breaking news
Delhi
-
గోడ దూకి పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి చొరబడిన ఆగంతకుడు
-
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్ సౌత్ జోన్ టైటిల్తో పాటు వయోవర్గంలో మిసెస్ ఇండియా–2025 టైటిల్ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్ఫుల్ సోల్, మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
వీధి కుక్కల తరలింపుపై కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
వీధికుక్కల🐕 తరలింపు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ నెల 11వ తేదీన ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను.. విస్తృత ధర్మాసనం సవరించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ క్రమంలో.. ఈ సమస్య పరిధిని జాతీయ స్థాయికి విస్తరించే ఉద్దేశంతో అన్నిరాష్ట్రాల సీఎస్లకూ నోటీసులు జారీ చేసింది.ఢిల్లీ ఎన్సీఆర్ వీధుల్లోని వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేక ఆవాసాలకు తరలించాలంటూ అధికారులకు సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. జంతు ప్రేమికులు, ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. ఆ ఆదేశాలను పునఃసమీక్షించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన విస్తృత ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆ మధ్యంతర ఆదేశాల్లో..👉 వీధి కుక్కలన్నింటిని షెల్టర్లలో ఉంచాల్సిన అవసరం లేదు👉 కరిచే కుక్కలు, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లలో ఉంచాలి👉 బయటకు వదిలే ముందు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజ్ తప్పక చేయాలి👉వీధుల్లో కుక్కలకు ప్రజలు ఆహారం పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు👉 ప్రతి మున్సిపల్ వార్డులో ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి👉 బహిరంగంగా ఆహారం పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి👉శునక ప్రియులు, ఎన్జీవోలు ఇందుకుగానూ 25వేల నుంచి 2 లక్షలు జమ చేయాలి👉 అధికారుల పనికి ఎవరూ ఆటంకాలు కలిగించొద్దుఈ 🐕 సమస్య పరిధిని జాతీయ స్థాయికి విస్తరించాలని నిర్ణయించిన త్రిసభ్య ధర్మాసనం.. ఇలాంటి అన్ని కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తద్వారా ఒక తుది జాతీయ విధానం రూపొందించేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడుతూ.. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నుంచి వీధికుక్కలను 🐕 తరలించాలంటూ ఈ నెల 11వ తేదీన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూసుకోవాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించిది. అదే సమయంలో.. ప్రజల ప్రాణాలు పోతున్నాయని, జంతు హక్కుల పరిరక్షకులు.. జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల వాదనలు వినే ఉద్దేశం కూడా తమకు లేదని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. అయితే..దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఈలోపు ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు 14వ తేదీన విచారణ జరిపింది. ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలే జరగ్గా.. తీర్పును బెంచ్ రిజర్వ్ చేసింది.ఆగస్టు 11న.. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ బెంచ్ కోర్టు కీలక వ్యాఖ్యలు⚖️వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న 🐕 ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి⚖️కుక్కలను వెంటనే పట్టుకొని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి⚖️అడ్డుపడే వ్యక్తులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం⚖️జంతు ప్రేమికుల భావోద్వేగాలకు తావు లేదు.. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యంగణాంకాల ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్యలో 35,198 కుక్కకాటు ఘటనలు, 49 రేబిస్ కేసులు నమోదయ్యాయి. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు పైతీర్పును వెల్లడించింది.ఆగస్టు 11న.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ⚖️పార్లమెంట్ చట్టాలు చేస్తుంది.. నిబంధనలు రూపొందిస్తుంది.⚖️కానీ, అధికారుల బాధ్యాతారాహిత్యం వల్ల క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు.⚖️Animal Birth Control (ABC) నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు⚖️ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది -
సీఎం రేఖా గుప్తాపై దాడి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్పై బదిలీ వేటు
ఢిల్లీ: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన జనం,కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ అగంతకుడు దాడికి పాల్పడిన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కమిషనర్ ఎస్బీకే సింగ్ను తొలగించింది. ఆయన స్థానంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సతీష్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న ఎస్బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే సీఎం రేఖా గుప్తాపై నిందితుడు దాడికి పాల్పడడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎస్బీకే సింగ్ను విధుల నుంచి తప్పించింది. -
కొంప ముంచింది ఆ ఇద్దరే.. 30 రోజులు జైల్లో ఉంటే నేతల పదవి ఊస్టింగ్..
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి,కేంద్ర రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్రం మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ఈ వివాదాస్పద బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఇద్దరు నేతలు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? వాళ్లు ఏం నేరం చేశారు.గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో,తీవ్రమైన నేరాలకు పాల్పడి నెలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రజాప్రతినిధుల్ని పదవుల్ని తొలగించేలా కేంద్రం చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ గతేడాది జూన్లో అరెస్టయ్యారు.జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జైలు శిక్షను అనుభవించారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయలేదు.ఆ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఆ సమయంలో చట్టాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలపై కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో వేచి చూసి ధోరణిని అవలంభించింది. కొంత కాలం తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో వివాదాస్పద చట్టం మరుగున పడింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే చట్టాన్ని అమలు చేసేలా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రేరేపించిన మరో కేసు తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కేసు. డీఎంకే పార్టీలో నాలుగు సార్లు సెంథిల్ బాలాజీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళనాడు మాజీ రవాణాశాఖ మంత్రి, ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. 2023లో ఆయనను అరెస్ట్ చేసింది. దాదాపు 14 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2024 సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరైంది. సెంథిల్ బాలాజీ అరెస్టయి జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఎలాంటి శాఖ లేకపోయినా మంత్రిగా కొనసాగారు. ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు బాలాజీపై తీవ్ర విమర్శలు చేసింది. శాఖ లేకుండా మంత్రిగా కొనసాగడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.బెయిల్ తర్వాత అన్నాడీఎంకేలో చేరి సెంథిల్ బాలాజీ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు మీరు మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు సీనియర్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం రావచ్చు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా తప్పులు చేసి 30రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు కోల్పోయేలా బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు సమాచారం. -
Gen Z: ఉదయం ఉద్యోగంలో చేరి.. మధ్యాహ్నానికే ‘గుడ్బై’!
ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్ టైంలో జాబ్కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో టాక్సిక్ వర్క్ కల్చర్కు అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్గా మారింది.ఆ ట్వీట్ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్ టైం వరకు పనిచేశాడు. లంచ్ టైం తర్వాత తన ల్యాప్ట్యాప్ను కూడా డెస్క్పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్ఆర్ నుంచి ఫోన్ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్ఆర్తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.ఆ ట్వీట్పై నెటిజన్లు పాజిటీవ్గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్ ప్లేస్ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ సంఘటన జెన్జీ వర్క్ కల్చర్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్జీకి వర్క్ కల్చర్ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు. A friend told me about this guy who joined a startup here in Delhi. On his very first day, he left his laptop on his desk during lunch and just never came back. He ignored everyone’s calls initially but later picked up HR’s, and just said he cannot work there 😭— Poan Sapdi (@Poan__Sapdi) August 19, 2025 -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్పై కేంద్రం నిషేధం విధించింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. భారత్లో ఆన్లైన్ గేమింగ్కు నూకలు చెల్లాయి. నెటిజన్లను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి కట్టే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్ఫాంలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆన్లైన్ ప్రమోషన్, నియంత్రణకు ఉద్దేశించిన ‘రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్’బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది.ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్ఫాంలపై ఉక్కుపాదం మోపనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం చట్టబద్ధమైన ని యంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఆన్లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టనున్నారు.దేశాన్ని పట్టి పీడిస్తున్న నగదు అక్రమ చెలామణీ (మనీ లాండరింగ్), అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ వంటి పలు జాఢ్యాలకు ఈ ఆన్లైన్ నగదు బెట్టింగ్లు ఊతమిస్తున్నట్టు తేలిన నేపథ్యంలో కఠిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లును ఇవాళ (బుధవారం) లోక్సభలో ప్రవేశపెట్టారు.బిల్లులోని కీలకాంశాలు..👉రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా. పదేపదే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. 👉వాటిని ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా 👉ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం 👉ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్లాట్ఫాంలకు వాణిజ్య ప్రకటనలను కూడా పూర్తిగా నిషేధిస్తారు 👉నమోదు కాని, అక్రమ గేమింగ్ ప్లాట్ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు 👉ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత ఆన్లైన్ గేమ్స్ తదితరాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తారు 👉ఇలాంటి గేమ్స్ ఆడేవారిని మాత్రం శిక్షల పరిధి నుంచి తప్పించారు. వారిని బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు -
Delhi: 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. వారంలో రెండో ఘటన
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని 50 కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఏ పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయో స్పష్టంగా తెలియకపోయినా, వాటిలో మాలవీయ నగర్, నజాఫ్గఢ్లోని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం.ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలోని సర్వోదయ కన్యా విద్యాలయ (ఎస్కేవీ)కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ , భద్రతా సిబ్బంది పాఠశాలకు చేరుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నగరంలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడాన్ని మరచిపోకముందే, తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.గడచిన సోమవారం నగరంలో 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలలకు చేరుకుని, తమ పిల్లలను ఇంటికీ తీసుకెళ్లారు. తాజాగా పాఠశాలలకు తిరిగి బాంబు బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారని, ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయిని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గుజరాతీ పనేనా?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ‘జన్ సున్నాయ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ముఖ్యమంత్రి రేఖను దూషిస్తూ.. ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని గుజరాత్కు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడి వివరాలు తెలియ్సాలి ఉంది. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. సివిల్ లైన్స్లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి చేయి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. A mishap happened during Jan Sunvai at CM Residence, Civil Lines. Delhi BJP President Virendraa Sachdeva strongly condemns the attack on CM Rekha Gupta during the weekly Jan Sunvai. Police inquiry to reveal details: Delhi BJP— ANI (@ANI) August 20, 2025ఢిల్లీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఖండించారు. సీఎంపైనే దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం భద్రతా వైఫల్యమని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా దాడి చేసిన వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. గుజరాత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన సమయంలో ఏం జరిగిందే అక్కడే ఉన్న ఓ మహిళ వివరించారు.. తాజాగా అంజలి అనే మహిళ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతున్న సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. జన్సున్వాయ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తితో సీఎం రేఖా మాట్లాడుతున్న సమయంలో అతడు.. చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇలా చేయడం తప్పు అని చెప్పారు. #WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Anjali, who was present at the spot, says, "This is wrong. Everyone has the right to Jan Sunvai. If an imposter can slap her, this is a big deal...I was there...The person was speaking and he suddenly slapped. Police… pic.twitter.com/fsQCY8Jl0P— ANI (@ANI) August 20, 2025#WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Shailendra Kumar says, "I had come from Uttam Nagar with a complaint over sewer. When I reached the gates, chaos broke out because the CM was slapped. This is wrong..." pic.twitter.com/dVIJhz6ipD— ANI (@ANI) August 20, 2025 -
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ క్యాంపస్కు చేరుకుని అక్కడున్నవాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కవారంలోనే పాతికకు పైగా ఇలాంటి బాంబు బూచీ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో.. ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. తాజాగా.. ఓ స్కూల్కు బాంబు ఉందని, పిల్లలు చనిపోతారని కాల్ చేసిన వ్యక్తిని.. 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసులు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా వచ్చినా, కఠిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడినవారిపై జైలు శిక్ష, ఆర్థిక జరిమానా విధిస్తారు. విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తే శిక్షతోపాటు ప్రయాణాలు చేయకుండా బ్లాక్లిస్ట్లో చేర్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. BNS (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం ఉగ్రవాద చర్యగా పరిగణించి జీవిత ఖైదు తరహా కఠిన శిక్షా పడొచ్చు. -
‘రన్వేపై విమానం జారింది’: తప్పిన ప్రమాదంపై ఎంపీ వ్యాఖ్యలు
కొచ్చి: ‘ఎయిర్ ఇండియా’పై నీలి నీడలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నేటి (సోమవారం) తెల్లవారుజామున కేరళలోని కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్ను నిలిపివేశారు. అనంతరం ఊహించని విధంగా విమాన ప్రయాణం ఆలస్యం అవుతున్నదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ విమానంలో లోక్సభ ఎంపీ, కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు.కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్)ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ను నిలిపివేసిందని, విమానాన్ని మారుస్తున్నామని, త్వరలోనే బయలుదేరే అవకాశం ఉందన్నారు. టేకాఫ్ రోల్ సమయంలో గుర్తించిన సాంకేతిక సమస్య కారణంగా కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లే విమానం ఏఐ504 ఈ రోజు సాయంత్రం బయలుదేరేలా తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు. కాక్పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, టేకాఫ్ రన్ను నిలిపివేయాలని నిర్ణయించారని, నిర్వహణ తనిఖీల కోసం విమానాన్ని తిరిగి బేకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. Something unusual with this flight ✈️ AI 504, it just felt like the flight skid on the runway and hasn't taken off yet. Air India cancelled AI 504 and announced a new flight at 1 am which hasn't still started boarding, today is the third flight which has been AOG— Hibi Eden (@HibiEden) August 17, 2025ఈ ఘటన దరిమిలా ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయారని, కొచ్చిలోని తమ సహోద్యోగులు వారికి సహాయం అందిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ .. తాను ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో రన్వే నుండి జారిపోయినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్లో తెలిపారు.ఆ సమయంలో విమానంలో ఏదో అసాధారణమైనది జరిగిందన్నారు. తెల్లవారుజామున ఒంటి గంటకు తదుపరి విమానాన్ని ప్రకటించారని, అయితే ఇంకా బోర్డింగ్ ప్రారంభించనేలేదని ఆయన పేర్కొన్నారు. కాగా 2022 జనవరిలో ప్రైవేట్ యాజమాన్యంలోకి వచ్చినప్పటి నుండి ఎయిర్ ఇండియా చివరి నిమిషంలో విమానాల జాప్యాలు, రద్దులను ఎదుర్కొంటోంది. దీనికి సాంకేతిక, నిర్వహణ సమస్యలే ప్రధాన కారణమని ఎయిర్ ఇండియా చెబుతూవస్తోంది. -
ఎయిమ్స్ను వీడుతున్న వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీపడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ. ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లయితే.. వారి పేరుతో కాకుండా.. ఎయిమ్స్తోనే గుర్తింపు. అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకొంటున్నారు? పేగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు? ఇటీవల పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్పిన సత్యాలేంటో చూద్దాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచే ఎక్కువగా... దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ల్లో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య రెండేళ్ల కాలంలోనే, రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్లో 38 మంది, రాయ్పూర్లో 35, బిలాస్పూర్లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో 1,000 మందికంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే.. ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి. అత్యున్నత స్థాయివారే అత్యధికం.. రాజీనామా చేసినవారిలో మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన వీఆర్ఎస్ తీసుకుని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శివ్ చౌదరి రాజీనామా చేసి ఫోర్టీస్ ఎస్కార్ట్లో చేరారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ శరద్ కాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్టీ విభాగం, నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ మాజీ అధిపతి డాక్టర్ అలోక్ టక్కర్, రోటరీ కేన్సర్ హాస్పిటల్ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్ సుష్మా భటా్నగర్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి, న్యూరోసైన్సెస్ సెంటర్ చీఫ్ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఆర్థోపెడిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్లోనే ఎదిగి, 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం. అపనమ్మకం.. అసమర్థత... ఢిల్లీలోని ఎయిమ్స్ అంటే.. తక్కువ ఖర్చుతో అత్యున్నతమైన వైద్యం అందుతుందనే అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే.. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి సంస్థ చిత్రం మొత్తం మారిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అపాయింట్మెంట్ల కోసం గంటల తరబడి క్యూలు, శస్త్రచికిత్సల కోసం నెలలపాటు సుదీర్ఘ నిరీక్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం నిత్యం ఒత్తిడిలో ఉంటోంది. గతంలో ఎయిమ్స్ డైరెక్టర్ అంటే.. గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు అపనమ్మకం, అసమర్థతతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక విభాగాధిపతులైతే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనలన్నీ కాగితాలపైనే నిలిచిపోతున్నాయి. రోజువారీ పనితీరు కూడా కష్టమవ్వడం వల్లే ఎయిమ్స్ను వీడామని పలువురు చెబుతున్నారు. రోటరీ హెడ్షిప్ విధాన అమలే లేదు.. ఇక్కడ మరో వివాదాస్పద అంశం రోటరీ హెడ్షిప్ విధానం. రోటరీ హెడ్షిప్ అనేది వైద్య కళాశాల విభాగాల అధిపతులను రొటేషన్ పద్ధతిలో నియమించే విధానం. దీని ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక అధ్యాపకుడు ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. అధ్యాపకులందరికీ నాయకత్వ అవకాశం కల్పించడం, వారి అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలలో అమలు చేసే వ్యవస్థ. ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్లలోని పీజీఐఎంఈఆర్లో దీనిని అమలు చేయాలని 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ వరకు గడువు విధించింది. అయినా ఈ విధానం అమలు కాలేదు. రాజకీయాలతో విశ్వసనీయతకు మచ్చ.. ఎయిమ్స్తో 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం కలిగి ఉండి కూడా.. జరుగుతున్న నష్టాన్ని చూస్తూ భరించలేక వీడామని సీనియర్లు అంటున్నారు. నిబద్ధతతో ఉన్న వైద్యులపై రాజకీయాలు చేయడం, తక్కువ అనుభవం ఉన్నవారికి సంస్థలో నిర్ణయాధికారాలు కట్టబెట్టే ధోరణి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తప్పని పరిస్థితుల్లోనే అంత గొప్ప సంస్థను వీడామంటున్నారు. తాము వేతనాలకోసమే అయితే ఎప్పుడో వెళ్లిపోయేవారమని, ఇన్ని దశాబ్దాల తరువాత సంస్థను వీడాల్సి రావడానికి సంస్థలో రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఈ సామూహిక వలసలతో సీనియర్ స్థాయి వైద్యుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువ మంది అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నిండిపోయింది. ఇది ఎయిమ్స్ ఢిల్లీ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవత్తుతోంది.సౌకర్యాల కొరతతో పోస్టులు ఖాళీ.. ఎయిమ్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సరిపోను క్వార్టర్స్ ఉండటం లేదు. కనెక్టివిటీ తక్కువగా ఉంటోంది. దగ్గరలో ఉన్నతస్థాయి పాఠశాలు ఉండటం లేదు. షాపింగ్ కాంప్లెక్సులు సరికదా.. చివరకు ఇంటర్నెట్ సౌకర్యంగా కూడా సరిగా ఉంటం లేదు. ఇక వీరు ఉంటున్న ప్రాంతాలు టైర్–3 నగరాలుగా గుర్తించి హోమ్ అలవెన్స్ తక్కువగా ఇస్తున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. దీంతో ఇక్కడికి రావడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాయ్బరేలిలో 201 ఫ్యాకల్టీ పోస్టులకు 88 భర్తీ కాలేదు. జమ్మూలోని ఎయిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో 183కి గాను 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గత మూడేళ్లలో ఒక్క ఢిల్లీలోని ఎయిమ్స్లోనే 1,191 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 827 భర్తీ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 2023–24లో 1,207 పోస్టులు మంజూరు కాగా, 850 భర్తీ అయ్యాయి. 2024–25లో 1,235 పోస్టులు మంజూరు కాగా, 803 భర్తీ అయ్యాయి. 2025–26 సంవత్సరానికి 1,306 పోస్టులు మంజూరు కాగా, 844 భర్తీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఎయిమ్స్ల్లో సగానికి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. -
రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి డ్రామాలా?
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలో ఉండగా రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి, చట్టాలను కాలరాసి, అంబేడ్కర్ ఆశయాలను పాతర వేసినవారే నేడు అదే రాజ్యాంగ ప్రతులను తలపై పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు. రూ.11,000 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఆదివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలైన హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘సామాజిక న్యాయం గురించి పెద్ద మాటలు చెబుతున్న విపక్షాలు అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలను దగా చేసే చట్టాలు, నిబంధనలు తెచ్చాయి. ఆ తిరోగమన చట్టాలను వందలాదిగా రద్దు చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.‘వికసిత్’ నమూనాగా ఢిల్లీ ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రజలు బీజేపీ భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని మోదీ అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వివరించారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజాతీర్పును ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాయి. ప్రజల విశ్వాసానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా బతుకుతున్నాయి. ఢిల్లీలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని నెలల క్రితం పెద్ద కుట్రలు జరిగాయి. ఢిల్లీకి వచ్చే తాగు నీటిలో హరియాణా ప్రజలు విషం కలిపారంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఆ ప్రతికూల రాజకీయాల నుంచి ఢిల్లీవాసులకు స్వేచ్ఛ లభించింది. వికసిత్ భారత్కు ఢిల్లీని ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతాం’’ అన్నారు. జీఎస్టీలో అత్యాధునిక సంస్కరణల రూపంలో దీపావళికి దేశవాసులకు డబల్ బోనస్ దక్కనుందని శ్లాబుల తగ్గింపును ఉద్దేశించి పునరుద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించాలని ప్రజలను కోరారు. వాటితో పేదలు, మధ్య తరగతి ప్రజలతోపాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు మేలు జరుగుతుందన్నారు. -
ఓటు చోరీ వివాదంపై EC ప్రెస్ మీట్
-
తల్లిపై ‘అనుమానం’తో రెండుసార్లు అకృత్యం.. చేసిన పనికి శిక్ష ఇదేనంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఉదంతం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను ‘శిక్షిస్తున్నాడని’ ఫిర్యాదు చేసింది.బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్కు వచ్చి, తన కుమారునిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఉంటోంది. బాధితురాలి పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది.జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే తిరిగి రమ్మని కోరాడు. తల్లికి వెంటనే విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తాను కనుగొన్నానని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో అరేబియా నుంచి వారి కుటుంబం ఆగస్టు ఒకటిన ఢిల్లీకి తిరిగివచ్చింది.తల్లిని చూడగానే ఆ కుమారుడు ఆమెపై దాడి చేశాడు. కుమారుని ప్రవర్తనకు భయపడి తల్లి ఇల్లు విడిచిపెట్టి పెద్ద కుమార్తె ఇంటిలో ఆగస్టు 11 వరకూ ఉంది. ఆ తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు. తరువాత ఆమెను గదిలో బంధించి, అత్యాచారం చేశాడు. ఆమె ఎంతలా వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని చెప్పాడు.బాధితురాలు వెంటనే ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే గురువారం తెల్లవారుజామున కుమారుడు ఆమె గదిలోనికి వచ్చి మళ్లీ లైంగిక దాడి చేశాడు. మర్నాడు తల్లి జరిగిన విషయాన్ని చిన్న కుమార్తెకు చెప్పింది. తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని, నిందితునిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తుకు ఉపక్రమించారు. -
శుభాంశు వచ్చేశాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పాదం మోపిన తొలి భారతీయునిగా సరికొత్త చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలు దాటాక ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్లా భార్య కామ్నా, కుమారుడు కియష్తో పాటు అసంఖ్యాకులైన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, పలువురు ఉన్నతాధికారులు ఎదురెళ్లి మరీ కరతాళ ధ్వనుల మధ్య శుభాంశును విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025త్రివర్ణ పతాకాలను చేబూని నినాదాలతో హోరెత్తించిన అభిమానులకు ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు. డప్పుచప్పుళ్లు, జయజయధ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. ‘‘స్వదేశానికి తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా ఇంతటి సాదర స్వాగతం పలకినందుకు కృతజ్ఞతలు’’ అని కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ శుక్లా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. యాగ్జియం–4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లడం, ఆ మర్నాడు ఐఎస్ఎస్కు చేరుకోవడం తెలిసిందే. అక్కడ 18 రోజులపాటు ఆయన 20 ప్రత్యేక కార్యక్రమాలు, 60కి పైగా ప్రయోగాలుచేశారు. జూలై 15న భూమికి చేరుకున్నారు. నాసా క్వారంటైన్లో గడిపి తాజాగా స్వదేశం చేరారు. శుభాంశు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం సొంతూరు లఖ్నవూ వెళ్తారు. తర్వాత 22, 23వ తేదీల్లో ఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాలో పాల్గొంటారు. శుభాంశు దిగ్విజయ అంతరిక్ష యాత్రపై సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025 -
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా సౌకర్యాలకు కొత్త ఊపిరి పోసే రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని రోహిణిలో రూ.11 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. అనుసంధానత మెరుగు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్–2 (యూఈఆర్–2) ప్రాజెక్టులను చేపట్టారు. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలు, మలీ్ట–మోడల్ కనెక్టివిటీ కలి్పంచడమే వీటి ప్రధాన ఉద్దేశం. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై దాదాపు రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల ఢిల్లీ భాగం అభివృద్ధి చేశారు. ప్యాకేజీ–1 కింద శివమూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ వరకు (5.9 కి.మీ), ప్యాకేజీ–2 కింద ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ–హరియాణా సరిహద్దు వరకు (4.2 కి.మీ) నిర్మాణం చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్సీ బ్లూ, ఆరెంజ్ లైన్లు, కొత్తగా వచ్చే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా బస్ డిపోలతో నేరుగా అనుసంధానమవుతుంది. గత సంవత్సరం మార్చిలో హరియాణా విభాగంలోని 19 కి.మీ భాగాన్ని మోదీ ప్రారంభించారు. యూఈఆర్–2 ప్రాజెక్టు రూ.5,580 కోట్లతో యూఈఆర్–2లోని అలీపూర్–డిచాన్ కలాన్ రహదారితో పాటు, బహదూర్గఢ్, సోనిపట్లకు కొత్త లింక్ రోడ్లు కూడా ప్రజల వినియోగానికి అందించనున్నారు. ఇవి ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్హెచ్–09 వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. అంతేగాక పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు ఎన్సీఆర్లో రవాణా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా రోహిణిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మాష్టమి సందర్బంగా ‘దహీ హండీ’ (ఉట్టికొట్టే ఉత్సవం) వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. #WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. దహి హండీ మహోత్సవంలో పాల్గొనేందుకు స్పానిష్ క్యాస్టెల్లర్ల బృందం ఇప్పటికే మహారాష్ట్ర చేరుకుంది.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఇస్కాన్ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడిని, రాధాదేవిని దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. మధురలోని శ్రీ కృష్ణుని ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025ప్రధాని మోదీ ‘ఎక్స్’లో దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘నమ్మకం, ఆనందం, ఉత్సాహం నడుమ జరిగే ఈ ఉత్సవం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ కృష్ణ’అని రాశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!— Narendra Modi (@narendramodi) August 16, 2025 -
హైకోర్టు కంటే సుప్రీం ఎక్కువ కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని, ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే తేడా లేదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఫలానా వ్యక్తినే న్యాయమూర్తిగా సిఫారసు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వ జాలదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులను హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించే అంశాన్ని పరిశీలించాలంటూ అంతకుముందు బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వినతిపై ఆయనీ మేరకు స్పందించారు. ‘జడ్జీల నియామకంపై సిఫారసులు చేయాల్సింది ముందుగా హైకోర్టులే. హైకోర్టులు అందజేసిన పేర్లలో కొన్నిటిని మాత్రం మేం సిఫారసు చేస్తాం. తిరిగి మాకు అందిన జాబితాలోని వారు మాత్రమే జడ్జీలుగా నియమితులవుతారు’అని ఆయన తెలిపారు. -
ఢిల్లీ నిజాముద్దీన్లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం
ఢిల్లీ: ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్ప్ ప్రాంతంలోని హుమయూన్ సమాధ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | Delhi | NDRF personnel conduct a search operation at Dargah Sharif Patte Shah, located near Humayun's Tomb, in the Nizamuddin area, following the collapse of the roof of a room in the dargah premises. Police and Fire Department personnel are also present. So far, 11… pic.twitter.com/6oW3XjroAX— ANI (@ANI) August 15, 2025 సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ చర్యలు చేపట్టింది. -
అమెరికా ఓవరాక్షన్.. ఎర్రకోటపై ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో భారత శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు.దేశంలో 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై మోదీ మాట్లాడుతూ.. ‘కొందరు భారత్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ప్రపంచ మార్కెట్ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "... Viksit Bharat ka aadhar bhi hai Aatmanirbhar Bharat... If someone becomes too dependent on others, the very question of freedom starts to fade... Aatmanirbhar is not limited merely to imports, exports, rupees, pounds, or… pic.twitter.com/ZmP6uYoezm— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలి. నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేశారు.A very sharp message from PM Modi: Don’t waste your energy containing the other, focus all your energy on boosting your own. Economic selfishness is on the rise, but we must not sit and cry about it. Focus on building your future. No “selfishness” can trap us. This goes hard. pic.twitter.com/duImGAtzjJ— Shubhangi Sharma (@ItsShubhangi) August 15, 2025 -
దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం..! ఎర్ర కోటపై పవర్ ఫుల్ స్పీచ్
-
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
-
బ్లాక్ మెయిల్ నడవదు.. పాక్ బెదిరింపులకు భయపడేది లేదు: మోదీ హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్కు భారత్ తలవంచే రోజులు పోయాయని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్తో మన దేశ సత్తా చాటామని చెప్పుకొచ్చారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్పై ఆధారపడటం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయం గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద ఎంఐ-17 హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఎర్రకోటపై జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ప్రతీ ఇంటిపై మువ్వెన్నల జెండా ఎగిరే సమయం ఇది. 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది. సమైక్య భావంతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "My beloved citizens of India, this festival of independence is a festival of 140 crore resolutions. It is a moment of collective achievements, filled with pride and joy. The nation is continuously strengthening the spirit of… pic.twitter.com/YPze5woDJ6— ANI (@ANI) August 15, 2025ఉగ్రవాదులకు బుద్ది చెప్పాం.. పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్తో మన దేశ సత్తా చాటాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. పాక్ బ్లాక్ మెయిల్ నడవదు.. ఇకపై ఎవరి బ్లాక్ మెయిల్ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ది చెప్పింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చాం. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్ మెయిల్కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సింధూ నది జలాలపై భారత్కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. ఆత్మ నిర్భర్ భారత్తో స్వయం సమృద్ది..ఆపరేషన్ సిందూర్తో మేడిన్ ఇండియా సత్తా ప్రపంచానికి చాటి చెప్పాం. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్పై ఆధారపడటం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీపై భారత్ చొరవ చూపిస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వయం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ప్రతీ రంగంలో భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. 2030లోగా భారత్లో 50 శాతం క్లీన్ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలబడటం. మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు. ప్రపంచ దేశాలకు సాయం, టెక్నాలజీ అందిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్తో మన సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసింది. దీపావళి బహుమతి ఇవ్వబోతున్నాం..సైబర్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీల్లో భారత్ బలమైన పాత్ర. ప్రపంచ వాణిజ్యంలో మన సామర్థ్యం చాటాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనాల్లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. గగన్యాన్తో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన యువ శాస్త్రవేత్తలు, నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాం. అనేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నాం. దీని వల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. దేపావళికి దేశ ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నాం. ఈసారి దీపావళికి రెండింతల సంతోషం తీసుకురాబోతున్నాం. ఖనిజాలే ముఖ్యం.. నాకు యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంది. సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్వైపు దేశ యువత దృష్టి పెట్టాలి. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతాం. గ్రీన్హైడ్రోజన్ ప్రాజెక్ట్లను ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త ఇందనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది లక్ష్యం. 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని 10 రేట్లు పెంచాలన్నది టార్గెట్. 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతుంది. కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ ఎప్పుడో ఆలోచన చేసింది. యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకం. పంద్రాగస్ట్ సందర్భంగా పథకం ప్రారంభం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి. తొలిసారి ఉద్యోగం పొందిన యువతీయువకులకు 15వేలు అందజేస్తాం. కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తాం. ఇక, అంతకుముందు.. ఎర్రకోటలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. కాగా, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం నయా భారత్ థీమ్తో ఉత్సవాలు జరుపుతోంది.#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay (Video Source: DD) pic.twitter.com/UnthwfL72O— ANI (@ANI) August 15, 2025#WATCH | Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat, in Delhi, on #IndependenceDay (Video: DD) pic.twitter.com/3ecTwDdQXB— ANI (@ANI) August 15, 2025 -
ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన కేంద్ర మంత్రి బండి దంపతులు.. కారణం ఏంటంటే..
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు. -
ఢిల్లీలో ఊహించని విషాదం.. సీసీటీవీ దృశ్యాలు
ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం 9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్ కాల్కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.In South Delhi’s Kalkaji, a biker lost his life after a tree collapsed on him during heavy rain.pic.twitter.com/58u0JEa4E4— Greater Noida West (@GreaterNoidaW) August 14, 2025తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది. -
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేటి (గురువారం) ఉదయం నుండి ఎడతెరిపిలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. STORY | Yamuna nears warning mark in DelhiREAD: https://t.co/Khi8oNlw1WVIDEO | pic.twitter.com/jBQVZ17moE— Press Trust of India (@PTI_News) August 14, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజాగా రెడ్ అలర్ట్ జారీచేసింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.VIDEO | Gurugram: Heavy rainfall on Thursday led to significant waterlogging and traffic congestion at IFFCO Chowk.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zeQR1oE7ON— Press Trust of India (@PTI_News) August 14, 2025ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరింత అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది.VIDEO | Delhi: Heavy rain floods Mathura Road, causing severe waterlogging as vehicles struggle through the traffic.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/w4FYsbgkga— Press Trust of India (@PTI_News) August 14, 2025అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.వర్షం కారణంగా రింగ్ రోడ్, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలతో సహా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.#WATCH | Commuters wade through a partially waterlogged street near BD Marg area in Delhi, as the city receives continuous rain pic.twitter.com/CRdWc8w45N— ANI (@ANI) August 14, 2025సుబ్రోతో పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టార్-20, గురుగ్రామ్లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ అండర్పాస్లో నీరు నిలిచిపోయింది. ప్రజలు దాని గుండా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
రేపు ఎర్రకోటపై ‘నయా భారత్’.. సంబరాల జాబితా ఇదే
న్యూఢిల్లీ: రేపు.. ఆగస్టు 15న భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు సారధ్యం వహించనున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర సంబరాలు ‘నయ భారత్’ ఇతివృత్తం చుట్టూ తిరగనున్నాయి. ఎర్రకోటపై పంద్రాగస్టున జరిగే కార్యక్రమాలివే..గార్డ్ ఆఫ్ హానర్..ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధానమంత్రి మోదీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులకు చెందిన 96 మంది సిబ్బందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్ను ప్రధాని అందుకోనున్నారు.ఘనంగా గన్ సెల్యూట్అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాకారాల వద్దకు వెళతారు. అక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ జాతీయ జెండాను ఎగురవేయడంలో ప్రధానికి సహాయం చేస్తారు. ఈ సమయంలో స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ ద్వారా 21-గన్ సెల్యూట్ జరగనుంది.అగ్నివీరుల జాతీయ గీతాలాపనమొదటిసారిగా 11 మంది అగ్నివీర్ సంగీతకారులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ సమయంలో రెండు ఐఏఎఫ్ ఎంఐ 17 హెలికాప్టర్లు పూల రేకులను కురిపించనున్నాయి. వీటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని మోసుకెళుతుంది. మరొకటి ‘ఆపరేషన్ సిందూర్’ జెండాను ఎగురవేయనుంది.‘ఆపరేషన్ సిందూర్’ విజయం హైలెట్ఈ ఏడాది వేడుకలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ లోగో ఎర్రకోటలోని జ్ఞానపథ్లో కనిపించనుంది. పూల అలంకరణ ప్రముఖంగా నిలవనుంది.ఎన్సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగో..జ్ఞానపథ్లో 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగోను రూపొందించనున్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ముగింపు అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ వేడుకలకు దేశంలోని విభిన్న రంగాలకు చెందిన సుమారు ఐదువేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపేందుకు వివిధ రాష్ట్రాల నుండి సాంప్రదాయ దుస్తులలో 1,500 మంది ఆహ్వానితులు తరలిరానున్నారు. -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై మానవ మృగాల అకృత్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్రూమ్లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్రూమ్కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనుంది.#BREAKING Delhi Stray dog case referred to SC 3-judge bench.A 3-judge bench of the #SupremeCourt to hear the case tomorrow.This is different from the 2-judge bench.A bench of Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria will hear the matter tomorrow. pic.twitter.com/o0RSdoXyXp— Kashmir Dot Com (KDC) (@kashmirdotcom) August 13, 2025 -
భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్తో భారత్లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713 -
సుప్రీంకోర్టులోనూ వీధికుక్కల సంచారం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చిన మరుసటిరోజే మరోసారి వాటి ప్రస్తావన తెచ్చింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తంచేసింది. మిగిలిపోయిన ఆహారాన్ని మూతలున్న చెత్తబుట్టలో పడేయకుండా కోర్టుకాంప్లెక్స్లో ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఈ సమస్య తీవ్రతరమైందని ఆగ్రహం వ్యక్తంచేసింది.ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) పరిధిలోని వీధి శునకాలను కచ్చితంగా షెల్టర్లకు తరలించాలంటూ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు భవన పరిస్థితినీ ధర్మాసనం ప్రస్తావించింది.‘‘ సుప్రీంకోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ తాము వెంట తీసుకొచ్చిన, కొనుగోలుచేసిన ఆహారం మిగిలిపోతే దానిని కచ్చితంగా మూసిఉన్న డస్ట్బిన్లోనే పడేయండి. ఇష్టమొచ్చిన చోట పడేస్తే దానిని తినేందుకు వీధికుక్కలు సుప్రీంకోర్టు ప్రాంగణమంతా సంచరిస్తున్నాయి. కారిడార్లు మొదలు లిఫ్ట్ల దాకా ప్రతిచోటా వీధి శునకాలు కనిపిస్తున్నాయి. కుక్క కాట్ల నుంచి తప్పించుకోవాలంటే వాటికి ఆహారం దొరక్కుండా మూతలున్న చెత్తబుట్టలో పడేయండి.బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పడేయకండి. ఆహారం లభించకపోవడంతో అవి ఇక సుప్రీంకోర్టు ప్రాంగణాలకు రావడం మానేస్తాయి. కుక్క కాటు ముప్పు తప్పుతుంది. కోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరి సహకారంతో న్యాయస్థానం పరిసరాలు వీధికుక్కల కాట్ల నుంచి సురక్షితంగా ఉంటాయి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. -
అసలు నిజాలు బయటపడతాయని ఈసీ భయపడుతోంది: రాహుల్ గాంధీ
-
టెస్లా రెండో షోరూం ప్రారంభం
టెస్లా ముంబైలో తన మొదటి షోరూం ప్రారంభించి.. ఇండియన్ మార్కెట్లో 'మోడల్ వై' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీలో రెండో షోరూమ్ ప్రారంభించింది.భారతదేశంలో రెండవ టెస్లా అవుట్లెట్ ఢిల్లీలోని ఏరోసిటీలోని వరల్డ్మార్క్ 3 వద్ద ఉంది. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త షోరూమ్ వద్ద, నాలుగు సూపర్చార్జర్లు కూడా ఉన్నాయి. నోయిడా, హారిజన్ సెంటర్, సాకేత్ వంటి ప్రదేశాలలో సూపర్చార్జర్లను ఏర్పాటు చేయడానికి కూడా టెస్లా సన్నద్ధమవుతోంది.ముంబై, ఢిల్లీలలో తన షోరూంలను ప్రారంభించిన టెస్లా తన నెట్వర్క్ను హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
ఢిల్లీ వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్
-
ఢిల్లీలో ఇండియా కూటమి MPల ర్యాలీలో ఉద్రిక్తత
-
5 స్టార్ హోటల్ రేంజ్ లో ఎంపీ నేతలకు కొత్త ఫ్లాట్స్
-
ఢిల్లీలో హై టెన్షన్.. MPలతో రాహుల్ ర్యాలీ
-
EC Office: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ సహా ఎంపీలు అరెస్ట్
INDIA bloc leaders March Updates..ఎంపీలు అరెస్ట్.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులుకూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Dare hue hai. Sarkaar kaayar hai."Delhi Police detained INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march… https://t.co/GPvb7VcoH4 pic.twitter.com/nnA2tpXC8T— ANI (@ANI) August 11, 2025రాహుల్ కామెంట్స్..అరెస్ట్ తర్వాత రాహుల్ మాట్లాడుతూ..నిజం దేశం ముందు ఉంది.కానీ, వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరు.ఈ పోరాటం రాజకీయమైనది కాదు.ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్నాం.ఈ పోరాటం ఓటు కోసం.మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి#WATCH | Delhi: Police detains INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march from Parliament to the Election Commission of India. pic.twitter.com/9pfRxTNS49— ANI (@ANI) August 11, 2025కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్కు నేను రాసిన లేఖ ప్రత్యక్షంగా ఉంది.అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీసుకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తారని నేను స్పష్టంగా రాశాను.ఎంపీలందరూ SIR గురించి ఎన్నికల కమిషన్కు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఇది మా డిమాండ్.నేను నిన్న సాయంత్రం ఈ లేఖ రాశాను.ఇప్పుడు వారు 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని అంటున్నారు.ప్రతిపక్ష ఎంపీలందరూ సమిష్టిగా ఈసీకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం.మమ్మల్ని ఇక్కడే ఆపారు.ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు. శశి థరూర్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..ఈ విషయం చాలా సులభం.రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాదు. మన ఎన్నికల విశ్వసనీయత గురించి ప్రజల మనస్సులలో సందేహాలను నివృత్తి చేయాలి.ఈసీకి ఆ బాధ్యత ఉంది.ఎన్నికలు మొత్తం దేశానికి ముఖ్యమైనవి.నకిలీ ఓటింగ్ ఉందా, బహుళ చిరునామాలు ఉన్నాయా లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా?.పలు సందేహాలతో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.ప్రజల మనస్సులలో సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలి.ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉండవచ్చు, కానీ ఆ సమాధానాలను విశ్వసనీయంగా అందించాలి.ఎన్నికల కమిషన్ ప్రశ్నలను తీసుకొని వాటిని పరిష్కరించాలి. #WATCH | Congress MP Shashi Tharoor says, "For me, the issue is very simple. Rahul Gandhi has raised some serious questions; they deserve serious answers. The Election Commission not only has a responsibility to the nation, but it has a responsibility to itself that there should… https://t.co/BaEU00fr0Y pic.twitter.com/c39DQ5fSTu— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. సంసద్ మార్గ్ను బ్లాక్ చేసిన పోలీసులు.ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా విపక్ష ఎంపీలను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.బారికేడ్డు పెట్టి విపక్ష ఎంపీలను నిలువరిస్తున్న ఢిల్లీ పోలీసులు.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ చేసిన రాహుల్ గాంధీ. రోడ్డుపై బైఠాయించి ఎంపీల నిరసనలు.. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఢిల్లీలో హైటెన్షన్.. అఖిలేష్ యాదవ్ నిరసన..ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.బారికేడ్ల దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిలేష్.అఖిలేష్ను అడ్డుకున్న పోలీసులు..పార్లమెంట్ వద్ద రోడ్డుపై కూర్చుని అఖిలేష్, తృణముల్ ఎంపీలు నిరసనలు.నిరసనల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, శశి థరూర్ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల నినాదాలు #WATCH | Delhi: "... They are using the police to stop us...," says Samajwadi Party Chief and MP Akhilesh Yadav as he sits down to protest as police stop the opposition MPs from marching towards the Election Commission of India. pic.twitter.com/u3ScvbxWiX— ANI (@ANI) August 11, 2025 #WATCH | Congress MP Priyanka Gandhi Vadra raises slogans as the INDIA bloc leaders march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during… pic.twitter.com/X9xgcPRVCV— ANI (@ANI) August 11, 2025 #WATCH | Delhi: Senior INDIA bloc leaders- Congress President Mallikarjun Kharge, NCP SCP chief Sharad Pawar join INDIA bloc leaders as they march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in… pic.twitter.com/d0ExdSGTHH— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రికత్త.. పార్లమెంట్ బయటే బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లపైకి ఎక్కిన మహిళా ఎంపీలు.ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఈసీ అపాయింట్మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలుపార్లమెంట్ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీబీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీగత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలుఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు30 మందే రావాలంటూ జైరాం రమేష్కు లేఖ రాసిన ఈసీ.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్. 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం #WATCH | Delhi: INDIA bloc leaders gathered at the Makar Dwar of the Parliament. INDIA bloc leaders are set to stage a march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar… pic.twitter.com/gc9hDgtqNB— ANI (@ANI) August 11, 2025👉విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఇండియా బ్లాక్ నేతలు, తదితరులు పాల్గొన్నారు. -
Viral Video: మనిషిని చూసి భయపడ్డ సింహం
-
ఎంపీల కోసం కొత్తగా 184 నివాసాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన కొత్త నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో నిర్మించిన 184 టైప్–7 మల్టీ స్టోరీ ఫ్లాట్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని మోదీ ‘సిందూర’మొక్కను నాటి, ఆ తర్వాత నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో ముచ్చటిస్తారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిచనున్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఎంపీల నూతన నివాస సముదాయం పార్లమెంట్ సభ్యుల అవసరాలకు తగిన అన్ని ఆధునిక సదుపాయాలతో ఉంటుంది. ప్రతి యూనిట్ విస్తీర్ణం సుమారు 5 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో నివాసంతో పాటు అధికారిక పనులకు అనుకూలంగా గదులను కేటాయించారు. సిబ్బంది నివాసాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్ వంటి సదుపాయాలు కల్పించారు. నివాస సముదాయంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. పర్యావరణ హిత సాంకేతికతతో నిర్మాణం చేపట్టి, గ్రీహా 3 స్టార్ రేటింగ్, నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రమాణాలను అనుసరించారు. దీంతో శక్తి పొదుపు, పునరుత్పత్తి ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల నిర్వహణలో మెరుగులు సాధ్యమవుతాయని అధికారులు పేర్కొన్నారు. అల్యూమినియం షట్టరింగ్ విధానంలో మోనోలితిక్ కాంక్రీట్ సాంకేతికతతో నిర్మాణం పూర్తి చేయడం వల్ల సమయానికి పనులు ముగిశాయని.. భూకంప నిరోధకంగా, దివ్యాంగులకు అనుకూలంగా ఈ భవనాలను రూపొందించారు. ప్రాజెక్ట్ కోసం భూమి పరిమితంగా ఉండటంతో అపార్ట్మెంట్ తరహా గృహ నిర్మాణం చేశారు. -
భారత్లో టెస్లా బిగ్ డీల్!.. నెలకు రూ.17.22 లక్షల రెంట్
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది. -
ఇండిగోకు భారీ జరిమానా.. ప్రయాణికురాలు ఏం చేసిందంటే?
ఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్కు ఢిల్లీ వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. విమానంలో ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి ఐదో తేదీన పింకీ అనే మహిళ బాకు-ఢిల్లీ ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ సందర్భంగా విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, ఈ ఘటనపై ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీని వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను ఇండిగో ఎయిర్ లైన్స్కు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సదరు ప్రయాణికురాలికి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని పేర్కొంది.అయితే.. ఈ ఆదేశాలను ఇండిగో వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటు కేటాయించినట్లు తెలిపింది. అనంతరం ఆమె సౌకర్యవంతంగా తన ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే రికార్డులలో భాగమైన సిట్యువేషన్ డేటా డిస్ప్లే నివేదికను సమర్పించడంలో ఎయిర్లైన్స్ విఫలమైందని తెలిపింది. అందుకే జరిమానాను చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. -
భారీ వర్షాలు.. ఢిల్లీలో పెను విషాదం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న(శుక్రవారం) రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది మృతిచెందారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.కాగా, శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.#दिल्ली के जैतपुर थाना इलाके में आज एक हादसा - लगभग 100 फुट लंबी दीवार गिर गई जिसकी चपेट में पास की कई झुग्गियां आ गई है। pic.twitter.com/FsEMHTY8o6— Rohit Chaudhary (@rohitch131298) August 9, 2025 -
Heavy Rainfall: ఢిల్లీకి రెడ్ అలర్ట్
-
భారతీయ దుస్తుల్లో ఎందుకొచ్చారు?.. జంటకు రెస్టారెంట్లోకి నో ఎంట్రీ!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారతీయ వస్త్రధారణతో రెస్టారెంట్కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో వెళ్లిన కారణంగా వారిని రెస్టారెంట్లోకి అనుమతించ లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. వింత సమాధానం ఇవ్వడం గమనార్హం.వివరాల ప్రకారం.. ఢిల్లీలో పితాంపురలో ఉన్న రెస్టారెంట్కి ఓ జంట డిన్నర్కు వెళ్లారు. భారతీయ వస్త్రధారణతో వారిద్దరూ వెళ్లడంతో సదరు రెస్టారెంట్ జంటకు లోపలికి అనుమతించలేదు. సిబ్బంది అనుమతి నిరాకరించారు. రెస్టారెంట్లోకి ఇతరులను అనుమతించగా.. తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. దీంతో, వారికి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం, ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని మంత్రి కపిల్ మిశ్రా ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై రెస్టారెంట్ యజమానులు కస్టమర్స్కు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించరని పేర్కొన్నారు.How can a restaurant in India stop entry in India for wearing an Indian wear…Dear @KapilMishra_IND ji,Please look into the matter. pic.twitter.com/f1ueFvPIco— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) August 8, 2025ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ స్పందించారు. తమ రెస్టారెంట్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవంటూ తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చారు. రెస్టారెంట్లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదన్నారు. కస్టమర్స్ అందరికీ ఆహ్వానం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఇలా ప్రవర్తించే రెస్టారెంట్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.This is unacceptable in Delhi पीतमपुरा के एक रेस्टोरेंट में भारतीय परिधानों पर रोक का वीडियो सामने आया है ये अस्वीकार्य है CM @gupta_rekha जी ने घटना का गंभीरता से संज्ञान लिया है अधिकारियों को इस घटना की जांच व तुरंत कार्यवाही के निर्देश दिए गए हैं https://t.co/ZUkTkAZmAT— Kapil Mishra (@KapilMishra_IND) August 8, 2025 -
‘పీఎం–ఉజ్వల’కు రూ.12వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షాబంధన్ వేడుకల వేళ దేశ మహిళలకు కేంద్రం శుభవార్త తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు చేయూత నిచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ.12,060 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్న 10.33 కోట్ల గృహ వినియోగదారులకు మేలు చేకూర్చనుంది. ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 9 రీఫిల్ల వరకు 14.2 కిలోల సిలిండర్కు రూ.300 వరకు రాయితీ ఇస్తుంది. ఉజ్వల వినియోగదారుల సగటు తలసరి వినియోగం 2019–20లో కేవలం 3 రీఫిల్స్, 2022–23లో 3.68 రీఫిల్స్గా ఉండగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి 4.47కి చేరింది. 2016లో ప్రారంభమైన ఈ పథకం కింద 2024–25 వరకు రూ.52 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందన్నారు. ఎల్పీజీ ధరల స్థిరీకరణకుగాను చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.30వేల కోట్ల ప్రధాన సబ్సిడీ ప్యాకేజీని కూడా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. మన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం వరకు దిగుమతులే తీరుస్తున్నాయన్నారు. దీంతోపాటు, 175 ఇంజనీరింగ్ సంస్థలు, 100 పాలిటెక్నిక్లతో కూడిన 275 సాంకేతిక సంస్థల్లో ’మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్’(ఎంఈఆర్ఐటీఈ) పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనపై సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం, పాలనను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. 2025–26 నుంచి 2029–30 వరకు మొత్తం రూ.4,200 కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనుండగా, ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం రూ.2100 కోట్లని కేంద్ర మంత్రి తెలిపారు. వీటితో పాటే అస్సాం, త్రిపురల్లో అమల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల పథకం (ఎస్డీపీ) కింద రూ.4,250 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ వివరించారు.వీటితోపాటు కేంద్ర కేబినెట్ తమిళనాడులోని మరక్కణమ్– పుదుచ్చేరిని కలిపే నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2,157 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
వీడి వల్ల డబ్బు దండగ!.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా స్టార్
‘వీడి వల్ల ఏమవుతుందిలే? క్రికెట్ ఆడుతున్న ప్రతోడు సచిన్, కోహ్లి అయిపోతారా ఏంటి? వీడిపై పెట్టుబడి దండగ. డబ్బు వృథా’ అంటూ గేలి చేసిన వాళ్ల ముందే టీమిండియాకు ఆడటమే కాదు.. చిన్న వయసులోనే ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే.. ఆ కిక్కే వేరప్పా!!భారత యువ పేసర్ హర్షిత్ రాణా Harshit Rana) విషయంలో ఇదే నిజమైంది. తనను హేళన చేసిన బంధువుల ముందే తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు 23 ఏళ్ల ఈ ఫాస్ట్బౌలర్. దండగ అంటూ తిట్టినోళ్లే తనను పొగిడేలా చేసుకున్నాడు. అప్పుడు కనీసం తనతో మాట్లాడని వాళ్లు కూడా.. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే కాస్త గొప్పగానే అనిపిస్తున్నా.. వారికి రిప్లై మాత్రం ఇవ్వడం లేదంటున్నాడు హర్షిత్ రాణా.పేరుప్రఖ్యాతులు రాగానే..దేశానికి ఆడే స్థాయికి చేరుకునే క్రమంలో తనకు బంధువుల నుంచి ఎదురైన తిరస్కారం గురించి హర్షిత్ రాణా స్వయంగా వెల్లడించాడు. ‘‘మనకు ఒక్కసారి పేరుప్రఖ్యాతులు రాగానే.. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ‘దగ్గరై బంధువు’లైపోతారు.నిరాశపరిచే వారే ఎక్కువనేను క్రికెటర్ అవుతానంటే నవ్విన నా సోదరసోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను వెనక్కిలాగే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయనువీడి వల్ల ఏం కాదు.. క్రికెట్లో అసలేం ఉందని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. అయితే, ఈరోజు వాళ్లే మళ్లీ మా నాన్నకు ఫోన్ చేసి.. నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను మాత్రం వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయను.ఇదేమీ నా ఓవర్ ఆటిట్యూడ్ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారు. అలాంటి వాళ్లతో ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటాను’’ అంటూ హర్షిత్ రాణా ఉద్వేగానికి లోనయ్యాడు. యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్.. తన మనసులోని భావాలు పంచుకున్నాడు.ఐపీఎల్ నుంచి టీమిండియా బాటకాగా 2022లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన హర్షిత్ రాణా.. గతేడాది అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఈ రైటార్మ్ పేసర్ తన వంతు పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. 2024లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వన్డే, టీ20లలోనూ టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు తన కెరీర్లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన 23 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 10, 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు. చివరగా ఈ మెగా వన్డే టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హర్షిత్ ఆడి ఓ వికెట్ తీశాడు కూడా! చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్ -
దొంగను పట్టించిన శివుని టాటూ.. ఎంపీ సుధకు ఊరట
న్యూఢిల్లీ: లోక్సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్పై బయటకు వచ్చాడు.ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్టీ కారిడార్ సమీపంలో బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుడు సోహన్ రావత్ ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్ మొబైల్ నంబర్ను అందించింది. ఫలితంగా రావత్ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలే కేంద్రంగా పారదర్శక పాలన
న్యూఢిల్లీ: ప్రజాసేవే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో గత 11 ఏళ్లుగా పారదర్శక, స్పందించే, పౌరులే కేంద్రంగా ఉన్న పరిపాలనా విధానం కొనసాగుతోందని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందుకోసం స్పష్టమైన విజన్తో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో కర్తవ్య భవన్–03ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతోపాటు మరిన్ని ఇతర మౌలిక సదుపాయాలు భారతదేశ గ్లోబల్ విజన్కు ప్రతీక అని ఉద్ఘాటించారు. బ్రిటిష్ కాలం నాటి భవనాల్లో ప్రభుత్వ యంత్రాంగం దశాబ్దాలుగా పని చేస్తోందని, అవి చాలావరకు కాలం చెల్లిపోయాయని అన్నారు. ఆయా భవనాల్లో సరైన వసతులు, గాలి, వెలుతురు కూడా లేవని చెప్పారు. అందుకే నేటి అవసరాలకు అనుగుణంగా అందుకే కర్తవ్య భవనాలు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తం 10 భవనాలు నిర్మిస్తున్నామని, వీటితో ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.1,500 కోట్లు ఆదా అవుతాయని స్పష్టంచేశారు. విజయ గాథలు లిఖించాలి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజయ గాథలను లిఖించడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అదే మనందరి సంకల్పం కావాలన్నారు. మన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించాలని, దేశంలో ఉత్పాదకత పెంచాలని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పానికి గుర్తు కర్తవ్య భవన్ అని వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది దశ దిశను నిర్దేశిస్తుందని ఉద్ఘాటించారు. మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న ప్రపంచవ్యాప్తంగా సమయంలోనే చాలా దేశాలు స్వాతంత్య్రం పొందాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆయా దేశాల తరహాలో మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆత్మసమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇప్పటి సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకోవడం మన బాధ్యత అని చెప్పారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించకూడదని స్పష్టంచేశారు. అత్యాధునిక వసతులతో కర్తవ్య భవన్–03 దేశ రాజధానిలో కర్తవ్య భవన్–03 అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 10 ఉమ్మడి కేంద్ర సచివాలయ(సీసీఎస్) భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్మాణం పూర్తయిన తొలి భవనాన్ని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కర్తవ్య భవన్–03లో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంఎస్ఎంఈ, పెట్రోలియం–సహాజవాయువు శాఖలు కొలువుదీరబోతున్నాయి. ముఖ్య శాస్త్రీయ సలహాదారు కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు బ్రిటిష్ కాలంతోపాటు 1950వ దశకంలో, 1970వ దశకంలో నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్లో పని చేస్తున్నాయి. ఆయా భవనాలు చాలావరకు బలహీన పడడంతో నూతన భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కర్తవ్య భవన్–03ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ భవనమంతా కలియదిరిగారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఈ భవనంలో యోగా రూమ్, మెడికల్ రూమ్ సహా అత్యాధునిక వసతులున్నాయి. కర్తవ్య భవన్–01, కర్తవ్య భవన్–02 నిర్మాణం వచ్చే నెలలో పూర్తికానుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని, వైస్ ప్రెసిడెంట్ కాంక్లేవ్ను నిర్మించిన సంగతి తెలిసందే. అలాగే విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ దాకా కర్తవ్య పథ్ను అభివృద్ధి చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్, కేబినెట్ సెక్రెటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్ నిర్మించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. మొదటి మూడు కర్తవ్య భవన్ల భద్రతకు కేంద్ర ప్రభుత్వం 735 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..
ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు సర్వసాధారణమే. పోరాడి గెలుస్తుండగా..లాగిపెట్టి అమాంతం కిందపడేసే కష్టాలు హఠాత్తుగా ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంటే..గెలుపు అన్న మాట భయంగా మారిపోతుంది. మళ్లీ తిరిగి లేచి నిలబడటానికి ధైర్యం చాలదు కూడా. కానీ ఈ మహిళ గుక్కపెట్టి ఏడిపించిన కష్టానికి తన దైన శైలిలో సమాధానం ఇచ్చి నిలబడటమే గాక..ఆ కష్టమే తోకముడిచి పారిపోయేలా అచంచలంగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ మహిళే నీతు మేడమ్గా పేరుగాంచిన నీతుసింగ్. జార్ఖండ్లోని గిరిదిహ్లో జన్మించిన నీతు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి కిషోర్ దేవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో తన అన్నయ్య, ఆరుగురు సోదరిమణులతో కలసి పెరిగింది. చిన్ననాటి నుంచే కష్టం విలువ తెలిసిన ఆమె చదువులో బాగా రాణించేది. కార్మెల్ కాన్వెంట్, సెయింట్ జాన్స్ స్కూల్ (వారణాసి)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. వినోబా భావే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. అప్పుడే కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. ఆ సెంటర్ని ప్రారంభించిన ఒక ఏడాదికి రాజీవ్ సౌమిత్రను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారామౌంట్ కోచింగ్ సెంటర్ని విజయవంతంగా నడిపారు. దాదాపు రూ. 200 కోట్ల టర్నోవర్ సంస్థగా మలిచారు. పోటీ పరీక్షల కోసం నీతు ఇంగ్లీష్ వాల్యూమ్1 అనే పుస్తకాన్ని రచించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన కాంపిటీషన్ బుక్గా నిలిచింది కూడా. ఇంతలో ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అది రాను రాను మరింతగా క్షీణించే స్థాయికి వచ్చేసింది. ఆమె కూడా ఆ కోచింగ్ సెంటర్లో దాదాపు 50% వాటాదారు అయినా..ఆమెభర్త ఆగస్టు 5,2015న బౌన్సర్ల చేత బలవంతంగా బయటకు గెంటేశాడు. దాంతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేసింది నీతు జీవతం. వివాహం విచ్ఛిన్నమవ్వడమే గాక లాభాల బాట పట్టించిన వ్యాపారం కూడా పోయింది. తగ్గేదేలే అంటూ లేచి నిలబడింది..మళ్లీ పరిస్థితి చలికిలబడినట్లు అయినా..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడి ఆ దిశగా సాగింది. ఈసారి తన తండ్రి దివంగత కిషోర్ దేవ్ పేరుతో కేడీ కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. చూస్తుండగానే అచిరకాలంలోనే ఆ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ర్యాంకర్లుగా మార్చే సంస్థగా కేడీ సంస్థ పేరుతెచ్చుకుంది. ఇలా మంచి లాభాలతో దూసుకుపోతున్న కోచింగ్ సెంటర్కి మళ్లీ మహమ్మారి రూపంలో బ్రేక్ పడింది. అయినా సరే టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా అడుగులేసి ఆన్లైన కోచింగ్లు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఆమె యూట్యూబ్ ఛానెల్కి సుమారు రెండు మిలయన్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండటమే గాక, వేలాదిమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులకు తీర్చిదిద్దింది. అంతేగాదు తన కోచింగ్ సెంటర్తో పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది నీతు. బాల్యంలో తండ్రిని కోల్పోవడం దగ్గర నంచి మొదలైన ఎదురుదెబ్బలు వెవాహిక జీవితం కోల్పోవటం, నమ్మక ద్రోహం వరకు భరింపరాని కష్టాలను కడగండ్లను ఎందుర్కొంది. అయినా ఎక్కడ నా వల్ల కాదు అని గివ్ అప్(చేతులెత్తేయ లేదు) ఇవ్వలేదు. జీరో నుంచి మళ్లీ మెదలు పెట్టినా.. చివరికి గెలుపు మాత్రం నాదే అని ప్రూవ్ చేసింది నీతు మేడమ్. చిన్న చిన్న కష్టాలకే భయపడే నేటి యువతరానికి నీతు సింగ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.(చదవండి: ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్) -
చెప్పినట్లే చేసిన టెస్లా.. ఇక రెండో షోరూం ఎక్కడంటే?
ఆగస్టు 4న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో తన మొదటి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇదివరకే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జింగ్ స్టాల్స్(డీసీ చార్జింగ్), నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్(ఏసీ చార్జింగ్) ఉన్నాయి.వీ4 సూపర్చార్జర్లు కిలోవాట్కి రూ.24, డెస్టినేషన్ చార్జర్లు కిలోవాట్కి రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెప్టెంబర్ చివరి కల్లా ముంబైలోని లోయర్ పరేల్, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో కొత్త చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ వివరించింది.ఢిల్లీలో రెండో షోరూంటెస్లా తన రెండో షోరూంను ఢిల్లీలోని ఏరోసిటీ(వరల్డ్ మార్క్ 3)లో ఆగస్టు 11న ప్రారంభించనుంది. కాగా తొలి షోరూంను జూలై 15న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. -
ఎర్రకోటలో నిఘా వైఫల్యం.. బంగ్లాదేశీయులు అరెస్ట్.. అధికారులు సస్పెండ్
ఢిల్లీ: భారత స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమవుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. డమ్మ బాంబును భద్రతా అధికారులు గుర్తించకపోవడం ఒక కారణం అయితే.. ఎర్రకోటలోకి ఐదుగురు బంగ్లా దేశీయులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ కార్యaక్రమం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోటలో స్పెషల్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు భద్రతాధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. మొత్తం ఏడుగురు సస్పెండ్ కాగా.. వారిలో హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఉన్నారు. 7 police personnel, including constables and head constables, deployed for the security of the Red Fort, have been suspended due to negligence in security. The Delhi Police conducts daily drills as part of preparations for the program scheduled for 15th August. A team of the…— ANI (@ANI) August 4, 2025ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లాదేశ్కు చెందిన ఐదుగురు యువకులు.. ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్ట తెలిపారు. 20-25 ఏళ్ల వయసున్న వీరంతా అక్రమ వలసదారులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఎర్రకోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. Delhi Police arrested 5 Bangladeshi nationals who tried to forcibly enter the Red Fort premises. All of them are illegal immigrants. @Sreya_Chattrjee with more details.#news #ITVideo @anchorAnjaliP #RedFort #Delhi pic.twitter.com/JD56T6Mc5W— IndiaToday (@IndiaToday) August 5, 2025 -
మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలకు భద్రత కరువవుతున్నదనే మాట తరచూ వినిపిస్తుంటుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్కు వెళుతూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉదయం నడకకు వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ, ఆమె మెడలో నుంచి చైన్ లక్కెళ్లిన దొంగ అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. తమిళనాడు భవన్ నుండి ఎంపీ సుధ.. మరో మహిళా పార్లమెంటు సభ్యురాలు రాజతి వాకింగ్కు వెళుతూ, రాయబార కార్యాలయం సమీపంలో ఉన్నప్పుడు ఒక స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఎంపీ సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఇద్దరు ఎంపీలు అతనిని గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో ఎంపీ మెడకు గాయాలయ్యాయి. -
ఢిల్లీలో మార్నింగ్ వాక్.. కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేసిన దొంగ
న్యూ ఢిల్లీ: రోజురోజుకీ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని బైక్పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఈ అనుభవం ఓ మహిళా ఎంపీకి కూడా ఎదురైంది కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్ చైన్ దొంగతనానికి గురైంది. ఢిల్లీలో ఉదయం వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని గొలుసు దొంగలు కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తోటి శాసనసభ్యడు, డీఎంకేకు చెందిన రాజాతితో కలిసి వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. దొంగ తనా మెడ నుంచి గొలుసును లాగడంతో, ఆమె మెడపై గాయాలయ్యాయని, తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.అదే విధంగా ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. స్కూటర్పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లాడని ఆమె పేర్కొన్నారు. కాగా సుధా రామకృష్ణన్ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. -
పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులైన రహదారులు
న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) ఉదయం నుంచి రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్లు ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గురుగ్రామ్లో భారీ వర్షాల కారణంగా జలమయమైన ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై జనం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. VIDEO | Heavy rains caused severe waterlogging in parts of Delhi. Visuals from Deoli Vidhan Sabha. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/kR0s9gewpZ— Press Trust of India (@PTI_News) August 2, 2025విజయ్ చౌక్, కన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జి, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచకుయన్ మార్గ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతమయ్యింది. జనపథ్, లజ్పత్ నగర్, మింటో బ్రిడ్జిలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. డియోలి ప్రాంతానికి చెందిన దృశ్యాలు వర్షం తీవ్రతను చూపించాయి. ఈ మార్గాలలో రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పంచకుయన్ మార్గ్కు సంబంధించిన వీడియో ఫుటేజ్లో వర్షం కారణంగా వాహనాలు నీటిలో నడుస్తున్నట్లు, ట్రాఫిక్, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడాన్ని చూపిస్తున్నాయి. సరోజినీ నగర్, కన్నాట్ ప్లేస్లలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi | Waterlogging in parts of the national capital following a spell of rain. (Visuals from Panchkuian Marg) pic.twitter.com/Im77ERO6Ps— ANI (@ANI) August 2, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం బహదూర్గఢ్, మనేసర్ తదితర ఎన్సీఆర్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ బల్లభ్గఢ్లతో సహా ఢిల్లీ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi: Rain lashes several parts of the National Capital.(Visuals from Sarojini Nagar) pic.twitter.com/gXlpXwmsJh— ANI (@ANI) August 2, 2025ఢిల్లీలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణ సగటు కంటే 1.1 డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.4 డిగ్రీలు తక్కువ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సంతృప్తికరమైన వర్గంలోనే ఉంది శనివారం సాయంత్రం 6 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 84గా నమోదైంది. -
ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని అన్నారు. గత ఏడాది లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తన వద్దనున్న అణు బాంబును అతిత్వరలో ప్రయోగిస్తానని, అది మన ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని తేల్చిచెప్పారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోదీ ఈసారి అతి తక్కువ మెజారీ్టతో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఎన్డీయేకు మరో 15 సీట్లు తక్కువ వచ్చి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలను రిగ్గింగ్ చేయొచ్చని, గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని త్వరలో నిరూపిస్తామని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఆ కొత్త ఓటర్లు ఎవరు? ఎన్నికల సంఘం స్వతంత్రను కాపాడుతున్నది రాజ్యాంగమే. కానీ, రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘం అతిక్రమిస్తోంది. లెక్కలేకుండా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై గతంలో నా దగ్గర ఆధారాల్లేవు. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయలేదు. కానీ, ఇప్పుడు 100 శాతం సాక్ష్యం ఉంది కాబట్టే పూర్తివిశ్వాసంతో మాట్లాడుతున్నా. ఎన్నికల్లో అవకతవకలు ఎలా సాధ్యమని కురీ్చలో కూర్చున్నవారు అడుగుతున్నారు. కానీ, అది ముమ్మాటికీ సాధ్యమే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎన్నికల వ్యవస్థపై నాకు ఎప్పటి నుంచో అనుమానాలున్నాయి. 2014 నుంచే జగరానిది ఏదో జరుగుతున్నట్లు సందేహాలు తలెత్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో అనుమానాలు బలపడ్డాయి. అక్కడ బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించించింది. రాజస్తాన్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. మధ్యప్రదేశ్, గుజరాత్లోనూ సీట్లు రాలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి స్కోర్ సాధించిన మూడు పారీ్టలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీట్లు గెల్చుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలపై అప్పటి నుంచే సీరియస్గా దృష్టి పెట్టాం. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల తర్వాత కొత్తగా కోటి మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. ఆ కొత్త ఓటర్లు ఎవరన్నదానిపై నావద్ద స్పష్టమైన ఆధారం లేదు. ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని మా మిత్రపక్షాలతోనూ చెప్పా. ఇప్పుడు ఆధారం దొరికింది. దేశంలో ఎన్నికల సంఘం అనేదే లేదు, అది అదృశ్యమైపోయిందని నిరూపించే సాక్ష్యాధారాన్ని దేశానికి చూపిస్తాం. ఓటర్ల జాబితాల సంగతేంటి? లోక్సభ ఎన్నికల్లో జరిగిన మోసంపై ఆధారాలు సేకరించడానికి ఆరు నెలలపాటు శ్రమించాం. ఎల్రక్టానిక్ రూపంలోని ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం మాకు ఇవ్వలేదు. బూత్ల వారీగా కాగితాల రూపంలోని జాబితాలు ఇచ్చారు. ఎన్నికల సంఘం వాటిని స్కాన్ చేయలేదు. ఓటర్ల జాబితాలను స్కాన్ చేసి ఎందుకు భద్రపర్చడం లేదు? వాటి ఎల్రక్టానిక్ కాపీలను భద్రపర్చాల్సిన అవసరం లేదా? ఒక లోక్సభ నియోజకవర్గంలో భౌతిక రూపంలోని ఓటర్ల జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తే 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షల ఓట్లు తప్పుడు వని తేలిపోయింది’ అని రాహుల్ స్పష్టం చేశారు. జైట్లీ బెదిరించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నేను తీవ్రంగా వ్యతిరేకించా. కానీ, వ్యతిరేకించవద్దని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే నాపై చర్యలు తీసుకుంటామని బెదిరించాలని చూశారు. ఆయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ గట్టిగా బదులిచ్చా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదనుకుంటా... మేము కాంగ్రెస్ మనుషులం. పిరికిపందలం కాదు. మేము ఎవరికీ తలవంచం. బ్రిటిష్ పాలకులే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మాకు చెప్పడానికి మీరెవరు? అని నిలదీశా’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. 2019లో చనిపోతే 2020లో బెదిరించారా?: రోహన్ జైట్లీ ఆరుణ్ జైట్లీ బెదిరించడానికి ప్రయతి్నంచారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఖండించారు. తన తండ్రి 2019లో మరణించారని, వ్యవసాయ చట్టాలు 2020లో వచ్చాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాహుల్ గాం«దీని బెదిరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు రోహన్ జైట్లీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినవారిని బెదిరింపులకు గురి చేయడం తన తండ్రికి అలవాటు లేదని, అది ఆయన వ్యక్తిత్వం కాదని పేర్కొన్నారు. -
మోదీని గద్దెదించడం సంఘ్ పరివార్ వల్ల కాదు, కానీ..: రేవంత్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పీఠాన్ని వదులుకునేందుకు మోదీ సిద్ధంగా లేరని, ఆయన్ని గద్దె దించాలని సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారాయన. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కుల గణన పూర్తి చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీది. 2004, 2009 లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ తీసుకోలేదు. సీనియర్లకు ప్రధాని పదవి అప్పగించారు. కానీ.. ..2001 నుంచి నరేంద్ర మోదీ అధికార కుర్చీని వీడడం లేదు. ఆర్ఎస్ఎస్ ఆ కుర్చీని వదిలేయాలని చెప్పినా కూడా మోదీ వదలడం లేదు. 75 ఏళ్ల వయసు వచ్చిన వారు పదవి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లకు వర్తించిన వయస్సు పరిమితి అంశం.. మోదీకి వర్తించదా?.. .. మోదీని గద్దె నుంచి దించేందుకు సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. మోదీని దించేయడం సంఘ్ పరివార్ వల్ల కాదు. మోదీని గద్దె దింపడం కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వల్లే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోడీని గద్దె దింపుతాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు మించి గెలవదు. మోదీ బారి నుంచి దేశాన్ని రక్షిస్తాం. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’’ అని రేవంత్ అన్నారు. -
‘పెద్ద లగేజీ మెట్లపై అమాంతం పడగానే..’: ఢిల్లీ విషాదంపై రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: కుంభమేళా సమయంలో ఢిల్లీ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విషాదానికి దారితీసిన కారణాలపై రాజ్యసభలో ఒక సభ్యుడు అడిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. స్టేషన్లో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో మెట్లపై నుంచి వస్తున్న ఎవరో ప్రయాణికుని తలపై నుంచి భారీ లగేజీ పడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని తెలిపారు.2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. అది ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న సమయం కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మంత్రి అశ్విని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో.. నాటి దురదృష్టకర ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ అందించిన నివేదిక వివరాలను తెలియజేశారు.రైల్వే మంత్రి ఆ ఘటనను ‘తొక్కిసలాట’ అని పేర్కొననకుండానే వివరాలు అందించారు. విషాదం జరిగిన రోజున, రైల్వే స్టేషన్లో 49 వేల జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది రోజువారీ సగటు కంటే 13 వేలు ఎక్కువ అని వైష్ణవ్ గత మార్చిలో లోక్ సభకు తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆయన ఆరోజు స్టేషన్కు అధిక సంఖ్యలో చేరుకున్న ప్రయాణీకులను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని, రాత్రి 8.15 గంటల తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. వీరిలో చాలామంది ప్రయాణికులు పెద్ద లగేజీలను తలపై మోస్తున్నారు. ఇది ప్రయాణికుల కదలికలను అమితంగా ప్రభావితం చేసింది.ఇంతలో ప్రయాణికులలోని ఒకరి తలపై నుండి పెద్ద లగేజీ అమాంతం కింద పడిపోవడంతో దుర్ఘటన సంభవించింది. మెట్లపై ఉన్న ప్రయాణికులు జారిపడ్డారు. ఈ ఘటన రాత్రి 8.48 గంటలకు జరిగిందని మంత్రి చెప్పారు. పెద్ద లగేజీ ఒక్కసాగిగా పడగానే ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. లక్ష పరిహారం అందించామని, మొత్తం 33 బాధిత కుటుంబాలకు రూ. 2.01 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటన దరిమిలా రైల్వేలు భద్రత కోసం నూతన చర్యలను అమలులోకి తెచ్చాయి. శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలు, విశాలమైన ఫుట్ ఓవర్బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, ప్రధాన స్టేషన్లలో వార్ రూమ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. -
తెలుగు చిత్రం మెరిసింది
71వ జాతీయ సినీ అవార్డులను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. 2023లో జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని, ఈ అవార్డులను ప్రకటించారు. అశుతోష్ గోవారీకర్ అధ్యక్షుడిగా, పదకొండు మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను నిర్ణయించింది. నాన్–ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డుల విజేతలను ప్రకటించిన జ్యూరీకి పి. శేషాద్రి చైర్పర్సన్గా వ్యవహరించారు. అవార్డుల్లోని ప్రధాన విభాగాల్లో హిందీ సినిమా జోరు కనిపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలాంటి ప్రధాన విభాగాల్లో నార్త్ సినిమా హవా కనిపించగా, టెక్నికల్ విభాగాల్లో దక్షిణాది సినిమాలకు అవార్డులు వచ్చాయి. కాగా తెలుగు చిత్రసీమ ఏకంగా ఏడు అవార్డులు దక్కించుకుని మెరిసింది.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం విశేషం. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్ఫుల్ యాక్టర్గా రాణిస్తున్న షారుక్ ఖాన్కు తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లోని ‘జవాన్’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్ మెస్సీకీ అవార్డు దక్కింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్ చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’లో హీరోగా నటించారు విక్రాంత్ మెస్సీ. విధు వినోద్ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది. ఇక తన బిడ్డల కోసం ఓ తల్లి చేసిన అసాధారణ పోరాటం ఆధారంగా రూపొంది, ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలోని నటనకుగాను రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడి అవార్డు ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు గాను సుదీప్తో సేన్కు దక్కింది. ఇక తెలుగు సినిమాకి దక్కిన అవార్డుల విషయానికొస్తే... 2023 దసరాకి విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘భగవంత్ కేసరి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇక 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో అవార్డులు వచ్చాయి. ‘హను–మాన్ (నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, యానిమేటర్–వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జెట్టి వెంకట్ కుమార్లు అవార్డులు అందుకుంటారు. అలాగే స్టంట్ కొరియోగ్రఫీకి సంబంధించి నందు, పృథ్వీ అవార్డులు అందుకుంటారు. ‘బేబీ’ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. మంచి స్క్రీన్ప్లేను సమకూర్చి యువత పల్స్ పట్టుకున్న ఈ చిత్రదర్శకుడు సాయిరాజేశ్కు స్క్రీన్ప్లే రైటర్ (ఒరిజినల్)గా, ఇదే చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా...’ పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎస్ఎన్ రోహిత్కు అవార్డులు వచ్చాయి. జాతీయ వ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘యానిమల్’ సినిమాకు ఆర్ఆర్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్కు అవార్డు దక్కింది. ఇక ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటను రాసినందుకు గాను బెస్ట్ లిరిక్ రైటర్గా కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది. ఉత్తమ బాలనటి విభాగంలో ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించగా, వారిలో తెలుగు నుంచి ప్రముఖ దర్శక – నిర్మాత సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉన్నారు. ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి అవార్డు లభించింది. 2023లో విడుదలైన సినిమాలకే అవార్డులను ప్రకటించారు. కానీ... ‘హను–మాన్’ సినిమా 2024లోవిడుదలైంది కదా అనే సందేహం రావొచ్చు. కానీ ఈ సినిమాకు 2023లో సెన్సార్ పూర్తయింది. ఇంకా పలు విభాగాల్లో పలు భాషలకు చెందిన అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఆ అవార్డుల జాబితా ఈ విధంగా... → ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ – జవాన్ → నటుడు: విక్రాంత్ మెస్సీ – ‘ట్వెల్త్ ఫెయిల్’ → నటి: రాణీ ముఖర్జీ – మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రం → సహాయ నటుడు: విజయరాఘవన్ – ‘పోక్కాలమ్’ (మలయాళం); ముధుపెట్టయి సోము భాస్కర్ – ‘పార్కింగ్’ (తమిళ చిత్రం) → సహాయ నటి: ఊర్వశి – ఉళ్లోళుక్కు (మలయాళ చిత్రం); → జంకీ బోడివాల – ‘వశ్ (గుజరాతీ చిత్రం) → చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి – (గాంధీ తాత చెట్టు → కబీర్ ఖాండరి – జిప్సీ (మరాఠీ మూవీ) → త్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ – నాల్ 2 (మరాఠీ మూవీ) → మేల్ ప్లేబ్యాక్ సింగర్: ప్రేమిస్తున్నా.. (పీవీఎన్ ఎస్ రోహిత్) – బేబీ మూవీ → ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: చెలియా.. (శిల్పరావు సింగర్) – జవాన్ → సినిమాటోగ్రఫీ: ప్రసంతను మొహపాత్ర – ది కేరళ స్టోరీ → ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – బేబీ: సాయిరాజేశ్ నీలం → పార్కింగ్: రాంకుమార్ బాలకష్ణన్ → డైలాగ్ రచయిత: దీపక్ కింగక్రాని: సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై → తమిళ చిత్రం – పార్కింగ్ → పంజాబీ చిత్రం – గొడ్డే గొడ్డే చా → ఒడియా చిత్రం– పుష్కర → మరాఠీ చిత్రం – శ్యాంచీ ఆయ్ → మలయాళ చిత్రం – ఉళ్లోళుక్కు → కన్నడ చిత్రం – కందిలు → హిందీ చిత్రం: కాథల్ → గుజరాతీ చిత్రం: వశ్ → బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ → అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982 → యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) – హనుమాన్ , స్టంట్ కొరియోగ్రాఫర్: నందు, పృథ్వి → స్పెషల్ మెన్షన్ : యానిమల్ (రీ రికార్డింగ్ మిక్సర్) – ఎమ్ఆర్ రాజకృష్ణన్భగవంత్ కేసరిబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇతర పాత్రలు పోషించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా 2023 అక్టోబర్ 19న విడుదలైంది. ‘భగవంత్ కేసరి’ కథేంటంటే... నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఒక ఊచకోత కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. మంచితనంతో అక్కడి జైలర్కు (శరత్ కుమార్) దగ్గరవుతాడు. జైలర్ కుమార్తె విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల)తో మంచి అనుబంధం ఏర్పడుతుంది భగవంత్ కేసరికి. విజ్జి పాపని ఆర్మీలో చేర్చాలనేది జైలర్ కల. అయితే అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించే క్రమంలో విజ్జి పాపని ఆర్మీలో చేర్పించమని భగవంత్ కేసరిని కోరతాడు. దీంతో ఆ పాప బాధ్యతల్ని భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా తయారు చేసి, ఆర్మీలో జాయిన్ చేయాలని శిక్షణ ఇప్పిస్తుంటాడు. అయితే ఆర్మీలో చేరడం విజ్జి పాపకు ఇష్టం ఉండదు. కానీ, ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం చెంది, శిక్షణ తీసుకుంటుంది. పోలీసాఫీసర్ అయిన భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? విజ్జి పాప మిలిటరీలో జాయిన్ అయిందా? లేదా? కేసరిని ఇష్టపడిన సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) భగవంత్కి చేసిన సాయం ఏంటి?ప్రాజెక్ట్ వి కోసం ప్రయత్నాలు చేస్తున్న బిలియనీర్ రాహుల్ సంఘ్వీతో (అర్జున్ రాంపాల్) భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏంటి వంటి అంశాలు ఈ సినిమాలో ఆసక్తిగా అనిపిస్తాయి. అంతేకాదు.. అమ్మాయిలపై గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పిన అంశం ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రధాన కారణం.‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడం గర్వంగా ఉంది. ఈ గౌరవం మా చిత్ర బృందానికి చెందుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిచ్చి, మరిన్ని శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరిచింది. – బాలకృష్ణ, నటుడుట్వెల్త్ ఫెయిల్ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా తెరకెక్కింది. మధ్యప్రదేశ్లోని చంబల్ లోయ ప్రాంతమైన మౌర్యానాకి చెందిన మనోజ్ కుమార్ శర్మది నిరుపేద కుటుంబం. చదువులో మనోజ్ బిలో యావరేజ్ స్టూడెంట్. అయితే ఓసారి మనోజ్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అవ్వమని స్టూడెంట్స్కు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దుష్యంత్ ప్రిన్సిపాల్ను జైలుకు పంపుతాడు. నిజాయితీగా చదివి పాస్ కావడంలోనే అసలైన గెలుపు ఉందని, మనల్ని మనం మోసం చేసుకోకూడదని డీఎస్పీ దుష్యంత్ స్టూడెంట్స్కు చెబుతాడు. ఇక మనోజ్ ఏమో ట్వెల్త్ ఫెయిల్ అవుతాడు. కానీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న మనోజ్ నిజాయితీగా చదివి ట్వెల్త్ పాస్ అవుతాడు. సివిల్స్వైపు అడుగులు వేస్తాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొంటాడు? రీ స్టార్ట్ అంటూ... ఫైనల్గా మనోజ్ ఎలా కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు? అన్నదే ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా కథ.ఏడు అవార్డులు రావడం సంతోషం71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు ఏడు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపికవడంపై బాలకృష్ణకి, తెలంగాణలోని పల్లె ఆ΄్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన ‘బలగం’లోని పాటల్లో ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ జాతీయ అవార్డుకు ఎంపికైన కాసర్ల శ్యామ్కు అభినందనలు. ‘బేబీ, హను–మాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు రావడం, ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి సుకృతి వేణి బాలనటిగా ఎంపికవడం అభినందనీయం. తెలుగు సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిజాతీయ ఉత్తమనటుడు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ అవార్డుకు నేను అర్హుడిని అని నమ్మిన జ్యూరీకి, కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ.. ఇలా అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి, నాకు అవకాశం కల్పించిన అట్లీసార్ అండ్ టీమ్కి థ్యాంక్స్..అట్లీసార్ చెప్పినట్లు...మాస్!. సినిమాల కోసం నేను మరింత కష్టపడాలన్న దానికి ఈ అవార్డు ఓ రిమైండర్ వంటిది. – షారుక్ ఖాన్, నటుడుమా ‘హను–మాన్’కి రెండు ప్రతిష్టాత్మక విభాగాలైన యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో అవార్డు వచ్చినందుకు మా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ చిట్టికి అభినందనలు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో నందు, పృథ్వీ మాస్టర్లకు ఈ అవార్డు వచ్చింది.. వారికీ అభినందనలు. మా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా తర ఫున చాలా థ్యాంక్స్. మా సినిమాకి ఈ గుర్తింపు ఇచ్చిన జ్యూరీ సభ్యులకు మా యూనిట్ తరఫున ధన్యవాదాలు. –ప్రశాంత్ వర్మ, డైరెక్టర్మా ‘బేబీ’ బెస్ట్ స్క్రీన్ప్లే, బెస్ట్ మేల్ సింగర్ విభాగాల్లో రెండు అవార్డులకి ఎంపికవడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ముఖ్యంగా స్క్రీన్ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఒక్కటే చెబుతాను. ఎస్కేఎన్ నమ్మకపోతే ఇది జరిగేది కాదు. చిన్న సినిమాలు తీసుకునే నన్ము నమ్మి ‘బేబి’ సినిమా నిర్మించి, నాకు ఈ గౌరవం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. అలాగే నా టీమ్కి కూడా అభినందనలు. మా సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాతో తనకు పెద్ద బ్రేక్ రావడం గర్వంగా ఉంది. – సాయి రాజేశ్, డైరెక్టర్జాతీయ అవార్డు సాధిస్తాననుకోలేదు. నాకు అవార్డు వచ్చిన విషయం తెలిసి దర్శకుడు సందీప్గారు హ్యాపీ ఫీలయ్యారు. ‘యానిమల్’ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడ్డాం. మనకు దక్షిణాదిలోనే చాలా పోటీ ఉంటుంది. అలాంటిది ఉత్తరాది వెళ్లి, అవార్డు అందుకోవడం అనేది దేవుడి దయ, కొంచెం అదృష్టం, నా కష్టం... ఇవన్నీ కలిసి నా కల నిజమై నట్లుగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి సందీప్రెడ్డిగారితో నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్గారి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాం. – హర్షవర్ధన్ రామేశ్వర్, సంగీత దర్శకుడురెండోసారి జాతీయ అవార్డు వచ్చినందుకు హ్యాపీగా ఉంది (గతంలో ‘సూరరై పోట్రు’కు వచ్చింది). ‘వాత్తి’ (తెలుగులో ‘సార్’గా విడుదలైంది) సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు నన్ను ఎంచుకున్న ‡హీరో ధనుష్కి ధన్యవాదాలు. నన్ను నమ్మి ప్రోత్సహించిన దర్శకుడు వెంకీ అట్లూరి, నాగవంశీ, త్రివిక్రమ్గార్లతో పాటు టీమ్ అందరికీ «థ్యాంక్స్. – జీవీ ప్రకాశ్, సంగీత దర్శకుడు -
PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్లో తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు
సాక్షి, విశాఖపట్నం: కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే ఈ మెగా లీగ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్..ప్రొ కబడ్డీ 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29 శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది.ఇక ఆగస్టు 30న, తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. ఇక సూపర్ సండే 30న తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్తో ప్రారంభించనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత పీకేఎల్ మళ్లీ వైజాగ్కు రావడం విశేషం. గతంలో 2018లో ఆరో సీజన్కు అంతకుముందు 1,3 వ సీజన్ పోటీలకు అతిథ్యం ఇచ్చిన ఈ నగరంలో ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి నెలకొననుంది.చాలా ఆనందంగా ఉందిఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.మిగతా నగరాల్లో షెడ్యూల్జైపూర్వైజాగ్లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్తో తలపడనుంది. 10వ సీజన్లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది.చెన్నైసెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.ఢిల్లీఅక్టోబర్ 13 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో లీగ్ చివరి దశ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు, ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్లు) మ్యాచ్లు కూడా నిర్వహించనున్నారు. -
‘మెట్రో’ను రాత్రి ఎందుకు నడపరు?.. తెలిస్తే.. ఇంతుందా? అంటారు..
దేశంలోని వివిధ నగరాల్లోని లక్షలాది మంది ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయం ఆదాతోపాటు ట్రాఫిక్ సమస్య ఉండదనే కారణంతో చాలామంది తమ ప్రయాణాలకు మెట్రోనే ఎంచుకుంటారు. అయితే మెట్రో రైళ్లను రాత్రి వేళ ఎందుకు నడపరనే విషయం చాలామందికి తెలియదు. దీని వెనుకనున్న కారణం తెలిస్తే, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.దేశంలో తొలి రైలు ప్రయాణం 1853లో ముంబై- థానే మధ్య ప్రారంభమైంది. పదేళ్ల తరువాత 1863లో ప్రపంచంలోనే మొట్టమొదటి మెట్రో రైలు సేవలు లండన్లో ప్రారంభమయ్యాయి. ఇది పట్టణాల్లో వేగవంతమైన రవాణా వ్యవస్థల ప్రారంభానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటి మెట్రో సేవలు 1984లో కోల్కతాలో ప్రారంభమయ్యాయి. ఇది ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో మెట్రో నెట్వర్క్లకు పునాది వేసింది.ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్కు నిలయంగా మారింది. మెట్రో సేవలు పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మార్చి 2024 నాటికి, భారతదేశంలోని 17 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాయి. దేశంలో మొత్తం 902.4 కిలోమీటర్లు (560.7 మైళ్ళు) మెట్రో లైన్లు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ మెట్రోకు అతిపెద్ద నెట్వర్క్ ఉంది. ఢిల్లీ మెట్రో 391 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్తో ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్లకు సేవలు అందిస్తుంది . ఢిల్లీ మెట్రోలో మొత్తం 286 స్టేషన్లను ఉన్నాయి. దేశంలో మెట్రో సేవలు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.మెట్రోను రాత్రి వేళ నడపకపోవడానికి ప్రధాన కారణం వాటి నిర్వహణ. రాత్రి వేళల్లో ట్రాక్ తనిఖీ, ఓవర్ హెడ్ పరికరాల తనిఖీలు, పగటిపూట సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి సిగ్నలింగ్ సిస్టమ్ అప్గ్రేడ్లు వంటి కీలకమైన నిర్వహణ పనులు చేస్తుంటారు. అలాగే కొత్త ట్రయల్ రన్లు, సిబ్బందికి శిక్షణనివ్వడం, కొత్త టెక్నాలజీని పరీక్షించడం లాంటి పనులను మెట్రోలో రాత్రివేళ నిర్వహిస్తుంటారు. మర్నాడు మెట్రోను సజావుగా నడిపేందుకు, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రాత్రి వేళ మెయింటెనెన్స్ పనులు చేస్తుంటారు. మెట్రో రైళ్లను రాత్రివేళ నడపకపోవడానికి ఇదే ప్రధాన కారణం. -
పోరుబాటలో పార్టీ సైతం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణలో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. మూడురోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఆగస్టు ఆరో తేదీన జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనేలా.. ప్రత్యేక రైలులో ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందిని పంపనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ప్రత్యేక రైలు ఈనెల ఆరో తేదీ ఉదయం కల్లా ఢిల్లీ చేరుకునేలా సమన్వయం చేయనుంది. ఢిల్లీలో పోరాటం నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర షెడ్యూల్ను కుదించారు. వాస్తవానికి ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆరు ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాల్సిన ఈ పాదయాత్రను వచ్చే నెల నాలుగో తేదీకి కుదించారు. నాలుగో తేదీ సాయంత్రం పాదయాత్ర ముగిసిన వెంటనే ముఖ్య నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో పాటు ముఖ్య నాయకత్వమంతా ఢిల్లీలోనే ఉండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగస్వాములు కావాలని పీసీసీ పిలుపునిచ్చింది. త్వరలో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ప్రకటన పార్టీ సంస్థాగత నిర్మాణం, పాదయాత్ర, ఢిల్లీ టూర్, నామినేటెడ్ పదవులపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశమయ్యారు. సీఎం నివాసంలో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. నామినేటెడ్ పదవుల కోసం జిల్లా ఇన్చార్జుల నుంచి వచ్చిన జాబితాలను మీనాక్షి, మహేశ్గౌడ్లు ముఖ్యమంత్రికి అందజేశారు.ఆయన వీటిని పరిశీలించి తుది జాబితాను ఖరారు చేస్తారని, వారం, పది రోజుల్లో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీసీ రిజర్వేషన్ల పోరాట ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఈ నెల ఐదో తేదీన పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశం చర్చకు వచ్చేలా వాయిదా తీర్మానం కోసం పార్టీ తరఫున పట్టు పట్టాలని, ఆరో తేదీన జంతర్మంతర్ వద్ద ధర్నా చేయాలని, ఏడో తేదీన రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
హీలియం గ్యాస్తో అనంత వాయువుల్లోకి.. ఢిల్లీలో తొలి కేసు
న్యూఢిల్లీ: కొందరు క్షణికావేశానికి లోనై నిండు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకుంటుంటారు. ఆ క్షణంలో వారు సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాన్ని బంగారుమయం చేసుకోగలుగుతారు. ఢిల్లీకి చెందిన ఒక యువ చార్టర్డ్ అకౌంటెంట్ హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ధీరజ్ కన్సల్ అనే 25 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ధీరజ్ ఫేస్బుక్లో తన సూసైడ్ నోట్ను పోస్ట్ చేశాడు. దానినే రాత పూర్వకంగానూ తన గదిలో ఉంచాడు. హీలియం గ్యాస్ పీల్చడంద్వారా ఢిల్లీలో నమోదైన తొలి ఆత్మహత్య కేసుగా ఇది నిలిచింది. ధీరజ్ గోల్ మార్కెట్లోని ఒక గెస్ట్ హౌస్లో బసచేస్తున్నాడు. అతను గది నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గెస్ట్ హౌస్ యజమానికి అనుమానం వచ్చింది.దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా, ధీరజ్ మంచం మీద అచేతనంగా కనిపించాడు. అతని నోటికి హీలియం సిలిండర్ను అనుసంధానం చేసిన పైపు ఉంది. అలాగే అతని ముఖం పారదర్శక ప్లాస్టిక్ షీట్తో కప్పి ఉంది. జూలై 20న గెస్ట్ హౌస్లో చెక్ ఇన్ చేసిన ధీరజ్ జూలై 28న చెక్ అవుట్ చేయాల్సి ఉంది. ధీరజ్ తన ఫేస్బుక్ పోస్ట్లో..‘నా మరణానికి ఎవరినీ నిందించవద్దు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నా జీవితంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ నాతో ఎంతో ప్రేమగా మెలిగారు.అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా డబ్బును అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. నా అవయవాలను దానం చేయండి. ఎవరూ ఇబ్బందుల్లో పడకూడదనే నేను ఎవరి పేర్లను ప్రస్తావించడం లేదు’ అని ధీరజ్ సూసైడ్ నోట్లో రాశాడు. ఘజియాబాద్లోని ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ నుండి ధీరజ్ హీలియం సిలిండర్ను ఆర్డర్ చేశాడని పోలీసులు గుర్తించారు. ధీరజ్ 2002లో తన తండ్రిని కోల్పోయాడు. అనంతరం తల్లి తిరిగి వివాహం చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ధీరజ్ తన తాత ఇంటిలో పెరిగాడు. -
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
టైగర్ ప్రిన్సెస్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.వాటిని చూడడం అదృష్టంనేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.– లతికానాథ్ -
ఆగస్ట్ 6న ఢిల్లీకి సీఎం బృందం.. ‘బీసీ బిల్లు’పై ధర్నా!
హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) ఆరో తేదీన సీఎం రేవంత్రెడ్డి బృందం ఢిల్లీకి పయనం కానుంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తేల్చుకోవడానికి సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించేందుకు గాను బీసీ బిల్లును తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోద ముద్ర కావాలి. ఈ క్రమంలోనే ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ ధర్నా చేయాలని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ రోజు(సోమవారం. జూలై 28) జరిగిన కేబినెట్ భేటీలో బీసీ బిల్లు అంశానికి సంబంధించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ,ఎమ్మెల్యే లు ,ఎంపీలు ఢిల్లీ వెళ్లి బీసీ బిల్లుపై డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ ‘ ఈడబ్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం క్యాప్ ఎప్పుడో ఎత్తేసారు. ఆర్ కృష్ణయ్య మౌనం వీడాలి... మాతో కలసి రావాలి. ఇండీ కూటమి పార్టీలతో కలసి పోరాటం చేస్తాం. రిజర్వేషన్ల కోసం సామ ధాన దండన ఉపయోగిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను ఎందుకు తొలగించడం లేదు. అక్కడ తొలగించి మమ్మల్ని అడగాలి. బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని బీజేపీకి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’ అని మండిపడ్డారు. -
TUWJ ఢిల్లీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న TUWJ ఢిల్లీ విభాగానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఢిల్లీ TUWJ అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేష్(సాక్షి టీవీ ),ప్రధాన కార్యదర్శిగా మేకా గోపికృష్ణ (టివి9),ఉపాధ్యక్షులుగా వంగా తిరుపతి(వెలుగు),పబ్బా సురేష్, కోశాధికారిగా రాజు కొన్నోజు(ఎన్టీవీ) కార్యదర్శులుగా రాజ్ కుమార్ గుజరాతి(సాక్షి), కామరాజు,లింగా రెడ్డి (టి న్యూస్), నాగరాజు(వి6) , కార్యవర్గ సభ్యులుగా పిల్లి రాజేందర్ (ఆంధ్ర ప్రభ ) సలహా దారులుగా సతీష్ ముక్కాముల(ఏ బి ఎన్ టీవీ ), డి. విజయ్ కుమార్, రాష్ట్ర కమిటి సభ్యులుగా రాజశేఖర్ రెడ్డి (సాక్షి ),శిరీష్ రెడ్డి(మహా న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ , IJU కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ ,కోశాధికారి యోగానంద,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి నాయక్ సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా TUWJ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఢిల్లీ TUWJ అమలుచేస్తున్న పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో అర్హతగల జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రకటించిన 10 కోట్లను విడుదల చేస్తామని సీఎంఇచ్చినహామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రత్యర్థి గ్యాంగ్కు సమాచారమిచ్చాడనే కక్షతో 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న 13 మందిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. అంతా కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హింసించి ప్రాణాలు తీశారు. అతడి శరీరంపై మొత్తం 24 కత్తిపోట్లున్నాయి. మర్మాయవాలను తీవ్రంగా గాయపరిచారు. జూన్ 29–30వ తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకోగా బాలుడి మృతదేహం జూలై ఒకటో తేదీన ఢిల్లీలో మునాక్ కాలువ ఒడ్డును నగ్నంగా పడి ఉండగా గుర్తించారు. మొత్తం పది మంది ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు 19 ఏళ్ల కృష్ణ అలియాస్ భోలాను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కావడ్ యాత్రికులుగా వేషం వేసుకున్న ముగ్గురిని యూపీలోని మీరట్లో కన్వర్ క్యాంపులో ఉండగా గుర్తించారు. ఈ నెల 18న పోలీసులు సైతం కన్వరియాలుగా వేషం వేసుకుని వెళ్లి వారిని మోనుతోపాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన భోలాపై గతేడాది ప్రత్యర్థి బధ్వార్ సోదరులు మోను, సోనులు దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, చోరీల ఆరోపణలపై పోలీసులు మోకా చట్టం కింద మోను, సోనులను జైలులో పెట్టారు. ఈ సోదరులకు తనను గురించిన సమాచారం అందిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భోలా.. ఆ బాలుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. జూన్ 29వ తేదీ రాత్రి బాలుడిని వీర్ చౌక్ వద్ద ఉండగా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం బలవంతంగా బైక్పై ఎక్కించుకుని మునాక్ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తర్వాత ఒకరు అతడిని పొడిచి, వదిలేసి పరారయ్యారు. గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మెడకు కేవలం స్కార్ఫ్ మాత్రం కట్టి ఉంది. ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టి భోలాను పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో అత్యధికులు మైనర్లే అయినప్పటికీ అత్యంత తీవ్రమైన నేరమైనందున మేజర్లుగా 16ఏళ్లు దాటిన వారిగా గుర్తించి, తీవ్ర శిక్షలు వేయాలని కోర్టును కోరుతామని డీసీపీ హరేశ్వర్ స్వామి తెలిపారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల తారుమారుతోపాటు పోక్సో కేసు కూడా నమోదు చేశామన్నారు. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ రాజీనామా అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది. ఈ ఎన్నికలు 1952 నాటి ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్, 1974 నాటి ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహించనున్నారు.జగ్దీప్ ధన్కడ్ రాజీనామా నేపథ్యంలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. కాగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఇప్పటికే పలు కీలక కార్యాచరణలు ప్రారంభమైనట్లు కమిషన్ వెల్లడించింది. లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పీ. పవన్ తెలిపారు. -
ఢిల్లీలో కుంభవృష్టి.. నీట మునిగిన రోడ్లు.. అంతటా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నేటి(బుధవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వరుసగా రెండవరోజు కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం కూడా రాజధానిలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. #WATCH | Delhi: Rain lashes parts of the national capital. (Visuals from Rao Tula Ram Marg) pic.twitter.com/V3AlLZAAcE— ANI (@ANI) July 23, 2025భారీ వర్షానికి నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు తీవ్రతరం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కురిసిన వర్షానికి ఎక్స్ ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్దు, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ సమీపంలోని అనువ్రత్ మార్గ్లోని రెండు క్యారేజ్వేలలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఢిల్లీ వాతావరణ బేస్ స్టేషన్ అయిన సఫ్దర్జంగ్లో మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య 8.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని రిడ్జ్లో 22.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో 136.3 మి.మీ వర్షపాతం నమోదైంది. Very heavy #rain in #Noida Filmcity #Monsoon#Delhirain#Raining#WeatherUpdate pic.twitter.com/RVR099hdSj— Shweta (@imshwetta) July 23, 2025 -
ఎయిరిండియా విమానంలో మంటలు.. భద్రతపై ఆందోళన
-
ఎయిరిండియా విమానంలో మంటలు
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం. ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. మంగళవారం (జూలై 22) హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315 ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ జరిగిన కొద్ది సేపటికే విమానం ఏపీయూలో (Auxiliary Power Unit)లో మంటలు చెలరేగాయి.ప్రమాదంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది. -
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్నగర్కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్షాక్కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్లు ఇన్స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు. -
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్షాక్కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
20 స్కూల్స్కు బాంబు బెదిరింపులు.. టెన్షన్లో పేరెంట్స్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో దాదాపు 20 స్కూల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాఠశాళలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం ఉదయమే పశ్చిమ్ విహార్, రోహిణీ సెక్టార్-3లోని పలు పాఠశాలలతో సహా దాదాపు 20 స్కూల్స్ బాంబు బెదిరింపు మొయిల్స్ వచ్చాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పలు పాఠశాల్లలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి.. తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో నాలుగు రోజుల వ్యవధిలో 30కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారం మొదటి మూడు రోజుల్లో ఢిల్లీలోని 11 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.బీజేపీ సర్కార్పై మాజీ సీఎం ఫైర్.. దేశ రాజధాని వరుస బాంబు బెదిరింపుల విషయమై అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి అతిషి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతిషి ట్విట్టర్ వేదికగా.. ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి!. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బాధను ఆలోచించండి. ఢిల్లీలోని నాలుగు పాలనా యంత్రాలను బీజేపీ నియంత్రిస్తుంది. ఇంకా మా పిల్లలకు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది!. ఇది దిగ్భ్రాంతికరం! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. VIDEO | More than 20 schools in Delhi on Friday received bomb threats, triggering panic among the students and their parents. Delhi Police and other quick-response authorities have launched search and evacuation operations, an official said. This is the fourth such day this week… pic.twitter.com/xmnlP3HquW— Press Trust of India (@PTI_News) July 18, 2025 -
ఏపీతో చర్చించొద్దా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘నదీ జలాల విషయంలో భారత్–పాకిస్తాన్ మధ్యే చర్చలు జరుగుతున్నాయి. నీటి పంపకాలపై రెండు దేశాలు మాట్లాడుకుంటున్నాయి. అలాంటప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై పొరుగు రాష్ట్రంతో మేం చర్చిస్తే తప్పేంటి. నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలే వద్దన్న తరహాలో బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 2015–16లో చంద్రబాబునాయుడుతో చర్చలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ వెళ్లలేదా? ఇప్పుడు మేము వెళితేనే నొప్పొచ్చిందా?. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగాలి. మేము రాజకీయంగా బతకాలన్నది వారి కోరిక. అందుకే మా భేటీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కూడా మాకెలాంటి అభ్యంతరం లేదు.నేనెవరికీ భయపడను. కేవలం సిస్టమ్కు మాత్రమే భయపడే వ్యక్తిని. నా ప్రాధాన్యత రాష్ట్రం. సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుంటా. కొట్లాట నా చివరి అస్త్రం. ఇదే ధోరణిలో కేంద్రంతో పాటు పక్క రాష్ట్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. కొట్లాడుకుంటూ పోతే పాలకులకు కాదు, ప్రజలకు నష్టం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నదీ జలాల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచి్చన సీఎం గురువారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పలు అంశాలపై వివరంగా మాట్లాడారు. బీఆర్ఎస్పై విమర్శనా్రస్తాలు సంధించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. కేంద్ర జలశక్తి మంత్రి వద్ద సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదు. జలశక్తి శాఖ తన ప్రకటనలో కూడా అదే చెప్పింది. ఆ భేటీ భవిష్యత్ కార్యాచరణకు రోడ్మ్యాప్ వంటిది. మేం పూర్తిగా కేంద్రానికి సహకరిస్తాం. వారి సహకారం తీసుకుంటాం. కలిసి పనిచేస్తాం. నిధులైనా, అనుమతులైనా అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కాబట్టి అడిగి తీసుకుంటాం. కేంద్రం పిలిస్తే మీరెందుకు వెళ్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశి్నస్తున్నారు. కేంద్ర పిలిస్తే ఢిల్లీకి రాకుండా, ఫాంహౌస్కు రావాలా? కేంద్రం వద్ద వాదన వినిపించకుండా, ఫాంహౌస్లో వాదించాలా? కేసీఆర్తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఆయనతో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమే. అన్నీ అధ్యయనం చేశాకే ‘ఇచ్చంపల్లి’.. కేంద్ర ప్రభుత్వమే గోదావరి–కావేరి నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ ప్రతిపాదనను ఇచ్చిం ది. తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేదైతే ఈ లింక్పై చర్చిస్తామని కేంద్రానికి చెప్పాం. ఎప్పుడో తయారు చేసిన డీపీఆర్ ప్రకారం అయితే దీనికి ఒప్పుకునేది లేదు. అది తయారయ్యాక ఎగువ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు వచ్చేశాయి. కాబట్టి ప్రస్తుతం నీటి లభ్యత ఎంత ఉందో తేలాలి. వందేళ్ల రాష్ట్ర అవసరాలకు సరిపడా నీటి లభ్యత, అవసరాలు అన్నీ అధ్యయనం చేశాకే ముందుకెళ్తాం తప్ప గుడ్డిగా వ్యవహరించం. 400 టీఎంసీలు చాలన్నది కేసీఆరే.. నీళ్ల ద్రోహి కేసీఆరే. 2004–2014 వరకు శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రోజుకు 4.1 టీఎంసీల చొప్పున నీళ్లు తరలించుకుపోతే, 2014–23 మధ్య ఆ సామరŠాధ్యన్ని ఏకంగా 9.6 టీఎంసీలకు పెంచనిచ్చిం ది కేసీఆరే. అంతకుముందు ఉమ్మడి ఏపీలో పదేళ్లలో 727 టీఎంసీలు ఏపీ తరలించుకుపోతే, బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏకంగా 1,200 టీఎంసీల నీటిని ఏపీకి పోనిచ్చాడు. దీన్నిబట్టి నీళ్ల ద్రోహి ఎవరో తెలుస్తోంది. మరోవైపు 2023లో కృష్ణా జలాల్లో 400 టీఎంసీలు చాలు అన్నది కేసీఆరే.గోదావరిలో 3వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి. వాటిని వాడుకోండని ఏపీకి చెప్పింది ఆయనే. చేపల పులుసు తిని అది అరిగేదాకా కూడా ఆగకుండా నీళ్లు వాడుకోమని చెప్పారు. ఇదే సమయంలో ‘కాళేశ్వరం’ కూలిపోతే ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మేం ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్నాం. సినిమాల్లో విలన్లను ఆఖరిలో చంపినట్లు ఇక్కడా మెల్లిగా అరెస్టులు జరుగుతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజీవ్రాల్ అరెస్టు చివర్లోనే జరిగింది కదా. 42% రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేక వ్యూహం 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 23 శాతానికి తగ్గించారు. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి బీసీలకు అన్యాయం చేశారు. ప్రస్తుతం 50 శాతం క్యాప్ను ఎత్తివేస్తున్నాం. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మాకు ప్రత్యేక వ్యూహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం.కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడతాం. అందుకే ఆర్డినెన్స్, మిగతా ప్రక్రియపై దృష్టి పెట్టాం. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించాక, తెలంగాణలో రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడాలి. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాతే కొత్త నామినేటెడ్ చైర్మన్ పోస్టులు ఇస్తాం. అప్పటివరకు ప్రస్తుత కార్పొరేషన్లకు డైరెక్టర్లు, సభ్యులను భర్తీ చేస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా పోటీ చేస్తుంది. లోకేశ్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిసినట్లు? ‘నేను అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పు అంటున్నారు. మరి ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేశ్ను కేటీఆర్ ఎందుకు కలిశాడు?, చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది?. లోకేష్తో భేటీ అయిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి..’ అని రేవంత్రెడ్డి సవాల్ చేశారు. లోకేశ్ను కలిసినట్లు మీకెలా తెలిసింది? మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని మాకు కళ్ల ముందు ఉన్న వ్యక్తులే చెప్పారని తెలిపారు. కేటీఆర్ది గంజాయి బ్యాచ్ కేటీఆర్ది గంజాయి బ్యాచ్ అని రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘ఆ గంజాయి బ్యాచ్ సవాల్ విసిరితే నేను స్పందించాలా? కేటీఆర్ బిజినెస్ భాగస్వామి కేదార్æ రకరకాల డ్రగ్స్ వాడి దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. లిక్కర్లో కాక్టెయిల్ విన్నాం..కానీ ఇక్కడ గంజాయి, డ్రగ్స్ కాక్టెయిల్ అని వింటున్నాం. అతని ఫోరెన్సిక్ రిపోర్టును తెప్పించాం. సందర్భాన్ని బట్టి మీడియా ద్వారా బయటపెడతాం. అవసరమైతే అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమే. ఆయన బావమరిది ఫాంహౌస్లో సమీప గ్యాంగ్ అంతా గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. ఇలా కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా గంజాయి బ్యాచే..’ అని సీఎం ఆరోపించారు. మిగిలింది కేటీఆరే.. మున్సిపల్ శాఖలో అక్రమాలకు సంబంధించి కీలక అధికారి బాలకృష్ణ అరెస్టు అయ్యారని, ఇక మిగిలింది కేటీఆర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. గతంలో నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన కిషన్రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నర్రగా ప్రభాకరావును కాపాడింది ఎవరు? ఇదే బీజేపీ, బీఆర్ఎస్ కాదా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. -
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
విమానం నుంచి ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’.. ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబైలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండ్ చేసిన పైలట్.. ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అంటూ సంకేతమిచ్చారు. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ కావాల్సి ఉందంటూ సంకేత భాషలో పైలట్ సందేశం పంపించారు.నిన్న(బుధవారం) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గోవా బయలేరిన ఇండిగో ఎయిర్బస్ ఏ320 నియో విమానంలో సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా.. ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ సంకేత భాషలో సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 9.53 గంటల ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్ల పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.కాగా, గత నెల ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ‘మేడే కాల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు.సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. -
జలశక్తి శాఖ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై కేంద్రం నేతృత్వంలో జరిగిన కీలక భేటీ ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీ కోసం బనకచర్లను సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రతిపాదనలను జలశాఖ చర్చకు చేపట్టింది. కానీ ఈ చర్చలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని, కేంద్రం ప్రభుత్వ పరిధిలోని సంస్థలే అభ్యంతరం వ్యక్తం చేశాయని సీఎం రేవంత్రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ భేటీకి ఇరు సీఎంలతో పాటు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్కుమార్రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు కృతజ్ఞతలు తెలియజేసిన ఇరువురు సీఎంలు.. ఆపై ఒకరికొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అంతకు ముందు.. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. ఇక.. సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించ దలిచామని ప్రధానంగా వివరించనుంది ఏపీ ప్రభుత్వం. ❇️గోదావరి నదిలో గత వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాల మేరకు ఏడాదికి 2500 -3000 టీఎంసీల మేర వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని సమావేశంలో వివరించనున్న ఏపీ ప్రభుత్వం❇️ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీల మాత్రమే తరలిస్తామని దీని వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేయనున్న రాష్ట్రప్రభుత్వం❇️గడచిన 11 ఏళ్లలో తెలంగాణాలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని సమావేశంలో తెలియచేయనున్న ప్రభుత్వం❇️వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావులేదని స్పష్టం చేయనున్న ఏపీ❇️గోదావరి పై ఉన్న చిట్టచివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే రైపీరియన్ రాష్ట్రంగా తాము వాడుకోదలిచామని వివరించనున్న ఏపీ ❇️ఈ అంశాన్ని తెలంగాణాతో పాటు కేంద్రం కూడా అర్ధం చేసుకోవాలని స్పష్టం చేయనున్న ఏపీ ప్రభుత్వం❇️అలాగే గత 11 ఏళ్లుగా తెలంగాణాలో కట్టిన ప్రాజెక్టులు, ఎగువ రాష్ట్రంగా వినియోగించుకున్న నీళ్ల వివరాలను సిద్ధం చేసుకున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు🚩కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి🚩బనకచర్లపై #GRMB, #CWC, ఈఏసీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే #Banakacharla ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది.🚩గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది.🚩ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ- ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు.🚩రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. -
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ రెండు పాఠశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.#BREAKING: Delhi | 5 Schools get threat emails Five schools have received threat calls and emails since this morning St Thomas in Dwarka, Vasant Valley in Vasant Kunj, Mother International in Hauz Khas and Richmond Global School in Paschim Vihar.@DelhiPolice @CPDelhi… pic.twitter.com/deWfff27jN— The New Indian (@TheNewIndian_in) July 16, 2025ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు స్కూళ్లు, భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల అధికారులలో భయాందోళనలను రేకెత్తించింది. అయితే పూర్తి భద్రతా తనిఖీల తర్వాత అధికారులు ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు పోలీసులు.VIDEO | Delhi: St. Thomas School in Dwarka received bomb threat via mail.A parent says, “My son is in 9th standard. I saw the news about bomb threat. Then, I came to take my child home."#bombthreat(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/nAj73TUJj1— Press Trust of India (@PTI_News) July 16, 2025 -
బనకచర్ల.. ఏపీకి షాకిచ్చిన తెలంగాణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమీరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు(జూలై 16, 2025) అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో..ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని పేర్కొంది. అయితే..అయితే బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట ఇచ్చింది. ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. బీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించే బనకచర్లపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఇతర అంశాలపై చర్చిస్తేనే మీటింగ్కు వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి స్పష్టం చేసింది.తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పందంగా మారింది తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా లేఖతో జరగబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలుప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వాదనగోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయంనాగార్జునసాగర్ వాడకాన్ని తప్పుబడుతూ, పర్యావరణ నష్టం గురించి ఆందోళన ఏపీ వాదనలువర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను వినియోగించాలన్న ఉద్దేశంరూ.80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన3 దశల్లో నిర్మాణం: పోలవరం → బొల్లపల్లి → బనకచర్లఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించివేసింది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే గోదావరి వరద జలాల లభ్యతపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.ఇదీ చదవండి: బనకచర్ల.. గురు శిష్యుల డ్రామానా? -
కాక్పిట్లోకి ఇద్దరు ప్రయాణికుల చొరబాటు.. ‘స్పైస్జెట్’లో గందరగోళం
న్యూఢిల్లీ: ఇద్దరు ప్రయాణికుల అలజడి కారణంగా మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరాల్సిన స్పైస్జెట్ విమానం (SG 9282) దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.స్పైస్జెట్ విమానంలో విమానం టేకాఫ్ కోసం ట్యాక్సీ చేస్తున్నప్పుడు కాక్పిట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ఇద్దరు ప్రయాణికులు ప్రయత్నించిన దరిమిలా గంగదరగోళం ఏర్పడింది. విమాన ప్రయాణానికి ఆటకం కలిగించిన ఆ ఇద్దరినీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కి అప్పగించామని స్పైస్జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘2025, జూలై 14న, ఢిల్లీ నుండి ముంబైకి వెళుతున్న స్పైస్జెట్ విమానం(SG 9282)లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను దింపేశాం. వారు బలవంతంగా కాక్పిట్లోకి చేరుకునేందుకు ప్రయత్నించారు. సిబ్బంది విధులకు ఆటకం కలిగించారని’ దానిలో పేర్కొంది.స్పైస్జెట్ తెలిపిన వివరాల ప్రకారం క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు, కెప్టెన్ పదే పదే అభ్యర్థించినప్పటికీ, ఆ ఇద్దరు ప్రయాణికులు ఇబ్బందులకు గురిచేశారు. జూలై 13న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం, తొమ్మిది గంటలకు పైగా ఆలస్యంతో రాత్రి 9:05 గంటలకు బయలుదేరిందని ప్రయాణికులు తెలిపారు. రన్వే వైపు టాక్సీ వేసిన తర్వాత విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడింది. -
ఢిల్లీ వెళ్తున్నారు.. ఏమి తెస్తున్నారు..?
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ప్రహసనంగా మారుతున్నాయి. 2014–19లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన తరచూ ఢిల్లీ రావడం.. హడావుడి చేయడం మినహా సాధించిందేమి కనిపించడంలేదు. ‘అయినా పోయి రావలె హస్తినకు’.. అన్నట్లుగా 21వ సారి ఆయన మళ్లీ మంగళవారం ఢిల్లీకి వస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా ఏం సాధించారంటే చెప్పుకోవడానికి గొప్పగా ఏమి కనిపించడంలేదు. ప్రతిసారీ రావడం.. కేంద్ర మంత్రులను కలవడం.. రాష్ట్ర అభివృద్ధే తన అజెండా అని చెప్పడం పరిపాటిగా మారింది. ప్రధాని సహా, కేంద్ర మంత్రులను కలిస్తే వారితో చర్చించిన అంశాలను ఎంపిక చుకున్నాడు మీడియాకు మాత్రమే వివరిస్తున్నారు. తాజాగా.. మంగళవారం మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వస్తుండగా, ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులను కలవనున్నారు. వస్తున్నారు.. వెళ్తున్నారు.. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 21సార్లు ఢిల్లీకి వచ్చి ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. వీరిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించానని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధానిని తాను నిరి్మంచబోతున్నట్లు ఎంపిక చేసుకున్న మీడియాకు చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే అప్పులు తప్ప ఆయన సాధించింది ఏమీ కనపడటంలేదు. ఇప్పటివరకు అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15వేల కోట్లు పొందారు. ఇవి కాక.. బడ్జెటేతర అప్పులు ఇప్పటివరకు రూ.19,410 కోట్లు. ఇక ప్రతి మంగళవారం అప్పులు సరేసరి. విశాఖ స్టీల్ప్లాంట్, పోలవరంపై గప్చుప్.. మరోవైపు.. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు దీనిని ప్రైవేటీకరణ చేయడంలేదనే హామీని మాత్రం కేంద్రం నుంచి ఇప్పించలేకపోతున్నారు. అలాగే, పోలవరం ఎత్తు తగ్గించినట్లు లోక్సభ సాక్షిగా బట్టబయలైనా ఆయన నోరు మెదపడంలేదు. ఎత్తు తగ్గలేదని బుకాయించే పనిలో మాత్రం ఎన్డీఏ నేతలు నిమగ్నమయ్యారు. ఈ అంశంపై మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.బనకచర్లపై బిగ్షాక్.. ఇదిలా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్డీఏ బిగ్షాక్ ఇచ్చింది. సముద్రంలో వృధాగా పోయే గోదావరి జలాలను వాడుకునేందుకు ‘పోలవరం–బనకచర్ల’ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉందని, త్వరలో డీపీఆర్ సమర్పించనుందని ఇటీవల ఢిల్లీ వచి్చన సమయంలో మీడియాకు చెప్పారు. అయితే, కొద్దిరోజులకే ఈ ప్రతిపాదనలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) వెనక్కు పంపింది. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి.. పర్యావరణ ప్రభావ అంచనాపై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫార్సు చేసింది. దీంతో.. బనకచర్లపై ఊదరగొట్టిన చంద్రబాబుకు ఇదొక బిగ్షాక్ అనే చెప్పాలి. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలోగానీ.. తోతాపురి మామిడి రైతులను ఆదుకునే విషయంలోగానీ కేంద్రం నుంచి ఆయనేమీ సాధించలేకపోయారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో భీకర వర్షం పడడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించడంతో అరెంజ్ అలర్ట్ను అధికారులు రెడ్ అలర్ట్గా మార్చారు. ఢిల్లీతోపాటు తూర్పు హరియాణ, పశి్చమ ఉత్తరప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. -
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్పూర్లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్పూర్కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్పూర్కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్సింగ్కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్బాగ్ ప్యాలెస్కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్పూర్లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్సైట్గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్పూర్కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్పూర్లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్మంతర్ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్పూర్కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్ను హోటల్గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్లో పాల్గొని తాజ్ మహల్కు ఓటు వేసి గెలిపించారు. తాజ్మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్ఖండ్ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
Delhi: ఆ త్రిపుర యువతి ఎక్కడ?.. సీఎం సూచనలతో గాలింపు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన యువతి స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యమయ్యింది. విషయం తెలుసుకున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆమె ఆచూకీ కోసం వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని పోలీసులకు పలు సూచనలు చేశారు.త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ‘న్యూఢిల్లీలో త్రిపురలోని సబ్రూమ్కు చెందిన స్నేహ దేబ్నాథ్ అదృశ్యమైనట్లు తమ కార్యాలయం దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె ఆచూకీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అవసరమైన సూచనలు జారీ చేశాం’ అని పేర్కొన్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఢిల్లీ పోలీసులు.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)నేతృత్వంలో ఆమె ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలో చదువుకుంటున్న స్నేహ చివరిసారిగా జూలై 7న తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఆరోజు ఆమె తన స్నేహితురాలు పితునియాతో కలిసి సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నట్లు తల్లికి తెలిపారు. అదే ఆమె చివరి ఫోన్ కాల్. ఇది ఉదయం 5:56 గంటలకు వచ్చింది. ఆ తరువాత ఉదయం 8:45 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ఆ రోజు స్నేహను క్యాబ్ డ్రైవర్ స్నేహను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో నిఘా ఫుటేజ్ లేకపోవడంతో స్నేహ తుది కదలికలను తెలుసుకోవడం పోలీసు అధికారులకు సాధ్యంకాలేదు. జూలై 9న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలో విస్తృతమైన పరిశీలన చేసింది. అయితే స్నేహకు సంబంధించిన ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.స్నేహ తన వెంట ఎటువంటి వస్తువులు తీసుకువెళ్లలేదని, గత కొద్దిరోజులుగా డబ్బు విత్డ్రా చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహ ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. -
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం సందర్బంగా నివాసం ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై తెలియరాలేదు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. #WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb— ANI (@ANI) July 12, 2025 -
హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్ఈ, అసోచామ్ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్ కుమార్ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్ బూమ్కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు. -
క్విక్ కామర్స్లో పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశీ క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆధిపత్యం నడుస్తుండగా తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నౌ కూడా రంగంలోకి దిగింది. అమెజాన్ నౌ పేరిట బెంగళూరు తర్వాత ఢిల్లీలో కూడా నిర్దిష్ట పిన్కోడ్లలో 10 మినిట్స్ డెలివరీ సర్వీసులు ప్రారంభించింది. ఆయా పిన్–కోడ్లలోని యూజర్లకు యాప్లో ఇప్పుడు అమెజాన్ నౌ అనే ట్యాబ్ను అందుబాటులోకి తెచి్చంది. నిత్యావసరాలు, పండ్లు..కూరగాయలు, పర్సనల్ కేర్, సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, వైర్లెస్ యాక్సెసరీలు, చిన్న గృహోపకరణాలు మొదలైన వాటిని ఈ సర్వీస్ కింద అమెజాన్ అందిస్తోంది. డెలివరీ ఉచితంగా పొందాలంటే ప్రైమ్ యూజర్లకు కనీస కొనుగోలు విలువ రూ. 99గా, నాన్–ప్రైమ్ యూజర్లకు రూ. 199గా ఉంటుంది. స్మార్ట్ఫోన్ల దన్ను..: డేటా చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడం, యువ జనాభా ఎక్కువగా ఉండటం వంటి అంశాలు దేశీయంగా క్విక్ కామర్స్కి దన్నుగా ఉంటున్నాయి. ఫ్లిప్కార్ట్, బెయిన్ అండ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ఈ–గాస్రరీ ఆర్డర్లలో మూడింట రెండొంతుల వాటా, ఈ–రిటైల్ వ్యయాల్లో పదో వంతు వాటా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలదే ఉంది. దేశీయంగా కొనుగోళ్ల విధానాల్లో క్యూకామ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న తీరును ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. కొనుగోళ్లకు సంబంధించి ఇది దాదాపు ప్రధాన మాధ్యమంగా మారిపోతుండటంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్లాంటి సంస్థలు కూడా తప్పనిసరిగా రంగంలోకి దిగుతున్నాయి. రూ. 64,000 కోట్ల ఆర్డర్లు.. 2024–25లో భారతీయులు బ్లింకిట్, ఇన్స్టామార్ట్లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫాంల ద్వారా రూ. 64,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులకు ఆర్డరిచి్చనట్లు అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 30,000 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) రూ. 2 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ కెర్ఎడ్జ్ రేటింగ్స్ విభాగం ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి ఏకంగా 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ మరో రిపోర్టులో అంచనా వేసింది. -
లవర్తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపంతో వణికింది. ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదైంది. కాగా, నిన్న(గురువారం) కూడా భూకంపంతో వణికిన హస్తిన.. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రత నమోదయ్యింది. హరియాణాలోని ఝాజ్జర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైందని జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం ప్రకటించింది.ఢిల్లీ–ఎన్సీఆర్, హరియాణాతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనూ భూమి కంపించింది. భూప్రకంపనలతో హస్తినవాసులు వణికిపోయారు. గురువారం ఉదయం 9 గంటల నాలుగు నిమిషాలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ఢిల్లీలో కొందరు స్థానికులు ప్రాణభయంతో భవనాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
ఢిల్లీలో భూకంపం..
-
ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు
న్యూఢిల్లీ: దేశారాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని క్షణాలపాటు బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రత నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్లో భూకంప తీవ్రత కనిపించింది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపాన్ని గుర్తించినంతనే జనం భయాందోళనలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే జనం రోజువారీ కార్యకలాపాల్లో మునిగివున్న సమమంలో ఈ భూకంపం సంభవించింది.యూపీలోని ఘజియాబాద్కు చెందిన ఒక వ్యక్తి భూకంపం సమయంలో తన అనుభవాన్ని వివరిస్తూ, అప్పుడే తాను నిద్రలేచానని, భూ ప్రకంపనలు చూసి భయపడ్డానని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇలానే భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. #WATCH | An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9.04 am IST. Strong tremors felt in Delhi-NCR. A man in Ghaziabad, UP says, "...I had woken up just at the time when there was a jolt. I was scared. There was another earthquake… pic.twitter.com/YHDyGq7Oaa— ANI (@ANI) July 10, 2025ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోనూ బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. జనం భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది.జజ్జర్లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్)తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం జజ్జర్కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. #earthquakeOnly elvish Bhai can save Delhi ncr from Earth quake ☠️❤️🔥😭👀 pic.twitter.com/TQTqSqtAbI— Yash Pratap (@yash_pst) July 10, 2025 -
కేజ్రీవాల్కు నోబెల్ ఇవ్వాల్సిందే.. ఏ కేటగిరి అంటే.. బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో వీకే సక్సెనా తరచూ తమ పరిపాలనకు అడ్డు తగులుతున్నాసరే విజయవంతంగా ప్రభుత్వపాలన కొనసాగించినందుకుగాను తాను కూడా నోబెల్ బహుమతికి అర్హుడినేనని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అసమర్థత కేటగిరిలో నోబెల్ ఉంటే కేజ్రీవాల్కు అవార్డు వచ్చేందని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు.ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. అసమర్థత, అరాచకం, అవినీతికి సంబంధించిన కేటగిరిలో నోబెల్ ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా ఒక అవార్డు లభించేది అని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో ఆప్ పాలనలో జరిగిన అక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సులలో పానిక్ బటన్లు, తరగతి గది నిర్మాణం, మహిళలకు పెన్షన్ పథకాలు, మద్యం లైసెన్సింగ్, షీష్ మహల్ గురించి వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆప్ నేతలు తిరిగి కౌంటరిచ్చారు. సచ్దేవా వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ..‘వీరేంద్ర సచ్దేవా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కేవలం మాట్లాడటం కాదు. పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాల రోజులు ముగిశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఆప్ హయాంలో పాఠశాలలు నిర్మించాం. ఆసుపత్రుల్లో వసతులను మెరుచుపరిచాం. ఉచిత విద్యుత్ ఇచ్చాం. అవినీతిని అరికట్టాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులే దోచుకుంటున్నారు’ అని ఆరోపించారు.కేజ్రీవాల్ వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. అంతకుముందు పంజాబ్లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్ కేజ్రీవాల్ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్లను ఆప్ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్లను కూల్చివేశారు. వారికి ఏం లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్లను కూల్చివేసింది’ అని అన్నారు.మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మొహల్లా క్లినిక్లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు. -
ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. #WATCH | Heavy rain lashes parts of Delhi. Visuals from the GRG Road, which is waterlogged. pic.twitter.com/EOVN69XZRQ— ANI (@ANI) July 9, 2025నగర వ్యాప్తంగా పలు అండర్పాస్లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals near Kartavya Path. pic.twitter.com/vPgcg2iuiU— ANI (@ANI) July 9, 2025VIDEO | Delhi: Heavy rain lashes parts of the national capital, bringing relief from heat. Visuals from Constitution Club. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#Delhi pic.twitter.com/vsrcgn1i7Q— Press Trust of India (@PTI_News) July 9, 2025 -
అక్కడ అంతటి గౌరవమా..! భారత సంతతి మహిళ అనుభవం
అగ్నిమాక సిబ్బందికి ఇంత గౌరవ మర్యాదలిస్తారా అని అబ్బురపడింది ఓ భారత సంతతి మహిళ. అస్సలు ఇది ఊహించలేదు. సరదాగా మా నాన్నని లండన్ తీసుకువస్తే..ఇంతలా గౌరవ మన్ననలను అందుకుంటాడని అనుకోలేదంటూ ఖుషీ అవుతోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..UKలో నివసిస్తున్న భారత సంతతి మహిళ పూజా ఖర్బ్ తన నాన్నను లండన్ పర్యటనకు తీసుకువచ్చినప్పడు ఎదురైన అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. నిజానికి ఆమె తండ్రి ఢిల్లీలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన తన కూతురితో కలిసి లండన్ వెళ్లారు. అక్కడకు ఆ తండ్రి తనవెంట ఐడీ కార్డుని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ తన అగ్నిమాపక దళం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇలా లండన్కి తన ఐడీ కార్డుని తెచ్చుకున్నాడు. తన కూతురు పూజాతో లండన్కి వచ్చిన అతడు..నేరుగా తన వృత్తికి సంబంధించిన అగ్నిమాపక స్టేషన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ తన ఐడీ కార్డుని చూపించగానే అక్కడి అధికారులు అతనికి అగ్నిమాపక కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసే అవకాశం లభించడమే గాక, అక్కడ అతనికి మంచి గౌరవ మర్యాదలు కూడా లభించాయి. పైగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది జాకెట్ ధరించి ఓ ఫోటో కూడా దిగాడు. అంత దూరం నుంచి కూతురు కారణంగా లండన్ వచ్చిన ఆ తండ్రికి అక్కడి అగ్నిమాపకదళం అందించిన గౌరవమర్యాదలకు ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అది చూసి కూతురు పూజా ఈ లండన్ పర్యటనకు తీసుకువచ్చి మంచి పనిచేశా, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారంటూ తెగ సంబరపడింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా పంచుకుంది. అయితే నెటిజన్లు ఇక్కడ భారతీయ అగ్నిమాపక సిబ్బందికి అంతటి గుర్తింపు లభించడం లేదని వాపోవడమే గాక, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాలను లేదా అగ్నిమాపక సిబ్బందిని ఎవరూ అభినందించరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలాగే లండన్ అగ్నిమాపక శాఖ కూడా పూజా షేర్ చేసిన వీడియోపై స్పందించింది. ఇలా మా అగ్నిమాపక దళాన్ని సందర్శించినందుకు చాలా సంతోషం అని లండన్ ఫైర్ స్టేషన్ బదులివ్వడం విశేషం. View this post on Instagram A post shared by pooja kharb (@learnerforlifetime) (చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి) -
యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ సీఎం సంచలన లేఖ.. యమునపై కొత్త ట్విస్ట్!
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్ను ఆమె కోరారు. అక్రమ తవ్వకాల కారణంగా ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు.ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని యమునా నది వెంట అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి చేరడంతో ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. ఈ లేఖలో రేఖా గుప్తా.. యమునా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు నది కరకట్టలను బలహీనపరుస్తున్నాయి. దీంతో, దేశ రాజధానిలో వరదల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నది సహజ మార్గాన్ని కూడా మారుస్తాయి. ఇది నది పరిసర ప్రాంతాల్లో నివసించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ తవ్వకం వరద ప్రమాదాన్ని కలిగించడమే కాకుండా దీర్ఘకాలిక పర్యావరణ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అక్రమ మైనింగ్పై అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాన్ని తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఎన్జీటీ గుర్తించింది. అందుకే ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని కోరుతున్నాను. దీనిపై తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి’ అని యోగి ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని అన్నారు. దీని అమలు బాధ్యతలో గందరగోళాన్ని నివారించడానికి నది వెంబడి అధికార పరిధిని ఉమ్మడిగా గుర్తించడంతో సహా ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని అభ్యర్థించారు. -
తెలంగాణ సీఎంను కలిసి స్టార్ హీరో అజయ్ దేవగణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అజయ్ దేవగణ్ హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు.మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో భేటీముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. దీనికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రికి కపిల్దేవ్ వివరించారు. -
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను సీఎంవో కోరింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను సీఎం కలిసి కోరుతారని.. వీలునుబట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. తిరిగి ఆయన మంగళవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారని సమాచారం. సీఎంతో 45 నిమిషాలపాటు మంత్రి సురేఖ భేటీ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం సీఎం రేవంత్ను కలిశారు. తన కుమార్తె సుస్మితా పటేల్తో కలిసి జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. రేవంత్తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారని సమాచారం. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా రాజకీయాలు, పార్టీ నేతల వ్యవహార శైలి, తమపై వచి్చన ఫిర్యాదులకు సంబంధించి సీఎంతో చర్చించారు. అలాగే తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు గురించి కూడా సీఎంతో మంత్రి మాట్లాడారని తెలియవచ్చింది. -
మాల్లో మంటలు.. లిఫ్ట్లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
‘సెకండ్ హ్యాండ్’ సో బెటరూ!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ బండ్లు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అక్కడ కాలపరిమితి ముగిసిన వాహనాలు నగరంలో జోరుగా అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరల్లో లభిస్తుండటంతో నగరవాసులు వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలే అయినప్పటికీ కండీషన్ బాగా ఉన్నవి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల దందా ఏజెంట్లకు లాభసాటిగా మారింది. తక్కువ ధరలకు లభిస్తుండటంతో.. ⇒ ఇటీవల ఢిల్లీ సర్కారు పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలను కఠినతరం చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ‘నో పెట్రోల్, నో డీజిల్’ అంటూ నిబంధనలు విధించింది. ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిబంధనను వాయిదా వేసినప్పటికీ ఢిల్లీలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినందువల్ల పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ వాహనాలకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఏర్పడింది. ⇒ మరోవైపు తక్కువ ధరలకు లభిస్తుండటంతో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ క్రమంలో కొందరు ఏజెంట్లు సెకండ్ హ్యాండ్ వాహనాల ముసుగులో ఊరూపేరూ లేని వాహనాలను విక్రయించి భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేని వాహనాలకు సైతం నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో తప్పుడు అడ్రస్లపై రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జరుగుతోంది. దీంతో అటు ఏజెంట్లకు, ఇటు కొందరు ఆర్టీఏ అధికారులకు ‘సెకండ్హ్యాండ్ బండి ఒక దందా’గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.డాక్యుమెంట్లు ఉంటే ఓకే.. ⇒ ఒక రాష్ట్రంలో నమోదైన వాహనాలను మరో రాష్ట్రానికి తరలించేందుకు తప్పనిసరిగా రవాణాశాఖ అనుమతి అవసరం. వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా పత్రాలు, వాహన యజమాని చిరునామా ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. అలా అన్ని డాక్యుమెంట్లు ఉన్నవాటికి మాత్రమే రవాణా అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అందజేస్తారు.దీంతో ఆ వాహనాన్ని ఎక్కడైనా విక్రయించవచ్చు. కానీ కొందరు ఏజెంట్లు ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా దొంగబండ్లను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇలాంటి వాహనాలపై గతంలో పోలీసులు పలు కేసులు నమోదు చేసి నిందితులపైన చట్టపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. ⇒ తాజాగా 15 ఏళ్లు ముగిసిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు ముగిసిన డీజిల్ వాహనాలపై ఢిల్లీ రవాణాశాఖ ఆంక్షలను విధించింది. ప్రస్తుతానికి ఈ ఆంక్షలను సడలించారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని మాత్రం ప్రభుత్వం నిరుత్సాహపరుస్తోంది. దీంతో చాలామంది వాహన యజమానులు వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ బండ్లకు హైదరాబాద్లో మరోసారి గిరాకీ నెలకొంది. ఈ ముసుగులో కొందరు ఏజెంట్లు ఎలాంటి ఆధారాలు లేని వాహనాల విక్రయాలకు పాల్పడడం గమనార్హం. ‘వాహన్’లో నమోదు తప్పనిసరి.. గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3000లకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలే ఉన్నాయి. ప్రత్యేకించి సెకండ్ హ్యాండ్ కేటగిరీలో వ్యక్తిగత కార్ల కొనుగోళ్లు ఎక్కువ. ఈ కేటగిరీలో 70 శాతం కార్లు ఢిల్లీకి చెందినవే ఉన్నట్లు అంచనా. నగరంలో 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కాలపరిమితిని ప్రతి సంవత్సరం పొడిగించుకొనే అవ కాశం ఉంది. ఈ వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని 5 నుంచి 10 ఏళ్ల లోపు కాల పరిమితి కలిగిన ఢిల్లీ వాహనాలను ఎక్కువగా కొను గోలు చేస్తున్నారు. ఎలాంటి వాహనాలైనా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘వాహన్’ వెబ్సైట్లో నమోదై ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాత వాహనాల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం వాహనాల కొనుగోలు తేదీని బట్టి ఆటోమేటిక్ స్క్రాపింగ్ లేదా సీజ్ చేసే ప్రక్రియను అధికారులు ఇకపై కొనసాగించరని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు.పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నడపకుండా నిషేధించాలన్న దీర్ఘకాలిక విధానాన్ని ఈ నిర్ణయంతో నిలిపేశారు. వాస్తవ ఉద్గారాలతో సంబంధం లేకుండా తమ వాహనాలను బాగా నిర్వహించిన వారికి లేదా క్లీనర్ టెక్నాలజీలను ఏర్పాటు చేసిన వారికి ఇది నష్టం కలిగిస్తుందని కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.‘పాలసీ ఫ్రేమ్వర్క్పై పునరాలోచన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వాహనాల వయసుపై కాకుండా వాస్తవ ఉద్గారాలపై దృష్టి సారించాం’ అని సిర్సా విలేకరుల సమావేశంలో చెప్పారు. పాత వాహనాలనే కాకుండా కాలుష్య కారకాలను లక్ష్యంగా చేసుకునే శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..రూ.లక్షలు పోగేసి కొన్న వాహనాలను మెరుగ్గా నిర్వహిస్తున్నా, నిబంధనలకు లోబడి కాలుష్యకారకాలను నియంత్రిస్తున్నా ఏకమొత్తంగా వాహనాల వయసురీత్యా పాలసీలు అమలు చేయడం తగదని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా విమర్శించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సోషల్మీడియాలో ‘రూ.84 లక్షలతో రేంజ్ రోవర్ కారు కొన్ని ఎనిమిదేళ్లు అవుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఇంట్లోనే పార్క్ చేశాను. మొత్తంగా ఆ కారులో 74 వేల కి.మీ మాత్రమే ప్రయాణించాను. కారు మంచి కండిషన్లో ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడు చౌకగా అమ్మాల్సి వస్తుంది’ అనేలా పోస్టులు వెలిశాయి. -
వాడు డ్రైవర్ కాదు కిల్లర్.. ఓనర్ తో పాటు ఆమె కొడుకు హత్య
-
ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు
-
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాను యమునా నది ప్రక్షాళనతో పాటు రాజధానిలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తరచూ చెబుతుంటారు. తాజాగా ఆమె నూతన అధికారిక నివాసం గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నంబర్ వన్ను ఆమెకు అధికారికంగా కేటాయించగా, ఈ నెలలోనే ఆ భవన పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు రూ. రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సమాచారం.ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) జారీ చేసిన టెండర్ నోటీసులోని వివరాల ప్రకారం భవన పునరుద్ధరణలో ప్రధానంగా నూతన విద్యుత్ పరికరాలను అమర్చడంపై దృష్టి సారించనున్నారు. దీని టెండర్ కోసం బిడ్లు జూలై 4న ప్రారంభం కానున్నాయి. పునరుద్దరణ పనులు 60 రోజుల వ్యవధిలో పూర్తికానున్నాయని అధికారులు తెలిపారు. సీఎం రేఖా గుప్తాకు రెండు బంగ్లాలు కేటాయించగా, వాటిలో ఒక బంగ్లాను ఆమె నివాసానికి ఉపయోగించనున్నారు. మరొక బంగ్లాను క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించనున్నారు.జూన్ 28న జారీ చేసిన టెండర్లో రూ.60 లక్షల మొత్తంతో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు ముఖ్యమంత్రి బంగ్లాలో ఏర్పాటు చేయనున్నారు. రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇంటికి రూ. రెండు లక్షలతో నిరంతర విద్యుత్ సరఫరా (యూపీఎస్) వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ. 1.8 లక్షల ఖర్చుతో రిమోట్ కంట్రోల్తో నడిచే 23 సీలింగ్ ఫ్యాన్లను కూడా అమర్చనున్నారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.ఇది కూడా చదవండి: ‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్ నేత క్షమాణలు -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా!
సాక్షి, సిటీబ్యూరో: కాలం చెల్లిన వాహనాలపై ఢిల్కీ సర్కార్ కొరడా ఝళిపించింది. కాలపరిమితి ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేస్తూ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం లక్షలాది కాలం చెల్లిన వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారకాలతో రహదారులపై స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజారోగ్యంపై కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి.నగరంలో ప్రవేశపెట్టిన 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛంద తుక్కు విధానం ఆచరణలో వెక్కిరిస్తోంది. పాతవాహనాన్ని స్క్రాప్ చేసుకొని కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవాళ్లకు జీవితకాలపన్నులో రవాణాశాఖ కొంత మొత్తాన్ని మినహాయింపునిస్తున్నా వాహనదారుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కాలపరిమితి ముగిసిన డొక్కుబండ్ల వినియోగాన్ని అరికట్టేందుకు ఢిల్లీ తరహాలో నిర్బంధ విధానాలను అమలు చేయాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని రూపొందించింది. కానీ దీన్ని నగరంలో స్వచ్ఛందం చేయడం వల్ల చాలామంది ముందుకు రావడం లేదు. నగరంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలు సుమారు 85 లక్షలకు పైగా ఉన్నాయి. రవాణాశాఖ అంచనాల ప్రకారమే 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాలు కనీసం 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మరోవైపు ప్రతిసంవత్సరం ఈ డొక్కు బండ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాలుష్యకారక వాహనాల వల్ల జీవశైలి వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలే టాప్...నగరంలో 15 ఏళ్లు దాటిన వాటిలో వ్యక్తిగత వాహనాల కేటగిరీలో సుమారు 17 లక్షల బైక్లు, మరో 3.5 లక్షల కార్లు టాప్లో ఉన్నాయి. రవాణా వాహనాల కేటగిరీలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, తదితర వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. మరో లక్ష వరకు సరుకు రవాణా వాహనాలు ఉన్నట్లు అంచనా. గ్రేటర్లో 13 వేలకు పైగా స్కూల్ వాహనాలు ఉంటే వాటిలో 2500 వరకు డొక్కు బస్సులే కావడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో లభించే వాహనాలను కొనుగోలు చేసి హైదరాబాద్లో నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 1.4 లక్షల ఆటోరిక్షాల్లో కనీసం 25 వేలకు పైగా కాలం చెల్లినవి ఉన్నాయి. ఇవి కాకుండా వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు, 4 వేల మ్యాక్సీ క్యాబ్లు తిరుగుతున్నాయి. ఇలా ఇటు వ్యక్తిగత వాహనాలు, అటు రవాణా వాహనాలు అన్నీ కలిపి 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో పీఎం స్థాయి 2.5 శాతం వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల కండీషన్ బాగా లేకపోవడం వల్ల, ఇంజన్ దెబ్బతినడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఉత్తుత్తి తుక్కు విధానం...మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు గ్రీన్ట్యాక్స్ చెల్లించి మరో 5ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు సైతం రిజి్రస్టేషన్ పునరుద్ధరణ సదుపాయం ఉంది. ఈ వెసులుబాటు వల్ల స్వచ్ఛంద స్క్రాపింగ్కు స్పందన రావడం లేదు. వాహనాల స్క్రాపింగ్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ప్రభుత్వ విభాగాలకు చెందిన రవాణా వాహనాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించినవి మినహాయించి వ్యక్తిగత వాహనదారులు స్వచ్చంద స్క్రాపింగ్కు ముందుకు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.ఢిల్లీలో ఇలా..ఢిల్లీ రవాణాశాఖ లెక్కల ప్రకారం 15 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటికి జూలై ఒకటో తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ నిషేధించారు.ఈ మేరకు 350 పెట్రోల్ బంకుల్లో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్ప్లేట్లను ‘క్లిక్’ మనిపించి రవాణా కార్యాలయానికి చేరవేస్తాయి. అక్కడి ఆరీ్టఏలో ఏర్పాటు చేసిన కమాండ్ కేంద్రంలో వాహనం జీవితకాలాన్ని నిర్ధారిస్తారు. ఇదంతా కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసిన బంకుల్లో కొన్నింటి నిర్వహణను పోలీసులు పర్యవేక్షించనుండగా, మరికొన్ని రవాణాశాఖ పర్యవేక్షించనుంది. ఈ విధానంపైన పెట్రోల్ బంకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ఢిల్లీలో ప్రమాదకరంగా ఉన్న వాహనకాలుష్యం దృష్ట్యా ఈ విధానం మంచిదేనని పర్యావరణవర్గాలు పేర్కొంటున్నాయి. -
Air India Plane: ఒక్కసారిగా 900 అడుగుల కిందకు.. విచారణకు ఆదేశం!
ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది. ఇది జూన్ 12వ తేదీన జరిగిన ఘటన. అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.అసలు విషయంలోకి వెళ్లే.. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్ సిగ్నల్ వెళ్లింది పైలట్లకు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనుంది.ఈపీఎఫ్ రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్అండ్డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్న ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. -
ఎయిమ్స్కు తొలి మహిళా డైరెక్టర్ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..
మన దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు నాయకత్వం వహించిన తొలి మహిళ ఆమె. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థల్లో ఒకటి. పైగా దాదాపు 70 సంవత్సరాల చరిత్రలో ఆ ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించిన ఏకైక మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అంతేగాదు హత్యకు గురైనా నాటి ప్రధాని ఇంధిరాగాంధీని శతవిధాల కాపాడేందుకు ప్రయత్నించిన మహిళా వైద్యురాలు కూడా ఆమెనే. ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా అంతటి గౌరవనీయ హోదాలో పనిచేసిన ఆ మహిళా వైద్యురాలికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.తొలి మహిళా రేడియాలజిస్టు అయిన డాక్టర్ భారవ్ 1984లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టరు. ఆమెను ఆమె పదవికి ఎంపిక చేసింది నాటి ప్రధాని ఇందిరా గాంధీనే. నిజానికి 1940ల భారతదేశంలో రేడియాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఉండగానే..దానినే ఆమె ఎంచుకుని, అందులోని వైద్యురాలిగా కొనసాగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాదు 95 ఏళ్ల వయసులో ఉన్నా ఆమె ఇప్పటికీ ఆ విభాగంలో ప్రొఫెసర్ కొనసాగుతుండటం విశేషం. ఆమెను డైరెక్టర్గా ఎవరైతే ఎంపిక చేశారో ఆమేకే వైద్యం అందిచాల్సిన విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారామె. చెప్పాలంటే అత్యున్నత హోదా ఖరారయ్యే సమయంలోనే ఈ విషాదాన్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అంటే..బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే సవాళ్లును ఎదుర్కొంటు వచ్చారామె. వాటన్నింటి జ్ఞాపకాలు "ది ఉమెన్ హూ రన్ ఎయిమ్స్" అనే పుస్తకంలో పొందుపర్చారామె. అందులోని కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేరణ కలిగించడమే కాకుండా ధైర్యంగా సవాళ్లను ఎలా ఫేస్ చేయాలో నేర్పిస్తాయి. అవేంటంటే..AIIMS డైరెక్టర్గా ఆమె ఉద్యోగంలో చేరిన మొదటి రోజు అక్టోబర్ 31, 1984 ఉదయం ఆమె నియమాకాన్ని ధృవీకరించడంపై సమావేశ జరుగుతోంది. అయితే భర్గవ ఆ సమావేశంలో పాలుపంచుకోలేదు. ఆ రోజు ఆమె కొన్ని క్రిటికల్ వైద్య కేసులను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే సహోద్యోగి ఎమర్జెన్సీ కేసు వచ్చిదంటూ ఆమెను హుటాహునా క్యాజువాలిటీ వార్డుకి తీసుకుపోయారు. అక్కడ స్ట్రెచ్చర్పై ప్రధాని ఇందిరా గాంధీ రక్తంతో తడిసి ముద్దై పడి ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనంలో ఆస్పత్రి ప్రాంగణంలోకి దూసుకొస్తుంది. ఈ ఘర్షణల నడుమ ఎయిమ్స్ డైరెక్టర్గా నాటి ప్రధాని ఇంధిరాగాంధీకి చికిత్స అందించాల్పి ఉంది. ఉగ్రవాదులను తరిమికొట్టడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ జూన్లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై సైనిక దాడి నిర్వహించడంతో ఇద్దరు సిక్కు అంగరక్షకులే ఆమెపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమెను హుటాహుటినా ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు బార్గవ తన పుస్తకంలో రాసుకొచ్చారు. దురదృష్టం ఏంటంటే ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆమె చనిపోయారు. అయితే తాము ఆమె కుమారుడు రాజీవ్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే వరకు కాపాడటానికి ప్రయత్నిస్తున్నామనే కథ కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. అంతేగాదు నాలుగు గంటల వరకు ఇందిరా శరీరాన్ని పాడవ్వకుండా ఎంబామింగ్ చేసే బాధకరమైన ప్రక్రియను గురించి కూడా అందులో వివరించారు. ఇలాంటి ఎన్నో ఉత్కంఠ పరిస్థితులను తన కెరీర్లో ఎన్నో ఎదుర్కొన్నారామె. అలాగే సోనియా గాంధీ కుమారుడు రాహుల్ని ఎయిమ్స్కి తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో పంచుకున్నారు. ఆయన తలకు బాణం తగలడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. పలు రాజకీయ ఒత్తుడులు..అలాగే రాజకీయ ఒత్తిడిని కూడా ఎదర్కొన్నారు. ఒక ఎంపీ తన అల్లుడిని ఎయిమ్స్లో ఉద్యోగం కోసం ఎంపిక చేయలేదని బెదిరించిన అనుభవాలను కూడా ప్రస్తావించారు. ఇదేగాక ఫెడరల్ హెల్త్ సెక్రటరీతో సహా ఇద్దరు అగ్ర రాజకీయ నాయకులు ఎయిమ్స్ డీన్ను స్వయంగా ఎంచుకోవడానికి ప్రయత్నించే సాహసం చేసినప్పుడూ కూడా ఆమె దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆమె నేపథ్యం..లాహోర్లోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన భార్గవకు చిన్నతనం నుంచే వైద్యవృత్తి అంటే మహా మక్కువ. సరిగ్గా పాకిస్తాన్ విభజన సమయంలో, డాక్టర్ భార్గవ కుటుంబం భారతదేశానికి వచ్చి స్థిరపడింది. చిన్నతనంలో తన తండ్రితో కలిసి శరణార్థి శిబిరాల్లోని ప్రజలకు సహాయం చేయడంలో పాలుపంచుకునేది. అంతేగాదు భారతదేశంలో స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించని సమయంలోనే లండన్లో రేడియాలజీని పూర్తిచేశారామె. ఆమె తన క్లాస్లోనూ ఆస్పత్రిలోనూ వైద్య చదువుని అభ్యసించిన చివరగా ఆమె తన కలను సాధించడంలో సహాయపడిన తన కుటుంబాన్ని, తన భర్తను ప్రశంసలతో కొనియాడారు. ఇక భార్గవ కేవలం కొడుకులకే గాక, కూతుళ్లకు కూడా మద్దుత ఇవ్వమని తల్లిదండ్రులకు సూచించారు.(చదవవండి: అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!) -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్కతా ఎయిర్పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. -
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్బాక్స్(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.బ్లాక్బాక్స్లో ముందు భాగంలో ఉండే క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ల్యాబ్లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్పిట్ వాయిస్ రికార్డర్స్, ఫ్లైట్ డాటా రికార్డర్స్ నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.బ్లాక్బాక్స్తో..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. -
మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. -
ఢిల్లీకి మారనున్న నితీశ్ రాణా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్ప్రదేశ్కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు. దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.ఐపీఎల్లోనూ అదే ప్రదర్శననితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. -
అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్’.. అభ్యంతరం చెప్పడంతో..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు క్షణికావేశంతో బలవన్మరణాలకు లేదా అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక యువతి తనను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ యువతిని కడతేర్చాడు.ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతికి మరణానికి కారకుడైన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తౌఫిక్గా గుర్తించిన పోలీసులు.. అతనిని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలోని టాండాలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తౌఫిక్ ముందుగా బుర్ఖా ధరించి.. తాను ఎంతగానో ఇష్టపడిన నేహా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడేవున్న నేహా తండ్రిని పక్కకు నెట్టేసి నేరుగా టెర్రస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో నేహా అక్కడ వాటర్ ట్యాంక్ను పరిశీలిస్తోంది.అతనిని నేహా గమనించింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తౌఫిక్ ఆమెను ఐదవ అంతస్తు నుంచి తోసివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన నేహాను వెంటనే జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. కాగా నేహా అతనిని సోదరునిగా భావించిందని, అయినా అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.తౌఫిక్ మూడేళ్లుగా తమను తెలుసని, నేహా అతనిని సోదరునిలా చూసుకున్నదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే గతకొంతకాలంగా అతను నేహాను వివాహం చేసుకోవాలని భావిస్తూ, ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే నేహా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. తౌఫిక్ తన సోదరిని నెల్లాళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని నేహా సోదరి మీడియాకు తెలిపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో నివాసం ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే.. -
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police The search operation is still going on.(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef— ANI (@ANI) June 25, 2025 -
పసిడి రూ.900 డౌన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. అమ్మకాల ఒత్తిడితో బంగారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) ఢిల్లీ మార్కెట్లో రూ.900 నష్టపోయి రూ.98,900 స్థాయికి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 నష్టపోయి రూ.98,300 స్థాయిలో ట్రేడ్ అయ్యింది.మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,04,200 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 46 డాలర్లు క్షీణించి 3,323 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది. ‘‘ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందంటూ యూఎస్ ప్రకటించడంతో బంగారం ధరలు ఒత్తిడి ని ఎదుర్కొన్నాయి. మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయన్న అంచనాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. -
Vande Bharat: ఏసీ కోచ్లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!
న్యూఢిల్లీ: వందే భారత్ ట్రైన్లో ఏసీ కోచ్లో నీళ్లు లీకైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి వెళ్ళ్లే ఓ వందే భారత్ ట్రైన్లో ఏసీ పని చేయకపోవడంతో వాటర్ లీకేజ్ ఏర్పడింది. తాను వందే భారత్ ట్రైన్లో ప్రయాణించిన సమయంలో ఏసీ నుంచి నీళ్లు ధారలా తన సీటపైకి వచ్చాయన్నాడు ధర్శిల్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.ఇలా లీకేజ్ జరుగుతూనే ఉందని, ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి రిపోర్ట్ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి వీడియోను షేర్ చేస్తూ.. ఇది నా కోచ్లో జరిగిందంటూ పేర్కొన్నాడు. అత్యధిక ఖరీదుతో కొనుగోలు చేసిన వందే భారత్ ట్రైన్లో ఇలా జరగడంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రయాణంలో సుఖం లేదు. అంతా అసౌకర్యమే. రైల్వే సిబ్బందికి పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు నేను టికెట్ కొన్న డబ్బులు తిరిగి చెల్లించండి’ అంటూ పేర్కొన్నాడు. pic.twitter.com/SJlnRbUsHe— Darshil Mishra (@MishraDarshil) June 23, 2025 -
10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్ల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల నెట్వర్క్ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్ నంబర్ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి. వాహనం ఈఎల్వీ(ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్ సరి్టఫికెట్ లేకున్నా సిస్టమ్ ఆపరేటర్కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది. -
ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు. -
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు. -
ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న 110 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నుంచి అర్మేనియాకుతరలించిన 110 విద్యార్థులు గురువారం తెల్లవారుజామున భారత్కు చేరుకున్నారు. అర్మేనియా నుంచి ప్రత్యేక విమానంలో వారిని భారత్కు తీసుకొచ్చారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ కావడంతో వారికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ విద్యార్థుల్లో జమ్మూకశీ్మర్ నుంచే 90 మంది విద్యార్థులున్నారు. ‘నా కుటుంబాన్ని కలవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యుద్ధం మంచిది కాదు. మానవత్వాన్ని చంపుతుంది’అని ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థి అమాన్ అజార్ అన్నారు. కాగా, ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ‘నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. నా కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం వారి కృషికి ధన్యవాదాలు’అని రాజస్థాన్లోని కోట నుంచి వచ్చిన ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులకు భద్రత కల్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్ అభ్యర్థన మేరకు ఇరాన్ భూ సరిహద్దుల గుండా విద్యార్థులు సురక్షితంగా అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల గుండా బయటకు వెళ్లాలని సూచించింది. కాగా, ప్రస్తుతం ఇరాన్లో 4వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది కూడా చదవండి: ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్? -
ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా బుధవారం 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అతడు నోటి క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా కారణంగా 13 మంది మరణించగా, ప్రస్తుతం 620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్ 15న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. వీరిలో 57 ఏళ్ల మహిళకు డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. 57 ఏళ్ల పురుషుడికీ అదే రకమైన అనారోగ్య సమస్యలున్నాయి. మరణించిన 83 ఏళ్ల మహిళకు డయాబెటిస్, హైబీపీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది. తగ్గుతున్న కేసుల సంఖ్య ఢిల్లీలో గత మూడు రోజులుగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు నమోదు కాలేదు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 212 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 1,960 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కొత్త వేరియంట్లు సాధారణంగా వేగంగా వ్యాపిస్తాయి. అయితే ఇవి గత వేరియంట్ల మాదిరిగా ప్రాణాంతకం కాకపోవచ్చని వైద్య నిపు ణులు చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు అధికంగా ఉంటుంది. కేసుల పెరుగుదలపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, జన సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో సోనియా గాంధీ చేరిన విషయం తెలిసిందే.తాజాగా సోనియా గాంధీ ఆరోగ్యంపై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ గ్యాస్ కారణంగా కడుపు నొప్పి కారణంగా బాధ పడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. According to Dr. Ajay Swaroop, Chairman, Sir Ganga Ram Hospital, Smt. Sonia Gandhi was admitted to Sir Ganga Ram Hospital at 9:00 PM Sunday under Department of Surgical Gastroenterology for stomach related issue. She is currently stable anddoctors is closely monitoring her health pic.twitter.com/iGOALuOBbH— Healthwire (@HealthwireMedia) June 16, 2025 -
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. -
ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక మలుపు..
-
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
Shabd Apartment: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
-
ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య.. బెంగళూరు తొక్కిసలాటపై చర్చ?
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేడు (మంగళవారం) న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలవనున్నారు. జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారని సమాచారం. ఈ తొక్కిసలాట ఘటన దరిమిలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపిస్తూ, వారు రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలుసుకోనున్న సిద్ధరామయ్య, డీకేఎస్లు ఆర్సీబీ విజయోత్సవ ఘటన తొక్కిసలాట పూర్వాపరాలపై సమగ్రంగా చర్చించనున్నారు.‘సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వారికి వివరిస్తారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) అధికారులతోపాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన డిప్యూటీ సీఎం నేడు తిరిగి ఢిల్లీకి వెళుతున్నారు. జూన్ నాలుగున సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు.ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నాటి తొక్కిసలాట ఘటనలో 56 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తన నుండి సమాచారం కోరిందనే వార్తలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాగా నేటి అధిష్టానం భేటీలో గవర్నర్ ఎంపిక నామినేషన్ల కోసం సిఫార్సు చేసిన నాలుగు పేర్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్ పైఅంతస్తును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తు నుంచి ఇద్దరు చిన్నారులతో సహా వారి తండ్రి కిందకు దూకేసి, తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కొద్దిసేపటి తరువాత వారి తండ్రి కూడా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. दिल्ली के द्वारका इलाके में एक अपार्टमेंट में लगी भीषण, द्वारका के सेक्टर 13 स्थित Shabd अपार्टमेंट की घटना, तीन लोग ऊपर से कूदे हैं, तीनों की हालत काफी गंभीर है। pic.twitter.com/Rjt3FteA8b— NBT Hindi News (@NavbharatTimes) June 10, 2025ఢిల్లీలో ప్రస్తుతం తీవ్రమైన తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయ. ద్వారకలోని శబ్ధ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న దరమిలా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం నుంచి ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా దూకేశాడు. వారు తీవ్ర గాయాటలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషిచేశారు.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది. -
వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వీసా దరఖాస్తుదారులను ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల మారిన నిబంధనలను ఆసరాగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రయతి్నస్తున్నారంటూ ఓ ప్రకటనలో అలర్ట్ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ను సైబర్ నేరగాడు బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా ఇంటర్వ్యూ ముందుగానే ఇప్పిస్తామని మోసం చేశారని వివరించింది. అమెరికా వీసా దరఖాస్తు పోర్టల్లో వ్యక్తిగత వివరాలను, అర్హతలను షేర్ చేయవద్దంటూ శుక్రవారం అమెరికా ఎంబసీ ‘ఎక్స్’లో కోరింది. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగానే వచ్చేందుకు ఎక్కువ ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అది వట్టి మోసమని వెల్లడించింది. ఇంజినీర్ ఎలా మోసపోయారంటే.. బెంగళూరు ఆర్ఆర్ నగర్కు చెందిన ఇంజినీర్(45) అమెరికా సందర్శనకు అవసరమైన బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ఇంటర్వ్యూ షెడ్యూల్ 2026 మార్చిలో ఖరారైంది. టెలీగ్రామ్ యాప్లో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆయన.. ఓ వ్యక్తిని మే 22న సంప్రదించాడు. ఆ మోసగాడు తన పేరు వనం శ్రవణ్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగా రావాలంటే అడ్వాన్స్గా రూ.10వేలు చెల్లించాలన్నాడు. ఆ మేరకు డబ్బు పంపగా, వ్యక్తిగత వివరాలు కావాలడిగాడు. అమెరికా వీసా అప్లికేషన్ పోర్టల్ లాగిన్ పాస్వర్డ్ కూడా తీసుకున్నాడు. ఫేక్ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ పత్రం పంపించిన మోసగాడు...మరో రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేదంటే లాగిన్ పాస్వర్డును మారుస్తానని బెదిరించాడు. ఆ మేరకు రూ.10వేలు చెల్లించిన తర్వాత కూడా ఆ మోసగాడు లాగిన్ పాస్వర్డును మార్చేశాడు. దీంతో, బాధితుడు చేసేదిలేక మే 24న పోలీసులను ఆశ్రయించాడు.అవకాశం కోల్పోయిన బాధితుడు ఈ విషయంలో బాధితుడికి అమెరికా ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందదని సీనియర్ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తొందరగా వచ్చేందుకు తనంతట తానే థర్డ్ పార్టీని ఆశ్రయించాడని, అధికారిక ప్రక్రియను కాదని దొడ్డిదారిన పని పూర్తి చేసుకునే ఇటువంటి వారిని ఎంబసీ అధికారులు ప్రోత్సహించరన్నారు. వ్యక్తిగత వివరాలతోపాటు పాస్వర్డ్ సైతం మోసగాడికి ఇవ్వడం మరీ దారుణమన్నారు. బాధితుడు మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలతోపాటు విజిటర్ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం గత నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులందరి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలంటూ విదేశాంగ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, నాన్ ఇమిగ్రాంట్ వీసా దరఖాస్తుదారుల నుంచి ప్రాసెసింగ్ ఫీజుగా ఇకపై వెయ్యి డాలర్లు వసూలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో వీసా ఇంటర్వ్యూలు తొందరగా పూర్తవ్వాలని కోరుకునే పర్యాటక వీసా దరఖాస్తు దారులు సైతం ఉన్నారు. -
పట్టాలపై విషాదం.. రన్నింగ్ ట్రైన్లో ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగ క్రికెటర్
రైలు పట్టాలపై ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పితో మరణించాడు. అత్యవసర సాయం కోసం రైల్వే వైద్య సిబ్బంది కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చనిపోయిన క్రికెటర్ సహచరులు వాపోతున్నారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. పంజాబ్కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్.. ఓ వీల్చైర్ టోర్నమెంట్ కోసం సహచరులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గ్వాలియర్కు బయల్దేరాడు. ప్రయాణంలో విక్రమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. విక్రమ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. రైల్వే వైద్య సిబ్బందికి అనేక అత్యవసర కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. రైలు ఢిల్లీ నుంచి మధుర స్టేషన్కు చేరుకునేలోపే విక్రమ్ మరణించాడు.కళ్ల ముందే సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి క్రికటర్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. విక్రమ్ నొప్పితో విలవిలలాడిపోయాడని ఓ క్రికెటర్ చెప్పాడు. అత్యవసర వైద్య సాయం కోసం ఎంత సేపు ప్రయత్నించినా రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ మిత్రుడు మరణించాడని మరో క్రికెటర్ వాపోయాడు. మధుర రైల్వే స్టేషన్లో విక్రమ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అక్కడే పోస్ట్మార్టమ్ పూర్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమ వైద్య సిబ్బంది ఆలసత్వంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై దివ్యాంగ హక్కుల సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓ దివ్యాంగ క్రీడాకారుడు ఛాతి నొప్పితో విలవిలలాడుతుంటే వైద్య సాయం అందించడానికి ఓ రైల్వే అధికారి కూడా లేకపోవడం సిగ్గు చేటని క్రీడా సమాజం దుమ్మెత్తిపోస్తుంది. -
స్వయం సమృద్ధ భారతే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వయం సమృద్ధ, సమీకృత భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ప్రతి పౌరుడికీ లభించాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ కాలం ఈ నెల 9వ తేదీ నాటికి 11 ఏళ్లు పూర్తి కానుంది. మూడో టర్మ్లో తొలి ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల్ యోజన, జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో ప్రజలకు పక్కా నివాస గృహాలు, వంట గ్యాస్, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)తో చివరి లబ్ధిదారుడికి సైతం మేలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేస్తాం. నేరుగా వారి వద్దకే వెళ్తాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మన భూగోళాన్ని కాపాడుకుందాం... మనం నివసిస్తున్న ఈ భూగోళాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమిని రక్షించుకొనే విషయంలో అన్ని రకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలన్నీ స్వప్రయోజనాలు పక్కనపెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కలపాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదమని గుర్తుచేశారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ క్రమంగా పెరుగుతోందని, లక్షలాది మంది నిత్య జీవితంలో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ విధానం పాటిస్తున్నారని చెప్పారు. సిందూర్ మొక్క నాటిన ప్రధాని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో లోక్ కల్యాణ్ మార్గ్లోని తన అధికారిక నివాసంలో సిందూర్ మొక్క నాటారు. బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడానికి 1971లో పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళలు ఆయనకు ఈ మొక్క బహూకరించారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు గుర్తుగా మోదీ సిందూర్ మొక్కను స్వహస్తాలతో నాటారు. సిందూర్ మొక్క మన దేశ మహిళల శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సిందూర్ మొక్క నాటే గొప్ప అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల గుజరాత్లోని కచ్లో పర్యటించినప్పుడు మహిళలు తనకు ఈ మొక్కను బహూకరించారని, 1971లో పాకిస్తాన్పై భారత్ సాగించిన యుద్ధంలో వారంతా అసాధారణ పరాక్రమం, దేశభక్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. సిందూర్ మొక్క నాటిన వీడియోలు, ఫొటోలను మోదీ షేర్ చేశారు. -
కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ ఎపిసోడ్.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి
ఢిల్లీ: కోర్టు లాకప్లోఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమన్ అనే అండర్ ట్రయల్ ఖైదీ మృతి చెందాడు. ఢిల్లీలోని సాకేత్ కోర్టులో అండర్ ట్రయల్ ఖైదీ అమన్ను విచారణ నిమిత్తం హాజరుపరిచిన క్రమంలో తోటి ఖైదీలు హత్యాయత్నం చేశారు. రిమాండ్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. ఆ అండర్ ట్రయల్ ఖైదీని గొంతుకోసి తీవ్రంగా గాయపరిచారు. అయితే ఆ ఖైదీ ఈరోజు(గురువారం) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు తొలుత తిహార్ జైలు 8వ నెంబర్ గదిలో ఉంచారు. అయితే వీరిని బుధవారం విచారణకు ఢిల్లీ సాకేత్ కోర్టుకు హాజరు పరిచిన క్రమంలో అండర్ ట్రయల్ ఖైదీపై మిగతా ఇద్దరు ఖైదీలు దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అమన్ అనే ఖైదీ గొంతు కోశారు. దాంతో గాయపడిన అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా, ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదికారులు చెప్పిన దాని ప్రకారం ఈ రెండు గ్రూపుల మధ్య కోర్టు లాకప్లోఏ తీవ్ర ఘర్షణ జరిగి అది ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు. -
Covid-19: 4,866కు యాక్టివ్ కేసులు.. ఏడుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ కేసులు(Covid cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,238 కొత్త కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. కోవిడ్-19 కారణంగా మహారాష్ట్రలో ముగ్గురు,ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు మృతి చెందారు.ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కేరళ(Kerala)లో కొత్తగా 114 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో కేసులు నమోదయ్యాయి. కేంద్రం నేడు(గురువారం) దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలలోని ఆసుపత్రుల సంసిద్ధతను తనిఖీ చేయనుంది.వైద్యాధికారులు ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అలాగే దేశంలోని ప్రధాన ఆసుపత్రులలో వెంటిలేటర్ల లభ్యతను అంచనా వేయనున్నారు. ఓమిక్రాన్ వేరియంట్కు చెందిన ఎన్బీ .1.8.1 ఉప-వేరియంట్ కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్ -
ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్కు స్పష్టంచేసింది. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
ఇదేం ఫ్యాషన్..? ఏకంగా దుప్పటినే లెహంగాలా..
‘ఫ్యాషన్ అనేది ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి కాదు మన ఊహాల నుంచి మొదలవుతుంది’ అంటారు. సిమ్రాన్ క్రియేటివిటీని చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ ఆనంద్ ఇరవై కిలోల బెడ్ షీట్ను ఆకట్టుకునే లెహంగాగా మార్చి ఔరా..! అనిపించుకుంది. చక్కటి ఎంబ్రాయిడిరీతో అందంగా ఉన్న ఈ బెడ్షీట్ని ఇలా కూడా ఉపయోగించొచ్చు అనే ట్రెండ్కి తెరతీసింది. అదేనండి మనసుంటే మార్గం ఉంటుంది. అన్నట్లుగా ఈ అమ్మడు తన సృజనాత్మకతకు పదునుపెట్టి మరీ మనకు సరికొత్త ఫ్యాషన్ని పరిచేయం చేసింది సిమ్రాన్‘ఔట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్’ కాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సిమ్రాన్.‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘బెడ్ షీట్లలో నాకు ఫ్యాషన్ కనిపించింది’ ‘లెహంగాగా మార్చడం ద్వారా దుప్పట్లకు సెకండ్ లైఫ్ కూడా ఇవ్వవచ్చు’ అంటుంది సిమ్రాన్. ఇక నెటిజనుల స్పందన విషయానికి వస్తే... ‘దుప్పటితో లేహంగా ఏమిటీ!’ అనే వెక్కిరింపుల కంటే.. ‘క్రియేటివ్ ఐడియా’ అనే ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. View this post on Instagram A post shared by Simran Anand (@simrananand21) (చదవండి: ‘పేరెంట్ షాలా’: పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!) -
దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం -
‘టైగర్ మ్యాన్’: వాల్మీకి థాపర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్య మకారుడు, టైగర్ మ్యాన్గా పేరున్న వాల్మీకి థాపర్(73) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడు తున్న ఆయన శనివారం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్లోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. వన్యప్రాణుల సంరక్షణ, ప్రత్యేకించి పులులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించారు. అటవీ సంరక్షణలో ప్రజలను మమేకం చేసే లక్ష్యంతో 1988లో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ రణథంబోర్ ఫౌండేషన్కు థాపర్ సహ వ్యవస్థాపకుడు. సహజంగా సంచరించే ప్రాంతాల్లో పులులను అక్రమంగా వేటాడటంపై ఆయన ఉద్యమించారు. మానవ జోక్యాన్ని అడ్డుకు నేలా ప్రత్యేక టైగర్ జోన్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సారథ్యంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్లైఫ్ వంటి రమారమి 150 ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. వన్యప్రాణుల గురించి టైగర్ ఫైర్, లివింగ్ విత్ టైగర్స్ వంటి 30కి పైగా పుస్తకాలను రాశారు. భారతీయ వన్యప్రాణులపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. 2024లో జీవావరణ పరిరక్షకురాలు నేహా సిన్హా తీసిన ‘మై టైగర్ ఫ్యామిలీ’అనే డాక్యుమెంటరీలో థాపర్ కూడా ఉన్నారు. కాగా, థాపర్ తండ్రి రమేశ్ థాపర్ ప్రముఖ జర్నలిస్ట్. బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్ కుమార్తె సంజనా కపూర్, వాల్మీకి థాపర్ దంపతులు కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు. -
‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ