ఢిల్లీని కమ్మేసిన పొగమంచు | Air Quality deteriorates again in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

Jan 18 2026 10:10 AM | Updated on Jan 18 2026 10:32 AM

Air Quality deteriorates again in Delhi

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలలో జీరో విజిబులీటీ నమోదైంది. పొగమంచు తీవ్రంగా ఉండడంతో విమానాలతో పాటు పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  మరోవైపు నగరంలో గాలికాలుష్య తీవ్రత సైతం మరోసారి పెరిగింది.

దేశరాజధాని నగరంలో గాలికాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం గాలి కాలుష్య స్థాయి 439 పాయింట్ల నుంచి 500 కు చేరుకుంది. దీంతో  వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం గ్రేడ్-4 కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 

దీంతో విమాన రాకపోకల సమయాలు ప్రయాణికులకు వెబ్‌సైట్‌లలో చుసుకోవాలని ఇండిగోతో పాటు ఇతర ఎయిర్‌ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు విజ్ఞ‍ప్తి చేశాయి.బేర్లీ, లక్నో, కుశీనగర్‌ ప్రాంతాలలో జీరో విజిబులిటీ నమోదుకాగా అమృత్ సర్, గోరఖ్‌పూర్‌లలో 100మీటర్లు, ‍‍ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల విజిబులిటీ నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement