దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ చేసిన కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు ఎవరియా? అక్కడికి ఎలా వచ్చాయా? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని నమూనాలు స్వీకరించాయి. మృతదేహాలు లభించిన కారు పీరాగఢి ఓవర్ వద్ద పార్కు చేసి ఉంది. అయితే చనిపోయిన వారిలో ఒకరు యువతి కాగా మరోకరు యువకుడు, ఓ పెద్దాయన ఉన్నారు. రణ్ధీర్(52), శివనరేష్(42) లక్ష్మీ(41)లుగా గుర్తించారు.
#BreakingNews #DelhiPolice #DelhiCrime
Piragarhi Incident | Delhi
Three bodies were found inside a parked car near the Piragarhi flyover, causing panic in the area.
The deceased include one woman and two men, identified as Randhir (62), Shivnaresh (42), and Laxmi (40). The car… pic.twitter.com/EkrutMTGsE— Manmeen Walia (@ManmeenWalia) February 8, 2026


