breaking news
Uttar Pradesh
-
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
ప్రాణాలు తీసిన పొగమంచు
మథుర: చిమ్మచీకట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది. యమునా ఎక్స్ప్రెస్వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు 13 మంది ప్రయాణికుల ప్రాణాలను అనంతలోకాల్లో కలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుఏముందో కనపడనంతగా విపరీతంగా ఉన్న పొగమంచు కారణంగా ఆగ్రా–నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికి వెంట మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వీటిల్లో చిక్కుకుపోయి రక్తమోడుతూ 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.43 మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆగ్రాలోని ఎస్ఎన్ వైద్య బోధనాస్పత్రి, బృందావన్, ఢిల్లీ ఆస్పత్రుల్లో చేర్పించామని మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ చెప్పారు. అయితే 60 మందికిపైగా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. స్వల్ప గాయాలైన ప్రయాణికులను యూపీ ప్రభుత్వ వాహనాల్లో తమతమ గమ్యస్థానాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని బల్దేవ్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై 127 నంబర్ మైలురాయి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసబెట్టి ఢీ.. వెనువెంటనే చెలరేగిన మంటలు క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట తొలుత ఒక బస్సును మరో వాహనం మాత్రమే ఒకదానివెనుక మరోటి ఢీకొన్నాయి. వాటిలోని ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లు ప్రమాదం షాక్ నుంచి తేరుకుని కిందకు దిగి తర్వాత అటుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేలోపే వెనకనుంచి మరికొన్ని వాహనాలు అతివేగంతో ఢీకొట్టాయి. ‘‘కొన్ని వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పక్కకు పోనిద్దామని చూసినా అప్పటికే గాయపడిన ఇతరవాహన ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో మరోదారిలేక వీటినే గుద్దేశారు.ఘటనాస్థలికి నేను వెళ్లిచూసేసరికి అక్కడ దృగ్గోచరత(విజిబిలిటీ) కేవలం మీటర్ మాత్రమే. అంతకుమించి దూరంలో ఏముందో కనిపించనంతా పొగమంచు అలుముకుంది’’అని ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. ఇలా మొత్తం ఎనిమిది బస్సులు, కార్లు, వాహనాలు ఢీకొని తుక్కుతుక్కయ్యాయి. దీంతో ఇంధన ట్యాంక్లు బద్దలై మంటలు చెలరేగాయి. నుజ్జునుజ్జయిన వాహనాల్లో కొందరు, అగ్నికీలల కారణంగా తీవ్రంగా కాలిన గాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.వరుసబెట్టి బస్సులు, కార్లు తగలబడుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాలిపోయిన వాహనాలు కుప్పగా రహదారిపై అడ్డుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, మథుర జిల్లా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్రేన్లతో పక్కకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతటా భీతావహస్థితి.. చిమ్మచీకటి, చలిలో వాహనాల్లో తమతమ సీట్లలో మఫ్లర్లు ధరించి, బెడ్షీట్లు కప్పుకుని ముసుగుతన్ని నిద్రపోతున్న పలువురు అగ్నికీలల్లో కాలి బూడిదయ్యారు. కొందరు శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపుముద్దలుగా మారిపోయారు. వాహనాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగ, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారింది. వేగంగా వాహనాలు ఢీకొన్న శబ్దం సుదూరంలోని తమకూ వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్పారు. మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి కుటుంబసభ్యులు, బంధువుల డీఎన్ఏతో పోల్చిచూశాక పార్థివదేహాలను పోలీసులు అప్పగించనున్నారు.ఇప్పటికే 17 మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. డీఎన్ఏ ప్రక్రియ కోసం రెండు వైద్య బృందాలను నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా వల్లభ్ చెప్పారు. కొందరు మృతుల జాడ గుర్తించారు. వాళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మథుర జిల్లా మేజి్రస్టేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ చెప్పారు. దుర్ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సారథ్యంలో నలుగురు సభ్యులతో మేజి్రస్టియల్ విచారణకు ఆదేశించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనపై ఒక అనామక డ్రైవర్పై తొలుత ఒక కేసు నమోదుచేసి నేరదర్యాప్తు ఆరంభించారు. పిల్లలను బయటకు విసిరేసి.. బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనాలకు హఠాత్తుగా మంటలంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతథా ప్రయత్నించారు. పార్వతి అనే 42 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రాచీ, సన్నీలను వెంటనే బస్సు నుంచి బయటకు విసిరేశారు. కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ లోపలికి పడిపోయారు. ‘‘పిల్లల్ని విసిరేశాక ఆమెను నేను చూడలేదు. ఆమెకు ఏమైందో ఎక్కడుందో అర్ధంకావట్లేదు’’అని ఆమె సమీప బంధువు గుల్జారీ ఏడుస్తూ చెప్పారు. ‘‘క్షతగాత్రులను చేర్పించిన ఆస్పత్రుల చుట్టూ ఆమె జాడ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఆమె ఎక్కడా కన్పించట్లేదు’’అని గుల్జారీ రోదిస్తూ చెప్పారు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలను ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం’’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేíÙయా, క్షతగాత్రులకు తలో రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు. -
ప్రియురాలిని బలిగొని.. పెళ్లి పీటలెక్కిన క్రూరుడు!
ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.బిలాల్ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
పాటలతో పులులు పరార్!
పిలిభిత్: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ ఓ ఉపాయం కనిపెట్టారు. ‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్పూర్, రామ్నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్పూర్లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్ తెలిపారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్: బీజేపీ నేత కుమార్తెకు ఆకతాయిల వేధింపులు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Molestation in daylight! 🚨⚠️Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్షోర్ ఛానెల్లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
యూపీలోని బదౌన్కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక పలువురి దృష్టిని ఆకర్షించింది.దైవిక వరుడితో సాంప్రదాయ వివాహంఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు. ఆమె సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు. మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.बदायूं की पिंकी शर्मा ने भगवान श्रीकृष्ण जी से की शादीबदायूं जिले के इस्लामनगर थाना क्षेत्र के गांव ब्यौर कासिमाबाद में 28 साल की पिंकी शर्मा ने श्रीकृष्ण की प्रतिमा के साथ धूमधाम से विवाह कर लिया। पूरे गांव ने घराती की भूमिका निभाई और परिवार ने विवाह की पूरी रस्में पूरी कीं pic.twitter.com/dtT9fjfARU— Arjun Chaudharyy (@Arjun5chaudhary) December 7, 2025వధువు తండ్రి ఏమన్నారంటే ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి తనతో పాటు వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్బంగారు ఉంగరం దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది. ఇది తన వివాహానికి మరొక సంకేతంగా భావించిందట. తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి. చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు -
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన తోడేలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్లోని కైసర్ గంజ్ ప్రాంతంలో మరోసారి తోడేలు దాడి ఘటన చోటుచేసుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ తోడేలు నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. అటవీ సిబ్బంది, గ్రామస్తులు డ్రోన్ కెమెరాల సాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటన మల్లహన్పుర్వ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. కిరణ్ సంతోష్ దంపతుల నాలుగు నెలల సుభాష్ తల్లి పక్కన నిద్రిస్తుండగా చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి పరుగుతీసింది. వెంటనే అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. లాభం లేకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడను కనుగొనేందుకు యతి్నస్తున్నారు. ‘గతంలో తోడేలు కనిపించినట్లు గ్రామస్తులు చెప్పిన నదీ సమీప ప్రాంతాలు, చెరకు తోటలు సహా అన్ని ప్రాంతాల్లోనూ మా బృందాలు గాలిస్తున్నాయి. శిక్షణ పొందిన షూటర్లను కూడా రంగంలోకి దించాం. ఆ తోడేలును పట్టుకోవడమో లేదా చంపేయడమో చేస్తాం’అని డీఎఫ్వో రామ్ సింగ్ యాదవ్ చెప్పారు. కాగా, మల్లన్పుర్వ గ్రామంలో గత 9 రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. నవంబర్ 28న ఐదేళ్ల బాలుడు స్టార్ తోడేలు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 5న మరో ఐదేళ్ల బాలిక తోడేలు దాడిలో గాయపడింది. సెపె్టంబర్ 9వ తేదీ నుంచి బహ్రెయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది చిన్నారులతోపాటు ఓ వృద్ధుడు చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టారు. ఆయన ఆదేశాలతో షూటర్లు నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు. -
ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం .. దేశంలో తొలి కేసు నమోదు
లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరోపణలపై దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఓ కుటుంబంపై కేసు నమోదైంది. రాంపూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఇద్దరు కుమారులు ఆమిర్ ఖాన్, డానిష్ ఖాన్ దుబాయ్, కువాయిట్లలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. అయితే, నూర్జహాన్ ఎస్ఐఆర్ బూత్ లెవల్ అధికారులకు వాళ్లిద్దరూ రాంపూర్లోని జ్వాలా నగర్లోనే ఉంటున్నట్లు ఫోర్జరీ పత్రాలను ఎన్యుమరేషన్ సందర్భంగా సమర్పించింది. డిజిటైజేషన్ ఫాంలను పరిశీలించిన బీఎల్వోల ఈ విషయాన్ని గుర్తించారు. ఆరా తీయగా వారిద్దరూ విదేశాల్లో ఉంటున్నది నిజమేనని తేలింది. దీంతో, నిజాలను దాచిపెట్టినందుకు నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు. -
మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్తో సంచలనం
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్సెట్ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా. శభాష్ అవధేశ్ రానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్ల వివాహం నవంబర్ 22న ముజఫర్నగర్లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు. నా మనస్సాక్షికి విరుద్ధం.. సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.మా బంధం రూపాయితో మొదలైంది.. తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘చీర్స్’బాబు చిక్కాడు
బహ్రైచ్ (యూపీ): చిరుతపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.. దాన్ని పట్టుకోవడానికి బోను కూడా ఏర్పాటు చేశారు. చిరుత చిక్కలేదు.. కానీ అందులో ఒక మందుబాబు చిక్కుకుపోయాడు. ఫక్రూర్ ప్రాంతంలోని ఉమ్రిదేహ్లో గ్రామంలో బుధవారం ఓ మహిళను చిరుత చంపింది. దీంతో అధికారులు గ్రామం బయట మేకను ఎరగా పెట్టి ఓ బోనును సిద్ధం చేశారు. కానీ, గురువారం రాత్రి, స్థానిక యువకుడు ప్రదీప్ బాగా మందుకొట్టి.. దారిలో ఈ బోనును చూశాడు. ‘బోను ఎంత గట్టిగా ఉందో చూద్దాం.. అనుకున్నాడో.. చిరుత లోపల ఉందో లేదో? చెక్ చేద్దాం అనుకున్నాడో’తెలీదు.. లోపలికి అడుగు పెట్టాడు. అంతే.. ఆటోమేటిక్ తలుపు దడాల్న మూసుకుపోయింది. తాను చిక్కుకున్నానని ఎట్టకేలకు గ్రహించిన ప్రదీప్ గ్రామపెద్దకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న ఈ అటవీ, పోలీసు శాఖాధికారులు హుటాహుటిన రాత్రిపూట ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘ఆ యువకుడిని బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. మందు మత్తులో ఉన్నాడు’.. అన్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్. చివరకు ప్రదీప్ను బయటకు తీసి, తీవ్రంగా హెచ్చరించి ఇంటికి పంపేశారు. -
వధువే వరుడై... రివర్స్ పెళ్లి ఊరేగింపు!
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక పెళ్లి ఊరేగింపు ‘ఆహా’ ‘వోహో’ అనిపించింది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈ పెళ్లి ఊరేగింపు ప్రత్యేకత ఏమిటంటే... రివర్స్ ఊరేగింపు!సంప్రదాయం ప్రకారమైతే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళతాడు. కాని ఈ పెళ్లిలో మాత్రం వధువు అత్తమామల ఇంటికి ఊరేగింపుగా వెళ్లింది. ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును చూడడానికి ప్రజలు తరలి వచ్చారు.వధువే వరుడి ఇంటికి ఊరేగింపుగా వెళ్లాలనేది వధువు తండ్రి రాజేష్ జైస్వాల్ కోరిక. అతడికి అయిదుగు అమ్మాయిలు. కొడుకు లాగే కుమార్తె వివాహా ఊరేగింపును జరుపుకోవాలనే అతడి సుదీర్ఘకాల కల ఫలించింది.ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును హైలెట్ చేస్తూ ‘లడ్కీకి బరాత్’ పేరుతో పెళ్లి పత్రికలు పంచాడు. అప్పటి నుంచే అందరిలో ఆసక్తి మొదలైంది. ఇదిసరేగానీ ఇంతకీ వరుడికి, అతడి తల్లిదండ్రులకీ, బంధువుకు ఈ రివర్స్ బరాత్ కాన్సెప్ట్ నచ్చిందా?‘బ్రహ్మాండంగా’ అంటున్నాడు రాజేష్ జైస్వాల్. వరుడి బంధువులు అత్యంత ఉత్సాహంగా పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్ల పాటు సాగిన ఈ ఊరేగింపులో వధువు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.‘నేను ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోను సేవ్ చేసుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. భవిష్యత్లో నా బిడ్డల పెళ్లి విషయంలో ఇదే కాన్సెప్ట్ అనుసరిస్తాను’ అన్నాడు ఒక తండ్రి.మంచిదే కదా! -
క్రికెటర్ టు ఐఏఎస్ జర్నీ..! బస్సు డ్రైవర్ కొడుకు విజయగాథ..
ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. దాంతో మన డ్రీమ్ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్ ఎగ్జామ్లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్ అయ్యాడు. విధి నీ వల్ల కాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.అతడే ఉత్తరప్రదేశ్కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్కు అవసరమైన కిట్కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. అలా ఇంటర్మీడియెట్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్కేఫ్లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్ఎగ్జామ్ వైపుకి వెళ్లడం అంటే కెరీర్ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
నేడు అయోధ్యలో మహా ఘట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయం పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు. జెండాపై శ్రీరాముడి శౌర్యం, తేజస్సును సూచించేలా సూర్యుడి గుర్తు, ఓం అనే మంత్రం, దేవకాంచన వృక్షం బొమ్మ ఉంటాయి. ఈ పవిత్ర పతాకం రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వికాస సందేశాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయోధ్యలోని సప్తమందిరాన్ని సైతం మోదీ దర్శించుకుంటారు. శేషావతార ఆలయం, మాత అన్నపూర్ణ అలయాల్లోనూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రామలల్లా గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుంటారు. అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. -
రీల్ ఎంత పని చేసింది రాములా!
సోషల్ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్ తన బెడ్రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. यूपी –शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025 ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ వకార్ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్ రూపంలో వైరల్ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. \బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్ డాక్టర్ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది. -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
సొంత వదిననే పెళ్లాడాడు, ఎందుకో తెలుసా?
ఉత్తర ప్రదేశ్లో అరుదైన వివాహం పలువురిని ఆకట్టుకుంటోంది. అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించిన ఘటన నెట్టింట విశేషంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన రాజేశ్ సింగ్ సోదరుడు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో తన సోదరుడితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వదిన వేదనను గమనించాడు. అలాగే చెట్టంత కొడుకును కోల్పోయిన తన తన కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇదే రాజేశ్ను ఆలోచింప చేసింది. అటు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వదినకు,ఇటు కుటుంబానికి ఊరట నివ్వాలని అనుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబంతో చెప్పి, ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనిపై వారిబంధువులతో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. -
కుట్లకు బదులు ‘ఫెవిక్విక్’!
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది. ఫెవిక్విక్తో వైద్యం! ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరం జాగృతి విహార్కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి. కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట. కంగుతిన్న వైద్యులు ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్ను (ఫెవిక్విక్ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశం.. ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ ప్రియుడిలైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనను వేధించిన పురుషుడికి తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కాన్పూర్లో (Kanpur) జరిగిన ఈ ఘటన నెట్టింట సంచలనంగా మారింది. బిల్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు, వివాహతుడు వేధించడం మొదలు పెట్టాడు. ఒంటరిగా పొలానికి వెళ్లిన ఆమెను వెంటపడి, లైంగికంగా వేధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ యువతి తనను తాను రక్షించుకునే చర్యలో భాగంగా అతని నాలుకను కొరికింది. దెబ్బకి నిందితుడి నాలుక తెగిపడింది. దీంతో లబోదిబో మంటూ ఆసుపత్రిలో చేరాడు.స్టోరీ ఏంటీ అంటేకాన్పూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిల్హోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దరియాపూర్ గ్రామానికి చెందిన చంపీ (35) అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం అయింది. అయినా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇంతలో ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో ఇతనితో మాట్లాడటం మానేసింది. ఇది అతగాడికి ఆగ్రహం తెప్పించింది. ఆమెను వేధించడం ప్రారంభించాడు. సమయం కోసం వేచి ఉన్న అతగాడు ఒంటరిగా ఉన్న ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీన్ని ఆమె ప్రతిఘటించింది. అక్కడితో ఆగకుండా అతగాడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో,నాలుకను బలంగా కొరికేసింది. నిందితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.తనకిష్టంలేదని చెప్పినా వినకుండా చంపీ రోజూ తనను వేధిస్తూనే ఉన్నాడని బాధితురాలు ఆరోపించింది. వద్దని వారించినా వినకుండా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపు కేసు నమోదు చేసామని డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
బతికున్నట్లు నిరూపించుకునేందుకు మూడేళ్లు
అలీగఢ్: అధికారిక రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల సరోజ్ దేవి మూడేళ్ల క్రితమే చనిపోయింది..! అసలు చనిపోయింది నా భర్త..నేను కాదు మొర్రో.. అని అప్పటి నుంచి ఆమె అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటూనే ఉంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. చమర్ నగారియా గ్రామానికి చెందిన జగదీశ్ ప్రసాద్ 2020లో చనిపోయాడు. స్థానిక క్లర్కు ఒకరు మృతుల జాబితాలో జగదీశ్ ప్రసాద్ బదులుగా అతడి భార్య సరోజ్ దేవి చనిపోయినట్లుగా 2022 జనవరి ఒకటో తేదీన నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సరోజ్ దేవి ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ అయ్యింది. గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారలేవీ ఆమెకు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడేళ్లయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చివరికి ఈ నెల 15వ తేదీన ఖైర్ సబ్ విడిజనల్ మేజి్రస్టేట్ శిశిర్ కుమార్కు తెహశీల్ దివస్ సందర్భంగా సరోజ్ దేవి తన సమస్యను వివరించింది. తన గుర్తింపును పునరుద్ధరించాలని, తనను తిరిగి బతికించాలని కోరింది. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రాధా న్యం కలిగిన అంశంగా భావించి, పరిష్కా రానికి అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. రికార్డుల్లో ఇందుకు అవసరమైన దిద్దుబాట్లు చేపట్టామని శిశిర్ కుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమై సరోజ్ దేవి త్వరలోనే ప్రభుత్వ రికార్డుల్లో సజీవురాలు అవ్వాలని ఆశిద్దాం.! -
కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు
సోనభద్ర: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోన్ భద్రలో గని కూలిపోయింది. శిథిలాల కింద 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఒక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికీ తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోనభద్రలోని ఒబ్రా పోలీస్స్టేషన్ పరిధిలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఆ ఘటన జరిగింది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పాటు రెండు ప్రైవేట్ కంపెనీల రక్షణ బృందాలు, ఒబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ బృందం రక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బద్రినాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు పరికరాలు, యంత్రాలతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో తొమ్మిది కంప్రెసర్లు పనిచేస్తుండగా, ప్రతి కంప్రెసర్ వద్ద ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. #WATCH | Sonbhadra, UP | Visuals from the spot where around 15 people are feared trapped after a stone mine collapsed yesterday in Sonbhadra. NDRF and SDRF teams are at the spot. One body has been recovered. Rescue operations are underway. (Source: NDRF) pic.twitter.com/0l7E4JL3kc— ANI (@ANI) November 16, 2025 -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
శ్రీనగర్/ఫరీదాబాద్: దేశంలో భారీ మారణ హోమం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఒక ముష్కరమూక గుట్టుమట్లను మూడు రాష్ట్రాల పోలీసు బృందం విజయవంతంగా ఛేదించింది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ముమ్మర సోదాలు, దాడుల్లో ఏకంగా 2,913 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకే–56 రైఫిల్, ఏకే క్రిన్కోవ్ పిస్టల్, ఒక చైనీస్ స్టార్ పిస్టల్, ఇటలీ తయారీ బెరెట్టా పిస్టల్, ఒక సబ్మెషీన్ గన్, బుల్లెట్లు, మందుగుండుతోపాటు పేలుడు సంబంధ ముడి సరుకులు, రసాయనాలు, మండే ధాతు వులు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్స్, టైమర్లు, వాకీటాకీ, మెటల్ షీట్లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నేరమయ డాక్యుమెంట్లతోపాటు ఐఈడీ వంటి పేలుడుపదార్థాల తయారీ విధాన పత్రాలను పోలీసులు పట్టుకెళ్లారు. ఇటీవలికాలంలో ఇంత మొత్తంలో పేలుడు పదార్థాలను కశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వాత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులుసహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్చేశారు. వీళ్లలో ఒక మహిళా డాక్టర్ సైతం ఉండటం గమనార్హం. వీళ్లకు సంబంధించిన నివాసాలు, అద్దె ఇళ్లు, స్థలాల్లో సోదాల తర్వాత భారీ ఎత్తున పేలుడుపదార్థాల జాడను పోలీసులు కనుగొన్నారు. 350 కేజీల పేలుడు పదార్థం, అసాల్ట్ రైఫిల్, హ్యాండ్గన్ జాడను ఆదివారమే కనిపెట్టగా సోమవారం 2,563 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్తోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లలో జరిగిన విస్తృతస్థాయి దాడుల్లో వీళ్లందరినీ అరెస్ట్చేశారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు కశ్మీరీలే కావడం గమనార్హం. అరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మఖ్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహీద్(నౌగమ్), మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్( షోపియాన్), జమీర్ అహ్మద్ అహంగీర్ అలియాస్ ముత్లాషా(వకురా), డాక్టర్ ముజామిల్ అహ్మద్ ఘనీ అలియాస్ ముసేబ్(పుల్వామా), డాక్టర్ ఆదిల్(కుల్గామ్)లతోపాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్ను పోలీసులు అరెస్ట్చేశారు. అత్యంత గౌరవప్రద వైద్యవృత్తిలోని నిపుణులు, విద్యార్థులను ఉగ్రవాదంలోకి దింపి ముష్కరులు వైట్కాలర్ ఉగ్రనెట్వర్క్ను సృష్టించగా దాని గుట్టుమట్లను విజయవంతంగా ఛేదించామని సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ప్రకటించింది. పోస్టర్లతో మొదలై.. అరెస్ట్ల దాకా..కశ్మీర్కు చెందిన ఒక డాక్టర్ అరెస్ట్తో ఈ మొత్తం నెట్వర్క్ అంశం వెలుగులోకి వచ్చింది. కుల్గాంలోని వాన్పురాకు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాటర్ భారత భద్రతాబలగాలను బెదిరిస్తూ శ్రీనగర్, బాన్పొరా నౌగామ్సహా పలుచోట్ల అక్టోబర్ 19న పోస్టర్లు అంటించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇతడిని గుర్తించి పోలీసులు నవంబర్ ఏడో తేదీన అరెస్ట్చేశారు. అతడిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్లోని అనంత్నాగ్లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఆదిల్కు చెందిన లాకర్ను తెరవగా అందులో ఏకే–47 రైఫిల్ లభించింది. మరింతగా విచారించగా ముజామిల్ ఘనీ షకీల్ అనే మరోవైద్యుడు సైతం ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అని తేలింది. తర్వాత అతడినీ అరెస్ట్చేశారు. షకీల్ ఇచ్చిన సమాచారంతో హరియాణాలోని ఫరీదాబాద్లో మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్లోని గదిలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలుచేసి 8 పెద్ద, 4 చిన్న సూట్ కేసులు, ఒక బకెట్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఏకంగా 2,563 కేజీల ఐఈడీ పేలుడుపదార్థాలున్నాయి. దీనిని అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్గా భావిస్తున్నారు. వాస్తవానికి షకీల్ కశ్మీర్లోని పుల్వామాలోని కోలీవాసి. ప్రస్తుతం ఇతను హరియాణాలోని ఆల్–ఫలాహ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు.ఢిల్లీలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే మా లక్ష్యంఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) లో మత కల్లోలాలు, విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా దాడులతో తెగబడాలని పాకిస్తాన్, కశ్మీర్లోని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు వచ్చాయని అరెస్టయిన షకీల్, ఆదిల్ విచారణలో బయటపెట్టారు. అయితే ఏఏ లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారో వాళ్లకు ఇంకా ఆదేశాలు రాలేదు. ‘‘ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో వైద్యులను ఉగ్రకోణంలో ఎవరూ అనుమానించబోరు. అందుకే మమ్మల్నే ఈ పనికి ఎంచుకున్నారు. లక్ష్యాలను నిర్దేశించేదాకా వేచి ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. ఈ ఉగ్రమాడ్యూల్కు పథకరచన పాకిస్తాన్లో జరిగింది. ఆదేశాలు మాత్రం కశ్మీర్ హ్యాండ్లర్ల నుంచే వస్తాయి. మేం గతంలో కశ్మీర్లో డాక్టర్లుగా పనిచేసిన కాలంలో 2018–2021 భద్రతా బలగాలతో పోరాడి గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేశాం’’అని షకీల్, ఆదిల్ పోలీసు విచారణలో వెల్లడించారు. -
ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు..
హథ్రాస్: ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోగా 21 మంది గాయపడ్డారు. అలీగఢ్ నుంచి హథ్రాస్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును అలీగఢ్–ఆగ్రా హైవేపైనున్న సమామాయి గ్రామ సమీపంలో ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 21 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ బైక్ను తప్పించేందుకు ప్రయతి్నంచిన క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెకర్ బస్సు.. యూపీలోని ఉన్నావ్లో బుధవారం అర్ధరాత్రి ఆగ్రా–లక్నో ఎక్స్ప్రెస్వే పైన ప్రైవేట్ డబుల్ డెకర్ బస్సు, కూరగాయలతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. హసన్పూర్లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు లోని 60 మందికి గాను 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, ప్ర యాణికులను బయటకు లాగారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన కొందరిని లక్నోకు తరలించారు. బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నేడు వారణాసికి మోదీ
వారణాసి: ఉత్తరప్రదేశ్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సొంత పార్లమెంటరీ నియో జకవర్గం వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్న ఆయన.. బీహెచ్ఈఎల్ యూనిట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వారణాసికి చెందిన 3,200 మంది ప్రముఖులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. బనారస్ రైల్వేస్టేషన్ను సందర్శిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ఇందులో బనారస్–ఖజురహో, లక్నో– సహరాన్పూర్, ఫిరోజ్పూర్–ఢిల్లీ, ఎర్నాకులం–బెంగళూరు ఉన్నాయి. -
మనుషులపై దూసుకెళ్లిన రైలు.. ఆరుగురి మృతి
-
యూపీలో రైలు ప్రమాదం.. భక్తులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం..మీర్జాపూర్లోని చునర్ రైలు స్టేషన్లో ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన భక్తులు రైలు ఆగిన వెంటనే ప్లాట్ఫామ్ ఉన్న వైపు కాకుండా పట్టాలు ఉన్న వైపునకు దిగారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న భక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాద కారణంగా రైల్వేస్టేషన్లో పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు. Aleast six killed at Chunar Railway Station in Mirzapur on Wednesday morning, when several pilgrims were run over by the Kalka Express while crossing the railway tracks. The victims were on their way to Varanasi to take part in Kartik Purnima festivities. pic.twitter.com/df6PZSCmw5— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 5, 2025ఇదిలా ఉండగా.. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. నిన్న ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రైలు కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్పుర్కు వెళ్తుండగా.. గటోరా- బిలాస్పుర్ స్టేషన్ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.🚨 Mirzapur Accident | Tragic Incident in Chunar on Kartik Purnima — 4 Devotees Killed After Being Hit by Train While Crossing Railway Tracks Tribute 📷 #Mirzapur #Chunar #KartikPurnima #UttarPradesh #TrainAccident #BreakingNews #IndiaNews https://t.co/SKsHmX4r07 pic.twitter.com/i3crPQq0Hz— Indian Observer (@ag_Journalist) November 5, 2025ఘటనా స్థలంలో రైల్వేశాఖ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది. -
మూకదాడి బాధితుల పరిహారానికి సుప్రీం నో
న్యూఢిల్లీ: మూకదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జమియత్ ఉలేమా–ఇ–హింద్ వేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలంటూ పిటిషనర్ను అలహాబాద్ హైకోర్టు ఆదేశించడాన్ని సమర్థించింది. దీనిపై తాము జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేసింది. తెహ్సీన్ పూనావాలా కేసులో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని జమియత్ ఉలేమా–ఇ– హింద్ తదితర పిటిషనర్లు తెలిపారు. అయితే, జమియాత్ ఉలేమా తదితరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేయ డంపై అలహాబాద్ హైకోర్టు జూలై 15వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా తప్పు బట్టింది. మూకదాడి ప్రత్యేకమైన ఘటన అయినందున పిల్గా స్వీకరించలేమని తెలిపింది. అయితే, అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాల అమలు గురించి బాధితులు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. -
రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన అమర్ సింగ్ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా తోడయ్యారు. తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?అభిజీత్ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పొట్టలోని పేగులు బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్ తల్లి నీలం సింగ్ చందేల్ వాపోయారు. అయితే చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం అయోధ్య ఆదివారం 2025 దీపోత్సవంలో సరికొత్తగారెండు ప్రపంచ రికార్డును సృష్టించింది. 2.6 మిలియన్ల దీపాల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో గత ఏడాది అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తిరిగ రాసింది. రెండోది 2,128 మంది పూజారులు , భక్తులు ఒకేసారి మా సరయు ఆరతి ప్రదర్శించడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బాణా సంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు కాంతులతో వెలిగిపోయింది.వేలాది మంది భక్తులు, యాత్రికులు , సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఇది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో లక్షలాది దీపాలు (మట్టి దీపాలు) సరయు నదీ ఒడ్డు దీదీప్య మానంగా వెలిగిపోయింది. భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని పంచింది. ఈ సందర్బంగా ఈ ఏడాది 2100 మంది భక్తులు సరయూ నదీ తీరాన దీపాలను వెలిగించి తరించారు. అయోధ్య అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన ఘాట్లలో 26,17,215 దివ్య దీపాలు వెలిగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్ను ధ్రువీకరించారు. ఇది 14 సంవత్సరాల వనవాసం ,రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని గౌరవంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.2017లో మొదలైన ఈ వేడుక ఇలా సాగింది. యూపీ ముఖ్యమంత్రి యోగి నాయత్వంలో 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2018లో 3.01 లక్షలు, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షలు, 2023లో 22.23 లక్షలు , 2024లో 25.12 లక్షలకు చేరింది. 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించిన సంగతి తె లిసిందే. Ayodhya lit up with 26 lakh diyas this Deepotsav 2025, making two world records! 🪔Diwali celebrates Lord Ram’s return and the victory of light over darkness. ✨Happy Deepawali! 🪔 💫#Diwali #Deepotsav #Ayodhyapic.twitter.com/oaQLbLWsuR— Swapnil Srivastav (@theswapnilsri) October 20, 2025 -
పాక్లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది. -
చరిత్ర సృష్టించిన రింకూ సింగ్
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.దిగ్గజాలను దాటేసి..తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.ఆంధ్ర క్రికెటర్ల శతకాలుఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రింకూ సింగ్ భారీ శతకంఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.యూపీదే పైచేయిఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు రింకూ రెడ్బాల్ క్రికెట్లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
Ranji Trophy: దేశవాళీ ధమాకా
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 91వ సీజన్కు నేడు తెరలేవనుంది. ఎలైట్ గ్రూప్లో 32 జట్లు, ప్లేట్ గ్రూప్లో 6 టీమ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. మొత్తం 138 మ్యాచ్లు జరగనుండగా... రెండు దశల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఒకప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు రంజీ ట్రోఫీలో రాణించడం తప్పనిసరి కాగా... ఇప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు వీలు ఉంటే దేశవాళీల్లో ఆడాలని బీసీసీఐ సూచించింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మినహా... టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడేది లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ ప్రదర్శనతో ఇప్పటికిప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే అయినా... సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇది చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. నేటి నుంచి నవంబర్ 19 వరకు తొలి దశ మ్యాచ్లు జరగనుండగా... ఆ తర్వాత నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ జరగనుంది. అనంతరం డిసెంబర్ 26 నుంచి జనవరి 18 వరకు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఫైనల్తో సీజన్ ముగియనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. ఎనిమిదేసి జట్లు ఉన్న ఒక్కో గ్రూప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. పలువురు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు... యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టు మరో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. కరుణ్ నాయర్ తిరిగి కర్ణాటక జట్టులో చేరగా... తొమ్మిదేళ్ల తర్వాత జలజ్ సక్సేనా కేరళ నుంచి మహారాష్ట్రకు మారాడు. పృథ్వీ షా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించనుండగా... ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రిపుర తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం... » ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన బంతికి గాయపడిన పంత్ అప్పటి నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. రంజీ ట్రోఫీ తొలి పోరులో ఢిల్లీ జట్టు హైదరాబాద్తో తలపడనుండగా... ఢిల్లీ సెలెక్టర్లు 24 మందితో ప్రకటించిన జట్టులో పంత్ను ఎంపిక చేయలేదు. దీన్ని బట్టి అతడు ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ నెల అఖరులో హిమాచల్ ప్రదేశ్తో జరిగే మ్యాచ్ వరకు పంత్ జట్టులో చేరొచ్చు. వచ్చే నెల 14 నుంచి ప్రపంచ చాంపియన్ దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. దానికి ముందు పంత్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలెక్టర్లు ఆశిస్తున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్టు తొలి పోరులో నాగాలాండ్తో తలపడనుంది. దేశవాళీల్లో స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న విదర్భ రంజీ ట్రోఫీతో పాటు... ఇటీవల ఇరానీ కప్ను సైతం కైవసం చేసుకొని జోరు మీదుంది. గత సీజన్ రన్నరప్ కేరళ, సౌరాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై జట్లు కూడా టైటిల్పై కన్నేశాయి. » గత సీజన్లో ముంబై జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహరించగా... ఇప్పుడు ఆ బాధ్యతలు శార్దుల్ ఠాకూర్ తీసుకున్నాడు. భారత టెస్టు జట్టులో పునరాగమనంపై ఇంకా ఆశలు పెట్టుకున్న రహానే... ప్లేయర్గా కొనసాగనున్నాడు. సహచరుడు పుజారా కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన కామెంటేటర్ అవతారమెత్తగా... రహానే మాత్రం ఇంకా పోరాడేందుకు సిద్ధమయ్యాడు. » గత సీజన్లో రంజీ మ్యాచ్లు ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపక బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... ఈ సీజన్లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రజత్ పాటీదార్ దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరి వీరిద్దరూ రంజీ సీజన్లో తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలి. » సుదీర్ఘ కాలంగా భారత రిజర్వ్ ఓపెనర్గా జట్టుతో పాటు ఉన్న బెంగాల్కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ కూడా తన బ్యాట్ పవర్ చూపేందుకు రెడీ అవుతున్నాడు. » రవిచంద్రన్ అశి్వన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... తదుపరి తరం స్పిన్నర్ ఎవరనేది రంజీ ట్రోఫీ ద్వారా తేలనుంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టిన విదర్భ స్పిన్ ఆల్రౌండర్ హర్‡్ష దూబేపై అందరి దృష్టి నిలవనుంది. రాజస్తాన్కు చెందిన మానవ్ సుతార్, ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. » సీజన్ ఆరంభానికి ముందు పలువురు యువ ఆటగాళ్లు ఆకర్షిస్తున్నారు. స్మరణ్ (కర్ణాటక), ఆండ్రె సిద్ధార్థ్ (తమిళనాడు), యశ్ ధుల్ (ఢిల్లీ), ప్రియాన్ష్ఆర్య (ఢిల్లీ), వైభవ్ సూర్యవంశీ (బిహార్), ఆయుశ్ మాత్రే (ముంబై), దానిశ్ మాలేవర్ (విదర్భ) వంటి వాళ్లు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా... దాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. » గత రంజీ సీజన్లో తన వేగంతో ఆకట్టుకున్న కేరళ పేసర్ ఎడెన్ టామ్తో పాటు, గుర్నూర్ బ్రార్, గుర్జపనీత్ సింగ్పై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. » దేశవాళీల్లో రాణించడం ద్వారానే ఎనిమిదేళ్ల తర్వత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ స్ఫూర్తిగా... పలువురు ఆటగాళ్లు రెండో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా ఇందులో ఉన్నారు. ఈ సీజన్లో పరుగుల వరద పారించి తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. » 38 ఏళ్ల జలజ్ సక్సేనా ఈ సీజన్లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత తొమ్మిది సీజన్లుగా కేరళ తరఫున ఆడిన జలజ్ రాకతో... మహారాష్ట్ర బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది. టీమిండియా ప్లేయర్ జితేశ్ శర్మ విదర్భ నుంచి బరోడాకు మారాడు. » రెండేళ్లుగా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన షమీ... పునరాగమనంపై ఆశలు పెట్టుకున్నాడు. ఢిల్లీ x హైదరాబాద్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై వీరోచిత ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించిన ఠాకూర్ తిలక్ వర్మ... హైదరాబాద్ రంజీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం మొదలుకానున్న మ్యాచ్లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోరులో తిలక్తో పాటు తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమతేజ, మిలింద్, రాహుల్ సింగ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీ జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఆయశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టులో యశ్ ధుల్, ప్రియాన్ష్ఆర్య, అనూజ్ రావత్, నితీశ్ రాణా, నవ్దీప్ సైనీ కీలకం కానున్నారు.రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ల వివరాలుగ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్, బరోడా. గ్రూప్‘బి’: కర్ణాటక, సౌరాష్ట్ర, చండీగఢ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘సి’: గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్, సర్వీసెస్, త్రిపుర, రైల్వేస్, బెంగాల్, హరియాణా. గ్రూప్ ‘డి’: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్. ఉత్తరప్రదేశ్ x ఆంధ్రగ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ప్రారంభం కానున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో ఆంధ్ర జట్టు తలపడనుంది. కాన్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. కెప్టెన్ రికీ భుయ్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, షేక్ రషీద్, అశ్విన్ హెబ్బర్, సత్యనారాయణ రాజు, చీపురుపల్లి స్టీఫెన్, విజయ్, శశికాంత్ ఆంధ్ర జట్టుకు కీలకం కాగా... ఉత్తరప్రదేశ్ జట్టు కరణ్ శర్మ, ఆర్యన్ జుయల్, ప్రియమ్ గార్గ్, విప్రాజ్ నిగమ్, శివమ్ మావి, రింకూ సింగ్పై ఆశలు పెట్టుకుంది. -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్షిప్లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్షిప్లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య.. ఐదుగురి దుర్మరణం
లక్నో: భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది(Ayodhya Blast). ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయోధ్య సమీంలోని పగ్లాభారీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోగా.. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని.. శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. अयोध्या के पुरा कलंदर में एक ज़ोरदार ब्लास्ट से एक मकान ढह गया। राम कुमार के परिवार के 5 लोगों की दर्दनाक मौत हो गई। कहा जा रहा है अवैध पटाखे बन रहे थे या सिलेंडर ब्लास्ट हुआ जांच में साफ होगा।#Ayodhya@ayodhya_police pic.twitter.com/2BX9IRqAhp— Hussain Rizvi हुसैन حسین رضوی (@TheHussainRizvi) October 10, 2025గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెజర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే.. పేలుడు జరిగిన చోట గన్పౌడర్, పటాకుల మిగులు భాగాలు బయటపడ్డాయి. దీంతో అనుమతులు లేకుండా బాణాసంచాలు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి యాజమానిని రామ్కుమార్ కసౌధన్ అలియాస్ పప్పు గుప్తాగా పోలీసులు నిర్ధారించారు. ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే ఇంట్లో పేలుడు జరిగి యజమాని భార్య, తల్లి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు(CM Yogi on Ayodhya Blast). ఘటనపై త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. దీంతో క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మొన్నే కాన్పూర్లో స్కూటర్ పేలుడు సంభవించి(Kanpur Scooter Blast).. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొలుత బాణాసంచాల వల్లే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు.. అది సిలిండర్ బ్లాస్ట్ అని తాజాగా ప్రకటించారు. ఈ రెండు పేలుళ్లపై కుట్ర కోణం ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని ఖండించారు.ఇదీ చదవండి: శబరిమలై వ్యవహారంలో మరో ట్విస్ట్ -
రన్వే పైనుంచి జారి పొదల్లోకి...
ఫరూఖాబాద్: ప్రైవేట్ జెట్ విమానమొకటి రన్ వే పైనుంచి జారి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా మహ్మదాబాద్లో చోటుచేసుకుంది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఇద్దరు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జెట్ సర్వీస్ ఏవియేషన్కు చెందిన విమానం ఉదయం 10.30 గంటల సమయంలో రన్ వేపై ల్యాండయిన అనంతరం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ఓ బీర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
నా భార్య నాగిని!
సీతాపూర్ (యూపీ): అక్టోబర్ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభి షేక్ ఆనంద్ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్ తహ సీల్లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్ కూడా కలెక్టర్ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్... స్... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు.పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు. -
దొంగనుకుని దళితుడ్ని చావబాదారు
రాయ్బరేలీ: రాత్రి వేళ చోరీలు జరక్కుండా గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు..తామడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో, దొంగగా అనుమానించి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. తీవ్రమైన గాయాలు, రక్తస్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఉంఛాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత బుధవారం చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగు చూ సింది. డ్రోన్లతో సర్వే చేసి మరీ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి సంచరిస్తోందంటూ కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పుకార్లు వస్తున్నాయి. దీంతో, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి ఏరి యాలో వారే గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. బుధ వారం రాత్రి జమునాపూర్ క్రాసింగ్ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు నిలదీశారు. తమ ప్రశ్నలకు అతడిచ్చిన సమాధా నాలతో సంతృప్తి చెందని గ్రామస్తుల గుంపు అతడిపై దాడికి పాల్పడింది. విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఈశ్వర్దాస్పూర్ రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లి వదిలేశారు. గురువారం ఉదయం పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫతేహ్పూర్కు చెందిన హరిఓం(40)అనే దళితుడిగా అతడిని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఘటనపై సమాచారం అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ కుమార్ సిన్హా వెల్లడించారు. దారుణంలో పాలుపంచుకున్న మరికొందరిని సైతం గుర్తించి, అరెస్ట్ చేసే పనిలో ఉన్నామన్నారు. -
మ్యాగీ పిచ్చి: ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మి.. విషయం తెలిసి తల్లి భావోద్వేగం
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని, కాన్పూర్లోని శాస్త్రి నగర్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్మెంట్ను రింగ్ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.చదవండి : కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది. -
యూపీలో ఘోరం.. కుప్పకూలిన కోచింగ్ సెంటర్
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్పూర్ మండి రోడ్లోని ఒక భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఈ పేలుడు తీవ్రతకు భవనం పైకప్పుతో సహా ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. పేలుడు గ్యాస్ సిలిండర్ కారణామా? షార్ట్ సర్క్యూటా? లేదా పేలుడు పదార్థం వల్ల ఈ ఘటన జరిగిందా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళ వివాహం.. మొదటి రాత్రికి ముందే..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళకు వివాహం జరిపించారు. తీరా పెళ్లి తర్వాత రోజే.. హనీమూన్కు ముందే సదరు వ్యక్తి మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని కుచ్ముచ్ గ్రామానికి చెందిన సంగ్రురామ్(75) భార్య గతేదాడి చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే, తనకు తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, జలల్పూర్ ప్రాంతానికి చెందిన మన్బవతిని(35) వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమెకు అప్పటికే వివాహం కాగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సెప్టెంబర్ 29వ తేదీన వారికి వివాహం జరిగింది.ఇక, ఈ జంట కోర్టులో వివాహాన్ని నమోదు చేసుకున్నారు. తరువాత స్థానిక ఆలయంలో సాంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం, వధువు మన్భవతి మాట్లాడుతూ.. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నా పిల్లలను పోషించే బాధ్యత సంగ్రురామ్ చూసుకుంటానని చెప్పారు. నన్ను ఇంటి బాధ్యతలు చూసుకోమన్నారు. తనకు ఉన్న ఆస్తిని కూడా పిల్లల పేరు మీదకు మారుస్తానని చెప్పినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ తమ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సరికి సంగ్రురామ్.. చనిపోయి ఉన్నాడు. దీంతో, స్థానికుల సాయంతో అతడికి ఆసుపత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, ఒక్కసారిగా మన్బవతిని షాక్కు గురైంది. అనంతరం, అతడికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సంగు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. పోస్టుమార్టం చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, మొదటి రాత్రి ముందు రోజే సంగ్రురామ్ ఇలా మృతి చెందడం పట్ల స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి చితిని కర్రతో కొట్టి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదనే కోపంతో ఓ వ్యక్తి చనిపోయిన తన స్నేహితుడి అంత్యక్రియల చితిపై కర్రతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతుడు అతని వద్ద నుండి తీసుకున్న రూ.50 వేలు రుణాన్ని తిరిగి చెల్లించకుండా మరణించడంతో.. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి కర్రతో వచ్చి మరణించిన వ్యక్తిని కొట్టడంతో మృతుని భార్య, పిల్లలతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది.గతం కొంతకాలంగా స్నేహితుల మధ్య రుణ వివాదం జరుగుతోంది. మృతుడు రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనుల కోసం రుణం తీసుకున్నాడు. పంట అమ్మిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. కానీ అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించాడు. తన స్నేహితుడు ఉద్దేశపూర్వకంగానే డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కలియుగం.. స్నేహం కూడా వ్యాపారంగా మారింది” అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు “కోపం అర్థం చేసుకోగలిగినదే.. కానీ చితిపై కూడా దాడి చేయడం? అతి క్రూరం” అంటూ కామెంట్లు పెడుతున్నారు."Debt Beyond Death"I watched a video — it shocked me… and made me laugh too.A man was standing by a burning funeral pyre, furiously beating it with a stick and yelling:👉 “You won’t even find peace in hell — I’ll see you there too!”The reason for his rage?Unpaid debt.… pic.twitter.com/g5h41hnVPV— Manish Kumar ad 🇮🇳 (@ma427906099) September 28, 2025 -
బహరాయిచ్లో మళ్లీ కలకలం.. వణికిస్తున్న తోడేళ్లు
బహరాయిచ్: ఉత్తరప్రదేశ్ బహరాయిచ్లో తోడేళ్లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం సాయంత్రం కైసర్గంజ్ ప్రాంతంలోని ఓ మగ తోడేలు కదలికలను గుర్తించారు. లభ్యమైన తోడేలు కళేబరం.. నరభక్షక తోడేలుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ధ్రువీకరించగమంటూ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెల్లడించారు.ఇటీవల గ్రామాల్లో తోడేళ్ల దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే తోడేళ్ల దాడుల్లో నలుగురు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో స్థానికులపై తోడేళ్ల దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో తోడేళ్ల బెడదను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టారు.ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్లో గత ఏడాది నుంచి నరభక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు గతంలో అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మళ్లీ ఆదివారం( సెప్టెంబర్ 29) సాయంత్రం తోడేలు కదలికలను గుర్తించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు గతంలో ఆరు తోడేళ్లను పట్టుకున్నారు. -
బారాబంకీ, మౌ జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు
బరేలీ/బారాబంకీ/వారణాసి: ఉత్తరప్రదేశ్లో ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమంపై తలెత్తిన వివాదం ముదిరింది. శుక్రవారం బరేలీలో ఆందోళనకారులు పోలీసులతో తలపడటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి ఇల్లిల్లూ సోదాలు జరిపి గొడవలకు కారణమైన వారిని అరెస్ట్ చేశారు. పొలీసులపై రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనల్లో పాలుపంచుకున్న 500 మందిని గర్తించామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందంటూ 8 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే, పొరుగునున్న బారాబంకీలోని ఫైజుల్లాగంజ్లో ‘ఐ లవ్ మహ్మద్’అని ఉన్న బ్యానర్ను తొలగించారన్న వార్తలు రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యానర్ చించినట్లు ఆరోపణలున్న ధన్ని అనే వాచ్మన్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అక్కడికి సమీపంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయ్యింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఫైజుల్లాగంజ్లో శాంతియుత వాతావరణం నెలకొందని ఎస్పీ అజయ్ సింగ్ చెప్పారు. అదేవిధంగా, మౌ జిల్లా నయీ బజార్ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ‘ఐ లవ్ మహ్మద్’అని నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఘటన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని మౌ ఎస్పీ ఇలమారన్ చెప్పారు. వారణాసిలోని సిగ్రాలో ఈ నెల 22వ తేదీన ‘ఐ లవ్ మహ్మద్’పోస్టర్లు, బ్యానర్లు చేబూని, నినాదాలతో ర్యాలీ చేపట్టిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర వర్గాల ప్రజల్లో తమ ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు కొందరు ఈ కొత్త ఒరవడిని మొదలుపెట్టారని పోలీసులు అంటున్నారు.మత పెద్ద రజా అరెస్ట్బరేలీలో ఘర్షణలకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఇత్తెహాద్–ఇ– మిల్లత్ పరిషత్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఐ లవ్ మహ్మద్’కు మద్దతుగా రజా ర్యాలీకి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసిందని, ప్రణాళిక ప్రకారం జరిగిన గొడవలకు ప్రధాన సూత్రధారి ఈయనేనని ఉన్నతాధికారులు తెలిపారు. రజా సహా 8 మందిని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. వీడియో ఫుటేజీలో గుర్తించిన మరో 36 మంది వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై రజా, మరో 25 మందితోపాటు గుర్తు తెలియని మరో 200 మందిపై ప్రేమ్నగర్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆందోళనకారులు ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంను చించివేశారన్నారు. బరేలీలో శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, స్కూళ్లు, దుకాణాలు యథావిథిగా పనిచేశాయని డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని తెలిపారు. ఘర్షణలపై దర్యాప్తులో కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించాలని చూసే వారిపై గూండా చట్టం, జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. బరేలీ నగరంలో 8 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
వాలు జడ తోలు బెల్టు!
ఆయనో స్కూల్కు హెడ్మాస్టర్. ఓ మహిళా టీచర్ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్కు హెచ్ఎం వెళ్లారు. చేతిలో ఫైల్ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..సీతాపూర్ హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్ను వర్మ బెల్ట్తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్పై సంచలన ఆరోపణలకు దిగారామె.అవంతిక గుప్తా మహ్ముదాబాద్లోని నద్వా ప్రైమరీ స్కూల్కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్గా రావడం లేదు.దీంతో.. హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..హెచ్ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.UP govt headmaster slams file, flogs BSA using beltIn UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025 ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్ఏ అఖిలేష్ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
‘ఐ లవ్ మహ్మద్’ ర్యాలీ వివాదం
బరేలీ: ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమానికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ చీఫ్, మత పెద్ద తౌకీర్ రజా ఖాన్ చేసిన ప్రకటన యూపీలో బరేలీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందుకు కారకులుగా గుర్తించిన డజను మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏదేమైనా ర్యాలీని నిర్వహిస్తామంటూ గురువారం ప్రకటించిన రజా ఖాన్.. అధికారులు అనుమతి ఇవ్వనందున ర్యాలీని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రకటించారు. దీంతో, ‘ఐ లవ్ మహ్మద్ అని రాసిన పోస్టర్లను చేబూనిన జనం పెద్ద సంఖ్యలో కొత్వాలీ ఏరియాలోని రజా ఖాన్ నివాసం, మసీదు వద్ద గుమికూడారు. ప్రదర్శనను వాయిదా వేయడంపై ఆగ్రహంతో ఇస్లామియా ఇంటర్ కాలేజీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్నాం. దీంతో రాళ్లు రువ్వుతూ, వాహనాలు, దుకాణాలపై దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టాం’అని పోలీసు అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ను అహ్మద్ రజా ఖాన్ ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం కలిగిన సున్నీ ఇస్లాంలోని బెరేల్వీ వర్గాన్ని స్థాపించింది ఈయనే. ఈయన వారసుడే తౌకీర్ రజా ఖాన్. కాగా, ‘ఐ లవ్ మహ్మద్’నినాదంలో ఎలాంటి తప్పూ లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఇదిగో ఇ–రిక్షా సోషల్ మీడియా సెంటర్!‘
అప్పు చేసి ఇ–రిక్షా కొన్నాడు సుమిత్ తండ్రి. ఆ అప్పు తీరకుండానే ఆయన మంచం పట్టాడు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్ ప్రజాపతి( Sumit Prajapati) కు ఇ–రిక్షాయే దిక్కు అయింది. దిక్సూచి అయింది. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 22 సంవత్సరాల సుమిత్ ప్రజాపతి ఇ–రిక్షాను సోషల్ మీడియా సెంటర్గా చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు...గ్యాస్స్టవ్ వెలిగించే క్రమంలో సుమిత్ తండ్రి అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం వల్ల అతడు రిక్షా నడపలేని పరిస్థితి. మరోవైపు రిక్షా కోసం చేసిన అప్పులు. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తూనే ‘ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.పేదరికం వల్ల చిన్నప్పుడు పొలం పనులు, కూలీ పనులు చేశాడు సుమిత్. కార్లు కడిగాడు. కూరగాయలు అమ్మాడు. తన పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదని ఎన్నో పనులు చేశాడు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అయితే విధి నిర్ణయం మరోలా ఉంది’ అంటాడు సుమిత్.తండ్రికి ఆసరాగా ఉండడానికి ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరాడు. చెప్పిన జీతంలో సగం జీతం కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగం మానేయ్యడమే కాదు ఇక ఎప్పుడూ ఉద్యోగం చేయకూడదనుకున్నాడు. చాలామంది యువకులలాగే సుమిత్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు. తండ్రి ప్రమాదానికి గురి కావడంతో ఇ–రిక్షా నడపాలనుకున్నాడు సుమిత్. ‘ఇ–రిక్షా, సోషల్ మీడియాను ఒకేచోట చేరిస్తే’ అనే దిశలో ఆలోచించాడు. కార్లు, బైక్లపై కంటెంట్ను క్రియేట్ చేసేవారు ఉన్నారు. ఇ–రిక్షాపై ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది అనుకున్నాడు. View this post on Instagram A post shared by Sumit Prajapati (@sumit_prajapati87) ‘నా రిక్షాను స్టార్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను’ నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుమిత్. కంటెంట్ క్రియేటర్గా అతడి వైరల్ మూమెంట్ గురించి చెప్పుకోవాలంటే...తన కుటుంబసభ్యులు ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ వచ్చాయి.‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వీడియోలు ఏమిటి! నిన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వెక్కిరిస్తారు’ అని తండ్రి అన్నాడు. కొన్ని అనుభవాల తరువాత ఆయన మాటలు వాస్తవం అనే విషయం అర్థమైంది. ‘ప్రజలు చిన్న చూపు చూడకుండా, అభిమానించేలా కంటెంట్ క్రియేషన్ చేయాలి’ అనుకున్నాడు. నవ్వించడానికి ఒకప్పుడు ఏవేవో వీడియోలు చేసిన సుమిత్ ఆ తరువాత రూట్ మార్చాడు. వ్యక్తిత్వవికాస వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రాండ్లకు సంబంధించి రిక్షాలో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.‘ఏ పనీ చిన్నది కాదు. మనం చేసే ప్రతి పని పెద్దదే. గౌరవనీయమైనదే’... ఇలాంటి మాటలెన్నో తన వ్యక్తిత్వ వికాస వీడియోల్లో వినిపిస్తుంటాడు సుమిత్. తాజా విషయానికి వస్తే...తనకు వచ్చే ఆదాయంతో సుమిత్ కుటుంబ అప్పులన్నీ తీర్చాడు. చెల్లిని చదివిస్తున్నాడు. సుమిత్కు ఇన్స్టాగ్రామ్లో 87వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.చదవండి : ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీమొదట చిన్న లక్ష్యాలు... ఆ తరువాత పెద్ద లక్ష్యాలు ఇక నా పనిఅయిపోయినట్లే’ అని నేను ఎప్పుడూ నిరాశపడలేదు. నిలదొక్కుకోవడం కోసం ఎంత చిన్న పనైనా చేయాలనుకున్నాను. కూలి పనులు కూడా చేశాను. ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాను. అప్పుల భారంతో మా సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి ఆ ఇంటిని కొనాలనేది నా కల. – సుమిత్ ప్రజాపతి -
‘దటీజ్ యోగి’.. పోలీసింగ్లో సరికొత్త అధ్యాయం!
ఉత్తర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్కౌంటర్లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్పై వెళ్తున ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది. ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.उक्त सम्बन्ध में श्रीमती उपासना पाण्डेय, सहायक पुलिस आयुक्त नन्दग्राम की वीडियो बाइट-@Uppolice https://t.co/VOUOjuBHf8 pic.twitter.com/x9XCNGSqwh— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 22, 2025యోగి ప్రశంసలు దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్ను మహిళా పీఎస్ స్టేషన్ హెడ్ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్లో మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్కౌంటర్లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్లలో 63 మంది క్రిమినల్స్ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త! -
ప్రియుడి కోసం స్వాతి స్కెచ్.. మతిపోవాల్సిందే!
వివాహేతర సంబంధాల మోజుతో భర్తలను, భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య చూస్తున్నవే. అలాగే.. ప్రేమ మత్తులో తల్లిదండ్రులకు, అయిన వాళ్లకూ ద్రోహాన్ని తలపెడుతున్న జంటలనూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్వాతి తన ప్రేమికుడి కోసం చేసిన పని మాత్రం.. నెక్ట్స్ లెవల్ అంతే!.స్వాతి(21).. స్థానికంగా సెలూన్ నడిపించే మనోజ్(22) అనే యువకుడ్ని గాఢంగా ప్రేమించింది. కానీ, ఇంట్లో వాళ్లు తమ ప్రేమకు ఒప్పుకోరని భయపడింది. ఈ క్రమంలో రోజూ రాత్రి ఇంట్లో వాళ్లు తినే తిండిలో మత్తు మందు మాత్రలు కలుపుతూ వచ్చింది. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో ఊరిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఏకాంతంగా గడపం చేస్తూ వచ్చింది. అలా.. ఓ రోజు స్వాతి కదలికలపై ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. దీంతో..ఆమె మనోజ్ను సలహా అడిగింది. గప్చుప్గా ఇంట్లో వాళ్లను చంపేయమని చెప్పాడు మనోజ్. స్వాతి అన్నంత పని చేయబోయింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. దీంతో.. ఆ ప్రేమ జంట ఓ క్రైమ్ షో స్పూర్తితో మరో భయంకరమైన స్కెచ్ వేసింది.తమ ప్లాన్ను మనోజ్ తన దగ్గరి బంధువు మాంజిత్కు సాయం కోరాడు. మాంజిత్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. సెప్టెంబర్ 17వ తేదీన.. స్థానికంగా పెయింటింగ్ పనులు చేసే యోగేష్.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాడు. అతన్ని గమనించి మనోజ్.. మద్యం ఆఫర్ చేసి అతన్ని జనసంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలవడంతో యోగేష్ సోయి లేకుండా పడిపోయాడు. ఆపై అతన్ని మనోజ్, మాంజిత్లు తమ బైక్పై ఎక్కించుకుని దగ్గర్లోని ఓ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక రాళ్లతో కొట్టి యోగేష్ను దారుణంగా హతమార్చారు. ఆపై యోగేష్ ఫోన్ నుంచి స్వాతి సోదరుడు గౌరవ్కు ఫోన్ చేసి.. కాల్ కట్ చేశారు. అటుపై పోలీస్ హెల్ప్లైన్కు కాల్ చేసి ‘‘యోగేష్, కపిల్(స్వాతి సోదరులు), శోభారామ్(స్వాతి తండ్రి) తనపై దాడి చేస్తున్నారని.. తనను కాపాడాలని’’ వేడుకుంటూ ఫోన్ కట్ చేసి యోగేష్ డెడ్బాడీ దగ్గర పడేసి వెళ్లిపోయారు.తెల్లారి స్మశానంలో శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలతో.. ఈ కేసులో పోలీసులు స్వాతి తండ్రి, సోదరులే నిందితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో.. యోగేష్కు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా తండ్రి, సోదరులు అరెస్ట్ అయినా స్వాతి ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండిపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో.. ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె మనోజ్ను రహస్యంగా కలవడంతో.. అనుమానం అతనిపైకి మళ్లింది. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో.. యోగేష్ హత్యలో మనోజ్ పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు అప్పటికే పరారైన అతని కోసం గాలింపు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం(సెప్టెంబర్ 22వ తేదీ) అతనిపై కాల్పులు జరిపి(కాలికి బుల్లెట్ గాయం అయ్యింది) మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల ఎదుట మనోజ్, మాంజిత్లు నేరం ఒప్పుకున్నారు. అయితే.. ఈ కేసులో మాస్టర్ మైండ్ స్వాతినే అని చెప్పేసరికి పోలీసులు కంగుతిన్నారు. తన తండ్రిని, సోదరులను ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తే కటకటాల పాలవుతారని, అలా తమకు ఏ అడ్డు ఉండబోదని స్వాతి భావించిందట. అలా పాపం అమాయకుడైన యోగేష్ను కూడా చంపేందుకు ఆమెనే ఎంపిక చేసిందట. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. ఈ ఘాతుకం ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో జరిగింది. -
కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కట్నం డబ్బుల(dowry) కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) కాన్పూర్నగరంలోని కల్నల్గంజ్లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది.బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. చదవండి: నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది! -
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్ఫ్రెండ్కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో యమునా నదిలో దొరికిన ‘సూట్కేసులో యువతి డెడ్బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు. ఆగస్టు 8వ తేదీన కాన్పూర్కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో.. అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో.. జరిగిన విషయాన్ని మరో గర్ల్ఫ్రెండ్కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి మోటార్సైకిల్పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యూపీలో మాయావతి ‘రాజకీయం’.. బీఎస్పీలోకి భారీగా చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్లో తిరిగి తన బలాన్ని నిరూపించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సిద్ధమయ్యారు. 2027లో జరిగే ఎన్నికలకు తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఆమె, వచ్చే నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ వర్గాల్లో తనకున్న పాత ఇమేజ్ను తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. పాత ఛరిష్మా కోసం పాట్లు... బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగు మార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గాను 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 22 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టుంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకు పోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓడినప్పటికీ ఆమె గెలుచుకున్న 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు.2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ 13 శాతం ఓట్లు పడినా కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. ఈ పరిణామాలన్నీ బీఎస్పీ ఉనికిలో లేవన్న సందేశాన్ని పంపడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో 2027 ఎన్నికలకు ముందే పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని, అక్టోబర్ 9న ఐదు లక్షల మందితో నిర్వహించే సభ ద్వారా తన బలాన్ని చూపించాలని మాయావతి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. వార్డు స్థాయి సమావేశాలు జరిగాయి. మొత్తం కేడర్ను ఉత్తేజపరిచేలా నేతలు పర్యటనలు సాగుతున్నాయి.అక్టోబర్ 8 నుంచే లక్నోలోని రమాబాయి మైదాన్కు సుదూర జిల్లాల నుంచి మద్దతుదారులు రావడం ప్రారంభిస్తారని, చాలా ఏళ్ల తర్వాత మాయావతి ఈ సభలో ప్రసంగించబోతున్నారని బీఎస్పీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంíపీ గిరీష్ చంద్ తెలిపారు. తమకు పట్టున్న ఎస్సీ వర్గాలతో పాటు ముస్లిం, బ్రాహ్మణ, ఓబీసీ వర్గాలను ఏకం చేసేలా ఈ సభ ఉంటుందన్నారు. పార్టీలోకి తిరిగి తీసుకొని జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాష్ ఆనంద్ సైతం ఈ సభను హిట్ చేయడం ద్వారా పారీ్టకి కొత్త జవసత్వాలను అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఆయన ఇప్పటికే యూపీ అంతా తిరుగుతూ బూత్ స్థాయి కమిటీల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 95 శాతం కమిటీలు పూర్తి చేశారు. ఈ సభలోనే సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, నిషాద్ పార్టీతో సహా అనేక పార్టీల సీనియర్ నాయకులు బీఎస్పీలో చేరవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ నేత ఆజం ఖాన్, బీజేపీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య రాజ్భర్ వర్గానికి చెందిన ఓం ప్రకాష్ రాజ్భర్, సంజయ్ నిషాద్, నసీముద్దీన్ సిద్ధిఖీ వంటి నాయకులు బీఎస్పీ శిబిరంలో చేరుతారనే చర్చ జరుగుతోంది. -
యూపీలో ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల జాబితాలో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం ఆరోపించారు. మహోబా జిల్లాలోని ఒకే ఒక ఇంటి నంబర్తో 4,271 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. లక్నోలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఉన్నట్లు కనుగొని షాకయ్యా.తాజాగా, ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లున్నారు. అంటే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు కనీసం 12 వేల మంది ఉండి ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే గ్రామంలో మొత్తం ఓటర్లు సుమారు 16 వేలు కావడం మరింత తీవ్రమైన అంశమన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి యూపీలో ఓట్ల చోరీ మొదలుపెట్టాయన్నారు. అదేవిధంగా, బిహార్లో బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలోని భాగల్పూర్లో పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్కు ఎకరా కేవలం రూ.1కే ఏకంగా వెయ్యి ఎకరాల భూమిని పవర్ ప్లాంట్ కోసం 25 ఏళ్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఈప్లాంట్ విద్యుత్ను యూనిట్ రూ.7 చొప్పున 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. -
విమానం టేకాఫ్ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. -
విషాదం.. 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు."మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
లైట్ తీసుకోవద్దు!.. నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం రియాక్షన్
లక్నో: నేపాల్ సంక్షోభాన్ని ఉటంకిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలేనని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్లో ఏం జరిగిందో చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన లక్నోలోని రామ్ మనోహర్ లోహియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేపాల్లోని ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం.. అది పెద్ద సమస్యలకు దారి తీస్తుందన్నారు.‘‘చిన్నవిగా కనిపించే విషయాలు, అవి పెద్ద సమస్యను తెస్తాయి. సమాజంలో అభివృద్ధి, పురోగతిని ఎలా అడ్డుకుంటాయో, అశాంతిని ఎలా రగిలిస్తాయో నేపాలే నిదర్శనం. జెన్-జడ్(Gen-Z) నిరసనకారుల ఆందోళనతో నేపాల్ హింసాత్మక ఘటనలు చవిచూసింది. కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి.. మారుతున్న పరిస్థితులకు సిద్ధపడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ కట్టుబడి ఉందన్నారు. వైద్య విద్యార్థులు, డాక్టర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతిక సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. -
ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్లే!
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటేఅక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.మాధోపట్టి మహిమస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!విజయ రహస్యంఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!మాధోపట్టి అనేది కేవలం మ్యాప్లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. -
యూపీఎస్సీ టాపర్స్ చిరునామా.. ఆ రాష్ట్రం!
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాఅయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అభ్యర్థులు సివిల్స్లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారే ఉన్నారు.యూపీఎస్సీ టాపర్లు2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)ఎలా సాధ్యమైంది?ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతవరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి. -
దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. -
ఫ్రిడ్జ్లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!
పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.ఏమిటీ పోస్ట్పార్టమ్ సైకోసిక్.. సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजहRead more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025 -
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
షాకింగ్ ఘటన.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికెళ్లిన మహిళ
ఫరూఖ్బాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖ్బాద్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత(33).. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించిన యువకుడు, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. నిషా సింగ్ అనే మహిళను యువకుడు దీపక్ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది.తమతో మాట్లాడాలంటూ దీపక్, అతని స్నేహితులు ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మాట్లాడానికి నిరాకరించడంతో వారి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ మహిళకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 6న ఈ సంఘటన జరిగింది.మృతురాలి తండ్రి బాల్రామ్ సింగ్ తన కుమార్తెను ఒక వ్యక్తి, అతని స్నేహితులు ఆగస్టు 6న సజీవ దహనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పరిస్థితి గురించి డాక్టర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తాను ఆసుపత్రికి వెళ్ళానని బాధితురాలి తండ్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు."డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ కూతురు చాలా తీవ్రంగా కాలిపోయిందని.. త్వరగా రండి అని చెప్పారు. నేను అక్కడికి చేరుకునేసరికి ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 'నాన్నా నన్ను రక్షించు' అని అరుస్తోంది. దీపక్ తనకు నిప్పు పెట్టాడని చెప్పింది. ఆ వ్యక్తి తనతో మాట్లాడమని, కలవమంటూ బలవంతం చేసేవాడని తన కూతురు చెప్పిందని తండ్రి బాల్రామ్ సింగ్ తెలిపారు. నిషా సింగ్ భర్త మాట్లాడుతూ.. వేధింపులు గురించి తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. -
బీజేపీ ఎంపీ సోదరికి వేధింపులు.. వెలుగులోకి మామ, మరిది అకృత్యాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా బీజేపీ ఎంపీ సోదరికే అత్తింటి వారి నుంచి వేధింపులు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి ఇంట్లో వారి అకృత్యాలు నిలదీసినందుకు మామ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం, ఆమెను వీధిలోకి లాగి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. యూపీలోని ఫరూఖాబాద్ ఎంపీ ముకేశ్ రాజ్పుత్ సోదరి రీనా సింగ్కు 17 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా జిల్లాలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం అనూహ్యం ఘటన చోటుచేసుకుంది. రీనా సింగ్ను తన మామ లక్ష్మణ్ సింగ్, తన భర్త సోదరులు కలిసి.. నడి వీధిలో దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. తనను కొట్టవద్దని ఎంత వారించినా.. ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అనంతరం, తనపై జరిగిన దాడిపై రీనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లుగా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.देखिये योगीबाबा के जंगलराज में जब भाजपा सांसद मुकेश राजपूत की बहन को इस तरह पीटा जा रहा है, तो बाकी महिलाओं का क्या हाल होगा ? उनके ससुर ने बीच सड़क बेरहमी से 4 सेकेंड में 5 डंडे मारे। सांसद की बहन चीखती-चिल्लाती रही। कोई मदद को आगे नही आया । pic.twitter.com/Gukk8Xh34R— Shyam Yadav SP (@shyamyadavsp95) September 8, 2025ఈ సందర్భంగా రీనా సింగ్ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్న సమయంలో మామ, తన మరిది కలిసి బాత్రూమ్ కిటికీ నుంచి ఫోన్లో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై నేను వారిని ప్రశ్నించడంతో నాపై దాడి చేశారు. నా కుమార్తెను కూడా దారుణంగా కొట్టారు. చాలా రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో, రీనా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు బీజేపీ ఎంపీ సోదరి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
రింకూ సింగ్ జట్టుకు నిరాశ.. యూపీ టీ20 లీగ్ విజేతగా కాశీ రుద్రాస్
ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్ టైటిల్ను కాశీ రుద్రాస్ రెండో సారి గెలుచుకుంది. లీగ్ తొలి ఎడిషన్లో (2023) ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. ప్రస్తుత ఎడిషన్లో (2025) మరోసారి విజేతగా అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన ఫైనల్లో రుద్రాస్ డిఫెండింగ్ ఛాంపియన్ (2024) మీరట్ మెవెరిక్స్ను చిత్తుగా ఓడించింది. శివమ్ మావి, అభిషేక్ గోస్వామి, కెప్టెన్ కరణ్ శర్మ రుద్రాస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఫైనల్లో టీమిండియా స్టార్ రింకూ సింగ్ లేని లోటు మెవెరిక్స్లో స్పష్టంగా కనిపించింది. రింకూ ఆసియా కప్ ఆడేందుకు యూఏఈకి ఫైనల్, అంతకుముందు క్వాలిఫయర్ మ్యాచ్ ఆడలేదు. ఈ సీజన్ ఆధ్యాంతం రింకూ అద్బుత ప్రదర్శనలు చేయడంతో మెవెరిక్స్ ఫైనల్స్ దాకా చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్.. రుద్రాస్ బౌలర్లు శివమ్ మావి (4-0-24-2), కార్తీక్ యాదవ్ (3-0-23-2), సునీల్ కుమార్ (4-0-41-2), అటల్ బిహారి రాయ్ (4-0-28-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్లో ప్రశాంత్ చౌదరీ (37) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారిలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఆర్సీబీ ఆటగాడు స్వస్తిక్ చికారా డకౌట్ కాగా.. కెప్టెన్ మాధవ్ కౌశిక్ 6 పరుగులు మాత్రమే చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రుద్రాస్.. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి (61 నాటౌట్), కరణ్ శర్మ (65) సత్తా చాటడంతో 15.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. అభిషేక్, కరణ్ ఇద్దరు కలిసి మెవెరిక్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. ముఖ్యంగా జీషన్ అన్సారీని (3.4-0-0-50) టార్గెట్ చేశారు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన (2-0-7-0) రుద్రాస్ కెప్టెన్ కరణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్ను కరణ్ శర్మ లీడింగ్ రన్ స్కోరర్గా (12 మ్యాచ్ల్లో 519 పరుగులు) ముగించాడు. రుద్రాస్ బౌలర్ శివమ్ మావి (10 మ్యాచ్ల్లో 22 వికెట్లు) ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. -
చెయ్యి అడ్డు తియ్యకుంటే మరిన్ని దెబ్బలు..!
లక్నో: యూపీ రాజధాని లక్నోలోని అమిటీ యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థిని క్లాస్మేట్స్ దూషిస్తూ దారుణంగా కొట్టారు. వర్సిటీ క్యాంపస్లోని పార్కు చేసి ఉన్న వాహనంలో ఆగస్ట్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఓ మహిళ ఎడాపెడా చెంపదెబ్బలు కొడుతుండగా పక్కనే ఉన్న మరొకరు దూషణల పర్వం సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. బాధిత విద్యార్థి శిఖర్ ముకేశ్ కేసర్వాని దెబ్బలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ‘చెంపకు చెయ్యి అడ్డు తియ్యి..లేకపోతే మరిన్ని దెబ్బలు తగులుతాయి’అన్న హెచ్చరికలు సైతం రికార్డయ్యాయి. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో కనీసం 25, 30 సార్లు బాధితుడి చెంపలను వాయించారు. దాదాపు ముప్పావు గంటపాటు శిఖర్పై దాడి కొనసాగిందని, ఆ దెబ్బలకు అతడు భయంతో అనారోగ్యం పాలై అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వస్తే చంపేస్తామని వాళ్లు బెదిరించారన్నారు. శిఖర్ ఫోన్ను కూడా పగులగొట్టారన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. వర్సిటీ కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. -
మీరట్లో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం.. అక్కడేం జరుగుతోంది?
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో "న్యూడ్ గ్యాంగ్" పేరుతో మహిళలపై దాడులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా దౌరాలా ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోకి కొందరు పురుషులు నగ్నంగా వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను పొలాల్లోకి లాక్కెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవల మీరట్లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్కు వెళ్తున్న సమయంలో ఓ ప్రాంతంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత మహిళ కేకలు వేయడంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలించినా ఫలితం లేదన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదంటూ బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇలాంటి ఘటనే ఎదురు కాగా, భయంతో బయటపెట్టలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్తులు తెలిపారు.కొంతమంది ఈ ఘటనలను వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్ను చూశామంటూ చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్ల సహాయంతో ఈ ప్రాంతాలను గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మద్యం అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు
లక్నో: ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు సృష్టించింది. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.22,337 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం కంటే.. రూ.3,021.41 కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మద్యం వినియోగం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టు నెలలోనే ఆగస్టు నెలలోనే ఆ శాఖ రూ.3,754.43 కోట్లు ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే రూ.174.24 కోట్లు ఎక్కువ సాధించి.. తన ఆదాయ రికార్డును తానే బద్దలు కొట్టిందని ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రి నితిన్ అగర్వాల్ చెప్పారు. -
అయోధ్యలో భూటాన్ ప్రధాని
అయోధ్య: భూటాన్ ప్రధానమంత్రి దషో త్సెరింగ్ టాబ్గే శుక్రవారం అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో అయోధ్యకు చేరుకున్న త్సెరింగ్కు ఉత్తరప్రదేశ్ మంత్రి సూర్యప్రతాప్ షాహీ, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన లక్నో–గోరఖ్పూర్ మార్గంలో ప్రత్యేక కాన్వాయ్లో అయోధ్య ఆలయానికి చేరుకున్నాయి. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రామ్లల్లా ఆలయంతోపాటు అయోధ్యలోని హనుమాన్ గార్షీని త్సెరింగ్ దర్శించుకున్నారు. ఆయన గౌరవార్థం అధికారులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయోధ్యలో పర్యటన ముగిసిన తర్వాత త్సెరింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. భూటాన్ ప్రధానమంత్రి పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. భారత్, భూటాన్ మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని ఉత్తరప్రదేశ్ మంత్రి సూర్యప్రతాప్ షాహీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. -
చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు.. చివరికి ట్విస్ట్
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంట్లో దూరిన కోతులు.. మంచంపై నిద్రపోతున్న రెండేళ్ల పసికందును బయటకు లాక్కెళ్లి.. ఇంటిపై ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేయడంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. మఖ్రేహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.గురువారం.. అనుజ్ కుమార్ కుమారుడు కనిపించకుండా పోయాడు. తల్లి సవిత స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో.. నిద్రిస్తున్న చిన్నారిని ఇంట్లోకి చొరబడిన కోతులు ఎత్తుకెళ్లాయి. పసికందు కనిపించడం లేదని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఇంట్లో, చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. చివరికి నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహన్ని గుర్తించారు.అయితే, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శిశువు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. శిశువు తండ్రి అనుజ్ కుమార్ ఇంటి బయట ఒక ఎలక్ట్రిక్ షాపును నిర్వహిస్తున్నాడని.. ఇప్పటివరకు కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..
ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. ఆమెను అతగాడు చితకబాదేశాడు. దీంతో ఏడుస్తూ ఆ భార్య ఇంటి మేడ మీదకు చేరింది. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించింది. దమ్ముంటే దూకమంటూ ఆ భర్త ఆమెకు చాలెంజ్ చేస్తూ పదే పదే చెప్పసాగాడు. కట్ చేస్తే.. ఆమె అన్నంత పని చేసింది. ఉత్తర ప్రదేశ్ అలీబాగ్లో దారుణం జరిగింది. గోండా ఏరియా దాకౌలి గ్రామంలో రెండతస్తుల మేడ మీద నుంచి దూకిన ఓ మహిళ.. ఆస్పత్రి పాలైంది. భార్యభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భర్త కొట్టడంతో ఆమె ఏడుస్తూ మిద్దెపైకి చేరిందని, అక్కడి నుంచి దూకుతానని బెదిరించిందని, దూకి చావమని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసిందని, భూమిని బలంగా తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే కిందపడిన తర్వాత కూడా ఆమెపై భర్త దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్నారి మమ్మీ.. మమ్మీ.. అంటూ ఏడుస్తూ కనిపించాడు. మహిళ తరఫు బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదైంది.अलीगढ़ : महिला छत से कूदी, परिजनों का आरोप उकसाकर कूदने पर किया मजबूर। कूदने का वीडियो वायरल, महिला गंभीर घायल। ससुराल पक्ष के खिलाफ थाने में दी तहरीर, थाना गोंडा इलाके के दमकोली गांव की घटना। #Aligarh pic.twitter.com/twWG6yKtuq— Akash Savita (@AkashSa57363793) September 3, 2025 -
అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!
ఉత్తర్ప్రదేశ్లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది. కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. పెరుగుతున్న ఆన్లైన్ సుసైడ్ అటెంప్ట్స్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. (చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
అమ్మాయి కాదు ఆంటీ!
వివాహేతర సంబంధాలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న హత్యల్లో చాలావరకు సోషల్ మీడియా లింకులు కూడా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం.. ఈ తరహా నేరాల్లోని మరో కోణాన్ని బయటపెట్టింది.ఓ ఆంటీ(52) ఇన్స్టాగ్రామ్కు అడిక్ట్ అయ్యింది. ఫాలోవర్స్ను పెంచుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేసేది. ఫిల్టర్లను ఉపయోగిస్తూ అమ్మాయిలా ఫోజు ఇస్తూ రీల్స్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె వయసులో సగం ఉన్న ఓ కుర్రాడు.. ఆ రీల్స్కు లైకులు, కామెంట్లు పెట్టాడు. మెల్లిగా వ్యవహారం ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్కు షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ..ఉత్తర ప్రదేశ్ మెయిన్పురిలో కిందటి నెల 11వ తేదీన గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిస్టరీగా మారిన ఆ కేసును ఎట్టకేలకు చేధించినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మృతురాలిని ఫర్రూఖాబాద్ జిల్లా రాణి(52)గా గుర్తించిన పోలీసులు.. ఆమె సోషల్ మీడియా ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.మెయిన్పురికి చెందిన అరుణ్ రాజ్పుత్(26).. రాణితో ఏడాదిన్నర కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య చాలాకాలం చాటింగ్, కాల్స్ వ్యవహారం నడిచాయి. అయితే నేరుగా కలిశాక ఆమె తనను మోసం చేసిందని.. తన కంటే వయసులో చాలా పెద్దదని గ్రహించాడు. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆమె అతనికి బోలెడంత డబ్బు(లక్షన్నర రూపాయలకు పైనే) సమర్పించుకుంది.అరుణ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని.. తన డబ్బుతిరిగి ఇచ్చేయాలని, లేకుంటే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన కంటే రెట్టింపు వయసు, పైగా నలుగురు పిల్లలున్న ఆవిడను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని అరుణ్ భావించాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమెను మెయిన్పురికి రప్పించాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గొంతుకు ఆమె చున్నీనే బిగించి హత్య చేశాడు. కేసులో ఎలాంటి క్లూలు లేకపోవడంతో.. మిస్సింగ్ కేసులతో సరిపోల్చుకున్న పోలీసులు చివరకు కేసును చేధించగలిగారు. పెళ్లి చేసుకోకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తుందేమోనని భయపడ్డానని..ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె ఫోన్ను దాచేశానని అరుణ్ పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకున్నాడు. -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
గూగుల్ మ్యాప్స్ టీమ్పై దాడి.. వామ్మో అసలు కారణం ఇదా?
కాన్పూర్: గూగుల్ మ్యాప్స్ బృందానికి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. గూగుల్ మ్యాప్స్ కోసం సర్వే చేయడానికి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా బిర్హార్ గ్రామానికి వెళ్లిన బృందంపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అయితే, వారిని దొంగలుగా అనుమానించి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ మ్యాప్స్లో రహదారి సమాచారం అందించేందుకు టెక్ మహీంద్రా నుంచి ప్రత్యేకంగా కెమెరాలు అమర్చిన వాహనంతో బృందం గ్రామంలోని వీధులను మ్యాపింగ్కు ఫొటోలు తీశారు. అయితే, కెమెరాలు అమర్చిన వాహనాన్ని చూసిన గ్రామస్థులు అనుమానంతో.. వారు దొంగతనం చేయడానికి ముందస్తుగా సమాచారం సేకరిస్తున్నారని భావించారు. ఒక్కసారిగా గ్రామస్థుల గుంపు బృందాన్ని చుట్టుముట్టి, వాహనాన్ని అడ్డగించి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు.. బృంద సభ్యులపై దాడికి దిగారు.ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులు, సర్వే బృందాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అక్కడ గూగుల్ మ్యాప్స్ బృందం తమ పని గురించి వివరించడంతో గ్రామస్థులు శాంతించారు. ఇదిలా ఉండగా.. తాము దొంగలం కాదని చెబుతున్నా వినకుండా తమపై దాడి చేసినట్లు సర్వే బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాన్ని సర్వే చేసేందుకు వెళ్లామని, అందుకు డీజీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ.. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని.. దీంతో గ్రామస్థులు.. వాహనానికి కెమెరాలు అమర్చి గ్రామంలో తిరుగుతున్న గూగుల్ మ్యాప్స్ బృందాన్ని దొంగలుగా భావించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించినట్లు పోలీసులు చెప్పారు. -
సంభాల్లో 15 శాతానికి పడిపోయిన హిందువులు.. 1947లో ఎంతంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఇటీవల సమర్పించింది. 450 పేజీల ఈ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2024 నవంబర్ 24న జరిగిన హింసతోపాటు దాని పూర్వాపరాలు వెల్లడించింది. సంభాల్లో హిందువుల జనాభా 15 శాతానికి పడిపోయినట్లు స్పష్టంచేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ జనాభా స్థితిగతుల్లో భారీ మార్పులు వచ్చాయని, మత రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. సంభాల్లోని షాహీ జామా మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో పట్టణంలో గత ఏడాది హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మసీదు ప్రాంగణంలో గతంలో హిందూ ఆలయం ఉండేదని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే కోసం వచ్చిన బృందంతో కొందరు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. ఇది క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాళ్ల దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలను నిరసనకారులు దహనం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవేంద్ర ఆరోరా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలోని అంశాలివీ...సంభాల్లో 1947 తర్వాత 15సార్లు ఘర్షణలు జరిగాయి. 1947, 1948, 1953, 1958, 1962, 1976, 1978, 1980, 1990, 1992, 1995, 2001, 2019, 2024లో హింసాకాండ చోటుచేసుకుంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంభాల్లో హిందువులు 45 శాతం, ముస్లింలు 55 శాతం ఉండేవారు. ఇప్పుడు హిందువుల జనాభా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. ముస్లింల సంఖ్య 85 శాతానికి చేరుకుంది. తరచుగా జరుగుతున్న ఘర్షణలు, బుజ్జగింపు రాజకీయాలు ఇందుకు దోహదం చేశాయి.2024 నవంబర్ 22న సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ చేసిన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సంభాల్లో ఘర్షణ మొదలైంది. నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఘర్షణలు విస్తరించలేదు. అల్–ఖైదా, హర్కత్–ఉల్–ముజాహిదీన్ తది తర ఉగ్రవాద సంస్థలకు సంభాల్లో గతంలో స్థావరాలు ఉండేవి. ఇక్కడ ఆక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల ముఠాలకు కొదవలేదు. సంభాల్లో 68 పుణ్యక్షేత్రాలు, 19 పవిత్ర బావులు ఉండేవి. అవి చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. -
నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి.. దంపతుల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు.. తమ నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్లూమ్ వ్యాపారవేత్త సచిన్ గ్రోవర్ (30).. ఆయన భార్య శివాని (28) తమ నాలుగు నెలల కుమారుడు ఫతేహ్.. ఇంటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు.బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి.. కిటికీ గుండా చూసేసరికి, గదిలోని ఉరికి వేలాడుతూ భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండగా.. భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.సూసైడ్ నోట్లో తమకున్న అప్పులు తీర్చడానికి తమ కారు, ఇల్లు అమ్మివేయాలని సచిన్ కోరారు. “నా కుటుంబంపై నాకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వారు నన్ను పూర్తిగా మద్దతు ఇచ్చారు. దయచేసి మా కారు, ఇల్లు అమ్మి అప్పులు తీర్చండి.. తద్వారా ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలి.” అంటూ సచిన్ తన సూసైడ్ నోట్లో రాశారు. సచిన్.. మంగళవారం సాయంత్రం తన తల్లితో మాట్లాడినప్పుడు.. రూ. 5 లక్షలు బ్యాంకు లోన్ కట్టాల్సి ఉందని.. కానీ రూ. 3 లక్షలు మాత్రమే సమకూర్చగలిగానని చెప్పాడని ఆయన తల్లి పేర్కొంది.ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి, దంపతులు ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయారని.. వారి కుమారుడిని ముందుగా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్లో వచ్చారు. రోహితాష్ లాయర్తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
శుభాంశుకు లక్నోలో అపూర్వ స్వాగతం
లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగిడిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లాకు సోమవారం లక్నోలో అపూర్వ స్వాగతం లభించింది. యాగ్జియం–4 మిషన్ను దిగి్వజయం ముగించుకుని ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ఆయన..మొదటిసారిగా సొంతూరుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లా, భార్య కామ్నా, కుమారుడు కియా‹Ùతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త్రివర్ణ పతకాలు చేబూని, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిటీ మాంటెస్సోరి స్కూలుకు చెందిన విద్యార్థులు డ్రమ్ములు వాయిస్తూ బాకాలు ఊదుతూ సందడి చేశారు. సొంతూరు రావడం ఎంతో ఉత్కంఠగా ఉందని శుభాంశు పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు లక్నోలో కాలు పెట్టిన దగ్గర్నుంచి అభిమానులతో కనీసం 2 వేల సెలీ్ఫలు తీసి ఉంటానని అన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో పూల వాన కురిపిస్తుండగా త్రివేణీ నగర్లోని సొంతింటి వైపు ఆయన విక్టరీ పరేడ్ సాగింది. స్పేస్ టెక్నాలజీ చదివే విద్యార్థులకు శుభాంశు శుక్లా పేరుతో స్కాలర్ షిప్పులను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నాసా బదులుగా ఇస్రో గురించి అందరూ మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ సమక్షంలో శుభాంశు శుక్లాకు సీఎం యోగి సన్మానం చేశారు. లక్నోలోని ఓ పార్కుకు శుక్లా పేరు పెడతామని మేయర్ తెలిపారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన భారీ డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లపై శుభాంశు శుక్లా ఘనతను ప్రదర్శించారు. శుక్లాను భారత రత్నతో గౌరవించాలని రా్రïÙ్టయ కిసాన్ మంచ్ డిమాండ్ చేసింది. -
UP: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ట్రాక్టర్ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ట్రాక్టర్ రాజస్థాన్లోని గోగామేడికి కాస్గంజ్ నుంచి బయలుదేరింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు.అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్షహర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెలిపారు. కాస్గంజ్ జిల్లాలోని 60 నుంచి 61 మంది భక్తులు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది.ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్ను ఘటన స్థలంనుంచి తొలగించారు. ఈ ఘటన భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిలింది.#WATCH उत्तर प्रदेश | बुलंदशहर थाना अंतर्गत राष्ट्रीय राजमार्ग 34 पर घटाल गांव के पास, कासगंज से राजस्थान के गोगामेड़ी जा रहे गोगाजी के भक्तों से भरे ट्रैक्टर को एक कंटेनर ने टक्कर मार दी, जिससे 8 लोगों की मौत हो गई और 43 घायल हो गए हैं। pic.twitter.com/CDsRntamck— ANI_HindiNews (@AHindinews) August 25, 2025 -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్లోని విజయ్ నగర్లోని బ్రహ్మపుత్రా ఎన్క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు. ఇదీ చదవండి: స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే -
మొసళ్లతో పోరాడి గెలిచిన మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు. ప్రవాహంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రాణసంకటంగా మారిన మొసళ్ల నుంచి తమ వారికి ఇద్దరు మహిళలు రక్షించుకున్న ఘటనలు ఆదివారం బహ్రెయిచ్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. «భర్త కాలిని నోట కరిచిన మొసలి నుంచి భార్య కాపాడగా, మరో ఘటనలో ఐదేళ్ల కుమారుడిని మొసలి బారి నుంచి చాకచక్యంగా కాపాడి మరో మహిళ తన తల్లిప్రేమను నిరూపించుకుంది. ఖైరీఘాట్ పరిధిలోని ఘాఘ్రా నదీప్రవాహానికి అనుసంధానంగా ధకియా గ్రామంలో ఒక కాలువ ప్రవహిస్తోంది.ఇందులోకి ఏడు అడుగుల మొసలి వచి్చచేరింది. ఆదివారం కాలువ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు వీరును అది ఒక్కసారిగా నోటకరిచి కాలువలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న బాలుడి తల్లి మాయా ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వెంటనే మొసలిని సమీపించి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో దానిపై దాడిచేసింది. ఆపకుండా పలుమార్లు రాడ్తో కొట్టడంతో దెబ్బలకు తాళలేక అది బాలుడిని విడిచిపెట్టింది. విషయం తెల్సుకున్న బహ్రెయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని కాలువలోకి మళ్లీ మొసళ్లురాకుండా వలలు ఏర్పాటుచేయించారు.మోతీపూర్ పరిధిలోని మాధవపూర్ గ్రామంలో అటుగా వెళ్లేందుకు రామ్తాలియా కాలువ దాటాల్సి ఉంటుంది. ఆదివారం 45 ఏళ్ల సైఫూ తన భార్య సుర్జానా, బంధువుతో కలిసి కాలువ దాటుతుండగా అందులోని పెద్ద మొసలు సైఫూ కాలిని నోట కరిచి కాలువ లోపలికి లాక్కెళ్లింది. ప్రాణభయంతో సైఫూ అరడం మొదలెట్టాడు. పక్కనే ఉన్న భార్య సుర్జానా ఏమాత్రం భయపడకుండా చీర కొంగును అతని వైపు విసిరి పట్టుకుని బయటకు లాగింది. ఇది చూసిన సమీప గ్రామస్థులు పరుగున వచ్చి కర్రలతో మొసలిపై దాడి చేసి సైఫూ కాలిని ఎలాగోలా విడిపించారు. -
ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.➤మురళీధర్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు➤బిమల్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లుఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత -
దుస్తులు చించి, భౌతిక దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్పై ఆమె నివాసముంటున్న ఇంటి యజమాని కుటుంబం దాడి చేసింది. ఆగస్టు 15న సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నోలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళ తన గదిలో ఉండగా.. ఇంటి యజమాని సల్మా షేక్ వచ్చాడు. ఆమె వాహనాన్ని ఇంటి బయట పార్కింగ్ చేయడంపై అభ్యంతరం చెప్పాడు. ఇంటిని ఖాళీ చేయాలన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సల్మా షేక్ కుమారులు సుహాన్, ఇమ్రాన్ ఆమెను కులపరంగా దూషించడమే కాదు.. భౌతికంగా దాడి చేశారు. అనుచితంగా తాకారు. సర్వీసు నుంచి సస్పెండ్ చేయిస్తామని బెదిరించారు. దాడితో కానిస్టేబుల్ బట్టలు చిరిగిపోయాయి. స్పృహ కోల్పోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. యోగితో పూజా పాల్ భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్వాద్ పార్టీ(ఎస్పీ) నుంచి బహిష్కరణ ఎదుర్కొన్న ఎమ్మెల్యే పూజా పాల్ తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు. లక్నోలోని సీఎం నివాసంలో యోగితో ఆమె భేటీ అయ్యారు. దీంతో, ఆమె బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఇటీవల యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్.. బీజేపీ ప్రభుత్వం, సీఎం యోగి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో ఇటీవల విజన్ డాక్యుమెంట్ 2047పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజా పాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూపీలో నేరగాళ్లపై యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందన్నారు. తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్) హత్య కేసులో నిందితుడు అతీక్ అహ్మద్ ఆగడాలపై చర్యలు తీసుకోవడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. దీంతో, అసెంబ్లీలో బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు.Samajwadi Party expelled MLA Pooja Pal met Chief Minister Yogi Adityanath at his official residence in Lucknow(Source: UP CMO) pic.twitter.com/H2Bv99U2SM— ANI (@ANI) August 16, 2025ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను సమాజ్వాజ్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్గా తీసుకున్నారు. పూజా వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా అఖిలేష్.. పూజా పాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డరని పేర్కొన్నారు. అనంతరం, ఆమెపై వేటు వేశారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమె చర్యలు పార్టీకి నష్టం కలిగించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె.. సీఎం యోగిని కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. Samajwadi Party expelled MLA Pooja Pal after she praised CM @myogiadityanath ji in her assembly speech for delivering justice through the encounter of gangster Atiq Ahmed.She recalled how Atiq Ahmed murdered her husband and how it was CM Yogi who ensured justice.This is… pic.twitter.com/9sS9E3u8Wj— Tulla Veerender Goud (@TVG_BJP) August 14, 2025 -
రూ. 30,000 కోట్లతో బ్రిజ్ క్షేత్ర అభివృద్ధి
మథుర: ఉత్తరప్రదేశ్లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్(బ్రిజ్ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. ఈ నాలుగు దివ్య క్షేత్రాలను అనుసంధానించబోతున్నట్లు తెలిపారు. పురాణాల ప్రకారం శనివారం శ్రీకృష్ణుడి 5,252వ జన్మదినం. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మథుర పట్టణంలో పలువురు యోగులు, గురువులను సన్మానించారు. మథుర–బృందావన్లో రూ.646 కోట్ల విలువైన 118 అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం అసాధ్యమని పదేళ్ల క్రితం అన్నారని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని చెప్పారు. -
బైక్తో చేజ్ చేసి, ఎత్తుకెళ్లి..
బలరాంపూర్: ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 ఏళ్ల దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు నివాసముండే ప్రాంతంలోని రహదారిపై ఆమెను వెంబడించి.. కిడ్నాప్ చేసి మరీ దురాగతానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు, నాలుగు బైక్లపై ఆమెను వెంబడిస్తుండటం, యువతి రోడ్డుపై పరుగెత్తుతుండటం ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తన ఇంటినుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లిన యువతి.. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో బైక్ ఆపిన వ్యక్తి ఆమెను వెంబడించారు. తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే యువతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు ఒక పోలీసు పోస్టు సమీపంలో పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. స్పృహలోకి వచి్చన యువతి.. బైక్పై వచి్చన వ్యక్తులు అత్యాచారం చేశారని వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను అరెస్టు చేశారు. -
మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్లోని బలరామ్పూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025 -
రోజుకు ఐదు ఎన్కౌంటర్లు.. క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు
యూపీ పోలీసుల పేరు చెబితే అక్కడి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ తమకు ఎదురే లేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగిపోయిన క్రిమినల్స్ ఆట కటిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రక్షక భటులు. తామున్నది శాంతి భద్రతలు కాపాడటానికేనని, నేరాలు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. తమదైన శైలిలో కిరాతకుల పీచమణుస్తున్నారు. ఇందుకు అధికారిక లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం.ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సగటున రోజుకు దాదాపు ఐదు ఎన్కౌంటర్లు జరిగినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీ పోలీసుల డేటా ప్రకారం.. 2017, మార్చి 20 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు రాష్ట్రంలో 15,140 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 243 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 9,668 మందికి గాయాలయ్యాయి. 31 వేల మందిపైగా నిందితులు అరెస్టయ్యారు. విధి నిర్వహణలో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 1720 మంది గాయపడిన్నట్టు యూపీ పోలీసుల అధికారిక డేటా వెల్లడించింది.నో కాంప్రమైజ్రాష్ట్రంలో శాంతిభద్రతల పరిక్షణలో రాజీపడబోమని, నేరాలు చేసే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ (Rajeev Krishna) స్పష్టం చేశారు. తాము చేపట్టిన ప్రతి చర్య కూడా నిష్పక్షపాతంతో పారదర్శకంగా ఉంటుందన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూనే చట్టానికి లోబడి వ్యవహరించామని ఆయన చెప్పారు. ఎదురు కాల్పుల సమయంలో జాతీయ మానవ హక్కుల మార్గదర్శకాలను యూపీ పోలీసులు పాటించారు. గ్యాంగ్స్టర్, మాఫియా డాన్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదిలాగే కొనసాగుతుందని అన్నారు. నేరస్థులను పట్టుకునే క్రమంలో తమ పోలీసులు ఎంతో దైర్యసాహసాలు ప్రదర్శించారని, విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, కొంతమంది గాయపడ్డారని తెలిపారు.వెస్ట్లోనే హయ్యస్ట్యూపీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం ఎన్కౌంటర్లలో సగానికి పైగా పశ్చిమ యూపీలోని పోలీసు కమిషనరేట్లు, జోన్స్ పరిధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. మీరట్ జోన్లో అత్యధిక ఎన్కౌంటర్లు (4,282) చోటుచేసుకున్నాయి. అగ్రా జోన్ (2,326), బరేలీ (2,004) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మీరట్ జోన్లోనే 81 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యాయి. 2,951 మంది గాయపడగా, 4,568 మంది అరెస్టయ్యారు. ఇదే సమయంలో లక్నో జోన్లో 806 ఎన్కౌంటర్లలో 17 మంది నేరస్థులను పోలీసులు మట్టుబెట్టి 1,781 మందిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 166 మంది పోలీసులు గాయపడ్డారు. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో 1,084, కాన్పూర్ జోన్లో 671 ఎన్కౌంటర్లు జరిగాయి.పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్పోలీసు కమిషనరేట్ల వారీగా చూస్తే.. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయి. తర్వాతి స్థానిల్లో ఘజియాబాద్ (696), ఆగ్రా (430), వారణాసి(124), లక్నో (132) నిలిచాయి. నేరస్థులను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు తమపైకి కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లు జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు.చదవండి: కోట్లు కుమ్మరిస్తున్నారు... ఎక్కడా తగ్గట్లేదు! క్రిమినల్స్ ఫినిష్యూపీ ఎన్కౌంటర్లలో కరుడు గట్టిన పలువురు నేరస్థులు హతమయ్యారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబేను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. 60 క్రిమినల్ కేసులున్న అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో క్రిమినల్ షకీల్ అహ్మద్పై 25 కేసులుండగా, అతడి తలపై రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. 10 క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న కమల్ బహదూర్పై కూడా రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. లక్ష్మణ్ యాదవ్ రూ. 1.5 లక్షల రివార్డు ఉంది. వీరిని ఎన్కౌంటర్లలో పోలీసులు హతమార్చడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
వరద నీటిలో బాహుబలి సీన్ రిపీట్.. వరద నీటిలో పోలీసు అధికారి స్విమ్మింగ్
లక్నో: బాహుబలి సినిమాలో నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఒంటిచేత్తో పసిబిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి పాత్ర గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే నదీ ప్రవాహంలో నిజమైన నయా బాహుబలి ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. దాదాపు భుజం ఎత్తులో ప్రయాగ్రాజ్ నగరాన్ని గంగానదీ ప్రవాహం ముంచెత్తడంతో తమ బిడ్డను ఒక జంట ఇలా పైకెత్తి పట్టుకుని భద్రంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆదివారం ప్రయాగ్రాజ్ నగర వీధిలో తీసిందీ ఫొటో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయాగరాజ్లో గంగా నది నీళ్ల తన ఇంటి వద్దకు చేరడంతో యూపీకి చెందిన పోలీసు అధికారి ఒకరు.. వరద నీటికి పూజ చేశారు. అనంతరం, తన ఇంటి రెండో అంతస్తు నుంచి వరద నీటిలో దూకి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Ganga river has entered the residential areas or residential areas have encroached the Ganga river area? pic.twitter.com/PAiel3Fcqw— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025 Sub-inspector saab has upper his game - Dive from first floor. - Two camera set-up- Audience https://t.co/kksn2GCchs pic.twitter.com/4HT0EpJl3G— Piyush Rai (@Benarasiyaa) August 3, 2025 -
కాలువలో పడిన కారు.. 11 మంది మృతి
గోండా: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు. గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
పీడీఏ స్కూల్స్.. ఎ ఫర్ అఖిలేష్.. డి ఫర్ డింపుల్!
లక్నో: ఎ ఫర్ అఖిలేష్ యాదవ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ముంలాయం సింగ్ యాదవ్.. ఇది ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీ పీడీఏ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పీల్లలకు నేర్పుతున్న ప్రాథమిక పాఠం. సాధారణంగా చిన్న పిల్లలకు ఇంగ్లిష్ను పరిచయం చేసే క్రమంలో ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, డీ ఫర్ డాగ్ అని పరిచయం చేస్తారు. మరి యూపీలోని పీడీఏ పాఠశాలల్లో ఎ ఫర్ అఖిలేష్ అనే మాట వినిపిస్తోంది. యూపీలోని సమాజ్వాది పీడీఏ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచన మేరకు పీడీఏ పాఠశాలలను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా యూపీలో సహరాన్ పూర్ జిల్లాలోని రామ్నగర్లో తాజాగా పీడీఏ స్కూల్ను ఓపెన్ చేశారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూళ్లు మూసివేయబడుతున్నాయో అక్కడ పీడీపీ స్కూళ్లు ఓపెన్ చేయాలనే అఖిలేష్ ఆదేశాల నేపథ్యంలో పార్టీ కార్యకర్త ఫరాజ్ అలామ్ గడా ఈ స్కూల్ను ఆరంభించారు. ఈ స్కూల్లో 60 మందికి పైగా విద్యార్థులు చేరారు. ఇప్పుడు అక్కడ సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతల పేర్లను ఇంగ్లిష్ వర్ణమాలకు ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు.దీనిపై ఫరాజ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల కోసం ఈ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ స్కూల్లో 25 మంది చేరగా, ఆపై ఆ సంఖ్య 60పైకి చేరిందన్నారు. ‘ఇది స్కూల్ కాదు.. ఒక ఉద్యమం. బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లను మూసివేస్తోంది. పేద పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖేలేష్ యాదవ్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైతే స్కూల్ మూతబడుతుందో అక్కడ పీడీఏ స్కూల్ ఏర్పాటు కావాలని ఆదేశించారు. ఈ స్కూల్లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్ను అందివ్వడంతో పాటు మా పార్టీ రాజకీయ సందేశాన్ని కూడా ఇక్కడ జోడిస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. మా నాయకులు గురించి కూడా పాఠాల ద్వారా చెప్పే యత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఎ అంటే అఖిలేష్, డి అంటే డింపుల్ యాదవ్(అఖిలేష్ యాదవ్ భార్య), ఎం అంటే ములాయింగ్ సింగ్ యాదవ్( మా పార్టీ వ్యవస్థాపకుడు)ల గురించి కూడా చెబుతున్నాం’ అని పార్టీ కార్యకర్త తెలిపారు.ప్రతీ గ్రామంలో పీడీఏ పాఠశాల..గతవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్ స్కూళ్లు పెయిరింగ్ పాలసీలో భాగంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్లను యోగి సర్కార్ మూసివేస్తుందంటూ మండిపడ్డారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే మూతబడుతుందో ఆ గ్రామంలో కచ్చితంగా పీడీఏ స్కూల్ ఓపెన్ చేస్తాం. ప్రతీ గ్రామంలోనూ పీడీఏ స్కూల్ వస్తుంది. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. రాజకీయ వనరులను విస్తరిస్తున్న యోగి సర్కార్.. విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు’ అని అఖిలేష్ ధ్వజమెత్తారు. -
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే అంశమై వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ బుధవారం అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఫసల్ బీమా కింద రూ. 5 వేల కోట్ల బకాయిలు దేశ వ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థలు రైతులకు రూ.5,405 కోట్ల మొత్తాలను బకాయిపడ్డాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బీమా కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య వివాదాలు, బ్యాంకుల తప్పులు, ఆలస్యమైన బీమా ప్రతిపాదనలు, రాష్ట్రాలు సబ్సిడీ వాటాను ఆలస్యంగా విడుదల చేయడం వంటి కారణాలతో బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. -
గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్
తప్పులెన్నువారు తండోపతండంబు.. అనే ఓ వేమన పద్యం ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే.. ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని. అలాంటి బాపతు ఓ అధికారికి అనుకోని నిరసన ఎదురైతే.. దెబ్బకు గుంజీలు తీయాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐఏఎస్ రింకు సింగ్ రాహీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్గా ఆయన అందరి ముందు గుంజీలు తీసి చెంపలు వేసుకుని క్షమాపణలు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో తొలిరోజే ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వాళ్లను పిలిపించుకున్న ఆయన గుంజీలు తీయించాడు. టాయిలెట్లు వాడమని అక్కడ సూచన బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది ఇలా బహిరంగ విసర్జనకే మళ్లుతున్నారని, అందుకే శిక్షగా గుంజీలు తీయించామని ఆయన మీడియాతో చెబుతూ కనిపించాడు. అంతేకాదు.. కొంత మంది పిల్లలు బడి ఎగ్గొట్టి ఆ కాంపౌండ్లో తిరుగుతున్నారని.. బాధ్యతగా లేని వాళ్ల తల్లిదండ్రులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారాయన. అయితే ఈలోపు..తహసీల్దార్ వద్ద ఉన్న కొంత మంది లాయర్లు ఇదంతా గమనించారు. గుంజీలు తీసిన వాళ్లలో తమకు చెందిన క్లర్క్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్డీఎం రింకు సింగ్ను నిలదీశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వగా.. అక్కడి టాయిలెట్లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మీరూ గుంజీలు తీస్తారా? అని నిలదీస్తూ ఆ లాయర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో.. ఏం పాలుపోనీ ఆయన ‘అవును’ అంటూ చెంపలేసుకుంటూ ఆయన గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ లాయర్లు శాంతించి నిరసన విరమించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, టాయిలెట్లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయనే విషయాన్ని ఓ అధికారి 10రోజుల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడట. అయినా ఆ ప్రాంగణమంతా శుభ్రం కాకపోవడం తమ తప్పిదమేనంటూ ఆ ఐఏఎస్ పేర్కొన్నారు. తాను చేసిన పనికి నామోషీగా భావించడం లేదని అంటున్నారాయన.‘Our fault, I accept it’: On Day 1 of posting, #UP SDM Rinku Singh Rahi does sit-ups in front of advocates; takes responsibility for tehsil filthMore details 🔗 https://t.co/7Bm3up0dPp#UttarPradesh pic.twitter.com/Nuglfm9rQK— The Times Of India (@timesofindia) July 30, 2025 -
శివాలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి
బారాబంకీ: ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగిన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలోని ఓ విద్యుత్ తీగ తెగిపడిన కారణంగానే తొక్కిసలాట జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకిలో ఉన్న అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఈ క్రమంలో కోతి.. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై దూకడంతో.. కరెంటు వైర్లు తెగి భక్తులపై పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం, తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు.#BREAKING Stampede at Barabanki's Avsaneshwar Temple before darshan today... 15 devotees injured 📌The injured have been admitted to the hospitalpic.twitter.com/iJaQlnXUr4 #Barabanki #TempleStampede #India https://t.co/rVWlA2a7ab— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) July 28, 2025ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 40 మంది భక్తులు గాయపడినట్టు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.Barabanki, Uttar Pradesh: A stampede occurred during Jalabhishek at the Awsaneshwar Mahadev Temple after an electric current spread through the premisesDM Shashank Tripathi says, "Devotees had gathered here for darshan on the third Monday of Sawan. Some monkeys jumped onto the… pic.twitter.com/AzLnRnFQKx— IANS (@ians_india) July 28, 2025 -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional VideoLucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం
మెయిన్పురి: పోలీసు అధికారి పొరపాటు కారణంగా గ్యాంగ్స్టర్ చట్టం కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి 17 ఏళ్లపాటు న్యాయ పోరాటం సాగించాడు. చిట్టచివరికి 62 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 22 రోజులపాటు జైలు జీవితం అనుభవించి, కనీసం 300 సార్లు కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగీ అలసిపోయిన అతడితో కుటుంబం సంబంధాలు తెంచుకుంది. బడికి వెళ్లాల్సిన ఒక్కగానొక్క కొడుకు రోజు కూలీగా మారాడు. అన్నిటికీ తోడు సొంతూళ్లో అవమాన భారం. ఇదంతా ఏ తప్పూ చేయకుండానే భరించాడు రాజ్ వీర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుభవించిన వేదన పోలీసు అధికారి చేసిన చిన్న పొరపాటు ఫలితం కావడం గమనార్హం..! యూపీలోని మెయిన్పురి జిల్లా నగ్లా భంట్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవపై పోలీసులు నలుగురిపై 2008 ఆగస్ట్ 31న కేసు నమోదు చేశారు. వీరు మనోజ్ యాదవ్, పర్వేష్ యాదవ్, భోలా యాదవ్, రాంవీర్ సింగ్. అనంతరం వీరిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. రాంవీర్ సోదరుడే రాజ్ వీర్. కొత్వాలీ ఇన్స్పెక్టర్ రాం వీర్కు బదులుగా అతడి సోదరుడు రాజ్ వీర్ సింగ్ పేరు నిందితుల పేర్లలో చేర్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. రికార్డుల్లో ఉన్న ప్రకారం పోలీసులు రాజ్ వీర్ను పట్టుకెళ్లారు. పట్టుకోవాల్సింది రాంవీర్నని, తాను అమయాకుడిననీ ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. 22 రోజులపాటు జైలులో ఉన్నాక బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కేసు ఆగ్రా నుంచి మెయిన్పురి కోర్టుకు మారే వరకు దాదాపు 300 సార్లు వాయిదాలకు హాజరయ్యాడు. ‘నా క్లయింట్ గోడును ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏ కేసులూ లేవు. అయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవస్థపై ఇన్నేళ్లూ ఒంటరిగా పోరాటం సాగించాడు’అని లాయర్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘రాజ్ వీర్ కుటుంబం బాగోగులను చూసుకోలేకపోయాడు. ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు. కుటుంబ పోషణకు కుమారుడు వ్యవసాయ కూలీగా మారాడు’అని వివరించారు. గురువారం వాదనలు విన్న మెయిన్పురి కోర్టు రాజ్ వీర్ను నిర్దోషిగా ప్రకటించింది. జీవితంపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు. దాచుకున్న డబ్బు హరించిపోయింది. పరువు పోయింది. కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. తన తప్పు లేకున్నా ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది రాజ్ వీర్. ఈ నెల 24న మెయిన్పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి స్వప్న దీప్ సింఘాల్ రాజ్ వీర్కు సాంత్వన నిచ్చేలా తీర్పు వెలువరించారు. ‘పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు 22 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 17 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి’అని జడ్జి ఆదేశించారు. -
‘రాయబారి’ ముసుగులో ఆర్థిక నేరాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో నకిలీ రాయబార కార్యాలయం(ఎంబసీ) ఏర్పాటు చేసిన కేసులో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎంబసీకి సూత్రధారి అయిన హర్షవర్దన్ జైన్(47) గత పదేళ్లలో 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీపులు గుర్తించారు. అంతేకాకుండా రూ.300 కోట్ల ఆర్థిక కుంభకోణంతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ స్కామ్పై ఉత్తరప్రదేశ్ ‘సిట్’దర్యాప్తు చేస్తోంది. హర్షవర్దన్ జైన్ వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్వయా, లాడోనియా వంటి దేశాల పేరుతో ఎంబసీలు నిర్వహించాడు. ఇందుకు ఘజియాబాద్లోని తన రెండంతస్తుల బంగ్లాను అడ్డాగా మార్చుకున్నాడు. ఈ బంగ్లాపై విదేశీ జాతీయ జెండాలు ఎగురుతూ కనిపించేవని స్థానికులు చెప్పారు. ఖరీదైన కార్లలో తిరగడం జైన్కు అలవాటు. వాటిపై విదేశాల నామఫలకాలు, ముద్రలు ఉంటాయి. తనను తాను వెస్టార్కిటికా దేశ రాయబారిగా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. రాయబారిగా నాటకం ఆడుతూ జనాన్ని నిండా ముంచేశాడు. మొత్తానికి జైన్ గుట్టు గతవారం రట్టయ్యింది. ఈ నెల 22న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఎంబసీ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచ దేశాల్లో తనకు పలుకబడి ఉందని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పటిస్తానంటూ జనం వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు జైన్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో షెల్ కంపెనీలు కేవలం మోసాలే కాదు, ఆర్థిక నేరాల్లోనూ జైన్ ఆరితేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ పథకాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంక్ ఖాతాలతో భారీ సొమ్ము కొల్లగొట్టినట్లు పేర్కొంటున్నారు. జైన్ 2005 నుంచి 2015 వరకు 19 దేశాల్లో పర్యటించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 54 సార్లు వెళ్లొచ్చాడు. యూకేకు 22 సార్లు వెళ్లాడు. అంతేకాకుండా మారిషస్, ఫ్రాన్స్, కామెరూన్ తదితర దేశాల్లో పర్యటించాడు. విదేశాల్లో జైన్కు సంబంధించిన 25 షెల్ కంపెనీల లింక్లను స్పెషల్ టాస్్కఫోర్స్ వెలికితీసింది. స్టేట్ ట్రేడింట్ కార్పొరేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే లిమిటెడ్, ఐలాండ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ, ఇందిరా ఓవర్సీస్ లిమిటెడ్ తదితర పేర్లతో ఇవి ఏర్పాటయ్యాయి. అలాగే జైన్ పేరిట విదేశాల్లో 10 బ్యాంకు ఖాతాలున్నాయి. ఆరు దుబాయిలో, మూడు యూకేలో, ఒకటి మారిషస్తో తెరిచాడు. 12 నకిలీ డిప్లొమాటిక్ పాస్పోర్టులను అతడి నివాసంలో పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అంతర్జాతీయ రాకెట్ హర్షవర్దన్ జైన్ నెట్వర్క్ కేవలం ఇండియాకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో జని్మంచిన టర్కీ జాతీయుడు అహసన్ అలీ సయీద్ కూడా జైన్కు సహకరించాడు. ఇతడి సాయంతో జైన్ విదేశాల్లో పలు కంపెనీలను రిజిస్టర్ చేయించాడు. రూ.300 కోట్ల కుంభకోణంలో అహసన్ అలీ సయీద్ ప్రధాన నిందితుడు. ఇతడు జైన్తో కలిసి స్విట్లర్జాండ్లోని కంపెనీలను టార్గెట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఎంచుకున్నాడు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజాడు. జైన్, అలీ సయీద్ కలిసి హవాలా మార్గాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకు ఖాతాలతో ఈ డబ్బును సొంతం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీతోనూ జైన్కు సంబంధాలున్నాయి. 2002, 2004లో ఖషోగ్గీ రూ.20 కోట్లను జైన్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు జైన్ దేనికోసం ఖర్చు చేశాడన్న దానిపై ఎస్టీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై సోమవారం విచారణ జరుగనుంది. జైన్ను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!
త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారుఘజియాబాద్లోని మోడీనగర్లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్కారు..! ఇప్పటికీ..) -
జమీన్ కీ బేటీ.. వరినాట్లతో యువ ఎంపీ బిజీ బిజీ
రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జౌన్పూర్లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు. నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు. అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025(చదవండి: ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్.. ! వ్యాధులను నయం చేయడంలో..) -
కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్ నోట్
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లప్పుడు బుల్లెట్ బైక్ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది. ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్పీ ఎన్పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. -
సైన్యానికి 7 వేల ఏకే–203 రైఫిల్స్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే. గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు. అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఏకే–203 ప్రత్యేకతలుపాత కలాష్నికోవ్ సిరీస్కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు. -
రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
ఢిల్లీ: భారత్ జోడోయాత్రలో నమోదైన కేసులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడోయాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో ఆయనక లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలోభాగంగా రూ. 20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ న్యాయవాదులు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది కోర్టు.2022, డిసెంబర్ 16వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా భారత్ ఆర్మీ సైనికుల్ని రాహుల్ కించ పరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫను వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్పై కేసు నమోదైంది. భారత్ ఆర్మీని కించపరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు దాఖలు చేశాయి. మరొకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఈ జనవరిలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్ఘడ్, ప్రయాగ్రాజ్లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్హ్యాండెండ్గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
త్వరలో యూపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి, అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు అతిత్వరలో శ్రీకారం చుట్టబోతోంది. మరో పది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా.. అంతకంటే ముందే ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. బీజేపీకి ఆయువు పట్టులాంటి ఉత్తర్ప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరమే చేపట్టే అవకాశం ఉన్నట్లు సమచారం. ఉత్తరప్రదేశ్కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత వల్ల అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి వ్చవహరించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఎన్నికలే లక్ష్యంగా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీజేపీకి జాట్ వర్గానికి చెందిన భూపేంద్రసింగ్ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లోనే ఆయన పదవీకాలం ముగిసినా 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పొడిగించారు. లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ కేవలం 33 స్థానాలు గెలుచుకుంది. పార్టీ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆయనను మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం యూపీలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీల చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. బీజేపీ సైతం ఆయా వర్గాల నుంచి సమర్థులైన నేతలను అన్వేషిస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన స్వతంత్రదేవ్ సింగ్, ధరంపాల్ సింగ్, బీఎల్ వర్మలు ప్రధాన పోటీదారులుగా ఉండగా, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, సీనియర్ నేతలు బాబూరామ్ నిషాద్, అశోక్ కటారియాలు సైతం రేసులో ఉన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా ఆయన సారథ్యంలోనే 2027లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. క్రమంగా బలపడుతున్న సమాజ్వాదీ పార్టీ, దానికి అండగా ఉన్న కాంగ్రెస్ను ఎదిరించాలంటే బీజేపీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక సాధ్యం కాదని, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సైతం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడి వస్తారని అంటున్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ పగ్గాలు కట్టబెడతారా? లేక కొత్త వారికి అవకావం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. -
హైదరాబాద్లో ‘ఉత్తరప్రదేశ్’ రోడ్షో
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో రోడ్ షో చేపట్టింది.తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్లో ఈ రోడ్ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్ కమిషనర్ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు. -
యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు. -
20 మంది గాళ్ఫ్రెండ్స్, ఇద్దరు భార్యలు..
ఇలా ఎలారా.. అని అవాక్కయ్యారా? ఒక్కరితోనే వేగలేక చస్తున్నాం, ఇంత మందిని ఎలా మేనేజ్ చేశావ్ బ్రో అంటూ బుర్ర బద్దలు కొట్టుకోకండి. పాపం ఎప్పటికైనా పండుతుంది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. నౌషాద్ త్యాగి విషయంలోనూ అదే జరిగింది. మహిళల జీవితాలతో చెలగాటమాడిన ఈ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఎవరీ నౌషద్?ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని చార్తవాల్ ప్రాంతంలో జూలై 1న నౌషాద్ త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి పలువురు మహిళలను మోసం చేయడంతో పోలీసులు అతడికి బేడీలు వేశారు. యూపీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో కానిస్టేబుల్గా నటిస్తూ, మారు పేర్లతో కొన్నేళ్లుగా వంచనకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. త్యాగికి ఇద్దరు భార్యలు, 20 మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. వీరిలో 10 మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.వారే త్యాగి టార్గెట్..వితంతువులు, భర్తల నుంచి విడిపోయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని త్యాగి మోసాలకు పాల్పడ్డాడు. తాను లక్ష్యంగా చేసుకున్న మహిళ మతం ఆధారంగా తన వేషం మారుస్తాడు. హిందూ మహిళలకు రాహుల్ లేదా రికీగా, ముస్లిం మహిళలకు నౌషాద్గా పరిచయం చేసుకుని దగ్గరవుతాడు. తర్వాత వారి నుంచి డబ్బు, బంగారం, ఖరీదైన వస్తువులు దోచుకుని ఉడాయిస్తాడు. ముజఫర్నగర్లో మొదటి భార్య, ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అతడి రెండవ భార్య ఉంటారు. వీరిద్దరికీ తెలియకుండా త్యాగి వంచన పర్వం కొనసాగించాడు. మొదటి భార్య అతడి కంటే 23 సంవత్సరాలు పెద్ద.నాలుగు రాష్ట్రాల్లో మోసాలుయూపీతో పాటు ఢిల్లీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఆరేళ్లుగా నౌషాద్ త్యాగి మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్, బులంద్షహర్, మధుర, సంభాల్, ముజఫర్నగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అతడు వంచన పర్వం సాగించినట్టు తెలిపారు. అంతేకాదు పోలీసు యూనిఫాం ధరించి జనాన్ని బెదిరించి డబ్బులు గుంజేవాడని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తన మోసపూరిత చర్యలకు ఉపయోగించిన యూనిఫామ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దొరికాడిలా..ముజఫర్ నగర్లో దుకాణం నడుపుతున్న ఒక వితంతువును త్యాగి వలలో వేసుకోవడంతో ఈ దురాగతం బయటపడింది. తనను రాహుల్ త్యాగిగా పరిచయం చేసుకుని, ఆమె దుకాణానికి తరచుగా వెళ్లేవాడు. ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 లక్షల 75 వేల రూపాయలు గుంజాడు. తాకట్టులో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విడిపించేందుకు ఆమెను ఒప్పించాడు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు తప్పించుకోవడానికి చూసేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయట పడింది. అప్పటికే విషయం అర్థమై కొత్త 'తోడు' కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు త్యాగి ఆట కట్టించారు. అతడి మొబైల్ ఫోన్లో అనేక మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. మారు పేర్లతో అతడు తయారు చేయించిన నేమ్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.చదవండి: ఎంత నరకం అనుభవించాడో..ఫ్రెండ్ యూనిఫాంతో మోసాలు..పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్నేహితుడితో ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో నౌషద్ త్యాగి నివసించేవాడు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అతడి ఫ్రెండ్ మధ్యప్రదేశ్కు వెళ్లాల్సి వచ్చింది. అతడు అనుకోకుండా యూనిఫాం, ఇతర వస్తువులను త్యాగి వద్ద వదిలి వెళ్లాడు. వీటితో నౌషద్ మోసాలకు తెర తీశాడు. ముజఫర్నగర్కు మకాం మార్చి.. తనకు తాను పోలీసు కానిస్టేబుల్గా చెప్పుకుంటూ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు
మౌ: ఉత్తరప్రదేశ్లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది. ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్
-
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
-
వీడియో: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.భారీగా మంటలు వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారం రోహిణిలోని రిథాల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.#WATCH | Uttar Pradesh | Updated visuals: A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. Fire being doused. https://t.co/PJBThX8uSH pic.twitter.com/vPSt1vMoFk— ANI (@ANI) June 27, 2025 -
పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు!
డియోరియో: పోలీసు శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో యూపీ పోలీసు నియామకాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నాలుగు గంటలకు తాను నిద్ర లేవలేనని, ఈ పోలీసు ఉద్యోగం తనకొద్దని చెబుతున్నాడో పోలీసు. ఉత్తరప్రదేశ్లో కొత్తగా కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నియామక లేఖలు అందుకున్నారు. అయితే.. శిక్షణ ఐదవ రోజునే ఓ కానిస్టేబుల్ తన తండ్రితో కలిసి డియోరియాలోని ఎస్పీ కార్యలయానికి వచ్చాడు. ఎస్పీ విక్రాంత్ వీర్ను కల్పించాలని కోరాడు. కారణం ఏమిటని ఎస్పీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ మహేంద్ర కుమార్ అడగగా.. తనకు ఉదయం త్వరగా నిద్రలేవడం అలవాటు లేదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు... ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని, రోజంతా కఠినమైన శిక్షణ తనకు చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. తన కుమారుడికి బీఎడ్ డిగ్రీ కూడా ఉందని, ఆయన ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాడని అభ్యర్థి తండ్రి తెలిపాడు. పోలీసు శిక్షణలో శారీరక కఠినత్వం తన కొడుకును పెద్దగా ఉత్సాహపరచలేదని చెప్పాడు. అయితే, కౌన్సెలింగ్ నిర్వహించిన పీఆర్వో మహేంద్ర కానిస్టేబుల్కు నచ్చజెప్పి ఒప్పించాడు. శిక్షణా సెషన్లలో ఇటువంటి సమస్యలు సహజమని, తరువాత అంతా సాధారణంగా ఉంటుందని చెప్పారు. చివరికి మనసు మార్చుకున్న కానిస్టేబుల్ ఎస్పీని కలవకుండానే శిక్షణకు వెళ్లిపోయాడు. -
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్తో మారిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్!
లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ (33). అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్ గౌతమ్ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు సోమవారం జుగనూపూర్ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చిదాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. "फिल्मों में देखा होगा हीरो शेर से लड़ता है... लेकिन ये रियल है!"लखीमपुर-खीरी के धौरहरा की बबुरी गांव से चौंकाने वाला वीडियोयहां एक ईंट भट्टे में घुस आया तेंदुआ और सामने था एक युवक... न डर, न भागा — सीधा भिड़ गया! तेंदुए ने झपट्टा मारा, युवक ने डटकर मुकाबला कियागांववालों ने… pic.twitter.com/rd0FiBFEGY— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) June 24, 2025 అధికారులపై చిరుత దాడిచిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ రాజేష్ కుమార్ దీక్షిత్,రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్ గౌతమ్తో పాటు ఇక్బాల్ ఖాన్ ,ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ లక్ష్మీపూర్ ఆస్పత్రికి, రేంజర్ చతుర్వేది, పోలీస్ కానిస్టేబుల్ రామ్ సంజీవన్లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. -
ఢిల్లీకి మారనున్న నితీశ్ రాణా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్ప్రదేశ్కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు. దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.ఐపీఎల్లోనూ అదే ప్రదర్శననితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. -
మొదటి రాత్రే భర్తకు షాక్ ఇచ్చిన భార్య
-
నేను అమన్ సొంతం.. నాకు అల్లుడే కావాలి..
లక్నో: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని.. భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. నాటకీయంగా మొదటి రాత్రి వధువు ప్రవర్తనతో వరుడు ఖంగుతిన్నాడు. ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా.. నేను అమన్కు మాత్రమే సొంతం’ అంటూ భర్తకు భార్య వార్నింగ్ ఇచ్చింది. అనంతరం, అర్ధరాత్రి ఇంట్లో నుంచి నవ వధువు పరారీ అయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ప్రయాగ్రాజ్లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. అనంతరం, ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. మే రెండో తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత, కుటుంబ సభ్యులు వారిద్దరూ మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్లగానే.. వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధవు..‘నన్ను ముట్టుకుంటే.. నువ్వు 35 ముక్కలుగా కనిపిస్తావు. నేను అమన్ను ప్రేమిస్తున్నా. నేను అమన్ సొంతం’ అని సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ అనూహ్య ఘటనతో ఖంగుతిన్న నిషాద్కు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. #BREAKING : Touch me and I’ll cut you into 35 pieces’, Bride threatens groom on wedding night in Prayagraj. later jumps wall to escape with lover.After the Sonam murder case, a shocking incident from Prayagraj has surfaced. On the wedding night, a bride threatened her husband… pic.twitter.com/QBGDK9SjEK— upuknews (@upuknews1) June 24, 2025ఈ ఘటన అనంతరం, భర్త నిషాద్ మాట్లాడుతూ..‘నేను గదిలోకి వెళ్లగానే ఆమె నిశ్శబ్దంగా పూర్తిగా ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని కూర్చుని ఉంది. ఆమె నాతో సూటిగా ఒక్కటే చెప్పింది. నన్ను ముట్టుకోవద్దు. నేను అమన్ ఆస్తిని. నువ్వు నన్ను తాకాలని ప్రయత్నిస్త.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను అని బెదిరించింది. నన్ను అమన్ వద్దకు పంపించు అని చెప్పింది. దాంతో, నాకు ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రంతా ఆమె కత్తితో మంచం మీద ఉండగా నేను సోఫాలో కూర్చున్నాను. నిద్రపోయే ధైర్యం చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రవర్తనపై అటు నిషాద్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Prayagraj सुहागरात के दिन घूँघट में सितारा ने पति को चाकू दिखाए और 35 टुकड़ों में काटने की धमकी दी.. 3 दिन तक चाकू और धमकी का सिलसिला चलता रहा.दुल्हन के घर वालों को बुलाया गया और सहमति हुई कि दूल्हा दुल्हन हंसी खुशी रहेंगे, लेकिन सितारा दीवार फांदकर अपने प्रेमी के साथ फरार pic.twitter.com/SPEl9hFsqU— News & Features Network (@newsnetmzn) June 24, 2025 -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025 -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్పూర్ ఉదయ్రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్పాల్కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్జహాన్పూర్కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025బులంద్షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
కుప్పకూలిన హెలికాప్టర్
రుద్రప్రయాగ్/న్యూఢిల్లీ: భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర చేస్తున్న యాత్రికులను ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హిమ సానువుల్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకుని తిరిగొస్తున్న భక్తులు హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు. గౌరీకుండ్ అడవుల్లో ఈ దారుణం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్ సింగ్ రజ్వార్ వివరాలను వెల్లడించారు. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్ ఉదయం 5.19 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ బయల్దేరింది.కాసేపటికే కేదార్ఘాటీలో గౌరీకుండ్, త్రిజుగ్ నారాయణ్ ప్రాంతాల మధ్య అడవిలో కుప్పకూలింది. అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన జంట, వారి రెండేళ్ల పాప, పైలట్తో పాటు బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్ కూడా ఉన్నారు. పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ ఆర్మీలో 15 ఏళ్లపాటు పైలట్గా చేశారు.కేదార్నాథ్లో హెలికాప్టర్లు అటూ ఇటూ ఎత్తైన పర్వతాల మధ్య లోయ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, మేఘావృతమైన పొగమంచు గుండా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ప్రమాదానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు.నెలన్నరలో ఐదో ప్రమాదంఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర మొదలైనప్పటి నుంచి హెలికాప్టర్లు కూలిపోవడం ఐదోసారి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను రెండు రోజులు నిలిపేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. కేదార్నాథ్ లోయలో రాకపోకలు సాగించే అన్ని హెలికాప్టర్ల నాణ్యత, సామర్థ్యాలను తక్షణం సమీక్షించేందుకు అధికారులను పంపుతోంది.దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుంది. ‘‘ఇలాంటి ఘటనల్లో జవాబుదారీతనం పెంచాలి. దర్యాప్తు, భద్రతా ప్రమాణాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్శర్మ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఆంధ్ర జట్టుకు మారిన సీనియర్ రంజీ ప్లేయర్
ఉత్తర్ప్రదేశ్ సీనియర్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ వచ్చే రంజీ సీజన్ 2025-26 కోసం ఆంధ్రప్రదేశ్ జట్టుకు మారాడు. ఈ మేరకు ఇరు జట్లకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. బీసీసీఐ అప్రూవల్ రావడమే తరువాయి. 32 ఏళ్ల సౌరభ్ కుమార్ 2014లో సర్వీసస్ తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసి దశాబ్ద కాలానికి పైగా ఉత్తర్ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సౌరభ్.. ఇప్పటివరకు 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 25 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 324 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటర్ కూడా అయిన సౌరభ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 2374 పరుగులు చేశాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో 2015లో అరంగేట్రం చేసిన సౌరభ్ ఇప్పటివరకు 40 మ్యాచ్లు ఆడి 52 వికెట్లు తీశాడు. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 340 పరుగులు చేశాడు. 2016లో టీ20 అరంగేట్రం చేసిన సౌరభ్.. 33 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి 148 పరుగులు చేశాడు. సౌరభ్ 2017 ఐపీఎల్ సీజన్లో ధోని నేతృత్వంలోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్కు ఎంపికయ్యాడు. అయితే అతనికి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2021 సీజన్లో సౌరభ్ను పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకుంది. ఆ సీజన్లోనూ అదే పరిస్థితి. 2022 ఫిబ్రవరిలో సౌరభ్కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్లో సౌరభ్ నెట్ బౌలర్గా సేవలందించాడు. ఇటీవలికాలంలో సౌరభ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్లకు కూడా నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. బీసీసీఐ అధికారిక అనుమతి లభించాక సౌరభ్ రికీ భుయ్, హనుమ విహారి, కేఎస్ భరత్లతో కలిసి ఆంధ్ర జట్టుకు ఆడతాడు. -
రూ.20 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్లోని మధుర–బృందావన్లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.అలీగఢ్కు చెందిన అభిషేక్ అగర్వాల్ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్ అగర్వాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు. -
పాడైన మిక్చర్ పెడతావా?.. కోర్టు ఉద్యోగికి జడ్జి లీగల్ నోటీసులు
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని కూడా శిక్ష విధించగలరు.. నోటీసు ఇవ్వగలరు. పాపం ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో ఇలాగే ఓ కోర్టు అటెండర్ తనకు తాజా స్నాక్స్ పెట్టలేదని.. చెడిపోయిన మిక్చర్ ఇచ్చాడన్న కారణంతో సదరు జడ్జి కోపానికి వచ్చి ఏకంగా ఆ ఉద్యోగికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి నాలుగురోజుల క్రితం మధ్యాహ్న విరామ సమయంలో, గోండాలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో కలిశారు. వారిద్దరూ కాసేపు ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అతిథికి చాయ్ బిస్కెట్స్ అందించాలని కోర్టు అటెండర్ ను సెషన్స్ జడ్జి చెప్పారు.అయితే పాపం ఆ ఉద్యోగి కేవలం చాయ్ తీసుకొచ్చాడు. దీంతో జడ్జిగారు కోపంతో బిస్కెట్స్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ అటెండర్ పరుగెత్తుకువెళ్లి బిస్కెట్స్ బదులు దాల్మోత్ అనే మిక్చర్ లాంటిది తెచ్చి ఇచ్చాడు. అయితే అది నాణ్యత లేకపోగా చెడిపోయిన వాసనా వచ్చింది. దీంతో జడ్జిగారికి చిర్రెత్తుకొచ్చింది.. వెంటనే టింగ్ టింగ్ అని బెల్లు కొట్టి టైపిస్టును పిలిచి ఈ అటెండర్ నాకు సరిగా స్నాక్స్ ఇవ్వలేదు.. ముందు ఆయనకు నోటీస్ టైప్ చేసివ్వు.. అయన దానికి సమాధానం ఇచ్చుకుంటాడో ఉద్యోగం మనుకుంటాడో చూద్దాం అని హుకుం జారే చేసారు. అయన ఆదేశించిన మరుక్షణం ఉద్యోగి పేరిట నోటీస్ సిద్ధమైంది. ఇంతకూ ఆ నోటీసులో ఏముందంటే..“నేను బిస్కెట్లు తీసుకురమ్మన్నాను. కానీ నీవు బిస్కెట్లు తీసుకురాకుండా, బదులుగా చెడిపోయిన దాల్మోత్ను సర్వ్ చేసావు. అయితే, రెండు డబ్బాల్లో మంచి నాణ్యత గల బిస్కెట్లు క్యాబినెట్లో సిద్ధంగా ఉండగా కూడా, నీవు అవన్నీ విస్మరించి, బయటపడేయాల్సిన స్థితిలో ఉన్న దాల్మోత్ను ఇచ్చావు. ఇది గౌరవానికి భంగం కలిగించే చర్యగా, తీవ్రమైన నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.. అయ్యో జడ్జిగారికి కోపం వస్తే ఏమవుతుందో చూసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు-సిమ్మాదిరప్పన్న -
రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్
ప్రయాగ్రాజ్: సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా, బలంగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ దేశం స్థిరంగా నిలిచి ఉందని, ఆ క్రెడిట్ రాజ్యాంగానికే దక్కుతుందని స్పష్టంచేశారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ చాంబర్స్, మల్టి–లెవెల్ పార్కింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని రూపొందించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమరి్పంచిన సమయంలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నాయని కొందరు, ఏకీకృతంగా ఉందని మరికొందరు చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం పూర్తి సమాఖ్యం కాదు, పూర్తి ఏకీకృతం కాదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బదులిచ్చినట్లు తెలిపారు. యుద్ధం, శాంతితోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉంచే రాజ్యాంగం మనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్వర్ణ రథానికి రెండు చక్రాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమనత్వాన్ని తీసుకురావడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కృషి చేశాయని ఉద్ఘాటించారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయం చేకూర్చడం మన ప్రాథమిక విధి అని న్యాయమూర్తులు, న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఆ ఆఖరి వ్యక్తిదాకా చేరుకోవాలని సూచించారు. భూసంస్కరణలతో ఎంతోమందికి మేలు జరిగిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. భూస్వాముల నుంచి భూములు పేదలకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. భూసంస్కరణ చట్టాలను ఎంతోమంది కోర్టుల్లో సవాలు చేశారని వెల్లడించారు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ జరిగితే.. ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కు ఉన్నప్పటికీ.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని 1973లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలే ఆత్మ అని పేర్కొంటూ, రాజ్యాంగ స్వర్ణ రథానికి ఇవి రెండు చక్రాలు అని వ్యాఖ్యానించారు. ఒక్క చక్రాన్ని ఆపినా మొత్తం రథం ఆగిపోతుందన్నారు. బార్, బెంచ్ అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని జస్టిస్ గవాయ్ స్పష్టంచేశారు. బార్, బెంచ్ కలిసికట్టుగా పనిచేయకపోతే రాజ్యాంగ రథం ముందకు సాగదని చెప్పారు. -
‘వారికి నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టాం’
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టామన్నారు మోదీ. ఈ రోజు(శుక్రవారం) యూపీలోని కాన్పూర్ పర్యటనలో భాగంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ఆపరేషన్ సిందూర్.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. బ్రహ్మోస్ క్షిపణి తరహా రక్షణ వ్యవస్థ కల్గిన మనదేశ సామర్థ్యంతో పాక్ ను చావుదెబ్బ కొట్టాం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ మూలాల్లోకి పోయి మరీ విధ్వంసం సృష్టించాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగంతో పాక్ కు ఊపిరి సలపలేదు. ఇది భారత్ దేశ శత్రువులకు ఒక హెచ్చరిక లాంటిది. మమ్మల్ని తక్కువ అంచనా వేసే వారికి కూడా ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఆరంభం మాత్రమే.. ఇది ఇంకా ముగిసిపోలేదు. దీన్ని మరిచిపోవద్దు’ అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ పాత కాలంలో రాష్ట్ర, రాష్ట్రేతర సంస్థల మధ్య తేడాను చూపించే ఆట ఇకపై పనిచేయదు’ అని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. -
ముక్కు కొరికేశాడు
కాన్పూర్: అపార్ట్మెంట్లో తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరెవరిదో కారు నిలిపి ఉండటం చూసి పట్టరాని కోపంతో ఓ వ్యక్తి ఆ అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ ముక్కును రక్తమోడేలా కొరికేశాడు. ఈ అనూహ్యపరిణామం ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో జరిగింది. బాధితుడు రూపేంద్ర సింగ్ యాదవ్ కుమారుడు ప్రశాంత్, కుమార్తె ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్ శివారు నారామవూ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్లో క్షితిజ్ మిశ్రా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఆదివారం గుర్తు తెలియని కారు ఉండటంతో మిశ్రా వెంటనే సొసైటీకి ఫిర్యాదుచేశాడు. సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ యాదవ్ అదేరోజు సాయంత్రం మిశ్రా దగ్గరకు వచ్చాడు. వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులకు చెప్పానని, కారు ఎవరిదో ఆరాతీసి వెంటనే మీ స్థలం నుంచి తీయిస్తానని మిశ్రాకు నచ్చజెప్పారు. అయినాసరే ఏమాత్రం వినిపించుకోని మిశ్రా కోపంతో యాదవ్పై పలుమార్లు చేయిచేసుకున్నారు. తర్వాత యాదవ్ మెడను గట్టిగా పట్టుకుని ముక్కు కొరికేశాడు. దీంతో రక్తం ధారలా కారింది. రక్తమోడుతున్న యాదవ్ను ఆయన కుటుంబసభ్యులు దగ్గర్లోని రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఆగమేఘాల మీద ఆయనను ఢిల్లీకి తరలించారు. ‘‘ ప్రస్తుతం యాదవ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తే మిశ్రాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తాం’’ అని కళ్యాణ్పూర్ ఏసీపీ అభిషేక్ పాండే చెప్పారు. ‘‘ రక్తమొచ్చేలా కొరికిన కోపిష్టిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు’’ అని బాధితుడి కుమార్తె ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుగా ఎలాంటి ఫిర్యాదు అందని కారణంగానే మిశ్రాను విడిచిపెట్టామని, ఇకపై ఎఫ్ఐఆర్ ప్రకారం నడుచుకుంటామని ఏసీపీ చెప్పారు. -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తా
మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువ లేదు. చిన్న వయసులోనే అత్యద్బుతమైన నైపుణ్యంతో అబ్బుర పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా. మహా మహా నిపుణులే కనిపెట్టలేని బగ్ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి Wi-Fi ని హ్యాక్ చేసి దానితో ఆడుకునే ఆ పిల్లవాడు, నేడు NASA వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్సైట్ను సైబర్ దాడుల నుండి రక్షించాడు కాన్పూర్కు చెందిన యువరాజ్ గుప్తా (Yuvraj Gupta). తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.BREAKING NEWS 🚨 📢 14 year old Yuvraj Gupta, who lives in Kanpur, Uttar Pradesh, has done a great feat. Hesaved the website of American space agency NASA from hackers.NASA has included him in the 'Hall of Fame' and also given him a letter of recognition. pic.twitter.com/GzTbgFB8GN— News Arena India (@NewsArenaIndia) May 25, 2025 fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను NASA సబ్ డొమైన్లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది.కాన్పూర్లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టువదలకుండా ఎథికల్ హ్యాకింగ్లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం.యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి. యువరాజ్ కు ల్యాప్ టాప్ ఇవ్వడానికి, అతని సోదరి స్కాలర్షిప్ , అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టంను సమకూర్చుకున్నాడట. దేశానికి డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటోంది యువరాజ్ కుటుంబం.


