breaking news
Republic Day 2026
-
Republic Day 2026: ఆమె ఒక స్ఫూర్తి పాఠం
పోలీసు కొలువు.. నిత్యం సవాళ్లతో సహవాసం.. పోలీస్ శాఖలో మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తూ.. సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిస్త్ ఆ శాఖలో దూసుకుపోతున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అభిలాష బిస్త్.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా సర్వీసులో చేరారు. రాష్ట్ర పోలీస్ శాఖకు ఎంపికవుతున్న కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 1986లో ఏర్పాటైన పోలీసు అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం.గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షి డిజిటల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీస్ శాఖలో ఆమె జర్నీతో పాటు తెలంగాణ పోలీసింగ్ గురించి వివరించారు. పోలీసుశాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం సాధించగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వివిధ అంశాలపై మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు సాక్షితో పంచుకున్నారు.పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో క్లిక్ చేయండి: -
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం : ముర్ము
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ప్రస్తుతం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నారని ముర్ము అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ముర్ము పేర్కొన్నారు.మన రైతులు దేశానికి అవసరమైన పోషకాహారాన్ని సమృద్దిగా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్కు ఘన విజయం అందించిన త్రివిధ దళాలను ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ నిర్మాతలు నిబంధనలు ద్వారా జాతీయవాద స్ఫూర్తికి దేశ ఐక్యతకు బలమైన పునాదిని అందించారని, ప్రస్తుతం భారత ప్రజలమైన మనము గణతంత్ర దినోత్సవాన్ని దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత గణతంత్ర ఉత్సవాలు దేశ భూత, వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులకు అద్దం పడుతాయన్నారు.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం దేశ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్చి వేసిందని ఈ ముర్ము పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళ భాషలో వందేమాతరం యోన్బోమ్ అనే గీతాన్ని స్వరపరిచిన జాతీయవాద కవి సుబ్రమణ్య భారతిని ద్రౌపది ముర్ము ప్రశంసించారు.


