జట్టు విజయం సాధించాయి. దీంతో బిహార్ బంగారు పతకం గెలిచే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ క్రీడా సమాఖ్యల సాంకేతిక పర్యవేక్షణలో.. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా & నగర్ హవేలీ, దమన్ & డయూ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వాలీబాల్, సాకర్, సెపక్టక్రా, కబడ్డీ, పెంచక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, మల్లఖంబ్ మరియు టగ్ ఆఫ్ వార్ అనే ఎనిమిది క్రీడల్లో 1100కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొదటి ఆరు క్రీడలు పతకాల కోసం నిర్వహించబడుతుండగా, మొత్తం 32 బంగారు పతకాలు అందుబాటులో ఉన్నాయి.మహిళల సెపక్టక్రా ఫైనల్లో తొలి రెగును కోల్పోయిన తర్వాత హర్యానా జట్టు గట్టిగా తిరిగి వచ్చి బిహార్పై 2-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గంట 15 నిమిషాల పాటు సాగింది. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు బిహార్పై 2-0తో నేరుగా విజయం సాధించింది.బీచ్ సాకర్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఒడిశా, డెబ్యూ జట్టు హిమాచల్ ప్రదేశ్పై 7-0తో ఆధిపత్య విజయాన్ని నమోదు చేసి మహిళల ఫైనల్కు చేరుకుంది. స్రిజనా తమాంగ్, సత్యబతి ఖడియా, ఖుండోంగ్బామ్ అంబాలికా తలా రెండు గోల్స్ చొప్పున సాధించారు.రెండో మహిళల సెమీఫైనల్లో తొలి క్వార్టర్లోనే నాలుగు గోల్స్ చేసిన గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్పై 6-3తో విజయం సాధించింది. ఓడిన జట్టుకు కెప్టెన్ జియానీ రామ్చింగ్ మారా మూడు క్వార్టర్లలో ఒక్కో గోల్ సాధించినప్పటికీ ఇతరుల నుంచి సరైన మద్దతు లభించలేదు.బీచ్ వాలీబాల్లో తమిళనాడు పురుషులు మరియు మహిళలు రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలు గెలుచుకునే అవకాశం పొందారు. మహిళల సెమీఫైనల్లో దీపికా, పవిత్ర జంట తొలి సెట్ కోల్పోయిన తర్వాత స్వాతి, ధర్షిణిపై 19-21, 21-12, 15-6తో విజయం సాధించి ఫైనల్లో పుదుచ్చేరి జంట రేవతి, శ్వేతతో తలపడనుంది. పురుషుల ఫైనల్లో తమిళనాడు జంట భారత్, రాజేష్ గోవా జంట సావన్, గౌన్స్తో తలపడనుంది.ఫలితాలుబీచ్ సాకర్ (సెమీఫైనల్స్)మహిళలు: గుజరాత్ 6-3 అరుణాచల్ ప్రదేశ్ను ఓడించింది; ఒడిశా 7-0 హిమాచల్ ప్రదేశ్ను ఓడించిందిబీచ్ సెపక్టక్రామహిళలు: బంగారం – హర్యానా; రజతం – బిహార్; కాంస్యం – ఉత్తర ప్రదేశ్, మణిపూర్పురుషులు: బంగారం – ఢిల్లీ; రజతం – బిహార్; కాంస్యం – మణిపూర్, దాద్రా & నగర్ హవేలీ మరియు దమన్ & దియుబీచ్ వాలీబాల్ (సెమీఫైనల్స్)మహిళలు: దీపికా/పవిత్ర (టీఎన్) 19-21, 21-12, 15-6తో స్వాతి/ధర్షిణి (టీఎన్)పై విజయం; రేవతి/శ్వేత (పుదుచ్చేరి) 21-10, 21-18తో మనసా/మౌనిక (ఆంధ్రప్రదేశ్)పై విజయంపురుషులు: సావన్/గౌన్స్ (గోవా) 21-18, 16-21, 15-12తో పూన్తమిళన్/అభిథన్ (టీఎన్)పై విజయం; భారత్/రాజేష్ (టీఎన్) 21-13, 19-21, 15-8తో రామకృష్ణ దవాస్కర్/నితిన్ సావంత్ (గోవా)పై విజయం -
చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి గడ్డకట్టిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో ఈ సీజన్లోనే శనివారం అత్యంత చలి రోజుగా నమోదైంది. తీవ్రమైన చలి గాలుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.6 నుండి 3.0 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీల మధ్య ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మంచు దుప్పటిలో విమానాశ్రయం తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) వద్ద శనివారం ఉదయం దృశ్యమానత (Visibility) కేవలం 200 మీటర్లకు పడిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో విమానాశ్రయంలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారత దేశమంతటా ఈ వారం పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో కూడా తీవ్రమైన చలి పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. #WATCH | Delhi | People take refuge in night shelter homes as cold wave continues to grip the national capital.(Visuals from night shelter home in Lodhi Road area) pic.twitter.com/EpMxTWUuxf— ANI (@ANI) January 9, 2026ఊపిరి సలపని వాయుకాలుష్యం గత డిసెంబర్ నెలలో 5.6, 5.7 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలే ఇప్పటివరకు కనిష్టంగా ఉండగా, తాజాగా నమోదైన ఉష్ణోగ్రతలు వాటిని అధిగమించాయి. ఒకవైపు చలి పులి వణికిస్తుంటే, మరోవైపు వాయు కాలుష్యం ఢిల్లీ ప్రజలకు ఊపిరి సలపనివ్వడం లేదు. శనివారం నాటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 361గా నమోదై ‘చాలా అధ్వాన్నం’ (Very Poor) విభాగంలో కొనసాగుతోంది. ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతంలో ఏక్యూఐ 426కు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ‘అత్యంత తీవ్రం’ (Severe) గా మారింది. ఆనంద్ విహార్, వివేక్ విహార్, ద్వారక, సిరిఫోర్ట్ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఢిల్లీలోని మొత్తం 39 మానిటరింగ్ స్టేషన్లలో 33 చోట్ల గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.కాలుష్య కారకాలివే..ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి గల కారణాలను పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) విశ్లేషించింది. ఆ గణాంకాల ప్రకారం నగర కాలుష్యంలో 16.9 శాతం వాటా వాహనాల ఉద్గారాలదేనని తేలింది. దీని తర్వాత ఢిల్లీ పరిసరాల్లోని పరిశ్రమల ద్వారా 13.1 శాతం, గృహాల నుండి వచ్చే ఉద్గారాల వల్ల 4.3 శాతం కాలుష్యం చేరుతోంది. వీటితో పాటు వ్యర్థాల దహనం (1.6%), నిర్మాణ పనులు (2.1%), రోడ్లపై దుమ్ము (1.1%) కూడా గాలి నాణ్యత క్షీణించడానికి కారణమవుతున్నాయి.ఇది కూడా చదవండి: విద్యుత్ విప్లవం: వేలాడే వైర్లు.. భయపెట్టే ట్రాన్స్మీటర్లు కనుమరుగు -
‘దర్యాప్తు జరగాల్సిందే.. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదు’
సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని గంపగుత్తగా ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.అలాగే, ప్రతివాదులను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లపై, పెండింగ్లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధక చట్టం కింద పలువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
Delhi: ఢిల్లీపై చలి పంజా.. కనిష్టానికి ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శీతల గాలుల తీవ్రత మరింతగా పెరగడంతో చలి తన పంజా విసురుతోంది. ఈరోజు (గురువారం) ఉదయం నగరంలో ఈ సీజన్లోనే అత్యల్పంగా ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.1 డిగ్రీలు తక్కువ. హిమాలయ ప్రాంతాల నుండి వీస్తున్న అతి శీతల గాలుల వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ముందు డిసెంబర్ 20న 6.1 డిగ్రీలుగా నమోదయ్యింది. డిసెంబరు 31న 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తీవ్రమైన చలి వాతావరణం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వారం అంతటా ఇదే స్థాయి చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. శుక్రవారం నుండి గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, జనవరి 14 వరకు ఉదయం పూట పొగమంచు ప్రభావం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది.ఇటివంటి పరిస్థుతుల్లో ఢిల్లీవాసులకు వాయు కాలుష్యం నుండి కొంత ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం 336గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)గురువారం ఉదయానికి 276కి చేరి మెరుగుపడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం 201-300 మధ్య ఏక్యూఐAQI ఉంటే దానిని ‘పూర్’ స్థాయిగా పరిగణిస్తారు. కాగా రానున్న రెండు రోజుల్లో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోనే కాకుండా జైపూర్, త్రిపుర, లక్నో, మీరట్ తదితర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి గాలుల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం వేళల్లో ప్రయాణించే వారు పొగమంచు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘తుర్క్మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు -
‘తుర్క్మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.ఈ కేసుకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎంపీ మోహిబుల్లా నద్వీకి దర్యాప్తులో పాల్గొనాలంటూ పోలీసులు నోటీసులు పంపనున్నారు. హింస జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ఘర్షణ వెనుక ఆయన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్మన్ గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎంసీడీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున చర్యలు చేపట్టారు. అయితే మసీదును కూల్చివేస్తున్నారనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో, వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, భాష్పవాయువును ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సోలీసు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘మిఠాయిల రాజధాని’ ఎక్కడ?.. ఏ స్వీట్కు ఐజీ ట్యాగ్? -
Republic Day 2026: ఉగ్ర ముప్పు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు
జనవరి వచ్చిందంటే చాలు.. అందరికి ఢిల్లీలో 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి జరిగే వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎర్రకోట సమీపంలో ఇటీవలే కారు బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఉగ్ర ఘటన మరువకముందే జరుగుతున్న గణతంత్ర దినోత్సవాలు ఇవే కావడంతో అందరి దృష్టి ఈ వేడుకలపైనే నిలిచింది.70 వేల మంది భద్రతా బలగాలుఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అప్రమత్తత మధ్య నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులతో పాటు సుమారు 70 వేల మంది భద్రతా బలగాలను మోహరించి, నగరాన్ని భారీ భద్రతా వలయంగా మార్చారు. వేడుకలు జరిగే కర్తవ్య పథ్ పరిసరాల్లో వేల సంఖ్యలో ఏఐ (ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, గగనతలంలో డ్రోన్లు, పారా గ్లైడర్లపై పూర్తి నిషేధం విధించి ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. ఇంతటి భారీ భద్రతా ఆంక్షల నడుమ ‘నారీ శక్తి’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఇతివృత్తాలతో భారత సైనిక పటిమను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు.77వ గణతంత్ర దినోత్సవాల ప్రత్యేకత2026, జనవరి 26న భారత 77వ గణతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరగనున్నాయి. 1950లో బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో మన సొంత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారు. ఇది భారతీయ పౌరులందరి ప్రజాస్వామ్య హక్కులను గౌరవించే ఒక ప్రముఖ సందర్భంగా నిలుస్తుంది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక రాజ్యంగా భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.పూర్ణ స్వరాజ్ నుండి రాజ్యాంగం అమలు వరకు..బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత, దేశానికి ఒక బలమైన చట్టం అవసరమని గుర్తించిన నాటి నేతలు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన ‘పూర్ణ స్వరాజ్’ జ్ఞాపకార్థం, 1950లో అదే రోజున రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగ గ్రంథం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దింది.2026 ప్రత్యేక ఇతివృత్తంఈ ఏడాది గణతంత్ర వేడుకల ప్రధాన ఇతివృత్తం ‘గ్రీన్ గ్రోత్ అండ్ డిజిటల్ ఇండియా’. పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్థిక అభివృద్ధి, దేశంలోని నలు మూలలకూ సాంకేతికతను చేరవేయడమే లక్ష్యంగా ఈ థీమ్ను ఎంచుకున్నారు. భారతదేశం ఇప్పుడు కేవలం వ్యవసాయ దేశం మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాలలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందనేలా ఈ ఏడాది శకటాలు, ప్రదర్శనలు ఉండనున్నాయి.సైనిక గర్జన.. సాంస్కృతిక వైభవంఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట వరకు సాగే రిపబ్లిక్ డే పరేడ్ కనువిందు చేయనుంది. భారత సైన్యం.. తమ వద్దనున్న అత్యాధునిక క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, విమాన విన్యాసాలతో దేశ రక్షణ కవచం ఎంత దృఢంగా ఉందో ప్రదర్శించనుంది. అలాగే వివిధ రాష్ట్రాల కళారూపాలను ప్రదర్శించే శకటాలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పనున్నాయి. ఈ పరేడ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది తరలిరానున్నారు.ముఖ్య అతిథి- దౌత్య సంబంధాలుసంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా గణతంత్ర ఉత్సవాలకు ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026, జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా హాజరుకునున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ అధికారికంగా భారతదేశ ఆహ్వానాన్ని అంగీకరించిందని సమాచారం. ఇది భారత్-ఈయూల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది.మహిళా శక్తికి నీరాజనంఘనమైన భారత గణతంత్ర చరిత్ర కేవలం పురుషులతోనే కాదు, వీరవనితల త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యం, సరోజినీ నాయుడు వాగ్దాటి, అరుణా అసఫ్ అలీ పోరాట పటిమలను ఈ వేడుకల సందర్భంగా గుర్తుచేసుకోనున్నారు. రాజ్యాంగ రూపకల్పనలో, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను ప్రస్తుత తరానికి వివరించేలా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు రూపొందించారు.‘వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా..కేవలం ఢిల్లీలోనే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడనున్నాయి. చిన్నారులకు, యువతకు భారత రాజ్యాంగ విలువలను వివరిస్తూ, జనవరి 26న వివిధ పాఠశాలలు, కళాశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మితమైన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు ప్రతి పౌరుడు అడుగులు వేయాలనే సందేశాన్ని ఈ గణతంత్ర వేడుకలు మనకు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సింగపూర్లో లాలూ మనుమడు.. వృత్తి తెలిస్తే షాక్! -
ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
న్యూఢిల్లీ: వదంతులు షికార్లు చేయడంతో భూముల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కాస్తా హఠాత్తుగా మసీదు కూల్చివేత రంగు పులుముకుని ఢిల్లీలోని రామ్లీలా మైదాన సమీప ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఫయీజ్ ఇలాహీ మసీదులోని ఆక్రమణలను తొలగించేందుకు మంగళవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికా రులు, పోలీసులుపైకి స్థానికులు రాళ్లు, ఇటుకలు, గాజుసీసాలను రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టే ప్రయత్నంచేశారు. రాళ్లు, గ్లాస్ బాటిళ్లను రువ్విన ఘటనలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఘటనకు కారకులైన మైనర్సహా ఐదుగురిని పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. రామ్లీలా మైదాన్ సమీపంలోని ఫయీజ్ ఇలాహీ మసీదు, తుర్క్మన్ గేటు సమీప స్మశానవాటిక దగ్గర్లోని భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆక్రమణలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగడంతో చివరకు అది ఉద్రిక్తతలకు దారితీసింది. ఆక్రమణల తొలగింపులో భాగంగా అక్కడి మసీదును నేలకూలుస్తున్నారని ఒక ఆకతాయి పెట్టిన సోషల్మీడియా పోస్ట్తో పుట్టగొడుగుల్లా పుకార్లు పుట్టుకొచ్చి చివరకు ఘర్షణకు దారితీసింది. ఢిల్లీ సెంట్రల్ పోలీస్ కమీషనరేట్కు సంబంధించిన ఈ స్థలంలో అక్రమంగా వెలసిన డయాగ్నస్టిక్ సెంటర్, ఫంక్షన్ హాల్ను తొలగించామని అక్కడి మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వివేక్ స్పష్టంచేశారు. తప్పుడు వీడియోతో అలజడిఅక్రమ కట్టడాలను కూల్చేందుకు కూలిన భవన శిథిలాలు, చెత్తను తొలగించేందుకు 30 బుల్డోజర్లు, 50 డంపింగ్ ట్రక్కులను తీసుకురావడంతో స్థానికులు ఇదంతా చూసి గుమిగూడారు. 300 మంది పౌరకార్మికులను శిథిలాలను తొలగించేందుకు అధికారులు వెంట తీసుకొచ్చారు. స్థానికులు సమీపంలోకి రాకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. మంగళవారం అర్ధరాత్రిదాటాక ఆక్రమించిన స్థలంలోని వాణిజ్యసముదాయాలను కూల్చేస్తున్న వీడియోను ఒక వ్యక్తి వీడియో తీసి ‘‘మసీదును కూల్చేస్తున్నారు. అందరూ వెంటనే ఇళ్ల నుంచి బయటికొచ్చి ఉద్య మాన్ని ఉధృతం చేయండి’’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో పెద్దసంఖ్యలో స్థానికులు రాళ్లు పట్టుకుని రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు, సీసాలు విసిరేస్తూ దాడికి దిగారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు వీడియోలు పోస్ట్చేసినందుకు, ఉద్రిక్తపరిస్థితులు సృష్టించినందుకు 17 ఏళ్ల బాలుడుసహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. -
భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని.. తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో.. ‘‘అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. దేశం నుంచి వెల్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది. Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు టైమ్ లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం. -
Delhi : మసీదు వద్ద కూల్చివేతలు పోలీసులపై రాళ్ల దాడి
-
మసీద్ సమీపంలో కూల్చివేతలు.. ఢిల్లీ పాతబస్తీలో టెన్షన్ టెన్షన్..
-
ఢిల్లీలో ఉద్రిక్తత.. జనం రాళ్ల దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్క్మన్ గేట్ సమీపంలోని పురాతన మసీదు ఆనుకుని ఉన్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30 గంటలకే మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో ఆక్రమణలను తొలగిస్తుండగా, పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వగా, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు (టీయర్ గ్యాస్) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. తుర్క్మన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. #WATCH | Delhi | Visuals from the area near Faiz-e-Elahi Masjid, Turkman Gate, where MCD, pursuant to the directions of the Delhi High Court, carried out a demolition drive on an encroachment earlier today. Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says,… pic.twitter.com/56LD5zeYZg— ANI (@ANI) January 7, 2026ఈ కూల్చివేతలపై ఢిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ సీపీ మధుర్ వర్మ స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించే క్రమంలో ఈ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, అదనపు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఇక్కడ మోహరించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ, కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు. గత అక్టోబర్లో నిర్వహించిన సర్వే ప్రకారం, 38,940 చదరపు అడుగుల మేర రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. మసీదు ఉన్న 0.195 ఎకరాల భూమి మినహా మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎర్రకోట పేలుడు నిందితుడు ఉమర్-ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్కే..’ మచాడో సంచలనం -
తీవ్ర బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: వాయుకాలుష్యంలోనూ దేశరాజధానిగా పనికిరాని పేరు తెచ్చుకుని గ్యాస్ఛాంబర్గా తయారైన ఢిల్లీని కాలుష్యం బారి నుంచి తప్పించడడంలో కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) విభాగం ఘోరంగా విఫలమవుతోందని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఢిల్లీని చుట్టేస్తున్న వాయుకాలుష్యానికి ప్రధాన హేతువులను గుర్తించి, పరిష్కారాలను సూచిస్తూ రెండు వారాల్లోగా తగు నివేదికను సమర్పించాలని సీఏక్యూఎంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగీ్చల ధర్మాసనం మంగళవారం సూచించింది.పొరుగురాష్ట్రాల గుండా ఢిల్లీలోకి వచ్చే వాహనాలు గంటలతరబడి వేచి ఉండటంతో సరిహద్దుల వెంబడి ఉన్న ప్రధాన టోల్ప్లాజాలు కాలుష్యకేంద్రాలుగా తయారయ్యాయని, వెంటనే వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో వాటిని తాత్కాలికంగా మూసేయడం లేదంటే వేరే చోటుకు మార్చడంపై తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం కావాలని సీఏక్యూఎం కోరడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు నెలల గడువు ఇవ్వడం కుదరదు. కేవలం రెండు వారాల సమయం ఇస్తున్నాం. ఈలోపు నివేదిక ఇవ్వండి’’అని ధర్మాసనం ఆదేశించింది. సమస్య వదిలేసి ఆదాయంపై యావ? ‘‘పరిష్కారం చూపండయ్యా అంటే అది వదిలేసి ఆయా టోల్ప్లాజాలే మాకు ఆదాయ వనరులు అంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అఫిడవిట్ సమర్పించింది. వీళ్లను చూసి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సైతం ఇదే పాట పాడుతోంది. గురుగ్రామ్లో పర్యావరణ నష్టపరిహార రుసుముల్లో సగభాగం తమకు ఇప్పించాలని కోరుతోంది. ఇదేం వైఖరి?. దీర్ఘకాలిక పరిష్కారాలతో లేదా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాల్సిన సంస్థలు ఇలా సమస్య తీవ్రత తెలీకుండా వ్యవహరిస్తున్నాయి. గతంలో మేం లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చడం కూడా ఏమాత్రం సబబుగా లేదు’’అని కోర్టు వ్యాఖ్యానించింది.కారు ఇప్పుడు స్టేటస్ సింబల్‘‘ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే కార్ల సంఖ్యను కుదించాలి. కొన్ని కుటుంబాలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి ఒక్కటే కారు అనే నిబంధన అమలుచేస్తే వాహన కాలు ష్యం కాస్తం తగ్గొచ్చు’’అని సీనియర్ న్యా యవాది రాకేశ్ ద్వివేది వాదించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇప్పుడు జనాల్లో కారు అనేది స్టేటస్ సింబల్గా తయారైంది. జనం సైకిళ్లు ఉపయోగించడం మానేశారు. సరిపడా డబ్బులు కూడబెట్టి నేరుగా కారు కొనేస్తున్నారు’’అని అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత శక్తివంతంగా తయారైందని లాయర్ వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘‘ధనవంతులు ఒక రకమైన త్యాగం చేస్తే బాగుంటుంది. అత్యంత ఖరీదైన కార్లు కొనేబదులు విద్యుత్తో నడిచే కార్లు కొంటే ఉత్తమం’’అని అన్నారు. -
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్స్టైల్పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్కుమార్ చెబుతున్నారు. -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఛాతీ సంబంధిత నిపుణుని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. సోనియా గాంధీ గత కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో, ఆమె ఆస్పత్రిలో చేరారని వైద్యులు పేర్కొన్నారు. ఇది సాధారణ పరీక్షల కోసమేనని వారు స్పష్టం చేశారు. గత డిసెంబర్లో సోనియా గాంధీ తన 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. వయసు రీత్యా వస్తున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె అడపాదడపా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.ఇది కూడా చదవండి: ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
ఖలీద్, ఇమామ్లకు నో బెయిల్
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాము లుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. 11 షరతులు విధించిన కోర్టుఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.వీళ్లది కీలక పాత్ర..‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు. ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది. సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.అదృష్టం లేదంతే బెయిల్ తిరస్కృతిపై ఖలీద్ తండ్రి ఆవేదన న్యూఢిల్లీ: ఉమర్ ఖలీద్కు బెయిల్ రాకపోవడంపై అతని తండ్రి ఎస్క్యూఆర్ లియాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ తీర్పు కాపీ అందరికీ అందుబాటులోనే ఉంది. దీనిపై నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఖలీద్ విషయంలో మాకు అదృష్టం లేదంతే. ఇది నిజంగా దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. ఇకపై ఇదే నా కొత్త జీవితం.. తీర్పుపై ఖలీద్ సహచరిణి బానోజ్యోత్స్న లాహిరి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అతనికి బెయిల్ రాకపోయినా తన తోటి వాళ్లు బెయిల్పై విడుదల అవుతున్నందుకు ఖలీద్ సంతోషం వ్యక్తం చేశాడని బానోజ్యోత్స్న వెల్లడించారు. ‘‘ బెయిల్ కనీసం వాళ్లకయినా వచి్చందికదా. సంతోషం. నాకెంతో తృప్తిగా ఉంది’’ అని ఖలీద్ అన్నారు. దీనికి స్పందనగా ‘‘ నేను రేపు వచ్చి జైలులో నీతో ములాఖత్ అవుతాను’’ అని జ్యోత్స్న సమాధానం ఇచ్చారు. దీనికి స్పందనగా ఖలీద్ ‘‘ మంచి పని. వచ్చేసెయ్. ఇకపై ఇదే నా కొత్త జీవితం’’ అని వ్యాఖ్యానించాడు. ఆయనకు 15 సార్లు ఎలా?ఉమర్ ఖలీద్, ఇమామ్ల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వెలువ ర్చిన తీర్పుపై విపక్ష నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పె ట్టారు. ‘‘ వీలైనంత వరకు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకే చూడాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి అనే సూత్రం అందరికీ ఒకేలా వర్తించబోదని నేడు సుప్రీం తీర్పుతో అర్థమైంది. ఈ కేసులో విచారణ ఇంకా మొదలుకాలేదు. అయినాసరే కఠిన ఉపా చట్టం కింద ఉమర్ఖలీద్ను ఐదేళ్లుగా కారాగార చీకటికొట్టంలో పడేశారు. ఇది విచారణకు ముందే జైలుశిక్ష అమలుచేయడం కాదా?. మహిళా భక్తులపై రేప్, హత్య కేసులో 2017లోనే 20 ఏళ్ల శిక్షపడిన డేరాసచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్కు మరోసారి తాత్కాలిక జైలుశిక్ష నిలుపుదల(పెరోల్) అవకాశం కల్పించారు. ఇప్పటికి ఆయన ఇలా 15 సార్లు పెరోల్మీద బయటికొచ్చాడు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా. ఒకరు(ఖలీద్) నిరవధికంగా జైళ్లో మగ్గిపోతుంటే మరొకరు(గుర్మీత్ బాబా) బయట డిమాండ్కు తగ్గట్లు ఎప్పటికప్పుడు జైలు నుంచి సెలవుల మీద విడుదలై సంతోషంగా గడుపుతున్నారు’’ అని జాన్ బ్రిటాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీర్పును బీజేపీ స్వాగతించింది. సత్యమేవ జయతే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు. -
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్ను మనువాడబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా శిఖర్- సోఫీల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది.భారత క్రికెట్ వర్గాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహకాలు మొదలయ్యాయని పేర్కొంది. ‘‘శిఖర్ ధావన్ జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం.ఈ వేడుకను సానుకూల వాతావరణంలో జరుపుకోవాలని వారిద్దరు భావిస్తున్నారు’’ అని ధావన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శిఖర్ ధావన్ స్వయంగా పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని గతంలో వివాహం చేసుకున్నాడు.పదకొండేళ్ల కుమారుడుడివోర్సి, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆయేషాను ప్రేమించిన ధావన్ 2011లో ఆమెను పెళ్లాడాడు. ఆమెతో కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో పదకొండేళ్ల జొరావర్ను తల్లి ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లింది.తన కుమారుడిని నేరుగా కలుసుకునే వీలు కూడా లేకుండా పోయిందంటూ ధావన్ ఎన్నోసార్లు ఇన్స్టా వేదికగా పోస్టులు పెట్టాడు. ఒంటరిగా మిగిలిపోయిన అతడి జీవితంలోకి ఐరిష్ అమ్మాయి సోఫీ షైన్ వచ్చింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ సందర్భంగా దుబాయ్లో వీరిద్దరు తొలిసారి జంటగా కనిపించారు.రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంతద్వారా తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేసిన ధావన్.. అప్పటి నుంచి సోఫీతో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నాడు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన సోఫీ.. ఓ ప్రముఖ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. జీవితంలో మరోసారి ప్రేమను వెదుక్కున్న శిఖర్ ధావన్.. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.ఇకపై గబ్బర్కు అంతా మంచే జరగాలని.. శిఖర్- సోఫీల వివాహ బంధం కలకాలం నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా 2010- 2022 మధ్య భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన శిఖర్ ధావన్.. 34 టెస్టుల్లో 2315, 167 వన్డేల్లో 6793, 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఓపెనర్గా సత్తా చాటిన గబ్బర్ ఖాతాలో టెస్టుల్లో ఏడు. వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. జట్టులో చోటు కరువు కావడంతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధావన్.. ఐపీఎల్కు కూడా గుడ్బై చెప్పేశాడు. -
భర్తపై దాడి, భార్యను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి..!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి, అతడి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. వారి కుమారుడిని నగ్నంగా నిల్చోబెట్టి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన జనవరి రెండో తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని లక్ష్మీనగర్లో రాజేష్ గార్గ్ అనే వ్యక్తి తన ఇంటి బేస్మెంట్పై జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ బాధ్యతను సతీష్ యాదవ్ అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. అయితే, సదరు జిమ్ హక్కుల విషయంలో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రాజేష్, అతడి భార్య.. సతీష్పై ఆరోపణలు చేశారు. సతీష్ యాదవ్ తమను మోసం చేశారని, తమ ఆస్తిని స్వాధీనం చేసకున్నాడని ఆరోపించారు. దీని గురించి ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు.A youth was allegedly assaulted, stripped naked and dragged away by neighbours in Delhi’s Laxmi Nagar area. Recounting the incident, his mother, Reeta Garg, said the attack began when she and her husband were standing outside their own property. She alleged that Shubham Yadav… pic.twitter.com/w6mKdpXM3E— IndiaToday (@IndiaToday) January 5, 2026అనంతరం, విషయం పెద్దది కావడంతో సతీష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. జిమ్పై తమ హక్కు గురించి ప్రశ్నించినందుకు దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో తేదీన సతీష్ యాదవ్ మరో ముగ్గురితో కలిసి వచ్చి.. రాజేష్ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. రాజేష్పై దాడి చేసిన దుండగులు.. అతడి భార్య జుట్టుపట్టుకుని లాగి, దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన తమ కొడుకు అక్కడికి రాగా.. అతడిపై కూడా దాడి చేసి, కొంతదూరం తీసుకెళ్లి దుస్తులు విప్పించారు. వీధిలోకి లాక్కెళ్లి ఇనుప రాడుతో దాడి చేయగా, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటనలో గార్గ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్ను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
Republic Day: ‘పరేడ్’ టిక్కెట్ల బుకింగ్ షురూ.. రేట్లు ఎంతంటే?
న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. 2026 జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్తో పాటు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు జనవరి 5 (సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ టికెట్లు జనవరి 14 వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఆ రోజుకు కేటాయించిన కోటా ముగిసే వరకు అందుబాటులో ఉండనున్నాయి. జనవరి 26న ప్రధాన పరేడ్, జనవరి 28న బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్, జనవరి 29న అధికారిక బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.టికెట్ ధరల వివరాలుసామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం టికెట్ ధరలను నిర్ణయించింది. రిపబ్లిక్ డే పరేడ్ కోసం రూ. 100, రూ. 20 ధరల్లో టికెట్లు లభిస్తాయి. అలాగే జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ రిహార్సల్ టికెట్ ధర రూ. 20 కాగా, జనవరి 29న జరిగే ప్రధాన కార్యక్రమానికి రూ. 100 గా నిర్ణయించారు. ఆసక్తి కలిగినవారు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ‘ఆమంత్రణ్’ (Aamantran) పోర్టల్ www.aamantran.mod.gov.in ద్వారా డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో ఉపయోగించిన ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డును వేడుకకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.ఆన్లైన్లో వీలుపడని వారి కోసం న్యూఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో ఆఫ్లైన్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి జనవరి 5 నుండి 14 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయనున్నాయి. సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్ రిసెప్షన్, రాజీవ్ చౌక్, కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లలో ఈ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి.వేడుకల విశిష్టత1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కర్తవ్య పథ్లో జరిగే ఈ ప్రధాన పరేడ్లో భారత రాష్ట్రపతితో పాటు ఒక విదేశీ ముఖ్య అతిథి పాల్గొంటారు. సైనిక దళాల విన్యాసాలు, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జనవరి 29న విజయ్ చౌక్ వద్ద జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకతో గణతంత్ర ఉత్సవాలు ముగుస్తాయి. బీటింగ్ రిట్రీట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ బ్యాండ్ల ప్రదర్శనలు భారత సాయుధ దళాల క్రమశిక్షణను, శౌర్యాన్ని తెలియజేస్తాయి.ఇది కూడా చదవండి: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ‘మకరవిళక్కు’కు 900 బస్సులు -
ఢిల్లీ అల్లర్ల కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులు, విద్యార్థి సంఘాల నేతలు ఉమర్ ఖాలీద్, శార్జీల్ ఇమామ్కు బెయిల్ తిరస్కరించింది. అలాగే.. మరికొందరికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు తీర్పు ఇచ్చారు.ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్లపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ ఆలస్యం బెయిల్ ఇచ్చేందుకు ఆధారం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జాతీయ భద్రత అంశంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్ఖాన్, షాబాద్ అహ్మద్లకు మాత్రమే ఊరట లభించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలీద్, ఇమామ్ల విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని.. అల్లర్లలో వీళ్లిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్లిద్దరూ ఏడాది తర్వాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లను UAPA (Unlawful Activities Prevention Act) కింద అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దీర్ఘకాలిక కస్టడీ.. విచారణ ఆలస్యం, ట్రయల్ ప్రారంభం కాని పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ కోరగా.. అల్లర్లకు ప్రణాళికాబద్ధంగా సహకరించారని, ఇది దేశ భద్రతకు ముప్పు అని పోలీసులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. -
లేడీ సింగం ఇషా సింగ్పై బదిలీ వేటు
పుదుచ్చేరి ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్పై బదిలీ వేటు పడింది. ఆమెకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యువలాయర్ టు ఐపీఎస్గా మారిన ఇషా సింగ్.. మొన్నీమధ్యే వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరి తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆ మధ్య నిర్వహించిన ర్యాలీలో ఇషా సింగ్ హైలైట్ అయ్యింది. జనసేకరణ చేయకుండా టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ను అడ్డుకున్నారామె. ‘‘సభా ప్రాంగణంలో చాలా స్థలం ఉందని.. లోపలికి రావాలంటూ బయట ఎదురు చూస్తున్న కార్యకర్తలకు ఆయన మైక్ ద్వారా పిలుపు ఇచ్చారు. అయితే.. ‘‘ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఇంక చాలదా?’’ అనే అర్థం వచ్చేలా కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇషా సింగ్ ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో లేడీ సింగంగా ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగింది. అయితే.. ఆనాటి నుంచి ఇషా సింగ్కు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ఎదురయ్యాయి. టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులే ఈ పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హఠాత్తుగా ఆమె బదిలీ కావడం వెనుక టీవీకే ప్రమేయం కూడా ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. అటు టీవీకే కూడా దీనిని ఖండించాల్సి ఉంది.1998 ముంబైలో జన్మించిన ఇషాసింగ్.. 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఇషా సింగ్.. పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తుండగానే నెట్టింట వైరల్ అయ్యారు. தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
రిషబ్ పంత్ విధ్వంసం.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్, సైనీ తలా వికెట్ సాధించారు. సర్వీసెస్ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్ స్కోరర్గా నిలవగా.. పుల్కత్ నరాంగ్ 22 పరుగులు చేశాడు.రాణా, పంత్ మెరుపులు..అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 72 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 67 పరుగులు చేశాడు.ఈ ఏడాది సీజన్లో పంత్కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పంత్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.Rishabh Pant when people start doubting him. pic.twitter.com/mnXCLPxp5p— Vaibhav (@spideynation_) January 3, 2026 -
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం
న్యూయార్క్: ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జొహ్రాన్ మమ్దానీ మద్దతు తెలపడం తీవ్ర వివాదం రేపుతోంది. ‘డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటలను, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’అని ఆ నోట్లో ఉంది. మమ్దానీ స్వయంగా రాసి సంతకం చేసిన ఆ నోట్ను ఆయన భాగస్వామి బనోజ్యోత్స్న లాహరి ఎక్స్లో.. ‘జైళ్లు ఒంటరిని చేయడానికి ప్రయతి్నస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్కు జొహ్రాన్ మమ్దానీ ఇలా రాశారు..’అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఢిల్లీలో 2020 లో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది క్షతగాత్రులయ్యారు. ఈ గొడవలకు ఖలీద్, తదితరులు కుట్ర పన్నారనే ఆరోపణలపై అధికారులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)తోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత రాయబారికి ప్రజా ప్రతినిధులు లేఖ ఉమర్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అమెరికా చట్ట సభల ప్రతినిధులు 8 మంది అక్కడి భారత రాయబారి వినయ్ క్వాత్రా ఒక లేఖ రాశారు. ‘2020 నాటి ఢిల్లీ హింసకు సంబంధించి అరెస్టయిన ఉమర్ ఖలీద్ సహా పలువురి సుదీర్ఘ నిర్బంధంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, స్వేచ్ఛ, చట్టబద్ధత, మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్య ఉంది. ఇదే ఉద్దేశంతో ఖలీద్ నిర్బంధం అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు’అని వారు అందులో పేర్కొన్నారు. అప్పుడెందుకు మాట్లాడలేదు?: వీహెచ్పీ ఉమర్ ఖలీద్ను విడిచిపెట్టాలంటూ న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీ, అమెరికా ప్రజా ప్రతినిధులు చేసిన వినతిపై బీజేపీ, వీహెచ్పీ తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. భారత్ విభజన గురించి మాట్లాడిన నేరగాడికి మద్దతివ్వడం ఖురాన్ను అగౌరవపర్చడమే అవుతుందని వీహెచ్పీ వ్యాఖ్యానించింది. ఖురాన్పై ప్రమాణం చేసిన మమ్దానీ, ఉమర్ ఖలీద్కు మద్దతు తెలపడం ద్వారా ఆ ఖురాన్ను అవమానించారని పేర్కొంది. బీజేపీ కూడా మమ్దానీ నోట్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. మమ్దానీతోపాటు అమెరికా చట్టసభల ప్రతినిధులు భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. -
ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్గా నగేశ్ కపూర్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్(ఎస్డబ్ల్యూఏసీ) కమాండింగ్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. ఢిల్లీలోని వాయుభవన్లో జరిగిన∙కార్యక్రమంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సేవలందించిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ బుధవారం రిటైరవడంతో వైస్ చీఫ్ పదవి ఖాళీ అయ్యింది. 1986 ఐఏఎఫ్ బ్యాచ్కి చెందిన ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్కు వివిధ యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు నడిపిన అనుభవముందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. -
రిషభ్ పంత్ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్ కీపర్.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. సమంత్రాయ్ హాఫ్ సెంచరీమొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. పంత్ సహా వారంతా విఫలంఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్ష్ ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి.చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్ కీపర్ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్ ఆప్షన్ ఎవరంటే? -
ఢిల్లీలో IMD ఎల్లో అలెర్ట్ విమాన రాకపోకలు అంతరాయం
-
దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పరిసరాల్లో దృశ్యమానత (Visibility) గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పొగమంచు ప్రభావంతో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్జెట్,ఎయిర్ ఇండియా మొదలైనవి తమ విమాన సర్వీసుల్లో జాప్యం జరుగుతున్నదని వెల్లడించాయి. తక్కువ దృశ్యమానత కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ‘క్యాట్ III’ ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల షెడ్యూల్లో మార్పులు తప్పవని స్పష్టం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల ఆలస్యం కారణంగా ఐజీఐ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్స్ అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు చలి, మరోవైపు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు సర్వీసులపై కూడా ఈ పొగమంచు ప్రభావం పడటంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది.ఈ నేపధ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు ఇంటి నుండి బయలుదేరే ముందే తమ విమాన స్థితిగతులను తెలుసుకోవాలని, ఇందుకోసం సంబంధిత ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్ల ద్వారా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎయిర్లైన్స్ పంపే ఎస్ఎమ్ఎస్ అలర్ట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే విమానయాన సంస్థల హెల్ప్డెస్క్లను సంప్రదించాలన్నారు.ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు!


