జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము | Delhi Kartavya Path: Republic Day 2026 Celebrations Updates | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

Jan 26 2026 7:31 AM | Updated on Jan 26 2026 11:52 AM

Delhi Kartavya Path: Republic Day 2026 Celebrations Updates

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి, సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధాన్ని ప్రతిబింబించేలా పేరేడ్‌ సాగుతోంది. పరేడ్‌లో ఆరువేల మంది సైనికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

  • అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
  • గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌
  • మొదటిసారిగా ఇండియన్‌ ఆర్మీ ‘ఫేజ్‌డ్‌ బ్యాటిల్‌ అరే’ ప్రదర్శన
  • దేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్‌
  • పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర,
  • భిన్నత్వంలో ఏకత్వం థీమ్‌పై 100 మంది కళాకారులతో సంగీత నృత్య కార్యక్రమం
  • పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర, అశోక చక్ర విజేతలు
  • ప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం
  • పరేడ్‌లో పాల్గొన్న ఐరోపా సమాఖ్య చెందిన సైనిక బృందం
  • 150 ఎంఎం లైట్‌ ఫీల్డ్‌ గన్స్‌తో 21 సార్లు పేల్చి గౌరవ వందనం
  • శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం
  • పూల వర్షం కురిపించిన 4 ఎంఐ-17 హెలికాఫ్టర్లు
  • ప్రత్యేక ఆకర్షణగా భారతీయ న్యాయ సంహిత శకటం
  • వేడుకల్లో తొలిసారి జంతు దళం కవాతు
     

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
మొదటిసారిగా ఇండియన్‌ ఆర్మీ ‘ఫేజ్‌డ్‌ బ్యాటిల్‌ అరే’ ప్రదర్శన
దేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్‌

  • వేడుకల్లో భాగంగా వార్‌ మెమోరియాల్‌ వద్ద  అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులు 

  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరిన  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  • రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్యపథ్‌కు  ద్రౌపదీ ముర్ము

  •  ద్రౌపదీ ముర్ముతో పాటు యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్   

సైనికులతో పరేడ్‌ 

  • 6,050 మంది సైనికులతో పరేడ్‌ 

  • 17 రాష్ట్రాలు, 13 కేంద్ర  ప్రభుత్వ శకటాలను ప్రదర్శన 

  • 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు 

  • కర్తవ్య పథ్‌ దగ్గర 6 కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు 

  • దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా జరిగే కవాతు 

  •  ఆయుధ ప్రదర్శన వైమానిక విన్యాసాలు 

  • గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో నిఘా ఏర్పాట్లు  

     


     

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement