ఘజియాబాద్‌లో అక్కాచెల్లెళ్ల కేసులో కొత్త ట్విస్ట్‌ | Ghaziabad Three Sisters Incident probe Interesting Facts | Sakshi
Sakshi News home page

ఘజియాబాద్‌లో అక్కాచెల్లెళ్ల కేసులో కొత్త ట్విస్ట్‌

Feb 6 2026 10:52 AM | Updated on Feb 6 2026 11:02 AM

Ghaziabad Three Sisters Incident probe Interesting Facts

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరి ఆత్మహత్యలకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతుల తండ్రి.. అప్పుల్లో కూరుకుపోవడం, వారి చదువులు మాన్పించడం వంటి అంశాలు ఆత్మహత్యకు దారి తీసినట్టు తెలిసింది. వారికి పెళ్లి చేస్తానని చెప్పడం కూడా ఇందుకు ఇక కారణమని పోలీసులు గుర్తించారు.

ఘజియాబాద్‌కు చెందిన ఫారెక్స్ వ్యాపారవేత్త చేతన్‌ కుమార్‌కు ముగ్గురు భార్యలు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్‌ సోదరి కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా కలిసే ఉంటున్నారు. అయితే, కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో చేతన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ క్రమంలో చేతన్ తన అవసరాల కోసం అప్పులు చేశాడు. అది కాస్తా ఇప్పుడు రెండు కోట్లకు చేరుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో.. స్కూల్‌, కాలేజీ ఫీజులు కట్టలేక వారి చదువు ఆగిపోయింది. దీంతో, వారంతో ఇంట్లోనే ఉంటున్నారు.

ఆర్థిక అవసరాల కోసం పేరెంట్స్‌ కూడా పనులు చేసుకుంటున్నారు. దీంతో, పిల్లలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతన్‌.. పిల్లలను సరిగా పట్టించుకునే వాడు కాదని సమాచారం. ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్‌కు బానిసైపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12).. ‘కొరియన్ లవ్ గేమ్’కు అడిక్ట్‌ అయిపోయారు. సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచారు. గేమ్‌కు బానిసలుగా మారడాన్ని గుర్తించిన తండ్రి.. పది రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్‌ను తీసుకుని దాచిపెట్టేశాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.  ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో వారి బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి’ అంటూ ఒక సూసైడ్ నోట్‌ ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement