breaking news
Uttar Pradesh
-
గంగా నదిలో బిర్యానీతో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026 -
వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026 -
‘కారుణ్య మరణానికి’ ఊపిరి!
అచేతన లేదా అర్ధ చేతన స్థితిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ మనుగడ సాగించే రోగుల విషయంలో ఏం చేయాలన్న అంశంలో స్పష్టత కొరవడిన నేపథ్యంలో బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా అనే యువకుడి పరోక్ష కారుణ్య మరణానికి అనుమతిస్తూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చావు బతుకుల పొలిమేరల్లో కొట్టుమిట్టాడేవారి విషయంలో ఏం చేయాలన్న మీమాంస మన దేశానికే పరిమితమైనది కాదు. దాదాపు అన్ని సమాజాల్లోనూ దశాబ్దాలుగా ఎడతెగని చర్చ కొనసాగుతోంది. 27 దేశాలు మాత్రమే కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ కొన్ని మొగ్గు చూపగా, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ మరికొన్ని అనుమతించాయి. 1973లో ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్న అరుణా రామచంద్ర శాన్బాగ్ అనే యువతి లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్లిన ఉదంతం అనంతరం ఈ విషయమై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమెను నాలుగు దశాబ్దాల పాటు ఆసుపత్రి సహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2009లో ఆమె స్నేహితురాలు పింకీ విరానీ... అరుణా శాన్బాగ్కు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతినీయటం రాజ్యాంగబద్ధమేనని 2011లో న్యాయస్థానం అభిప్రాయపడింది. కానీ రోగి తరఫు బంధువులు కోరనందున ఈ తీర్పు బాధితురాలికి వర్తించబోదని తెలిపింది. ఎన్నో పరిమితులు విధించినా 2011 నాటి తీర్పు ఎన్నదగింది. అయితే 2018లో ‘కామన్ కాజ్’ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ‘జీవించే హక్కు’కు పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ‘హుందాగా మరణించే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని తెలిపింది. దీనికోసం ఒక చట్టం చేయాలని కేంద్రానికి సూచిస్తూ, ఈలోగా వర్తింప జేయటం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కానీ ఇప్పటివరకూ ఆ చట్టం జాడలేదు. ఆచరణలో ఆ మార్గదర్శకాల వల్ల ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేశాక 2023లో అవి మరింత సరళమయ్యాయి. కానీ వాటి అమలుకు అనుమతించటం ఇదే ప్రథమం.పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతించటం విషయంలో నైతిక పరమైన సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం. ఎందుకంటే గుండె, లేదా మెదడు ‘సజీవంగా’ ఉన్నట్టు వైద్యులు చెప్పాక చూస్తూ చూస్తూ అలాంటి రోగి మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఏ క్షణమైనా కోలుకోవచ్చని ఆశిస్తారు. ప్రస్తుత కేసులో రోగి 13 ఏళ్లుగా అలాంటి స్థితిలోనే కొనసాగాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించాక అతని తల్లితండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తీర్పు వెలువరించినప్పుడు స్వయానా న్యాయమూర్తే కంటతడి పెట్టారంటే ఆయనలో సాగిన అంతస్సంఘర్షణ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కన్నవారి గురించి చెప్పేదేముంది? తీర్పు వెలువరించిన రోజే మీడియాలో యూపీ ఉదంతం ఒకటి వచ్చింది. దాన్ని గమనిస్తే ఈ తరహా రోగుల స్థితిని అంచనా వేయటం ఎంత సంక్లిష్టమో తెలుస్తుంది. ‘బ్రెయిన్ డెడ్’ అయి కోమాలోకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ కొద్ది నిమిషాల్లోనే మరణిస్తుందని వైద్యులు చెప్పటంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని వెనక్కి తీసుకెళ్తుండగా రోడ్డుపై లోతైన గుంతలో అంబులెన్స్ చిక్కుకుంది. దాన్ని కదల్చటానికి ఇంజిన్ను హెచ్చించటంతో వాహనం కుదుపునకులోనై ఆ మహిళలో శ్వాస సాధారణ స్థాయికి చేరి, మాట్లాడటం మొదలైంది. అందుకే అత్యంత జాగరూకత అవసరం. ‘మరణించడానికి గల హక్కు’ కాస్తా కొందరు స్వప్రయోజనపరుల వల్ల ‘బాధ్యత’గా మారిపోయే ప్రమాదం ఉంది. ఆస్తులపై కన్నేసి, లేదా చాకిరీ తప్పించుకునేందుకు అంతిమ దశలో ఉండేవారి చేత బలవంతంగా కారుణ్య మరణానికి అనుమతించాలన్న పత్రాలపై సంతకాలు చేయించే ప్రబుద్ధులు కూడా అక్కడక్కడ ఉంటారు. కనుక అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే అనుమతి మంజూరు చేయటం అవసరం. -
అరుదైన ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసా?
మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్ ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్ రైల్వే స్టేషన్లో నది ఒడ్డు వరకే ట్రాక్ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు. -
వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్లో డెడ్బాడీ, షాకైన ఓనర్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, నాలుగు రోజులుగా మూసి ఉన్న వెజ్ బిర్యానీ దుకాణం ఫ్రీజర్లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలోని GCRG కళాశాల ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణ యజమాని అజయ్ పాల్ కొనుగోలు కోసం బైటికి వెళ్లాడు నాలుగు రోజుల తర్వాత తిరిగి షాప్కు వచ్చి, డీప్ ఫ్రీజర్ను చెక్ తనిఖీ చేస్తుండగా లోపల డెడ్ బాడీని గుర్తించి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలుసుai మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం మిత్తం తరలించారు.మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ,ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని బక్షి కా తలాబ్ (BKT)లోని కిషున్పూర్ గ్రామానికి చెందిన విజయ్ పాల్గా గుర్తించారు. ఈ దుకాణం మూడు వైపులా టిన్ షీట్లతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణం అని, సరైన గేట్ లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం తీవ్ర గాయాలైన గుర్తులు లేవు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నామని వెల్లడించారు.పోస్ట్మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: లిఫ్ట్లో షాకింగ్ యాక్సిడెంట్.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!ప్రాథమిక దర్యాప్తులో అతని చెప్పుల్లో ఒకటి కళాశాలకు దగ్గరగా ఉన్న రోడ్డు మూలన, మరొకటి మరొకటి దుకాణం లోపల గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మృతుడు దుకాణంలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించాడు, చివరిగా ఎప్పుడు తెరిచారు అనే విషయాలను కూపీ లాగుతున్నారు.ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఢిల్లీ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. హింస జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచనలు చేసింది.వివరాల మేరకు ఇరాన్పై దాడుల నేపథ్యంలో నిన్న(ఆదివారం) జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్, యూపీలోని లక్నోలో షియా ముస్లింలు నిరసనలకు దిగారు. దీంతో, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్లో నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఇరాన్ రాడికల్ మతబోధకుల రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి పెట్టాలని హోంశాఖ.. రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లేఖలు రాసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ట్రాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 15 లక్షల షియా ముస్లింలు ఉన్న కశ్మీర్లోని శ్రీనగర్, బుద్గాం, బందిపొరా, అనంత్నాగ్, పుల్వామాలో షియాలు గుండెల మీద బాదుకొంటూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇరాన్లోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరారు. యూపీలోని లక్నో, అజ్మీర్లోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 1986లో ఖమేనీ సందర్శించిన ఓ గ్రామంలో స్వచ్చందంగా దుకాణదారులు షాపులను మూసివేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని గ్రామస్థులు నిర్ణయించారు. దీంతో, పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. -
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్కు చెందిన ఆర్ఎంపీగా పనిచేసే విసర్జీత్గా గుర్తించారు. ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్కు చెందిన అమీనా ఖాతూన్తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్లోని కటిహార్ ప్రాంతం. -
ఇండో–నేపాల్ సరిహద్దు మూసివేత
బహ్రైచ్(యూపీ): నేపాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మార్చి 2 అర్ధరాత్రి నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత–నేపాల్ సరిహద్దు మూసివేయనున్నారు. ఈ మేరకు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత్కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్ పోస్టులు మార్చి 2 నుంచి 5వరకు మూసివేయనున్నట్లు తెలిపింది.ఈ కాలంలో వస్తువుల దిగుమతులు, ఎగుమతులు కూడా నిలపివేస్తారు. అత్యవసరమైన మందులు, కీలక వస్తువుల రవాణా మాత్రం కొనసాగనుందని సశస్త్ర సీమా బల్ 42వ బెటాలియన్ కమాండెంట్ గంగా సింగ్ ఉదావత్ తెలిపారు. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని రెండు దేశాల పౌరులకు సూచించారు. ఉపాధి, వ్యాపార ప్రయోజనాల కోసం భారత్లో ఉన్న నేపాలీ ఓటర్లు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, అవసరమైన వస్తువులను మాత్రం భద్రతా దళాల పర్యవేక్షణలో సరిహద్దు దాటి అనుమతించనున్నట్లు తెలిపారు. -
పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో
ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.In a chilling daylight killing in Meerut's Ramraj market, Pradeep Dhiman allegedly shot dead Sunil Gaba — his wife Poonam's lover — with multiple bullets (reports cite 3 shots from different bores: .12, .32 & .315) yesterday. Poonam had eloped with Gaba ~1.5 years ago, leaving… pic.twitter.com/AkhR2gKCSo— Megh Updates 🚨™ (@MeghUpdates) February 26, 2026 ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్సైకిల్పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .ఇదీ చదవండి: ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
పెళ్లయిన కొన్ని గంటలకే.. సినిమా తరహా ట్విస్ట్..
హమీర్పూర్: ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో సినిమా తరహా ట్విస్ట్లతో ఓ ఘటన జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే వధూవరులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉండటానికి వధువు నిరాకరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం, తక్షణమే విడాకులు తీసుకోవాలని దంపతులు నిర్ణయించుకున్నారు.అసలేం జరిగిందంటే.. పెళ్లి వేడుకలు అనంతరం వధువు మిథిలేష్ కుమారి తన అత్తవారింటికి చేరుకుంది. శోభనం రాత్రి దంపతులిద్దరూ గదిలోకి వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త ధరమ్ సింగ్ కుష్వాహాతో ఉండటానికి నిరాకరించింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిపించారని మిథిలేష్ పేర్కొంది. తన కుటుంబ సభ్యులు తనను కొట్టి, బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారంటూ భర్తకు వివరించింది.వరుడు ధరమ్ సింగ్ కుష్వాహా స్పందిస్తూ.. వధువు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేదన్నాడు. అలా చేసి ఉంటే ఇరు కుటుంబాలకు ఈ అవమానం తప్పేదని.. అసలు పెళ్లే జరిగేది కాదన్నాడు. ఇరు కుటుంబాలు హమీర్పూర్లోని రాత్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాయి. పోలీసులు ఇరు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వధువు మిథిలేష్ తన నిర్ణయం మార్చుకోలేదు. తన భర్తతో ఉండటం ససేమిరా అంటూ స్పష్టం చేసింది.పోలీసులు మాట్లాడుతూ.. ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని.. కాపురానికి వెళ్లడానికి వధువు ఇష్టపడటం లేదని.. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, ఆ జంట తక్షణమే విడాకులు తీసుకున్నారు. వధువు తన కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. -
శంకరాచార్య కేసులో మరో కీలక పరిణామం
ఉత్తరప్రదేశ్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితులైన చిన్నారుల మెడికల్ రిపోర్ట్ విడుదలైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మైనర్లపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ప్రయాగ్రాజ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యుల బృందం బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సీల్డ్ కవర్లో నివేదికను గురువారం దర్యాప్తు అధికారికి అందజేశారు.ఈ నివేదికను రేపు (శుక్రవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే అవిముక్తేశ్వరానందపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ కేసు వివరాలను వెల్లడించలేమని అధికారులు తెలిపారు.శంకరాచార్యపై ఫిర్యాదు చేసిన జగద్గురు రాంభద్రాచార్య శిష్యుడు అశుతోష్ మహరాజ్ మాట్లాడుతూ, ఈ కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మెడికల్ పరీక్షల్లో చిన్నారులపై లైంగికదాడి జరిగినట్లు తేలిందని.. త్వరలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బాధిత విద్యార్థి మొదటిసారిగా 'ఆజ్ తక్' మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తాను చదువుకోవడానికి ఆశ్రమానికి వెళ్లానని.. అక్కడ తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇతర పిల్లలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు.కాగా, బుధవారం అర్ధరాత్రి శంకరాచార్య తరపు న్యాయవాది మొబైల్కు బెదిరింపు కాల్ వచ్చింది. వారణాసి కోర్టు సముదాయాన్ని బాంబుతో పేల్చివేస్తామని, న్యాయవాదిని కూడా చంపేస్తామని ఆ సందేశంలో హెచ్చరించినట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా ప్రయాగ్రాజ్ పోలీసులు వారణాసిలో మోహరించారు. కాగా, ఉత్తరప్రదేశ్లో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితులలపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. -
చదువుల బడిలో చిరుత
గాజియాబాద్: పాఠాలు వినేందుకు విద్యార్థులు రావాల్సిన పాఠశాలకు వాళ్ల కంటే ముందే ఒక చిరుతపులి రావడంతో పాఠశాల యాజమాన్యం అవాక్కైంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దానిని పట్టుకునేందుకు కృషిచేసింది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లోని గోవిందాపురం ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాఠశాల వైపుగా ఒక చిరుత రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయడం, వాళ్లు వెంటనే బోను, మత్తుమందు ఇంజెక్షన్లతో అటవీశాఖ సిబ్బందిని వెంటేసుకుని రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఎట్టకేలకు చిరుతను పాఠశాల టాయిలెట్ గదిలో గుర్తించారు. గది గోడకు నాలుగు అడుగుల రంధ్రం చేసి అందులోంచే మత్తు ఇంజెక్షన్ను చిరుత మీదకు ప్రయోగించి అది నిద్రపోయేలా చేశారు. బోనులోకి ఎక్కించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సహరన్పూర్లోని శివాలిక్ కొండల్లో చిరుతను వదిలేస్తామని సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ సలోని చెప్పారు. -
ఉత్తరప్రదేశ్లో ‘జల సత్యాగ్రహం’
సోన్భద్ర: మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం చరిత్ర ప్రసిద్ధం. అదే కోవలో ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సిందూరియా గ్రామ ప్రజలు ఇప్పుడు ‘జల్ సత్యాగ్రహ’ చేపట్టారు. గ్రామంలో తాగునీటి కొరత, ఇంటింటికీ నల్లా నీరు పథకంలో జాప్యానికి నిరసనగా ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదివారం సోన్ నది ఒడ్డున పెద్ద సంఖ్యలో ‘జల్ సత్యాగ్రహం’ నిర్వహించారు. వేసవి మొదలైనా కాకముందే నీటి సంక్షోభం తీవ్రతరమైందని వాళ్లు వాపోయారు. చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయని, తాగునీటి కోసం సుదూరాల దాకా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి నల్లా ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఆశించాం. కానీ ఇప్పటికే కొరత మొదలైంది. రెండు మూడేళ్ల కిందట రోడ్లు తవ్వి పైప్లైన్లు వేశారు. ఇళ్లలోకి మాత్రం నల్లాలు ఏర్పాటు చేయలేదు. దాంతో మేం కలుషితమైన నదీ జలాలే వాడుకోవాల్సి వస్తోంది’’ అంటూ గ్రామస్తులు వాపోయారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చకపోతే లఖ్నవూకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. అయితే 90 శాతం గ్రామాల్లో నీటి కనెక్షన్లు ఏర్పాటు చేశామని యూపీ జల్ నిగమ్ ఈఈ అరుణ్ సింగ్ తెలిపారు. ‘‘కొన్ని ప్రాజెక్టుల పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో సాధారణ సరఫరా ప్రారంభమవుతుంది’’ అని వెల్లడించారు. -
కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్ ఏంటంటే..
కొన్ని ఘటనలు చాలా సిల్లీగా ఉంటాయి. మనుషులు కూడా..చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడటం వల్లనో అపార్థం చేసుకోవడం వల్లనో.. క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి..చంపుకునేంత వరకు వెళ్లిపోతోంది పరిస్థితి. ఇక్కడ కూడా అచ్చం అలానే చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సరదాగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం జస్ట్ ఓ కుక్క కారణంగా ఘర్షణ వాతావరణంగా మారి ఏకంగా పెళ్లే ఆపేసేందుకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన వివాహ వేడుక కుక్క కారణంగా హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దివంగత సునీల్ కుమార్ , సరోజ్ గుప్తాల కుమార్తె తాన్య కేషర్వాణి, దివంగత రాకేష్ చందా, బాబ్లీదేవి కుమారుడు సుమిత్లు ఇంటి నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల ఫిబ్రవరి 18న ఫతేపూర్ అధికారిక వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. పెళ్లి తంతులో భాగంగా బంధువులు, శ్రేయోభిలాషులు నడుమ తెల్లవారుజామున 4 గంటలకు ఆభరణాలు సమర్పించే ఆచారం సాగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబం పెంపుడు కుక్క దూకుడుగా మొరగడం ప్రారంభించింది. విసుగుతో వరుడు కుటుంబానికి చెందిన యువకుడు ఆ కుక్కను కొట్టడంతో మొదలైన గొడవ..చూస్తుండగానే క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. ఈ ఉద్రిక్త ఘటనలో మహిళలతో సహా సుమారు ఎనిమిది మంది దాక తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరుఫు కుటుంబంలో ముగ్గురి తలలకు తీవ్ర గాయలయ్యినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్టేషన్కు చేరుకున్నాయి. అక్కడ వివాహాం అధికారికంగా రద్దు చేశారు. ట్విస్ట్ ఏంటంటే వధువు తాన్య దీన్ని నిరాకరించింది. తమ పెళ్లి ఎప్పుడో జనవరిలో అయిపోయిందని, ఇది అధికారికంగా నిర్వహించిన తంతు అని స్పష్టం చేసింది. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ తన భర్తతో కలసి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి మరి వివరణ ఇవ్వడం విశేషం.(చదవండి: కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!) -
అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?
మీరట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. సొంత దేశాన్ని కించపరుస్తారా? ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయమా? కాంగ్రెస్ తీరుతో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి. మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఢిల్లీ–మీరట్ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్ కాలేఖాన్, న్యూ అశోక్నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి శతాబ్దినగర్ స్టేషన్ దాకా మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్ సౌత్ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. -
దంపతులకు మరణ శిక్ష.. యూపీ కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైనర్ బాలురపై (3 ఏళ్ల చిన్నారులతో సహా) దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.అంతేకాకుండా, 2 లక్షలకు పైగా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను దాదాపు 47 దేశాలకు ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మిశ్రా, నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునాదులనే కదిలించిందని పేర్కొన్నారు. బాధితులైన 33 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది. -
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
సుల్తాన్పూర్: 2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్లోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మకు రాహుల్ తెలియజేశారు. తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతియాలన్నదే ప్రత్యర్థుల పన్నాగమని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనపై వచి్చన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఏనాడూ ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. మాటలతో ఇతరుల పరువుకు నష్టం కలిగించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ఫిర్యాదు చేశారని ఆక్షేపించారు. దాంతో న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ‘మీ వాదనను బలపర్చే సాక్ష్యాధారాలు సమర్పించండి’అంటూ రాహుల్కు సూచించింది. కోర్టు నుంచి రాహుల్ బయటకు వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ వారికి అభివాదం చేశారు. తమ నాయకుడి రాక సందర్బంగా సుల్తాన్పూర్లో కాంగ్రెస్ నేతలు ‘సత్యమేవ జయతే’అని రాసి ఉన్న పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఏమిటీ కేసు? రాహుల్ గాంధీ 2018లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో నిందితుడైన అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నీతి నిజాయతీ అంటూ కబుర్లు చెబుతోందని విమర్శించారు. దీనిపై సుల్తాన్పూర్కు చెందిన జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రాహుల్పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాహుల్పై పరువు నష్టం కేసు నమోదయ్యింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కోర్టు ఎదుట లొంగిపోయారు. రూ.25,000 పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. -
కుక్క కోసం తలలు పగిలేలా కొట్టుకున్నారు, ప్రేమ పెళ్లి రద్దు!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కను కొట్టిన కారణంతో రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా రెండేళ్ల ప్రేమను, బంధాన్ని కాదనుకుంది వధువు. అసలు ఏమైంది అంటే..ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిజానికి అప్పటికే రెండేళ్లుకుగా ప్రేమలో ఉన్న సుమీత్, తాన్య జంట పారిపోయి కాన్పూర్లోని ఆర్య సమాజ్లో పెళ్లిచేసుకున్నారు. అయితే విషయం తెలిసిన పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి, ఫతేపూర్లో బంధువుల సమక్షంలో మరోసారి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.పెళ్లి గ్రాండ్గా నిర్వహించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. బారాత్, జైమాల వేడుక సంతోషంగా పూర్తైంది. ఇక తెల్లవారుజామున ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రగడ మొదలైంది. పూజామందిరంవద్ద ఆభరణాల సమర్పణ ఆచారాలు జరుగుతుండగా, వధువు పెంపుడు కుక్క అవిశ్రాంతంగా మొరగడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన వరుడు తరపు బందువు ఒకరు ఆ కక్కను కొట్టాడు. దీంతో వధువు, ఇతర బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది. బంధువులంతా కర్రలు, కుర్చీలతో తలలు పగిలేలా కొట్టుకోవడంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. దీంతో వధువు వైపు ముగ్గురు, వరుడి వైపు ఇద్దరు గాయపడ్డారు. వధువు వేలు కూడా విరిగింది.ఇదీ చదవండి: గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్ ఈ విషయం ఖాగా పోలీస్ స్టేషన్కు చేరడంతో అధికారులు జోక్యం చేసు కున్నారు. గాయపడిన వారిని సెంట్రల్ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స చేసి, ప్రయాగ్రాజ్కు తిరిగి పంపించారు. అనంతరం ఇరు వర్గాల సీనియర్ సభ్యుల మధ్య చర్చించారు. ఈ క్రమంలో వధువు తాను ఇకపై తానీ పెళ్లిని కొనసాగించ లేనని వధువు స్పష్టం చేసింది. చివరికి కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చు కునేందుకు రాజీ కుదిరింది. ఏ పక్షమూ అధికారికంగా ఫిర్యాదేమీ లేదు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
గోరఖ్పూర్లో ఘోరం
గోరఖ్పూర్(యూపీ): ఉత్తరప్రదేశ్లోని ఓ ఆస్పత్రిలో దారుణ నిర్లక్ష్యం ‘వెలుగు’లోకి రాగా చూపు ‘చీకట్లో’కి వెళ్లింది. కంటి వైద్య శిబిరంలో నేత్రాలకు కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న పలువురు కళ్లను కోల్పోయిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పట్టణంలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీన 30 మంది రోగులకు కాటరాక్ట్ సర్జరీ చేయగా వారిలో 18 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరుకోవడంతో తప్పని పరిస్థితుల్లో వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్యులు తొమ్మిది మంది రోగుల కళ్లను తొలగించాల్సి వచి్చంది. మరో తొమ్మిది మంది రోగులు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఆపరేషన్ థియేటర్లో, శస్త్ర చికిత్స విధానంలో పూర్తి నిర్లక్ష్యపూరిత వైఖరికి గోరఖ్పూర్లోని న్యూ రాజేశ్ హైటెక్ హాస్పిటల్ కేంద్రబిందువుగా మారింది. విషయం తెల్సి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెనువెంటనే ఆస్పత్రిని సీజ్చేయించింది. కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తును పోలీస్, వైద్యవిభాగాలు వేర్వేరుగా ఆరంభించాయి. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజి్రస్టేట్ దీపక్ మీనా చెప్పారు. ‘‘కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని తేలితే వాళ్ల లైసెన్స్లు రద్దుచేస్తాం. ఇది చాలా తీవ్రమైన అంశం. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’’అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్ ఝా వెల్లడించారు. బాధితులందరి ‘కల్చర్’రిపోర్ట్లను ప్రభుత్వ వైద్యులు సరిచూశారు. అందరికీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందనే ఆశతోనే దాదాపు 30 మంది ఒకేసారి ఈ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆగని రక్తం.. ‘‘ఆపరేషన్ అయిన 24 గంటల తర్వాత కంటి నుంచి రక్తం ధారగా కారడం మొదలైంది. వెంటనే మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి్పంచాం. మందులు ఇస్తే నొప్పి తగ్గిందికానీ రక్తం కారడం ఆగలేదు. చివరకు వేరే ఆస్పత్రిలో చేర్పించాం’’అని ఒక బాధితుని కుటుంబసభ్యుడు ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు బాధితులు విపరీతమైన నొప్పి, బాధతో ఢిల్లీ, లక్నో, వారణాసి ఆస్పత్రుల్లో చేరారు. ఇన్ఫెక్షన్ దారుణంగా సోకడంతో తప్పని పరిస్థితుల్లో కళ్లను తొలగించాల్సి వచ్చిందని ఆయా వేర్వేరు ఆస్పత్రుల వైద్యులు వివరణ ఇచ్చారు. ‘‘వారణాసిలో మా అమ్మకు ఒక కంటిని తొలగించాం. మరో కంటికీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని భయంగా ఉంది. రెండో కన్నూ సరిగా కని్పంచట్లేదు. ఏదైనా జరిగితే మొదటి ఆస్పత్రిపై కేసు వేస్తా’’అని రాధౌరీ ప్రాంతానికి చెందిన శంకరావతి కుమారుడు ఆగ్రహంగా మాట్లాడారు. -
క్రికెట్ మైదానంలో పెను విషాదం
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ ఫీల్డ్ అంపైర్ ప్రాణాలు కోల్పోయాడు. 15-20 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కాన్పూర్లోని (ఉత్తర్ప్రదేశ్) శుక్లగంజ్ సప్రూ మైదానంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా అండర్-13 మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అంపైరింగ్ చేస్తున్న 65 ఏళ్ల మాణిక్ గుప్తాను తేనెటీగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తేనెటీగలు అంపైర్ గుప్తాతో పాటు మరో ఫీల్డ్ అంపైర్ జగదీశ్ శర్మపై కూడా దాడి చేశాయి. అలాగే మ్యాచ్ ఆడుతున్న 15–20 మంది ఆటగాళ్లను కూడా చుట్టుముట్టాయి. గుప్తాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో అంపైర్ జగదీశ్ శర్మకు అత్యవసర చికిత్స అందించగా.. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. అస్వస్థతకు గురైన ఆటగాళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.ఊహించిన ఈ ఘటనపై కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్. సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుప్తాను ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా తేనెటీగలు ఆయన ముఖం, శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నాయని ఆయన వాపోయారు. గుప్తాకు స్థానిక క్రికెట్లో అనుభవజ్ఞుడైన అంపైర్గా పేరుంది.తేనెటీగల దాడులు కొత్తేమీ కాదుక్రికెట్లో తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. అయితే భారత్లో ప్రాణనష్టం మాత్రం ఎప్పుడూ సంభవించలేదు. కాన్పూర్ ఘటనే తొలిసారి.గతేడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా కూడా ఇదే తరహాలో తేనెటీగల దాడి జరిగింది. ఆ ఘటనలో పలువురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు.2019లో త్రివేండ్రం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఇండియా ఏ-ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా కూడా తేనెటీగలు దాడి చేశాయి. ఆ సందర్భంలో స్టేడియంలోని చాలామంది ప్రేక్షకులు తేనెటీగల దాడికి గురై అసుపత్రిపాలయ్యారు. -
జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇరుకుటుంబాలు పెళ్లి సందడిలో మునిగిపోయాయి. బందు మిత్రుల ఆనందోత్సాహాల మధ్య పెళ్లిప్రమాణాలు పూర్తయ్యాయి. సరిగ్గా అప్పగింతల తతంగానికి కొన్న క్షణాల ముందు వివాదం మొదలైంది. పరిస్థితి తీవ్రమై వివాహం రద్దైంది. ఇంతకీ ఏమైంది? కట్న కానుకల గొడవా? మర్యాదల తక్కువయ్యాయని అలిగారా? ఏమైంది పదండి తెలుసుకుందాం.యూపీలోని కోఠి థానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం స్థానిక అమ్మాయి, పురే గనై గ్రామంలో నివసించే 22 ఏళ్ల అబ్బాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 13న జరిగే పెళ్లికి బారాత్, వివాహం ఆచారాలు,సాంప్రదాయ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పెళ్లి తంతు అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. అతిథులు ఆతిథ్యాన్ని స్వీకరించి వధూవరులను ఆశీర్వదించాడు. అయితే, శనివారం తెల్లవారుజామున ‘బిదాయి' వేడుకకు ముందు ట్రాన్స్జెండర్ (కిన్నార్) బృందం ఆశీర్వాదం ఆచార 'నెగ్' (బహుమతి) తీసుకోవడానికి వేదికకు చేరుకుంది. వారు కొత్తపెళ్లికొడుకుని గుర్తించడంతో అనుమానం మొదలైంది. వధువు కుటుంబం వాగ్వాదానికి దిగింది. అసలు వరుడు మాగాడా కాదా అని స్పష్టం చేయాలని, వెరిఫికేషన్ కావాలని వధువు బంధువులు పట్టుబట్టారు. దీనికి వరుడు తిరస్కరించి గొడవకు దిగాడు. ఇంతలో వరుడిని తమ సంఘం సభ్యుడే ధృవీకరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వధువు కుటుంబం వివాహాన్ని రద్దు చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅయితే తమ పరువు పోయిందని, రూ. 23 వేలు తీసుకుని మౌనంగా ఉండాలని వరుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది. అలా నవ వధువుతోపాటు, అప్పటిదాకా బాజా భజంత్రీలతో కళకళల్లాడిన పెళ్లి పందిర మూగబోయింది. ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి రావడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు కుటుంబాలను శాంతింపజేశారు. విషయం సున్నితమైంది గనుక, పైగా ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు కనుక ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! -
మేకలకు బర్త్ డే సెలబ్రేషన్
-
కారు మీద కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా, అంటు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. సుమారు 1000 కిలోల బరువున్న హై మాస్ట్ లైటింగ్ స్తంభం ఒకటి కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ దుర్ఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంప్ వద్ద కార్మికులు హై మాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Disturbing video.Lal Bahadur Yadav was driving his car when a pole installed at a petrol pump suddenly collapsed onto his vehicle. He died on the spot.Just yesterday in , a portion of a metro pillar fell onto a busy road, crushing one person to death.How are such fatal… pic.twitter.com/tfv16OD7Ng— Satyendra Kumar Behera (@imskbehera) February 15, 2026ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ (47) తన కారులో నగరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషాద వార్త తెలియగానే పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లైటింగ్ స్తంభం ఏర్పాటు చేస్తున్న సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్గఢ్ ఎస్పీ దీపక్ భూకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇది కూడా చదవండి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ -
దేశంలోనే తొలి ‘గో మ్యూజియం’!
మధుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో దేశంలోనే మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం (జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల) ఏర్పాటు కానుంది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం ఆవుల సాంస్కృతిక, ఆధ్యాతి్మక, శాస్త్రీయన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, గో సంరక్షణపై సమగ్ర అవగాహనను పెంపొందిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన భూమికోసం బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు శైలజాకాంత్ మిశ్రా, ఆగ్రా డివిజనల్ కమిషనర్ నాగేంద్ర ప్రతాప్, జిల్లా కలెక్టర్ సీపీ సింగ్, మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ ఉపాధ్యక్షులు ఎన్ లక్ష్మీ వెటర్నరీ యూనివర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు రూపురేఖలపై చర్చించారు. మ్యూజియంలో సు మారు 100 డిజిటల్, సింబాలిక్ ఆవుల నమూనాలు ప్రదర్శించనున్నట్టు కమిషనర్ నాగేంద్ర ప్రతాప్ తెలిపారు. ఆవు వారసత్వ గొప్పతనం గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కలి్పంచేందుకు దేశంలో అన్ని ప్రధాన ఆవుల జాతులు, అలాగే అంతరించి పోతున్న జాతులు అందులో ఉంటాయన్నారు. ఆవు పాలు, పెరుగు, జున్ను, నెయ్యి వంటి ఉత్పత్తుల ప్రదర్శనతోపాటు, అవి అందించే ఆయుర్వేద ప్రయోజనాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. సందర్శకులకు స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించే ఒక డైరీ పార్లర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్పై విడుదలైనట్టు తెలిపారు. -
తెల్లారితే పెళ్లి : నేరగాడితో పారిపోయిన కానిస్టేబుల్
ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మధ్య జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరుడు సహా బంధువులంతా హతాశులయ్యారు. వధువు కిడ్నాప్ అయ్యిందంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కథ అడ్డం తిరిగింది.ఇద్దరూ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. జోడీ బావుంది అని పెద్దలు వారిద్దరికి ఫిబ్రవరి 8న పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని, మీరట్లోని బహ్సుమా ప్రాంతంలోని అక్బర్పూర్ సదాత్ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సపరివార సమేతంగా వివాహానికి ఆహ్వానిస్తూ బంధువులందరికి వెడ్డింగ్ కార్డ్స్ పంచారు. బంధువులతో సందడిగా ఉంది. సంధ్య చేతులను కాబోయే భర్త పేరుతో మెహందీ తీర్చి దిద్దారు. ముజఫర్ నగర్లోని మీరాపూర్ నుండి వచ్చే వివాహ ఊరేగింపును స్వాగతించడానికి అంతా బిజీగా ఉన్నారు. సరిగ్గా వివాహానికి ముందు రాత్రి పెళ్లి కూతురు 25 ఏళ్ల సంధ్య భరద్వాజ్ మాయమైంది. ఆమె ప్రస్తుతం అలీఘర్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. వరుడు అతుల్ శర్మ ముజఫర్నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వధువు కనిపించకుండా పోవడంతో వధువు తండ్రి అంకిత్ ఠాకూర్ను అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అతను గతంలో (ఫిబ్రవరి 5న) తన కుమార్తెను వివాహం చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని ఫోన్లో బెదిరించాడని శర్మ తన ఫిర్యాదులో హింట్ ఇచ్చాడు. అంకిత్ తన కుమార్తెను బెదిరించి కిడ్నాప్ చేశాడని , ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని తండ్రి ఆరోపించాడు.అసలు సంగతి ఏంటంటే..పోలీసులు ఎనిమిది గంటల్లోనే మీరట్ జిల్లాలోని బక్సర్లో వధువు భరద్వాజ్ను గుర్తించారు. వధువు కిడ్నాప్కు గురికాలేదని ఇష్టపూర్వకంగా ఇల్లు వదిలి ప్రేమికుడు అంకిత్ ఠాకూర్తో వెళ్లిపోయిందని గుర్తించారు.పోలీసుల ప్రకారం గత కొన్నేళ్లుగా భరద్వాజ్ -అంకిత్ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేకపోవడంతో అతని స్వస్థలం ధికోలి గ్రామంలోని ఇంటికి పారిపోయింది. తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసు అధికారి మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లావానియా చెప్పారు. ఇక చేసే దేమీ లేక వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. భరద్వాజ్ను కోర్టు ముందు హాజరుపరుస్తామని సీనియర్ ఎస్పి(గ్రామీణ) అభిజీత్ కుమార్ తెలిపారుఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావాకాగా అంకిత్కు నేర చరిత్ర ఉందని, దోపిడీ, హత్య అభియోగాలతో సహా కనీసం తొమ్మిది కేసులు నమోద య్యాయని పోలీసులు నిర్ధారించారు. గత సంవత్సరం ఒక మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.మరోవైపు తన కూతురు ప్రేమ వ్యవహారం, పెళ్లి విఫలమవడం చూసి సంధ్య తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. ఫలితంగా బాజా భజంత్రీలు, విందుభోజనాలతో కళకళ లాడాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం -
‘నా కుమారుడు కారులో ఎక్కడున్నాడు.. ఆస్పత్రిలో ఉంటే’
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్ టుబాకో టైకూన్ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు. కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని, బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్ అని పేర్కొన్నారు. కారు కండిషన్ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్ బారిన పడిందన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా. -
మద్యం మత్తులో వ్యాపారి కొడుకు హల్చల్.. లంబోర్గిని బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారి కొడుకు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించి ఖరీదైన లంబోర్గిని కారుతో పాదచారుల పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అతడిని పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.UP tobacco trader’s drunk son rams Lamborghini into vehicles and pedestrians in Kanpur, several injured.Shivam was allegedly drunk and tried to flee before police took action. pic.twitter.com/WDEC8AG9eU— The Tatva (@thetatvaindia) February 9, 2026అయితే, ప్రమాదం జరిగిన వెంటనే శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే మరో కారులో అక్కడికి చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి కేకే మిశ్రా బన్షిదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీకి యజమాని. గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడినవారు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు శివం పేరు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఎఫ్ఐఆర్లో అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు ఎందుకు లేదనే దానిపై పోలీసులు అధికారులు ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు. -
ఘజియాబాద్లో అక్కాచెల్లెళ్ల కేసులో కొత్త ట్విస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరి ఆత్మహత్యలకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతుల తండ్రి.. అప్పుల్లో కూరుకుపోవడం, వారి చదువులు మాన్పించడం వంటి అంశాలు ఆత్మహత్యకు దారి తీసినట్టు తెలిసింది. వారికి పెళ్లి చేస్తానని చెప్పడం కూడా ఇందుకు ఇక కారణమని పోలీసులు గుర్తించారు.ఘజియాబాద్కు చెందిన ఫారెక్స్ వ్యాపారవేత్త చేతన్ కుమార్కు ముగ్గురు భార్యలు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్ సోదరి కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా కలిసే ఉంటున్నారు. అయితే, కోవిడ్ కారణంగా లాక్డౌన్ సమయంలో చేతన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ క్రమంలో చేతన్ తన అవసరాల కోసం అప్పులు చేశాడు. అది కాస్తా ఇప్పుడు రెండు కోట్లకు చేరుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో.. స్కూల్, కాలేజీ ఫీజులు కట్టలేక వారి చదువు ఆగిపోయింది. దీంతో, వారంతో ఇంట్లోనే ఉంటున్నారు.⚠️ Shocking News :- गाजियाबाद में तीन नाबालिक बच्चियों के बाप चेतन ने तीन शादियां कर रखी थी ।दो हिंदू बीवी जो आपस में बहने थी और एक मुस्लिम बीवी थी जबकि एक साली को अपने पास रखता था तो इससे समझ में आता है कि वह तीन बीवियों और एक साली में इतना उलझा था कि अपनी बच्चियों को ध्यान… pic.twitter.com/ENYMVUWWCo— 𝗦𝗨𝗡𝗶𝗟 𝗣𝗥𝗔𝗧𝗔𝗣 ᵖʳᵃʲᵃᵖᵃᵗⁱ (@SunilPtp) February 6, 2026ఆర్థిక అవసరాల కోసం పేరెంట్స్ కూడా పనులు చేసుకుంటున్నారు. దీంతో, పిల్లలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతన్.. పిల్లలను సరిగా పట్టించుకునే వాడు కాదని సమాచారం. ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్కు బానిసైపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12).. ‘కొరియన్ లవ్ గేమ్’కు అడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచారు. గేమ్కు బానిసలుగా మారడాన్ని గుర్తించిన తండ్రి.. పది రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్ను తీసుకుని దాచిపెట్టేశాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.Location: Ghaziabad, UPThree minor girls committed suicide by jumping from the ninth floor.The father says that the girls were addicted to a Korean game.The father is a share trader, his two wives and a sister-in-law live with him in the flat, all three are biological sisters. pic.twitter.com/viPezTN3H1— M Amir (@ResponsiveAmir) February 4, 2026ఈ క్రమంలో వారి బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి’ అంటూ ఒక సూసైడ్ నోట్ ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. -
సారీ నాన్నా..!
ఘజియాబాద్: కోవిడ్కాలంలో స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయిన టీనేజర్లలో కొందరు పూర్తిగా ఆన్లైన్ గేమ్లకు బానిసలై చివరకు వాటికి బలవుతున్న దారుణోదంతం తాజాగా ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది. ఘజియాబాద్కు చెందిన ముగ్గురు టీనేజీ అక్కాచెల్లెళ్లు నిషిక(16), ప్రాచీ(14), పఖీ(12) మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో తాము నివసించే అపార్ట్మెంట్ 9వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో చిన్నారుల ఫోన్ వినియోగం, ఆన్లైన్ గేమ్స్ వ్యసనం ఎంతటి దారుణాలకు దారితీస్తుందోన్న విస్తృతచర్చలకు తెరలేచింది. ఆత్మహత్య ఘటన తెల్సి పోలీసులు రంగంలోకి దిగి వాళ్లింట్లో సోదాలుచేసి సూసైడ్ నోట్ను స్వాధీనంచేసుకున్నారు. ఏడుస్తున్న ఎమోజీని జతచేసి ‘ సారీ నాన్నా. నిజంగా సారీ’’ అంటూ పలు వాక్యాలు రాసి ఉన్న లేఖను చూసి తండ్రి చేతన్ కుమార్ బోరున విలపించారు. షాలిమార్ గార్డెన్ అసిస్టెంట్ కమిషనర్ అతుల్ సింగ్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాహిబాబాద్లోని భరత్సిటీలో ఉన్న చేతన్కుమార్ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తుంటాడు. ఇతను ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు. వీళ్లకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగారు. అందరూ ఒకే అపార్ట్మెంట్లో కలిసే ఉంటున్నారు. నలుగురు కుమార్తెల్లో నిషిక, ప్రాచీ, పఖీలు కోవిడ్ నుంచి స్మార్ట్ఫోన్కు అందులోనూ ఆన్లైన్గేమ్లకు బాగా అలవాటు పడ్డారు. కొరియన్ ఆన్లైన్ గేమ్స్ అంటే విపరీతమైన పిచ్చి. దీంతో చదువుల్లో బాగా వెనకబడ్డారు. చివరకు పాఠశాలకు వెళ్లడం మానేశారు. గత రెండేళ్లుగా ముగ్గురూ స్కూల్ ముఖం చూడలేదు. ఇంట్లో తమ గదికే పరిమితమయ్యారు. ఎప్పుడూ కలిసి స్నానంచేయడం, తినడం, పడుకోవడం, ఫోన్ చూడటం తప్ప మరో పని చేసిందే లేదు. దీంతో ఫోన్ వాడకం ఆపేయాలని తండ్రి ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. అయితే మంగళవారం మాత్రం ఈ విషయమై గొడవ జరిగిందని వార్తలొచ్చాయి. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్ పదో అంతస్తు ఫ్లాట్లో ఉండే అరుణ్ అనే వ్యక్తి తన బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు. అదే సమయానికి ఈ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తులోని తమ బాల్కనీ వద్దకు చేరుకున్నారు. పెద్దవాళ్లు ఇద్దరు హత్తుకుని ఒక్కటిగా కిందకు పడిపోగా వాళ్లను పట్టుకోబోయి చిన్న చెల్లెలు సైతం కిందకు పడటం చూసి హుతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. ముగ్గురు హాహాకారాలు చేస్తూ కిందకు దూకడంతో అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. నేలపై రక్తపుమడుగులో పడి ఉన్న ముగ్గురినీ సమీప లోనీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.కొరియాకు వెళ్తామనేవారు..ఘటనపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు ఫోన్ చూస్తున్నారని అనుకున్నా. గేమ్స్ ఆడుతున్నారనిగానీ, టాస్క్లు ఉండే ఆన్లైన్ ఆటలాడుతున్నారని గానీ నాకు తెలీదు. ఒక గేమ్నయితే వాళ్లు దాదాపు మూడేళ్లుగా ఆడుతున్నారు. మేం కొరియాకు వెళ్లొస్తామని తరచూ నాతో అనేవాళ్లు. భయంకరమైన టాస్క్లు గేమ్లో ఉంటాయని నాకు తెలియదు. వీళ్ల మొబైల్ ఫోన్లను పోలీసులు పరిశీలించాకే నాకీ విషయం తెల్సింది. గేమ్ల సంగతి తెలిస్తే ముందే వీళ్లను హెచ్చరించేవాడిని. కనీసం ఫోన్లు ఇచ్చేవాడినే కాదు. వ్యసనపరులుగా మారేదాకా ఏ తండ్రీ చూస్తూ ఊరుకోడు’’ అని తండ్రి ఏడుస్తూ చెప్పారు. గేమ్లో ప్రాచీ బాస్గా ఉండేదని, అక్క నిషిక, చెల్లి పఖీ ఈమె ఆదేశాలను శిరసావహించేవారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో 14 ఏళ్ల బాలుడు ప్రమాదకర బ్లూవేల్ గేమ్ ఆడుతూఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ఘజియాబాద్ ఉదంతం గుర్తుకుతెస్తోంది. ఆనాడు రష్యాలో మొదలైన ఈ ఆన్లైన్ గేమ్ రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మధ్యాసియా దేశాల్లో 130 మంది ప్రాణాలుతీసింది. గేమ్ మొదలెట్టిన 50 రోజుల్లోపు గేమ్ ఆడే వ్యక్తి మరణించేలా అందులో టాస్క్లు ప్లాన్చేశారు. ఇది కూడా చదవండి: తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి -
బాలునికి మోమోల ఆశ చూపి...
దేవరియా (యూపీ): పాపం పిల్లవాడు! మోమోలంటే మనవాడికి మహా ఇష్టం. ఆ ఇష్టాన్ని కాస్తా మోమో స్టాల్ నడిపే ముగ్గురు యువకులు భారీగా ‘సొమ్ము’ చేసుకున్నారు! బాలుని ఇంటినుంచి ఏకంగా రూ.85 లక్షల విలువైన నగలను అతనితోనే ఒక్కొక్కటిగా తెప్పించి మరీ కాజేశారు. ఉత్తరప్రదేశ్లో దేవరియాలోని దుమ్రీ చౌరస్తాలో ముగ్గురు యువకులు మోమో స్టాల్ నడుపుతు న్నారు. ఏడో తరగతి చదువుతున్న ఓ పిల్లవాడు మోమోల కోసం తరచూ స్టాల్కు వెళ్లేవాడు. బాలుని అమా యకత్వాన్ని ఆసరాగా చేసుకున్న యువకులు, స్నేహం పేరుతో కొంతకాలం పాటు అతన్ని మచ్చిక చేసుకున్నారు. ఇంటి నుంచి నగలు తెచ్చిస్తే కావ్సాలినన్ని మోమోలు ఫ్రీగా ఇస్తామంటూ ఆశ చూపారు. దాంతో బాలుడు రోజుకొకటి చొప్పున నగలు తీసుకెళ్లి వారికిస్తూ వచ్చాడు. బాలుని అత్త అవసరం నిమిత్తం నగలు అడగడంతో విషయం బయటపడింది. అప్పటికే నిందితులు నగలతో ఉడాయించారు. -
బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!
అసలే బంగారం ధరలు కొండెక్కి కూచున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. తనకిష్టమైన మెమోల కోసం లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేశాడో టీనేజర్. చివరికి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కర్ఖానా పోలీస్ పరిధిలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల కుమారుడి నిర్వాకాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వారణాసికి చెందిన పూజారి విమ్లేష్ మిశ్రా దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు ప్రకారం కొడుకు అమాయకత్వాన్ని వాడుకుని స్థానిక మోమోల దుకాణాల యజమానులు సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని దోచేశారు.ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వరనుకున్నాడో ఏమోగానీ, ఏడవ తరగతి విద్యార్థి ఒక రోజుబీరువాలోని నగ తీసుకెళ్లి, దుకాణదారులకిచ్చి కావాలను కున్నప్పుడల్లా చెక్కగా మోమోలను లాగించేవాడు.ఈ చోరీనిఇంట్లో వాళ్లు కూడా గుర్తించక పోవడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. అటు దుకాణాదారులు కూడా పిల్లవాణ్ని వారించడంగానీ, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంగానీ చేయలేదు. పైగా ఆభరణాలు తెస్తేనే మెమోలు ఇస్తామని బాలుడు బెదిరించినట్టు సమాచారం.ఎలా బైట పడిందంటేబాలుడి అత్త పుట్టింటికి వచ్చి, తన నగలకోసం ఆరా తీయడంతో, బీరువాలో నగలు మాయమయ్యాయన్న సంగతిని గమనించారు. అనుమానం వచ్చిన బాలుడిని విచారించగా, ఆభరణాలను మోమోలు అమ్మేవారికి ఇచ్చేసినట్లు బాలుడు తన చేసిన పని గురించి చెప్పుకొచ్చాడు. బాలుడి అత్త తన ఆభరణాలను తీసుకోవ డానికి పుట్టింటికి వచ్చినప్పుడు నిజం బయటపడింది. కనిపించకుండా పోయిన ఆభరణాల ప్రస్తుత విలువ రూ. 85 లక్షలు దాకా ఉంటుందని దిగ్భ్రాంతికి గురైన విమ్లేష్ మిశ్రా, ముగ్గురు దుకాణ యజమానుల పేర్లను పేర్కొంటూ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు.దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ధృవీకరించారు. వివరాలను ధృవీకరించి, నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. అధికారులు ఇప్పుడు నిందితులైన విక్రేతలను గుర్తించి సబంధిత ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంత బంగారం పోయింది? దాని విలువ ఎంత అనే వివరాలను కూపీ లాగుతున్నారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా? -
తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!
బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం ఏం జరిగిందంటే..మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్లను ఇంటికి పిలిచింది.కాళ్లు, చేతులు కదలకుండా..వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్తో కిటికీ గ్రిల్కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. -
సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న జురెల్
టీమిండియా భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తర్ప్రదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 7 ఇన్నింగ్స్ల్లో 93 సగటున, 122.90 స్ట్రయిక్రేట్తో 558 పరుగులు చేసిన ఇతను.. ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన రంజీ మ్యాచ్లోనూ అదే సూపర్ ఫామ్ను కొనసాగించాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జురెల్ ఒంటరిపోరాటం చేశాడు. 122 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో ఎంతో అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. జురెల్కు మరో ఎండ్లో శివమ్ మావి (47) సహకరించడంతో ఉత్తర్ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేయగలిగింది. జురెల్, మావి మినహా యూపీ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే 6 వికెట్లతో చెలరేగి యూపీని ఘెరంగా దెబ్బ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్ మోఖడే (19), సత్యం భోయార్ (13) క్రీజ్లో ఉన్నారు.సూపర్ ఫామ్జురెల్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడు లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, నాలుగు సెంచరీలు బాదాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన (14 & 13, 0 & 2) జురెల్.. దానికి ముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. దీనికి ముందే టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన జురెల్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం రెండో టెస్ట్లోనూ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. -
తొలి యాసిడ్ బాధితురాలు, చచ్చిపోదామనుకుంది.. ఇపుడు పద్మశ్రీ!
బనారస్ హిందూవిశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ మంగళ కపూర్కి పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళ కపూర్ తన సంగీత కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.'కాశీ లత'గా ప్రసిద్ధి చెందిన మంగళకపూర్ భారతదేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలు. 12 ఏళ్ల వయసులోనే యాసిడి దాడికి గురైన బాధితురాలు. ఆమె దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక సంగీత విద్వాంసురాలిగా, ప్రొఫెసర్గా ఎలా ఎదిగిగారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశీ అవార్డు సాధన వెనుక ఆమె చేసిన కృషి ఏంటి? తెలుసుకుందాం.ఇక బతకలేమోమో ప్రయాణం ముగిసిపోయిందన్న తీవ్రమైన కష్టాలనుంచి బతికి బట్టకట్టడమే కాదు, అత్యంత ఉన్నతంగా ఎదిగిన ధీర ఆమె. బలమైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకీ అడ్డుకోలేదు అనడానికి ప్రొఫెసర్ మంగళ జీవితం మనకు బోధిస్తుంది. ఆమె పోరాటం,విజయ గాథ స్ఫూర్తిదాయకం. అంతేనా సంగీతం , విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని కూడా గుర్తు చేసిన ఘనత ఆమె సొంతం. ఉత్తరప్రదేశ్లోకి వారణాసికి చెందిన ఆమెపై 1965లో యాసిడ్ దాడి జరిగింది. బట్టల వ్యాపారంలో ఉన్న అసూయ కారణంగా కొంతమంది ప్రత్యర్థులు రాత్రి 2 గంటల సమయంలో దాడి చేశారు. యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియని 12 ఏళ్ల వయసులో ఆమె నరకం అనుభవించింది. ఆరేళ్లపాటు ఆసత్పికే పరిమితం అయింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 37 ఆపరేషన్లు .అందమైన మొహం అందవికారమైంది. మరోవైపు సమాజం సూటిపోటీ మాటలు. దీంతోచదువు కొనసాగించ లేకపోయింది. సంగీతం ఉన్న మక్కువతో ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకుంది. సూసైడ్ చేసుకుందామనుకుందిబయటకు వెళ్ళినప్పుడు సూటిపోటి మాటలు వ్యంగ్య వ్యాఖ్యలు వినేదానినని మంగళ కపూర్ గతంలో చెప్పారు. పాఠశాలలో పిల్లలు ఆమెను చూసి భయపడేవారట. కొన్నిసార్లు ఆమెను ఎగతాళి కూడా చేసేవారు. 'ముక్కులేనిది' అని వెక్కిరించేవారు. దీంతో ఆమె చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ముందుకు సాగాలని, వెనక్కి తిరిగితే మరింత బలహీనుమవుతామని చెప్పే తండ్రి గుర్తుకు వచ్చేవారట దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం అలవాటుగా మారిపోయింది. అలా దూరవిద్యలో పీజీ, తర్వాత మెరిట్ స్కాలర్ షిప్తో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంగీతం, కళల విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే శాస్త్రీయ సంగీత న ప్రొఫెసర్గా నియమితుల య్యారు. సంగీత కచేరీలను ప్రారంభించారు. మంగళ స్వరమాధుర్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు. దేశంలో ఆమె కార్యక్రమాలు నిర్వహించని మూల లేదు అంటే అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచంలో ఆమె గాత్రం ఎంతో ఆదరణ పొందింది. అటు టీచర్గా అనేకమంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందించారు. అందుకే ఆమెను "కాశీ లతా మంగేష్కర్" అని కూడా పిలుస్తారు. ఆమె కృషికి, అంకిత భావానికి అనేక అవార్డులు వచ్చి వరించాయి. తరంగ్ ఫౌండేషన్ ఆమెకు "కాశీ లత" బిరుదును ప్రదానం చేయగా, రాజ్యసభ ఆమెకు "రోల్ మోడల్" అవార్డును ప్రదానం చేసింది. తాజాగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవకు ,స్ఫూర్తిదాయకమైన పోరాట ప్రస్థానానికి గాను, కళారంగంలో 2026 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.మంగళ కపూర్ సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటారు. ఆమె ఉచితంగా సంగీతం నేర్పుతుంది, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకు రావడానికి కృషి చేస్తుంది. 2018లో 'సీరత్' పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మరాఠీలో "మంగళ" మూవీగా జనవరి 17, 2025న విడుదలైంది. ఈ చిత్రం ఆమె పోరాటాలు , విజయాలను వివరిస్తుంది. -
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026 -
సీటు కోసం కాలిపై వేటు
జౌన్పూర్ (యూపీ): ‘నేను 2026లో ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి!’.. ఇది తన డైరీలో ఒక యువకుడు రాసుకున్న బలమైన నిశ్చయం. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఎంచుకున్న దారి చదివితే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వైద్య కళాశాలలో సీటు కోసం రిజర్వేషన్ పొందేందుకు ఒక విద్యార్థి తన కాలినే తెగ్గోసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది.వరుస వైఫల్యాలతో వికృత ఆలోచన!ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లా ఖలీల్పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ (20) అనే యువకుడు రెండుసార్లు ‘నీట్’ పరీక్ష రాసినా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించలేకపోయాడు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైన సూరజ్, ఎలాగైనా మెడికల్ సీటు కొట్టాలని భయంకరమైన ప్లాన్ వేశాడు. దివ్యాంగుల కోటా ఉంటే తక్కువ మార్కులకే సీటు వస్తుందని గ్రహించిన అతను, తన కాలిని స్వయంగా నరుక్కున్నాడు.నేరస్తుల దాడి అంటూ ‘డ్రామా’!ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తన తమ్ముడిపై దాడి చేసి, కాలు నరికేసి పారి పోయారని సూరజ్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేయ డంతో కథ మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సూరజ్ మాటల్లో పొంతన లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.దర్యాప్తులో షాకింగ్ నిజాలుపోలీసులు సూరజ్ ఫోన్ను, డైరీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వహస్తాలతోనే కాలును వేరు చేసుకున్న సూరజ్, దానిని నేరస్తులపైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దివ్యాంగుల కోటా కింద మెడికల్ సీటు పొందడమే లక్ష్యంగా ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ యువకుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతనిపై ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలో పోలీసులు న్యాయసలహా కోరుతున్నారు. మెడికల్ సీటు కోసం ఒక యువకుడు జీవితాంతం అంగవైకల్యంతో మిగిలిపోయే నిర్ణయం తీసుకోవడం.. అక్షరాలా ఒక సామాజిక అనారోగ్యానికి సంకేతం. -
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. -
Shocking Video: కోబ్రాను నలిపేస్తా అన్నాడు.. చివరికి
-
ఒక్క వ్లాగ్తో ఓవర్నైట్ స్టార్గా 72 ఏళ్ల తాత..!
చాలామంది సోషల్మీడియాలో స్టార్లుగా సంచలనం సృష్టించేందుకు..చాలా కష్టపడుతుంటారు. పోనీ అంతలా చేసినా..కొందరికీ లక్ కలిసిరాక, లేక కంటెంట్ బాగోకో..జనాలకు రీచ్ అవ్వడంలో విఫలమవుతుంటారు. కానీ సోషల్మీడియా గురించి ఏమి తెలియని ఈ 70 ఏళ్ల తాత నిజాయితీగా మాట్లాడిన తొలి వ్లాగ్ ప్రభంజనమే సృష్టించేలా వ్యూస్ వచ్చాయి. అలా అని అందులో ఏమి అంత గొప్పగా చెప్పిన విషయాలేం లేవు. కేవలం తన గురించి మాట్లాడిన కొద్ది మాటలే..ఎంతలా నెటిజన్లను ఆకర్షించాయో వింటో నోరెళ్లబెట్టేస్తారు.ఉత్తరప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు వినోద్ కుమార్ శర్మకు అసలు వ్లాగింగ్ గురించి ఏమి తెలియదు. కానీ చాలా ఇన్నోసెంట్గా, నిజాయితీగా ఆ విషయాన్ని వివరించిన విధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వినద్ శర్మ పదవీ విరమణ అనంతరం తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా గడిపేందుకు ఈ వ్లాగ్ని ఒక మార్గంగా ఎంచుకున్నానట్లు తెలిపారు. ఆయన వీడియలో ఇలా అన్నారు. నా పేరు వినోద్ కుమార్ శర్మ. "నేను ఉత్తర ప్రదేశ్కి చెందిన వాడిని. నాకు వ్లాగ్ చేయడం రాదు. జస్ట్ కాలక్షేమపం కోసం వ్లాగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఈ వ్లాగ్మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకుంటే మీ ప్రోత్సాహం ఉంటే కదా భవిష్యత్తులో దీన్ని కొనసాగించగలను అంటూ ముగించారు." అంతే ఆ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకుపైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. ఆ వృద్ధుడు వినోద్ శర్మ అమయకత్వానికి మత్ర ముగ్ధలవ్వడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. అతడిని చూడగానే మా తల్లిదండ్రలు, తాతయ్య అమ్మమలు గుర్తుకొచ్చారని, అంకుల్ మీకు మేము తోడుగా ఉంటాం అంటూ పోస్టులు వెల్లువెత్తాయి. అంతేగాదు అంకుల్ మీరు మా హృదయాలనకు కొల్లగొట్టారంటూ ప్రోత్సహించారు కూడా. మరికొందరు నేర్చుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని నిరూపించారు శెభాష్ అంకుల్ అని ప్రశంసల వర్షం కురిపించారు కూడా. View this post on Instagram A post shared by Vinod Kumar Sharma (@instauncle_9) (చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..) -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ప్రమాదంలో యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి కారణంగా భావిస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశాడు. నిర్మాణ పనుల కోసం తవ్విన, నీటితో నిండి ఉన్న గుంతలో తన ఎస్యూవీ వాహనం పడిపోవడంతో 27 ఏళ్ల యువరాజ్ మెహతా మృతికి సంబంధించి ఒక బిల్డర్ను అరెస్టు చేశారు. విష్టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులలో ఒకరైన అభయ్ కుమార్ను అరెస్టు చేశామని, మరో యజమాని మనీష్ కుమార్ కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు మంగళవారం ప్రకటించారు. కాగా గురుగ్రాంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువరాజ్ మోహతా విధినిర్వహణ తరువాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి, పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి -
టెక్కీ మరణం.. సిట్ దర్యాప్తునకు సీఎం యోగి ఆదేశాలు
లక్నో: నోయిడాలో టెక్కీ యువరాజ్ మోహతా విషాద మరణంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన వెంటనే నోయిడా అథారిటీ సీఈఓ ఎం. లోకేష్ను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఐదు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.గత శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువరాజ్ మోహతా కారు నోయిడా సెక్టార్–150 వద్ద ప్రమాదానికి గురైంది. ఓ నిర్మాణ స్థలంలో ఉన్న నీటితో నిండిన గుంతలో ఆయన కారు పడిపోయింది. రక్షణ చర్యలు ఆలస్యమవడంతో యువరాజ్ నీటిలో ఊపిరాడక మరణించగా, అదే సమయంలో గుండెపోటు కూడా రావడంతో ఈ రెండు కారణాల వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అటాప్సీ నివేదికలో తేలింది.ఈ ఘటనపై యువరాజ్ తండ్రితో పాటు స్థానికులు ప్రభుత్వ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ ప్రాంతంలో గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, రక్షణ చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యువరాజ్ మరణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నోయిడా అథారిటీ సీఈఓను పదవి నుంచి తొలగించారు. అదనంగా, మీరట్ జోన్ అదనపు డీజీపీ భాను భాస్కర్ ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే..యువరాజ్ మరణంపై ప్రత్యక్ష సాక్షి, డెలివరీ ఏజెంట్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ ఏజెంట్ తన స్టేట్మెంట్లో నీటి గుంతలో పడిన యువరాజ్ను ప్రమాదం నుంచి రక్షించేందుకు చేపట్టే చర్యలు ఆలస్యమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉంటే బ్రతికేవాడని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తగినంత బారికేడింగ్ లేకపోవడం, రిఫ్లెక్టర్లు లేకపోవడం వల్లే తరచూ అనార్ధాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నివాసితులు నిరసనలు చేపట్టారు.ఇక బాధితుడి తండ్రి రాజేష్ మెహతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంజే విష్టౌన్ ప్లానర్ లిమిటెడ్, లోటస్ గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇద్దరు బిల్డర్లపై కూడా కేసు నమోదు చేశారు. నిరసనల నేపథ్యంలో, నోయిడా అథారిటీ సంఘటనా స్థలంలో బారికేడ్లను ఏర్పాటు చేసింది. -
ఢిల్లీ హైకోర్టులో సెంగర్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో ఉన్నావ్లో అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన ఉదంతంలో దోషిగా తేలిన బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీ మరణం కేసులో 2020 మార్చి 13న తనకు పడిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను రద్దుచేయాలన్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ దుదేజా సోమవారం విచారించారు. ‘‘గతంలోనే దోషిగా తేలిన పిటిషనర్ ఇప్పటికే ఏడున్నర సంవత్సరాలు జైలు జీవితం పూర్తిచేసుకున్న విషయం మాక్కూడా తెలుసు. ఈ ఏడున్నరేళ్లలో ఆయన తన శిక్ష రద్దు కోసం పిటిషన్లను ధర్మాసనం వినలేదు. ఎందుకంటే ఆయన శిక్షను రద్దుచేయాలంటూ చాలాసార్లు మధ్యంతర పిటిషన్లు దాఖలుచేశారు. ఇవి చాలవన్నట్లు బెయిల్ పొడిగింపు కోసం ఇంకొన్ని, మొత్తం శిక్ష రద్దు కోరుతూ మరికొన్ని పిటిషన్లు వేశారు. ఇన్ని పిటిషన్లు దాఖలుచేయడం వల్లే అసలైన పిటిషన్ విచారణకు నోచుకోలేదు. శిక్షరద్దు కోరుతూ వేసిన పిటిషన్లో ఎలాంటి పస లేదు. అందుకే ఆయన అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. గత శిక్ష రద్దుకు సంబంధించిన న్యాయ సూత్రాలు ఈయనకు వర్తించవు. ఈ ఉదంతంలో వాస్తవాలు, తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ శిక్ష రద్దుకు మేం సమ్మతి నిరాకరిస్తున్నాం. మిగతా శిక్ష నుంచి పిటిషనర్కు మినహాయింపు ఇచ్చేందుకు ఎలాంటి బలమైన సహేతుక కారణాలు లేవు. ఏడున్నర సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించిన పిటిషనర్కు కేసులో విచారణ ఆలస్యమైందన్న కారణంగా ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేం. ఈ అంశాన్ని ఫిబ్రవరి మూడో తేదీన తిరిగి విచారిస్తాం’’అని జడ్జి చెప్పారు. తీర్పుపై సంతోషం వ్యక్తంచేసిన బాధితురాలు పదేళ్ల శిక్ష రద్దు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంపై ఉన్నావ్ బాధితురాలు సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘కోర్టు నిర్ణయంతో నేనెంతో సంతృప్తిగా ఉన్నా. మా నాన్న ఆత్మ కూడా శాంతిస్తుంది. దోషులందరికీ మరణశిక్ష అమలయ్యాకే నిజంగా ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇది కేవలం నా యుద్దం కాదు. న్యాయం, సత్యం కోసం పోరాటం. నా తుది శ్వాసదాకా పోరాడతా’’అని ఆమె వ్యాఖ్యానించారు. -
సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో
పిల్లలతో ఇంటరాక్షన్ ఎపుడూ హృద్యంగానే ఉంటుంది. అది రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి వారైనా సరే ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాల్సిందే. ఎపుడూ గంభీరంగా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మోముపై నవ్వులు పూయించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. స్టోరీ ఏంటీ అంటేయూపీలోని గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం సంప్రదాయం ప్రకారం గోరఖ్నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడొక చిన్నారితో ముద్దుగా పలకరించారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడో ఏమో గానీ ఆ బుడ్డోడు తన మనసులోని కోరికను ముఖ్యమంత్రి చెవిన పడేశాడు. దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి అడిగింది ఏమిటో చిన్న పిల్లలంతా ఇష్టపడే చిప్స్ ప్యాకెట్. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా పిల్లవాడికి చిప్స్ ప్యాకెట్లను అందజేయడంతో వాడి మొహం మతాబులా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిషన్ ఎకాంప్ల్ష్డ్ కొంతమంది వ్యాఖ్యానించారు. సీఎం చూపిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ योगी जी ने पूछा और क्या चाहिए? बच्चा बोला चिप्स 😁 pic.twitter.com/Rqta2anzhU— Jayant Singh Shivach (@JayantSinghBJP) January 15, 2026Chips story update 😂 https://t.co/KBUvVsqlYM pic.twitter.com/aWOI9UzHiN— Lala (@FabulasGuy) January 16, 2026 -
ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్తో వేగలేక ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ప్రతీక్ ఇన్స్టాగ్రామ్లో అపర్ణ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఆమెను ఫ్యామిలీ డిస్ట్రాయర్గా అభివర్ణించారు. ‘నా భార్య అపర్ణ యాదవ్ (బీజేపీ నేత)కు విడాకులు ఇస్తున్నాను. అపర్ణ యాదవ్ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఇలా స్వార్థంగా ఆలోచించే మహిళ నుంచి వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటాను. ఆమె నా కుటుంబ సంబంధాలను నాశనం చేసింది. ఆమె ఫేమస్ అవ్వాలని, ఇతరులను ఇన్ఫ్లయిన్స్ చేయాలని కోరుకుంటుంది. నాకు నా మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది. అలా అని ఆమె నాకోసం బాధపడదు. తన కోసం తాను మాత్రమే బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు. ఆమెను వివాహం చేసుకోవడం నా దురదృష్టం’ అని ప్రతీక్ అన్నారు. ప్రతీక్, అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె ఉంది. అయితే, అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ .. ప్రతీక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైనట్లు చెప్పారు. ప్రారంభంలో సమాజ్వాదీ పార్టీలో ఉన్న అపర్ణ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో ఆమె జాతీయ వాదం కారణం చూపుతూ బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.అపర్ణ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కు కోడలుగా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. అయితే, ఆమె బీజేపీలో చేరిన తర్వాత యాదవ్ కుటుంబంలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు విడాకుల కేసు దాఖలు కావడంతో ఆ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదవ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విడాకుల కేసు ఆ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మౌని అమావాస్య పుణ్యస్నానాలు 4.5 కోట్లు !
ప్రయాగ్రాజ్ (యూపీ): మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణిసంగమ స్థలిలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సాయంత్రానికే వారి సంఖ్య 4.52 కోట్లు దాటిందని ఉత్తర ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచును, వణికించే చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు శనివారం అర్ధరాత్రి కల్లా త్రివేణి సంగమ ఘాట్లకు చేరుకున్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ ద్వారా గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఇటీవల మకర సంక్రాంతి సందర్భంగా సంగమంలో కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఏకాదశి రోజున 85 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ‘‘భిన్న మార్గాల నుంచి వస్తున్న భక్తులు నచ్చిన ఘాట్కు చేరుకునేందుకు వీలుగా మార్గసూచీలు ఏర్పాటుచేశాం. భక్తులకు సాయపడేందుకు పెద్ద సంఖ్యలో పౌర వలంటీర్లను రంగంలోకి దించాం. మాఘ మేళా ప్రాంతమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశాం. 800 హెక్టార్లలో జరుగుతున్న మేళాను ఏడు సెక్టార్లుగా విభజించాం. 25,000 మరుగుదొడ్లను నిర్మించాం. శుభ్రతా కార్యక్రమాల కోసం 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’’ అని డివిజనల్ కమిషనర్ సౌమ్యా అగర్వాల్ చెప్పారు. కళకళలాడుతున్న టెంట్ సిటీ స్వల్పకాలిక కల్పవాస్ దీక్ష కోసం, మేళాను తిలకించేందుకు విచ్చేసే లక్షలాది మంది విదేశీ పర్యాటకులు, సందర్శకుల కోసం యూపీ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ‘‘వారికోసం టెంట్ సిటీ నిర్మించాం. ధ్యానం, యోగాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వృద్దులు, అలసిపోయిన భక్తులు వెంటనే తిరుగుపయనం అయ్యేందుకు వీలుగా బైక్ ట్యాక్సీలు, గోల్ఫ్ కార్ట్ వాహనాలనూ సిద్ధంగా ఉంచాం’’ అని సౌమ్య పేర్కొన్నారు. ‘‘మేళాలో భద్రత, రక్షణ, పర్యవేక్షణ విధుల నిమిత్తం 10,000 మందికిపైగా పోలీస్ సిబ్బందిని మొహరించాం. జనం ఒకే ఘాట్లో గుమికూడకుండా చూసేందుకు, వాహనాలను వేర్వేరు చోట్ల నిలిపి ఉంచేందుకు 42 తాత్కాలిక పార్కింగ్ జోన్లను ఏర్పాటుచేశాం. ఒకేసారి 1,00,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ చేసేలా పార్కింగ్ జోన్ల సామర్థ్యాన్ని పెంచాం’’ అని మేళా సూపరింటెండెంట్ నీరజ్ పాండే వెల్లడించారు. ఈ ఏడాది మేళా కోసం 12 వేల అడుగుల పొడవునా స్నాన ఘాట్లను నిర్మించారు. కనీస సదుపాయాలన్నింటినీ సమీపంలోనే అందుబాటులో ఉంచారు. -
తాంత్రికుడు మాటలు నమ్మి.. స్నేహితుణ్ని బలిచ్చారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు. అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. -
‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటా’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫతేహ్పూర్ జిల్లా మోహన్పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టం కోసం పంపించారు. -
అవును నా ప్రియుడే.. అయితే తప్పేంటి?
వివాహేతర సంబంధాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.‘‘హలో.. పోలీస్ స్టేషన్ ఆ నా భార్య నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్ చేశాడు ఓ భర్త. ఆ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్ నెంబర్ 113 తలుపును విరగొట్టాడు. లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె. ‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలోని నవాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 🚨 होटल ड्रामा, VIDEO वायरल 🚨🏨 पत्नी प्रेमी संग, पति 👮♂️ पुलिस के साथ पहुंचा😱 पकड़े जाने पर बोली— “तलाक दे दूंगी”📍 वायरल वीडियो झांसी (UP) बताया जा रहा#Jhansi #UPNews #ViralVideo #BreakingNews pic.twitter.com/yX4Z3ggciQ— Mr Kushal Gupta,( K G ) (@g94897659) January 16, 2026 -
మనకంటే మొనగాడే లేడంటూ కోబ్రాతో స్టంట్స్..చివరికి!
పాముతో చెలగాటం వద్దు అని చెప్పినా వినలేదు. అందులోనూ విషపూరితమైన సర్పం..జాగ్రత్త అని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెట్టాడు. చివరికి విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.Ghar Ke Kalesh @gharkekalesh అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన వీడియో ప్రకారంఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల రాజ్ సింగ్ నాగుపాము కాటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. ‘నాకంటే వీరుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా’ అంటూ విన్యాసాలు మొదలు పెట్టాడు. అది చాలా పవర్ ఫుల్.. విషనాగు, దాన్ని వదిలేయ్ అని చాలామంది హెచ్చరించారు. ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచిఅయినా పట్టించుకోకుండా, ఆరడుగుల నాగుపామును మెడకు చుట్టుకుని రోడ్డుపై విన్యాసాలు చేశాడు. పామును తన మెడలో స్కార్ఫ్ లాగా చుట్టుకుని, నవ్వుతూ, కెమెరా ముందు పోజులిచ్చాడు. ఈ క్రమంలో ఆ పామును అతడిని మూడుసార్లు కాటు వేసింది. విషం వేగంగా శరీరమంతా పాకింది. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిర్లక్ష్యానికి తన ప్రాణాన్నే బలిపెట్టాడు. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం 50-year-old Raj Singh caught a 6-ft venomous cobra on the road, ignored warnings, wrapped it around his neck & did stunts. Snake bit him 3 times. Venom acted fast — declared de@d on arrival at hospital🐍😔pic.twitter.com/728XgFGqVz— Ghar Ke Kalesh (@gharkekalesh) January 15, 2026 -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్ఫ్రెండ్ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
కరిచిన పాముతో నేరుగా ఆస్పత్రికి
ఉత్తరప్రదేశ్: అడుగున్నర పొడవున్న ఒక సర్పాన్ని చలికోటులో దాచుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ హల్చల్ సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. 39 ఏళ్ల దీపక్ వృత్తిరీత్యా ఇ–రిక్షా డ్రైవర్. పాము కాటేసిందంటూ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అయితే ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అక్కడి సిబ్బంది అడగ్గా.. ఇదిగో ఇదే పాము అంటూ తన జర్కిన్లో దాచి తెచ్చిన తాచుపామును బయటకు తీశాడు. దీంతో అక్కడి వాళ్లంతా హడలిపోయారు. వెంటనే పామును దూరంగా వదిలేసి రావాలని సూచించినా వినకుండా విరుగుడు మందు కావాలని డిమాండ్చేశాడు. దీంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ‘‘సమీపంలోని బృందావన్ నుంచి వచ్చా. అరగంట నుంచి వేచిచూస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు’’అని దీపక్ చెప్పాడు. వైద్యం చేస్తాంగానీ ముందు ఆ పామును వదిలేయాలని సూచించామని జిల్లా ప్రభుత్వాసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ చెప్పారు. -
రింకూ విఫలం.. సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఖరారు చేసుకుంది. రింకూ విఫలంబెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. కెప్టెన్ రింకూ సింగ్ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.హార్విక్ దేశాయ్ సెంచరీతోసౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు... అంకుర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (116 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు.ప్రేరక్ మన్కడ్ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.పడిక్కల్ జోరు.. కర్ణాటక నాలుగోసారిడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3/42), అభిలాశ్ శెట్టి (2/59), విద్వత్ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది.కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్దత్ పడిక్కల్ (95 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు), కరుణ్ నాయర్ (80 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) రెండో వికెట్కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.చదవండి: భారత్పై నిందలు!.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
బుర్ఖాతో వచ్చినా.. ముఖం చూపించాలి
వారణాసి: మాస్క్, ముసుగు, బుర్ఖా, హెల్మెట్ వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు నగలను విక్రయించరాదని యూపీలోని వారణాసి జిల్లా నగల దుకాణదారుల సంఘం నిర్ణయించింది. ఇటీవల పలు జిల్లాల్లో బుర్ఖా, ముసుగులతో వచ్చిన చోరులు దుకాణాల్లో నగలను దోచుకోవడం, మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ మేరకు నిషేధం విధించినట్లు యూపీ జువెల్లర్స్ అసోసియేషన్(యూపీజేఏ) వారణాసి జిల్లా అధ్యక్షుడు కమల్ సింగ్ చెప్పారు. ‘ముఖాన్ని కప్పుకుని దుకాణానికి వచ్చే వినియోగదారులకు నగలను విక్రయించం. ముఖాన్ని కప్పుకుని వచ్చే వారు ఏదైనా నేరానికి పాల్పడితే, గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోంది. అందుకే, మేం మాస్క్, బుర్ఖా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చే వారికి నగలను అమ్మబోమంటూ దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశాం. ఇదంతా మా భద్రత కోసం మాత్రమే. ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు’అని అన్నారు.ఇకపై కొనుగోలుదారు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ఆచ్ఛాదనాన్ని తప్పనిసరిగా తొలగించాకనే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఆ కొనుగోలుదారు గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. ఇలాంటి నిషేధం యూపీలోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీజేఏ అధ్యక్షుడు సత్య నారాయణ్ సేథ్ చెప్పారు. -
పావుగంటలో పట్టుకొచ్చారు.. థాంక్యూ సార్
లఖీంపూర్ ఖేరీ(యూపీ): గతంతో పోలిస్తే నేడు ఆన్లైన్ బుకింగ్ వంటి సౌకర్యాలకారణంగా వంటగ్యాస్ సిలిండర్ను కేవలం 15 నిమిషా ల్లోనే ఇంటి వద్ద డెలివరీ తీసుకోగలిగానని ప్రధాని మోదీకి ఒక గృహిణి తన అమితానందాన్ని ఒక లేఖ ద్వారా వ్యక్తంచేశారు. ఈ వివరాలను శనివారం ప్రధాని మోదీ స్వయంగా అందరితో పంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉత్తర ప్రదే శ్లోని లఖీంపూర్ పట్టణానికి చెందిన అరుణశ్రీ డాన్ బాస్కో స్కూల్లో ఉపాధ్యాయురాలు. గత ఏడాది డిసెంబర్లో ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేయగా కేవలం 15 నిమిషాల్లో డెలివరీ బాయ్ సిలిండర్ను ఇంటి వద్దకు పట్టుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘‘ ఆనందం, ఉద్వేగంతో ప్రధానికి లేఖ రాశా. జీవితాలను ఇంత సులభతరంగా మార్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపా. నా చిన్నతనంలో ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలన్నా, సిలిండర్ మార్చుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఆకాలం పోయి ఒక్క ఫోన్కాల్తో సిలిండర్ ఇంటి వద్దే ప్రత్యక్షమవుతోంది. ఈ ఘనత ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానిదే’’ అని ఆమె అన్నారు. లేఖపై మోదీ స్పందించారు. మహిళా సాధికారత కోసం తామెన్నో కేంద్ర పథకాలను అమలుచేస్తున్నామని మోదీ గుర్తుచేశారు. -
లేడీ కిలాడీలు.. సీసీ ఫుటేజ్లో షాకింగ్ దృశ్యాలు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్లో డిసెంబర్ 31 2025న ఈ ఘటన జరిగింది.ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.డిస్ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. జువెలర్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.इन महिलाओं ने बड़ा हाथ मारा है. कल्याण ज्वेलर्स से 14 लाख के गहने चुराए.प्रयागराज स्थित कल्याण ज्वेलर्स में ये चोरी हुई है. चार महिलाओं ने सेल्समैन को बातों में उलझाए रखा और मौका मिलते ही गहना चोरी कर लिया. पूरी घटना CCTV में कैद है. pic.twitter.com/mhmYetbwEh— Priya singh (@priyarajputlive) January 7, 2026ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్మన్ను దృష్టి మళ్లించి, షాప్లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్ పెట్టారు. -
పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది
అర్థరాత్రి వేళ, కాన్పూర్ పోలీసులు స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది. ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం వెలుగు చూసింది. దొరికిన అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్తో అనుబంధం పెంచుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.ఎలా బయటపడింది?తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది. గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దిగ్భ్రాంతికరమైన నిజంబబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? -
ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే కసరత్తు కొలిక్కి వచ్చింది. రివిజన్ అనంతరం ఏకంగా 2.89 కోట్ల ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నవ్దీప్ రిన్వా మంగళవారం ఈ మేరకు వెల్లడించారు. వీరిలో ఏకంగా 2.57 కోట్ల మంది శాశ్వత వలస వెళ్లిపోయినట్టు తెలిపారు.మరణాలు, బహుళ నమోదుల వంటి కారణంగా మిగతా ఓట్లను తొలగించినట్టు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓటర్ల సంఖ్యను 12.55 కోట్లుగా ముసాయిదా ఎన్నికల జాబితా పేర్కొంది. ఎస్ఐఆర్కు ముందు యూపీలో ఓటర్ల సంఖ్య 15.44 కోట్లుగా ఉండేది. తుది ఓటర్ల జాబితాను మార్చి 6న ప్రచురిస్తామని రిన్వా ప్రకటించారు. ముసాయిదా జాబితాపై యూపీలో విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఈసీ అసలు రివిజన్ కసరత్తుకు సరిపడా సమయమే ఇవ్వలేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. -
'యాదవులు హిందువులు కాదు'
లక్నో: అఖిలేశ్ యాదవ్కు సన్నిహితుడైన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో నిమ్నవర్గాలను (శూద్రులను) హీనంగా చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారాయన. ఈ నేపథ్యంలో యాదవులు హిందువులు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాదవ్ సమాజం హిందువులలో భాగం కాదని పేర్కొంటూ.. మనుస్మృతిలోని కుల విభజనను ప్రశ్నించారు. మనిషిని కుక్క కంటే హీనంగా చూసే మతాన్ని తాను అనుసరించనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సిర్సాగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దండియామాయి గ్రామంలో "పీడీఏ (దళిత్-వెనుకబడిన-మైనారిటీ) పాఠశాల" పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.నేను మనిషిని.."మేము బ్రాహ్మణులం కాదు. మేము క్షత్రియులం కాదు. మేము వైశ్యులం కూడా కాదు. ఇక మిగిలింది ఎవరు? శూద్రులు. నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. హిందువుగా ఉండటం తప్పనిసరి కాదు. ప్రతి వేదికపై చెప్పినట్లే, ఇక్కడా చెబుతున్నా.. నేను హిందువును కాదు. నా పేరు శివరాజ్ సింగ్ యాదవ్, నేను ఒక మనిషిని. హిందువును కాదు. ఎందుకంటే ఏ మతమైతే మనిషిని కుక్క కంటే హీనంగా చూస్తుందో, ఆ మతాన్ని అస్సలు పాటించను, ఎప్పటికీ అనుసరించన''ని శివరాజ్ సింగ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుత ప్రభుత్వం దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై అత్యంత దారుణమైన అకృత్యాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.పీడితులకు రాజ్యాధికారమే లక్ష్యంగా..నిమ్నవర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టాలన్న లక్ష్యంతో పీడీఏ భావనను వ్యాప్తి చేస్తున్నామని శివరాజ్ సింగ్ యాదవ్ (Shivraj Singh Yadav) వివరించారు. దళిత- వెనుకబడిన- మైనారిటీ వర్గాలు దేశ జనాభాలో దాదాపు 90 శాతం ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో తగినంత ప్రాతినిథ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో వివక్షకు గురైన దళితులు ఎక్కువగా ఆ మతాన్ని విడిచిపెట్టారని తెలిపారు. వీరిలో చాలా మంది బౌద్ధమతంలోని సమతావాదానికి ఆకర్షితులై అందులో చేరారని అన్నారు. తమ కులానికి చెందిన కొద్దిమంది యాదవ్ నాయకులు మాత్రమే తాము హిందువులు కాదని ప్రకటించుకున్నారని చెప్పారు.చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీతో పాటు కేంద్రంలోనూ పీడిత వర్గాలపై దాడులు పెరిగాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) చాలా సందర్భాల్లో విమర్శించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దళిత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాయని పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్కు సన్నిహితుడైన శివరాజ్ సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, దళిత, మైనారిటీల ఓట్ల కోసమే ఆయనీ వ్యాఖ్యలు చేశారని అధికార వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. -
గంగా నదిలో మాఘమేళా.. బాస్మతి, అఫ్సానా వైరల్..
ప్రయాగ్రాజ్: పౌష్య పూర్ణిమను పురస్కరించుకుని శనివారం ప్రయాగ్రాజ్లో మాఘ మేళా ఉత్సవం వైభవంగా మొదలైంది. సంగం తీరంలో సాధువులు, తాత్కాలిక శిబిరాల్లో కల్పవాసులు, పూజా సామగ్రి విక్రయించే వ్యాపారులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేకువ జాము నుంచే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా తీరం భక్తులతో నిండిపోయింది. మరోసారి కుంభమేళాను తలిపించే విధంగా ఆ ప్రాంతం మారిపోయింది. మరోవైపు.. గతేడాది కుంభమేళలో మోసాలిసా హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈసారి మాఘ మేళాలో దంత కర్రలు(టూత్ స్టిక్స్) అమ్ముతున్న బాస్మతి అనే అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. బాస్మతి ఎంతో అందగా, అమాయకత్వంతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్మతి మాఘ మేళాలో స్నానం చేయడానికి వచ్చింది. కానీ తరువాత దండలు, దంత కర్రలను అమ్మడం ప్రారంభించింది. చాలా మంది యూట్యూబర్లు ఆమె వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజలు ఆమెను కొత్త మోనాలిసా అని పిలుస్తున్నారు.మరోవైపు.. బాస్మతితో పాటు, మరో ఇద్దరు అమ్మాయిలు కూడా మాఘ మేళాలో వైరల్ అవుతున్నారు. వారిలో ఒకరి పేరు అఫ్సానా, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నివాసి. అఫ్సానా మోనాలిసా బంధువు అని చెబుతారు. అఫ్సానా కూడా ఈ ఉత్సవంలో దండలు అమ్ముతోంది. ప్రజలు ఆమెను మోనాలిసా అని పిలుస్తున్నారు. #Viralमोनालिसा के बाद अब लोग इनके दीवाने हैंये बासमती हैंये प्रयागराज के माघ मेला में माला बेचने आई हैंलोग इन्हें देखने के लिए भीड़ लगा रहे हैंइससे पहले मोनालिसा आईं थीं, जिन्हें इलाहाबाद ने स्टार बना दिया था।#monalisa #basmati #prayagraj pic.twitter.com/KDQHND8lQ9— Anaadi TV UP (@AnaadiTVUP) January 4, 2026ఇక, నెల రోజుల పాటు కొనసాగే కల్పవాస్ సమయంలో గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. సంప్రదాయం ప్రకారం భక్తులు కల్పవాస్ సమయంలో రోజుకు రెండు పర్యాయాలు గంగా నదీ స్నానం, ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ధ్యానం, దైవారా ధనలో గడుపుతారు. మొదటి రోజైన శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది భక్తులు సంగం ప్రాంతానికి తరలివచ్చినట్లు అధికారుల అంచనా. అదే సమయంలో, దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పవాస్ దీక్షను ప్రారంభించారని త్రివేణీ సంగం ఆర్తి సేవా సమితి ప్రెసిడెంట్ ఆచార్య రాజేంద్ర మిశ్రా తెలిపారు.#WATCH | Prayagraj, UP | People take a holy dip at Triveni Sangam on the occassion of Paush Purnima, the first 'snaan' and also the first day of Magh Mela 2026. pic.twitter.com/2pp72Zib9z— ANI (@ANI) January 3, 2026महाकुंभ में फेमस हुई माला बेचने वाली मोनालिसा के बादमाघ मेले में 2 और लड़कियांl ये दोनों भी माला बेचती हैं। इनमें पहली लड़की है अफसाना, जो सिर्फ माला बेचती है और मोनालिसा की रिश्तेदार है। वहीं, दूसरी बासमती है, जो माला और दातून दोनों बेचती है। आज के समय में सब कोई फेमस… pic.twitter.com/QoX346KsGl— vinod singh (@Vinodsingh075) January 4, 2026 -
ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రచ్చ.. అర్ధనగ్నంగా డ్యాన్స్..
లక్నో: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి రద్దీ రహదారిపై కారుపైకి ఎక్కి అర్ధనగ్నంగా డ్యాన్స్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, పోలీసులు వారికి ఏకంగా 67 వేలు జరిమానా విధించి షాకిచ్చారు.తెలిసిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్లోని నోయిడా (Noida)లో న్యూ ఇయర్ సందర్భంగా యువకులు కారులో రోడ్డు మీదకు వచ్చారు. ఆరుగురు యువకులు ఫుల్లుగా మద్యం సేవించి మారుతి ఆల్టో కారులో ప్రయాణించారు. మార్గం మధ్యలో కారు ఆపి దాని రూఫ్టాప్ పైకెక్కి నృత్యాలు చేశారు. వీరి చర్యతో ఆ మార్గంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, ట్రాఫిక్లో చిక్కుకున్న స్థానికులు వీరి డ్యాన్స్, ఓవరాక్షన్ను వీడియో తీశారు. అనంతరం వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.#Noida नोएडा की सड़कों पर युवकों का हुड़दंगकार की छत पर खड़े होकर बीच सड़क युवकों ने मचाया हुड़दंग सोशल मीडिया पर वायरल वीडियो का ट्रैफिक पुलिस ने लिया संज्ञान।ट्रैफिक पुलिस ने कार्रवाई करते हुए काटा 67 हजार का मोटा चालान ।नोएडा सेक्टर 38 थाना 39 क्षेत्र का बताया जा रहा है… pic.twitter.com/360IAj7xqm— India News UP/UK (@IndiaNewsUP_UK) January 2, 2026ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు రూ.67 వేలు జరిమానా విధించి షాకిచ్చారు. ఇందులో భాగంగా వాహన యజమానిపై ప్రమాదకరమైన డ్రైవింగ్, బీమా లేకుండా వాహనం నడపడం, సేఫ్టీ బెల్ట్ ధరించకపోవడం వంటి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినందుకు పోలీసులు.. 868 చలాన్లు జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటన డిసెంబర్ 31న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. नोएडा में कार की छत पर खड़े युवकों का हुड़दंग का वीडियो वायरल होने के बाद ट्रैफिक पुलिस ने काटा 67 हजार का चालानI pic.twitter.com/50dP3THqH8— khabar greater Noida West (@khabargrnwest) January 3, 2026 -
చచ్చిపోయాడనుకుంటే..30 ఏళ్లకు తిరిగొచ్చాడు!
ఉత్తరప్రదేశ్లోని,ముజఫర్నగర్లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన షరీఫ్ ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్లో షరీఫ్ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది. దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్ఐఆర్ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు. షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్లో మహిళపై సామూహిక అత్యాచారంగత 15, 20 ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్కు వెళ్లిపోయాడు. -
నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.హాత్రాస్లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025 కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..! -
అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి
మనుషులుగా మానవత్వాన్నిమంట గలిపారు. కనీస వృత్తి ధర్మాన్ని పాటించ లేదు. మానవ విలువల్ని మరిచిపోయిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుషం. బాధితుడు 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, రైల్వేస్లో సీనియర్ క్లర్క్గా పనిచేసి రిటైరయ్యారు. ఆ చుట్టుపక్కల ఆయనకు మంచి వ్యక్తిగా పేరుంది. 2016లో భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు. దీంతో తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అన్నివిధాలా తోడు నీడగా ఉంటారనే ఉద్దేశంతో రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి అనే భార్యాభర్తల్ని కేర్టేకర్లుగా నియమించుకుని, ఇంట్లోనే చోటిచ్చారు ఓం ప్రకాష్. అయితే వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఈ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి. దీంతో ఆహారం లేక ఓం ప్రకాష్ చిక్కిశల్యమై పోయి ప్రాణాలు విడిచారు.ఓంప్రకాష్ మరణం గురించి కుటుంబానికి సమాచారం అందించడంతో ఈ జంట దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరిన బంధువులు అక్కడి దృశ్యాలను షాక్ అయ్యారు. ఇక కుమార్తె రష్మి చీకటి గదిలో నగ్నంగా, స్పృహ లేకుండా కనిపించింది. దాదాపు చావు అంచులకు చేరిపోయింది. తన అన్న, కుమార్తె రష్మిని గ్రౌండ్ ఫ్లోర్కు పరిమితం చేసి, పైభాగంలో వారు హాయిగా జీవిస్తున్నారని ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ ఆరోపించారు. బంధువులు ఎవరొచ్చినా, కలవడానికి ఇష్టం పడటం లేదంటూ తిప్పి పంపించేవారని తెలిపారు. ఓం ప్రకాష్ మర్యాదస్తుడనీ, చాలా గౌరవప్రద వ్యక్తి అంటూ ఆయన మరణంపై పొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆకలితో రష్మి దేహం శుష్కించిపోయిందనీ, ఒంటిమీద కొంచెం కూడా కండలేక ఎముకల గూడులా ఉందని బంధువు పుష్ప సింగ్ రాథోడ్ తెలిపారు. రష్మి ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది, బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఓంప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్మార్టం, ఇతర వైద్య, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్ను అందులో కోర్టు ఆదేశించింది. ‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి. 2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. -
ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి. -
UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం.ఈ పరిణామాల నేపధ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. లక్నో పరిధిలోని మలిహాబాద్, మోహన్లాల్గంజ్ తదితర నియోజకవర్గాల్లో 83 శాతం మంది దరఖాస్తులు సమర్పించగా, లక్నో కంటోన్మెంట్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల సంఘం తగిన సమయాన్ని కేటాయించింది.ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 31న ప్రకటించనున్న ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 2026, జనవరి 30లోపు ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. తుది ఓటర్ల జాబితాను 2026, ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ భారీ మార్పులు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇది కూడా చదవండి: మక్కాలో కలకలం.. వీడియో వైరల్ -
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్పై విజయాలు సాధించాయి. కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్మోల్, హర్నూర్ శతకాలు ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్పై నెగ్గింది. మొదట ఛత్తీస్గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్లో ఆడలేదు. -
రింకూ సింగ్ విధ్వంసకర శతకం
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ సింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు. తాజాగా వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఫామ్ను కొనసాగిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.ఈ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్గా బరిలోకి దిగిన రింకూ సింగ్ (Rinku Singh).. బుధవారం నాటి తొలి మ్యాచ్లో హైదరాబాద్పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇతడికి తోడు ధ్రువ్ జురెల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫలితంగా యూపీ 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం అందుకుంది.ఆర్యన్ జుయల్ సెంచరీగ్రూప్-బిలో భాగంగా తాజాగా చండీగఢ్తో శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో రాజ్కోట్ వేదికగా టాస్ ఓడిన యూపీ తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి (1) ఈసారి విఫలం కాగా.. ఆర్యన్ జుయల్ మాత్రం మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 118 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 134 పరుగులు సాధించాడు.రింకూ సింగ్ విధ్వంసకర శతకంఇక వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (57 బంతుల్లో 67) మరోసారి హాఫ్ సెంచరీతో మెరవగా.. సమీర్ రిజ్వి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 56 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రింకూ.. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి శతక ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ (14 బంతుల్లో 12).. రింకూతో కలిసి నాటౌట్గా నిలిచాడు.367 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యూపీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేశాడు. చండీగఢ్ బౌలర్లలో తరణ్ప్రీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు దక్కిన విషయం తెలిసిందే.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ను విజయంతో ఆరంభించాడు.ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో హైదరాబాద్ (HYD vs UP)పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఉత్తరప్రదేశ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. అదరగొట్టిన జురెల్, ఆర్యన్, రింకూధ్రువ్ జురేల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రింకూ సింగ్ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.ఇక హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (53; 9 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ సాధించగా... రాహుల్ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్లు), వరుణ్ గౌడ్ (45; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.జీషాన్ అన్సారీకి 4 వికెట్లుఉత్తరప్రదేశ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జమ్మూకశ్మీర్ 10 వికెట్ల తేడాతో చండీగఢ్పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. ఇక ఎలైట్ గ్రూప్ ‘సి’లో హిమాచల్ ప్రదేశ్ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్పై... పంజాబ్ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.మరోవైపు.. గ్రూప్ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో రాజస్తాన్పై విజయాలు సాధించాయి.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
నేడు జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం ఉత్తర ప్రదేశ్లో కీలకమైన జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, బీజేపీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయల భారీ కాంస్య విగ్రహాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. నేడు(డిసెంబర్ 25) వాజ్పేయీ 101వ జయంతిని పురస్కరించుకుని లక్నోలో ఈ నేషనల్ మొమోరియల్, కాంప్లెక్స్ను ఆరంభిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో హిందీలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ భారత రత్న, దివంగత వాజ్పేయీ జయంతి రోజున లక్నోలో రాష్రీ్టయ ప్రేరణ స్థల్ స్మారకం నా చేతుల మీదుగా ప్రారంభంకావడం నా అదృష్టం. వాజ్పేయీ, ఎస్పీ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్ విగ్రహాలు, ఈ ముగ్గురు దిగ్గజాలు దేశానికి చేసిన సేవను తెలిపే వివరాలతో అధునాతన మ్యూజియం సైతం ఇదే ప్రాంగణంలో అందుబాటులోకి రానుంది’’ అని మోదీ చెప్పారు. ప్రారం¿ోత్సవంలో భాగంగా మోదీ ఆ తర్వాత భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల వ్యయంతో ఈ మెమోరియల్, కాంప్లెక్స్ను నిర్మించారు. ముగ్గురు నేతల 65 అడుగుల ఎత్తయిన విగ్రహాలను ప్రతిష్టించారు. 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పువ్వు ఆకృతిలో మ్యూజియం కట్టారు. -
రాహుల్నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు. क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025బుధవారం సాయంత్రం జన్పథ్లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్లో సెంగర్కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి వ్యాఖ్యల దుమారంఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు. -
ఉన్నావ్ బాధితుల్ని ఈడ్చిపడేశారు!
దేశరాజధానిలో జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎనిమిదేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది తెలిసిందే. ఈ కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్ దక్కడంపై నిరసనగా బాధితురాలు, ఆమె తల్లి ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టబోయారు. ఆ సమయంలో యోగితా భయానా అనే యాక్టివిస్ట్ వాళ్లతో పాటు ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడమంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదంటూ ఆ తల్లీకూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లి బస్సు నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు. JUSTICE DETAINEDRapist's Sentence SuspendedUnnao rape victim dragged into police van by @AmitShah's Delhi Police, protesting against suspension of sentence of former @BJP4India MLA RAPIST-MURDERER Kuldeep Singh Sengar#KuldeepSinghSengar#StockMarketIndia #PlaneCrash pic.twitter.com/vYApILE9kN— Taj INDIA (@taj_india007) December 24, 20252017లో వెలుగు చూసిన ఉన్నావ్ కేసులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి (Unnao rape case) పాల్పడడంతో పాటు ఆమెను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో.. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న 2019 దోషిగా తేల్చి.. డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. అయితే.. సెంగర్కు శిక్ష పడక ముందే.. ఎన్నో పరిణామాలు జరిగాయి. అదే ఏడాది కేసు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా.. ఆమె ఇద్దరు బంధువులు మరణించారు. జీవిత ఖైదు పడడంతో 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2027 అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కుల్దీప్కు బెయిల్ దక్కిందని రాజకీయ ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు.. తర్వాత పోయేది తన ప్రాణమేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు న్యాయం జరగలేదు. నా కుమార్తెను బంధించారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అధికారులు (సీఆర్పీఎఫ్)సిబ్బంది బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లి, తాను రోడ్డుపై పడేశారు.సెంగర్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతను సంచరించకూడదని.. వాళ్లను బెదరించే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. నిందితుడికి బెయిల్ రావడంపై అభ్యంతరాలతో నెట్టింట చర్చ నడుస్తోంది. ఉన్నావ్ కేసు టైమ్లైన్జూన్ 4, 2017 – 17 ఏళ్ల బాలిక ఉన్నావ్ జిల్లా, మఖి గ్రామంలో కనిపించకుండా పోయింది. ఆమెను కుల్దీప్ సింగ్ సేంగర్, అతని సోదరుడు అటుల్ సింగ్ ఇతరులు అత్యాచారం చేశారు.జూన్ 21, 2017 – బాధితురాలు ఔరయ్యలో ప్రత్యక్షమైంది.. పోలీసులు ఆమెను రక్షించారుజూన్ 22, 2017 – పోలీసులు IPC సెక్షన్లు 363, 366 కింద కేసు నమోదు చేశారు.ఏప్రిల్ 3, 2018 – బాధితురాలి తండ్రిని సేంగర్ సోదరుడు అటుల్ మరియు అనుచరులు కొట్టి, తర్వాత జైలులో మరణించాడు.ఏప్రిల్ 8, 2018 – బాధితురాలు లక్నోలో CM యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీని తర్వాత కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.ఏప్రిల్ 2018 – CBI దర్యాప్తు ప్రారంభమైంది.జూలై 2019 – బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించారు.డిసెంబర్ 16, 2019 – ఢిల్లీ కోర్టు సేంగర్ను అత్యాచారంలో దోషిగా తేల్చింది.డిసెంబర్ 20, 2019 – సేంగర్కు జీవితఖైదు శిక్ష విధించారు.2020–2024 – సేంగర్ జైలులో శిక్ష అనుభవించాడుడిసెంబర్ 23, 2025 – ఢిల్లీ హైకోర్టు సేంగర్ జీవితఖైదు శిక్షను కొట్టేసి.. కండిషన్ బెయిల్ ఇచ్చింది -
మమ్మల్ని జైలులో పెట్టండి: బాధితుల మొర
దయచేసి మమ్మల్ని జైలులో పెట్టండి అని వేడుకంటున్నారు బాధితులు. అదేంటి తప్పు చేసిన వారిని కదా కారాగారంలో పెడతారు? బాధితులు ఎందుకు జైలుకెళతామంటున్నారు? తమను జైలులో ఉంచమని వేడుకుంటున్నది ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు. కనీసం తమకు అక్కడైనా రక్షణ ఉంటుందన్న భావనతో వారు ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. 2017 నాటి ఉన్నావ్ లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత ఉత్తరప్రదేశ్ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్కు (Kuldeep Singh Sengar) ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బెయిల్ రద్దు చేయాలని కోరింది.సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని బాధితురాలి సోదరి భయాందోళన చెందారు. అతడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తన సోదరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ''నా తండ్రిని హత్య చేశారు, నాపై లైంగికి దాడికి పాల్పడ్డారు. అలాంటి దుర్మార్గుడికి బెయిల్ మంజూరు చేస్తారా, ఇదెక్కడి న్యాయం'' అంటూ బాధితురాలు వాపోయినట్టు వెల్లడించారు. తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు పొంచివుందన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. సెంగార్ విడుదలైన తర్వాత మరింత హాని జరుగుతుందని తామంతా భయపడుతున్నామని చెప్పారు.ఏం చేస్తారో ఎవరికి తెలుసు?''సెంగార్ విషయంలో కోర్టు నిర్ణయం మాకు తీవ్ర నిరాశ కలిగించింది. అతడు ముందు నా మామను, ఆ తర్వాత నా తండ్రిని చంపాడు. ఆ తర్వాత నా సోదరి విషయంలో ఈ సంఘటన జరిగింది. అతడి నుంచి ఇంకా మాకు ప్రమాదం పొంచివుంది. అతడు జైలు నుంచి బయటకు వస్తే నన్ను, నా కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకుంటాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సెంగార్కు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ మా చుట్టూ తిరుగుతూ బెదిరిస్తున్నారు. వాళ్లు మా తమ్ముడిని ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. సెంగార్ జైలు నుంచి విడుదలైన మరుక్షణమే మమ్మల్ని జైల్లో పెట్టండి. కనీసం అక్కడైనా మా ప్రాణాలకు భద్రత ఉంటుంద''ని బాధితురాలి సోదరి ఆవేదన చెందారు.మాకు అన్యాయం జరిగిందిఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధితురాలు తన తల్లి, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానాతో కలిసి ఇండియా గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కోర్టు నిర్ణయంతో అభద్రతా భావానికి లోనయ్యానని బాధితురాలు పేర్కొన్నారు. వ్యవస్థ తనను మోసం చేసిందని వాపోయారు. ''మాకు అన్యాయం జరిగింది. యూపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున అతడిని బెయిల్పై విడుదల చేస్తున్నారు. అతడి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇలాంటి నిందితుడు బయటకు వస్తే మాకు రక్షణ ఎక్కడది? భయపడుతూ బతుకుతున్నాం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనుకుంటే మా వాళ్లు గుర్తుకు వస్తున్నారు. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేసిన సెంగార్ బెయిల్ రద్దు చేయాలి. న్యాయవ్యవస్థపై మాకు ఇంకా నమ్మకం ఉంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ''ని తెలిపారు. చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్కు 5 కోట్లు! -
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లోని గోరఖ్ నాథ్ పోలీస్స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్చంద్ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్నాథ్ పోలీస్స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
యూపీలో పొగమంచు బీభత్సం
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్ఖాన్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్పూర్ మలుపు వద్ద జరిగింది. -
సంచలన అత్యాచార కేసులో నేరస్తుడికి శిక్ష రద్దు, బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం సెంగర్కు బెయిల్ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.అసలు కేసు ఏంటి?2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్లో ఉంది. -
బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!
ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లిక్ యాప్లతో యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు కోట్ల రూపాయలు దండుకున్నారనే విషయాన్ని విన్నాం. అక్రమ సంపాదనతో వారు గడిపే విలాసవంతమైన జీవితం గురించి తెలుసుకున్నాం కానీ, ఉత్తర ప్రదేశ్లోని ఒక యూట్యూబ్ అక్రమ సంపాదన, లంబోర్గిని మెర్సిడెస్ బెంజ్తో సహాలగ్జరీ కార్ల గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అన్నాల్సిందే. ఇంతకీ ఎవరా యూట్యూబర్? తెలుసుకుందాం పదండి.ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హై-ఎండ్ స్పోర్ట్స్కార్లతో నిండిన గ్యారేజ్ చూసి ఈడీ అధికారులే నివ్వెర పోయారు. లంబోర్గిని ఉరుస్, BMW Z4, మెర్సిడెస్-బెంజ్తో సహా నాలుగు హై-ఎండ్ కార్లు వీటిల్లో ఉన్నాయి.బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు మరియు డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు సంస్థకు చెందిన 16 మంది సభ్యుల బృందం బుధవారం నవాబ్గంజ్, ఉన్నావ్ మరియు లక్నోలోని అనురాగ్ ప్రాంగణాలపై దాడి చేసింది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ద్వివేది బెట్టింగ్, జూదం యాప్లను ప్రమోట్ చేశాడు. ఫలితంగా ఎంతో అమాయకులు ఈ యాప్లలో చేరారని, దీంతో చట్టవిరుద్ధ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం స్కై ఎక్స్ఛేంజ్, ఇతర యాప్ల నుండి వచ్చాయట. ఇలా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా లాండరింగ్ చేసి, ఆపై లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు. హవాలా ఆపరేటర్లు, మ్యూల్ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా సేకరించిన నగదు డెలివరీల ద్వారా అనేక అక్రమ ఆస్తిని కూడబెట్టాడు. అతని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో, అతని కుటుంబ సభ్యుల ఖాతాలలో అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. దీన్నిభారతదేశం వెలుపల, ముఖ్యంగా దుబాయ్లో స్థిరాస్తుల కొనుగోలు కూడా చేశాడని ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత డబ్బు అక్రమంగా సంపాదించారో, ఎక్కడ పెట్టుబడి పెట్టారో అనే దానిపై ఈడీ కూపీ లాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా.పశ్చిమ బెంగాల్ సిలిగురిలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. సోషల్మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చట్టవిరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోను కుమార్ ఠాకూర్, విశాల్ భరద్వాజ్ సహా మరికొంతమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఎవరీ అనురాగ్ఉన్నావ్లోని ఖజూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అనురాగ్ ద్వివేది ఒకప్పుడు సాధారణ జీవితాన్ని గడిపాడు. పదేళ్ల క్రితం, సైకిల్పై ప్రయాణించేవాడు. అతని తండ్రి లక్ష్మీనాథ్ ద్వివేది, మాజీ గ్రామ అధిపతి. అనురాగ్ 2017-18లో క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్లలో చేరాడు , డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ల కోసం వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. అతని అంచనాలు మరియు గేమింగ్ కంటెంట్ అతన్ని ప్రజాదరణ పొందేలా చేసింది. అతనికి యూట్యూబ్లో 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు మరియు ఇన్స్టాగ్రామ్లో 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.దుబాయ్లో క్రూయిజ్లో అట్టహాసంగా పెళ్లి, క్లూ దొరికింది2024 నవంబర్ 22న అనురాగ్ దుబాయ్లో లగ్జరీ క్రూయిజ్లో లక్నోకు చెందిన తన ప్రియురాల్ని పెళ్లాడాడు. దాదాపు 100 మంది బంధువులను వివాహానికి విమానాల్లో తరలించాడు. వీరి హోటళ్ళు, ఆహారం అన్ని ఖర్చులను అనురాగ్ భరించాడు. పలు బాలీవుడ్ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. విలాసవంతమైన ఏర్పాట్లను చూసి బంధువులే ఆశ్చర్యపోయారు. ఇదే ఈడీనిదృష్టికి చేరింది. తాజాగా 12 గంటల పాటు భారీ దాడులు నిర్వహించింది సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించి యువతను ఈ యాప్ల వైపు ఆకర్షించాడని ED ఆరోపిస్తోంది. అనురాగ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు భావిస్తున్నారు. విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. (ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్తో సహా ఏడుగురు దుర్మరణం) -
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
ప్రాణాలు తీసిన పొగమంచు
మథుర: చిమ్మచీకట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది. యమునా ఎక్స్ప్రెస్వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు 13 మంది ప్రయాణికుల ప్రాణాలను అనంతలోకాల్లో కలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుఏముందో కనపడనంతగా విపరీతంగా ఉన్న పొగమంచు కారణంగా ఆగ్రా–నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికి వెంట మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వీటిల్లో చిక్కుకుపోయి రక్తమోడుతూ 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.43 మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆగ్రాలోని ఎస్ఎన్ వైద్య బోధనాస్పత్రి, బృందావన్, ఢిల్లీ ఆస్పత్రుల్లో చేర్పించామని మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ చెప్పారు. అయితే 60 మందికిపైగా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. స్వల్ప గాయాలైన ప్రయాణికులను యూపీ ప్రభుత్వ వాహనాల్లో తమతమ గమ్యస్థానాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని బల్దేవ్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై 127 నంబర్ మైలురాయి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసబెట్టి ఢీ.. వెనువెంటనే చెలరేగిన మంటలు క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట తొలుత ఒక బస్సును మరో వాహనం మాత్రమే ఒకదానివెనుక మరోటి ఢీకొన్నాయి. వాటిలోని ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లు ప్రమాదం షాక్ నుంచి తేరుకుని కిందకు దిగి తర్వాత అటుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేలోపే వెనకనుంచి మరికొన్ని వాహనాలు అతివేగంతో ఢీకొట్టాయి. ‘‘కొన్ని వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పక్కకు పోనిద్దామని చూసినా అప్పటికే గాయపడిన ఇతరవాహన ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో మరోదారిలేక వీటినే గుద్దేశారు.ఘటనాస్థలికి నేను వెళ్లిచూసేసరికి అక్కడ దృగ్గోచరత(విజిబిలిటీ) కేవలం మీటర్ మాత్రమే. అంతకుమించి దూరంలో ఏముందో కనిపించనంతా పొగమంచు అలుముకుంది’’అని ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. ఇలా మొత్తం ఎనిమిది బస్సులు, కార్లు, వాహనాలు ఢీకొని తుక్కుతుక్కయ్యాయి. దీంతో ఇంధన ట్యాంక్లు బద్దలై మంటలు చెలరేగాయి. నుజ్జునుజ్జయిన వాహనాల్లో కొందరు, అగ్నికీలల కారణంగా తీవ్రంగా కాలిన గాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.వరుసబెట్టి బస్సులు, కార్లు తగలబడుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాలిపోయిన వాహనాలు కుప్పగా రహదారిపై అడ్డుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, మథుర జిల్లా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్రేన్లతో పక్కకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతటా భీతావహస్థితి.. చిమ్మచీకటి, చలిలో వాహనాల్లో తమతమ సీట్లలో మఫ్లర్లు ధరించి, బెడ్షీట్లు కప్పుకుని ముసుగుతన్ని నిద్రపోతున్న పలువురు అగ్నికీలల్లో కాలి బూడిదయ్యారు. కొందరు శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపుముద్దలుగా మారిపోయారు. వాహనాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగ, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారింది. వేగంగా వాహనాలు ఢీకొన్న శబ్దం సుదూరంలోని తమకూ వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్పారు. మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి కుటుంబసభ్యులు, బంధువుల డీఎన్ఏతో పోల్చిచూశాక పార్థివదేహాలను పోలీసులు అప్పగించనున్నారు.ఇప్పటికే 17 మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. డీఎన్ఏ ప్రక్రియ కోసం రెండు వైద్య బృందాలను నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా వల్లభ్ చెప్పారు. కొందరు మృతుల జాడ గుర్తించారు. వాళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మథుర జిల్లా మేజి్రస్టేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ చెప్పారు. దుర్ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సారథ్యంలో నలుగురు సభ్యులతో మేజి్రస్టియల్ విచారణకు ఆదేశించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనపై ఒక అనామక డ్రైవర్పై తొలుత ఒక కేసు నమోదుచేసి నేరదర్యాప్తు ఆరంభించారు. పిల్లలను బయటకు విసిరేసి.. బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనాలకు హఠాత్తుగా మంటలంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతథా ప్రయత్నించారు. పార్వతి అనే 42 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రాచీ, సన్నీలను వెంటనే బస్సు నుంచి బయటకు విసిరేశారు. కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ లోపలికి పడిపోయారు. ‘‘పిల్లల్ని విసిరేశాక ఆమెను నేను చూడలేదు. ఆమెకు ఏమైందో ఎక్కడుందో అర్ధంకావట్లేదు’’అని ఆమె సమీప బంధువు గుల్జారీ ఏడుస్తూ చెప్పారు. ‘‘క్షతగాత్రులను చేర్పించిన ఆస్పత్రుల చుట్టూ ఆమె జాడ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఆమె ఎక్కడా కన్పించట్లేదు’’అని గుల్జారీ రోదిస్తూ చెప్పారు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలను ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం’’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేíÙయా, క్షతగాత్రులకు తలో రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు. -
ప్రియురాలిని బలిగొని.. పెళ్లి పీటలెక్కిన క్రూరుడు!
ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.బిలాల్ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
పాటలతో పులులు పరార్!
పిలిభిత్: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ ఓ ఉపాయం కనిపెట్టారు. ‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్పూర్, రామ్నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్పూర్లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్ తెలిపారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్: బీజేపీ నేత కుమార్తెకు ఆకతాయిల వేధింపులు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Molestation in daylight! 🚨⚠️Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్షోర్ ఛానెల్లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
యూపీలోని బదౌన్కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక పలువురి దృష్టిని ఆకర్షించింది.దైవిక వరుడితో సాంప్రదాయ వివాహంఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు. ఆమె సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు. మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.बदायूं की पिंकी शर्मा ने भगवान श्रीकृष्ण जी से की शादीबदायूं जिले के इस्लामनगर थाना क्षेत्र के गांव ब्यौर कासिमाबाद में 28 साल की पिंकी शर्मा ने श्रीकृष्ण की प्रतिमा के साथ धूमधाम से विवाह कर लिया। पूरे गांव ने घराती की भूमिका निभाई और परिवार ने विवाह की पूरी रस्में पूरी कीं pic.twitter.com/dtT9fjfARU— Arjun Chaudharyy (@Arjun5chaudhary) December 7, 2025వధువు తండ్రి ఏమన్నారంటే ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి తనతో పాటు వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్బంగారు ఉంగరం దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది. ఇది తన వివాహానికి మరొక సంకేతంగా భావించిందట. తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి. చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు -
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన తోడేలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్లోని కైసర్ గంజ్ ప్రాంతంలో మరోసారి తోడేలు దాడి ఘటన చోటుచేసుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ తోడేలు నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. అటవీ సిబ్బంది, గ్రామస్తులు డ్రోన్ కెమెరాల సాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటన మల్లహన్పుర్వ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. కిరణ్ సంతోష్ దంపతుల నాలుగు నెలల సుభాష్ తల్లి పక్కన నిద్రిస్తుండగా చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి పరుగుతీసింది. వెంటనే అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. లాభం లేకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడను కనుగొనేందుకు యతి్నస్తున్నారు. ‘గతంలో తోడేలు కనిపించినట్లు గ్రామస్తులు చెప్పిన నదీ సమీప ప్రాంతాలు, చెరకు తోటలు సహా అన్ని ప్రాంతాల్లోనూ మా బృందాలు గాలిస్తున్నాయి. శిక్షణ పొందిన షూటర్లను కూడా రంగంలోకి దించాం. ఆ తోడేలును పట్టుకోవడమో లేదా చంపేయడమో చేస్తాం’అని డీఎఫ్వో రామ్ సింగ్ యాదవ్ చెప్పారు. కాగా, మల్లన్పుర్వ గ్రామంలో గత 9 రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. నవంబర్ 28న ఐదేళ్ల బాలుడు స్టార్ తోడేలు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 5న మరో ఐదేళ్ల బాలిక తోడేలు దాడిలో గాయపడింది. సెపె్టంబర్ 9వ తేదీ నుంచి బహ్రెయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది చిన్నారులతోపాటు ఓ వృద్ధుడు చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టారు. ఆయన ఆదేశాలతో షూటర్లు నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు. -
ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం .. దేశంలో తొలి కేసు నమోదు
లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరోపణలపై దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఓ కుటుంబంపై కేసు నమోదైంది. రాంపూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఇద్దరు కుమారులు ఆమిర్ ఖాన్, డానిష్ ఖాన్ దుబాయ్, కువాయిట్లలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. అయితే, నూర్జహాన్ ఎస్ఐఆర్ బూత్ లెవల్ అధికారులకు వాళ్లిద్దరూ రాంపూర్లోని జ్వాలా నగర్లోనే ఉంటున్నట్లు ఫోర్జరీ పత్రాలను ఎన్యుమరేషన్ సందర్భంగా సమర్పించింది. డిజిటైజేషన్ ఫాంలను పరిశీలించిన బీఎల్వోల ఈ విషయాన్ని గుర్తించారు. ఆరా తీయగా వారిద్దరూ విదేశాల్లో ఉంటున్నది నిజమేనని తేలింది. దీంతో, నిజాలను దాచిపెట్టినందుకు నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు. -
మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్తో సంచలనం
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్సెట్ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా. శభాష్ అవధేశ్ రానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్ల వివాహం నవంబర్ 22న ముజఫర్నగర్లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు. నా మనస్సాక్షికి విరుద్ధం.. సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.మా బంధం రూపాయితో మొదలైంది.. తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘చీర్స్’బాబు చిక్కాడు
బహ్రైచ్ (యూపీ): చిరుతపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.. దాన్ని పట్టుకోవడానికి బోను కూడా ఏర్పాటు చేశారు. చిరుత చిక్కలేదు.. కానీ అందులో ఒక మందుబాబు చిక్కుకుపోయాడు. ఫక్రూర్ ప్రాంతంలోని ఉమ్రిదేహ్లో గ్రామంలో బుధవారం ఓ మహిళను చిరుత చంపింది. దీంతో అధికారులు గ్రామం బయట మేకను ఎరగా పెట్టి ఓ బోనును సిద్ధం చేశారు. కానీ, గురువారం రాత్రి, స్థానిక యువకుడు ప్రదీప్ బాగా మందుకొట్టి.. దారిలో ఈ బోనును చూశాడు. ‘బోను ఎంత గట్టిగా ఉందో చూద్దాం.. అనుకున్నాడో.. చిరుత లోపల ఉందో లేదో? చెక్ చేద్దాం అనుకున్నాడో’తెలీదు.. లోపలికి అడుగు పెట్టాడు. అంతే.. ఆటోమేటిక్ తలుపు దడాల్న మూసుకుపోయింది. తాను చిక్కుకున్నానని ఎట్టకేలకు గ్రహించిన ప్రదీప్ గ్రామపెద్దకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న ఈ అటవీ, పోలీసు శాఖాధికారులు హుటాహుటిన రాత్రిపూట ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘ఆ యువకుడిని బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. మందు మత్తులో ఉన్నాడు’.. అన్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్. చివరకు ప్రదీప్ను బయటకు తీసి, తీవ్రంగా హెచ్చరించి ఇంటికి పంపేశారు. -
వధువే వరుడై... రివర్స్ పెళ్లి ఊరేగింపు!
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక పెళ్లి ఊరేగింపు ‘ఆహా’ ‘వోహో’ అనిపించింది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈ పెళ్లి ఊరేగింపు ప్రత్యేకత ఏమిటంటే... రివర్స్ ఊరేగింపు!సంప్రదాయం ప్రకారమైతే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళతాడు. కాని ఈ పెళ్లిలో మాత్రం వధువు అత్తమామల ఇంటికి ఊరేగింపుగా వెళ్లింది. ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును చూడడానికి ప్రజలు తరలి వచ్చారు.వధువే వరుడి ఇంటికి ఊరేగింపుగా వెళ్లాలనేది వధువు తండ్రి రాజేష్ జైస్వాల్ కోరిక. అతడికి అయిదుగు అమ్మాయిలు. కొడుకు లాగే కుమార్తె వివాహా ఊరేగింపును జరుపుకోవాలనే అతడి సుదీర్ఘకాల కల ఫలించింది.ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును హైలెట్ చేస్తూ ‘లడ్కీకి బరాత్’ పేరుతో పెళ్లి పత్రికలు పంచాడు. అప్పటి నుంచే అందరిలో ఆసక్తి మొదలైంది. ఇదిసరేగానీ ఇంతకీ వరుడికి, అతడి తల్లిదండ్రులకీ, బంధువుకు ఈ రివర్స్ బరాత్ కాన్సెప్ట్ నచ్చిందా?‘బ్రహ్మాండంగా’ అంటున్నాడు రాజేష్ జైస్వాల్. వరుడి బంధువులు అత్యంత ఉత్సాహంగా పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్ల పాటు సాగిన ఈ ఊరేగింపులో వధువు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.‘నేను ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోను సేవ్ చేసుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. భవిష్యత్లో నా బిడ్డల పెళ్లి విషయంలో ఇదే కాన్సెప్ట్ అనుసరిస్తాను’ అన్నాడు ఒక తండ్రి.మంచిదే కదా! -
క్రికెటర్ టు ఐఏఎస్ జర్నీ..! బస్సు డ్రైవర్ కొడుకు విజయగాథ..
ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. దాంతో మన డ్రీమ్ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్ ఎగ్జామ్లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్ అయ్యాడు. విధి నీ వల్ల కాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.అతడే ఉత్తరప్రదేశ్కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్కు అవసరమైన కిట్కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. అలా ఇంటర్మీడియెట్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్కేఫ్లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్ఎగ్జామ్ వైపుకి వెళ్లడం అంటే కెరీర్ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
నేడు అయోధ్యలో మహా ఘట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయం పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు. జెండాపై శ్రీరాముడి శౌర్యం, తేజస్సును సూచించేలా సూర్యుడి గుర్తు, ఓం అనే మంత్రం, దేవకాంచన వృక్షం బొమ్మ ఉంటాయి. ఈ పవిత్ర పతాకం రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వికాస సందేశాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయోధ్యలోని సప్తమందిరాన్ని సైతం మోదీ దర్శించుకుంటారు. శేషావతార ఆలయం, మాత అన్నపూర్ణ అలయాల్లోనూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రామలల్లా గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుంటారు. అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. -
రీల్ ఎంత పని చేసింది రాములా!
సోషల్ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్ తన బెడ్రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. यूपी –शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025 ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ వకార్ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్ రూపంలో వైరల్ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. \బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్ డాక్టర్ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది. -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
సొంత వదిననే పెళ్లాడాడు, ఎందుకో తెలుసా?
ఉత్తర ప్రదేశ్లో అరుదైన వివాహం పలువురిని ఆకట్టుకుంటోంది. అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించిన ఘటన నెట్టింట విశేషంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన రాజేశ్ సింగ్ సోదరుడు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో తన సోదరుడితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వదిన వేదనను గమనించాడు. అలాగే చెట్టంత కొడుకును కోల్పోయిన తన తన కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇదే రాజేశ్ను ఆలోచింప చేసింది. అటు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వదినకు,ఇటు కుటుంబానికి ఊరట నివ్వాలని అనుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబంతో చెప్పి, ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనిపై వారిబంధువులతో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. -
కుట్లకు బదులు ‘ఫెవిక్విక్’!
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది. ఫెవిక్విక్తో వైద్యం! ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరం జాగృతి విహార్కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి. కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట. కంగుతిన్న వైద్యులు ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్ను (ఫెవిక్విక్ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశం.. ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ ప్రియుడిలైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనను వేధించిన పురుషుడికి తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కాన్పూర్లో (Kanpur) జరిగిన ఈ ఘటన నెట్టింట సంచలనంగా మారింది. బిల్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు, వివాహతుడు వేధించడం మొదలు పెట్టాడు. ఒంటరిగా పొలానికి వెళ్లిన ఆమెను వెంటపడి, లైంగికంగా వేధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ యువతి తనను తాను రక్షించుకునే చర్యలో భాగంగా అతని నాలుకను కొరికింది. దెబ్బకి నిందితుడి నాలుక తెగిపడింది. దీంతో లబోదిబో మంటూ ఆసుపత్రిలో చేరాడు.స్టోరీ ఏంటీ అంటేకాన్పూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిల్హోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దరియాపూర్ గ్రామానికి చెందిన చంపీ (35) అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం అయింది. అయినా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇంతలో ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో ఇతనితో మాట్లాడటం మానేసింది. ఇది అతగాడికి ఆగ్రహం తెప్పించింది. ఆమెను వేధించడం ప్రారంభించాడు. సమయం కోసం వేచి ఉన్న అతగాడు ఒంటరిగా ఉన్న ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీన్ని ఆమె ప్రతిఘటించింది. అక్కడితో ఆగకుండా అతగాడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో,నాలుకను బలంగా కొరికేసింది. నిందితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.తనకిష్టంలేదని చెప్పినా వినకుండా చంపీ రోజూ తనను వేధిస్తూనే ఉన్నాడని బాధితురాలు ఆరోపించింది. వద్దని వారించినా వినకుండా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపు కేసు నమోదు చేసామని డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
బతికున్నట్లు నిరూపించుకునేందుకు మూడేళ్లు
అలీగఢ్: అధికారిక రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల సరోజ్ దేవి మూడేళ్ల క్రితమే చనిపోయింది..! అసలు చనిపోయింది నా భర్త..నేను కాదు మొర్రో.. అని అప్పటి నుంచి ఆమె అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటూనే ఉంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. చమర్ నగారియా గ్రామానికి చెందిన జగదీశ్ ప్రసాద్ 2020లో చనిపోయాడు. స్థానిక క్లర్కు ఒకరు మృతుల జాబితాలో జగదీశ్ ప్రసాద్ బదులుగా అతడి భార్య సరోజ్ దేవి చనిపోయినట్లుగా 2022 జనవరి ఒకటో తేదీన నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సరోజ్ దేవి ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ అయ్యింది. గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారలేవీ ఆమెకు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడేళ్లయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చివరికి ఈ నెల 15వ తేదీన ఖైర్ సబ్ విడిజనల్ మేజి్రస్టేట్ శిశిర్ కుమార్కు తెహశీల్ దివస్ సందర్భంగా సరోజ్ దేవి తన సమస్యను వివరించింది. తన గుర్తింపును పునరుద్ధరించాలని, తనను తిరిగి బతికించాలని కోరింది. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రాధా న్యం కలిగిన అంశంగా భావించి, పరిష్కా రానికి అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. రికార్డుల్లో ఇందుకు అవసరమైన దిద్దుబాట్లు చేపట్టామని శిశిర్ కుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమై సరోజ్ దేవి త్వరలోనే ప్రభుత్వ రికార్డుల్లో సజీవురాలు అవ్వాలని ఆశిద్దాం.! -
కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు
సోనభద్ర: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోన్ భద్రలో గని కూలిపోయింది. శిథిలాల కింద 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఒక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికీ తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోనభద్రలోని ఒబ్రా పోలీస్స్టేషన్ పరిధిలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఆ ఘటన జరిగింది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పాటు రెండు ప్రైవేట్ కంపెనీల రక్షణ బృందాలు, ఒబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ బృందం రక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బద్రినాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు పరికరాలు, యంత్రాలతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో తొమ్మిది కంప్రెసర్లు పనిచేస్తుండగా, ప్రతి కంప్రెసర్ వద్ద ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. #WATCH | Sonbhadra, UP | Visuals from the spot where around 15 people are feared trapped after a stone mine collapsed yesterday in Sonbhadra. NDRF and SDRF teams are at the spot. One body has been recovered. Rescue operations are underway. (Source: NDRF) pic.twitter.com/0l7E4JL3kc— ANI (@ANI) November 16, 2025 -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
శ్రీనగర్/ఫరీదాబాద్: దేశంలో భారీ మారణ హోమం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఒక ముష్కరమూక గుట్టుమట్లను మూడు రాష్ట్రాల పోలీసు బృందం విజయవంతంగా ఛేదించింది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ముమ్మర సోదాలు, దాడుల్లో ఏకంగా 2,913 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకే–56 రైఫిల్, ఏకే క్రిన్కోవ్ పిస్టల్, ఒక చైనీస్ స్టార్ పిస్టల్, ఇటలీ తయారీ బెరెట్టా పిస్టల్, ఒక సబ్మెషీన్ గన్, బుల్లెట్లు, మందుగుండుతోపాటు పేలుడు సంబంధ ముడి సరుకులు, రసాయనాలు, మండే ధాతు వులు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్స్, టైమర్లు, వాకీటాకీ, మెటల్ షీట్లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నేరమయ డాక్యుమెంట్లతోపాటు ఐఈడీ వంటి పేలుడుపదార్థాల తయారీ విధాన పత్రాలను పోలీసులు పట్టుకెళ్లారు. ఇటీవలికాలంలో ఇంత మొత్తంలో పేలుడు పదార్థాలను కశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వాత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులుసహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్చేశారు. వీళ్లలో ఒక మహిళా డాక్టర్ సైతం ఉండటం గమనార్హం. వీళ్లకు సంబంధించిన నివాసాలు, అద్దె ఇళ్లు, స్థలాల్లో సోదాల తర్వాత భారీ ఎత్తున పేలుడుపదార్థాల జాడను పోలీసులు కనుగొన్నారు. 350 కేజీల పేలుడు పదార్థం, అసాల్ట్ రైఫిల్, హ్యాండ్గన్ జాడను ఆదివారమే కనిపెట్టగా సోమవారం 2,563 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్తోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లలో జరిగిన విస్తృతస్థాయి దాడుల్లో వీళ్లందరినీ అరెస్ట్చేశారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు కశ్మీరీలే కావడం గమనార్హం. అరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మఖ్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహీద్(నౌగమ్), మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్( షోపియాన్), జమీర్ అహ్మద్ అహంగీర్ అలియాస్ ముత్లాషా(వకురా), డాక్టర్ ముజామిల్ అహ్మద్ ఘనీ అలియాస్ ముసేబ్(పుల్వామా), డాక్టర్ ఆదిల్(కుల్గామ్)లతోపాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్ను పోలీసులు అరెస్ట్చేశారు. అత్యంత గౌరవప్రద వైద్యవృత్తిలోని నిపుణులు, విద్యార్థులను ఉగ్రవాదంలోకి దింపి ముష్కరులు వైట్కాలర్ ఉగ్రనెట్వర్క్ను సృష్టించగా దాని గుట్టుమట్లను విజయవంతంగా ఛేదించామని సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ప్రకటించింది. పోస్టర్లతో మొదలై.. అరెస్ట్ల దాకా..కశ్మీర్కు చెందిన ఒక డాక్టర్ అరెస్ట్తో ఈ మొత్తం నెట్వర్క్ అంశం వెలుగులోకి వచ్చింది. కుల్గాంలోని వాన్పురాకు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాటర్ భారత భద్రతాబలగాలను బెదిరిస్తూ శ్రీనగర్, బాన్పొరా నౌగామ్సహా పలుచోట్ల అక్టోబర్ 19న పోస్టర్లు అంటించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇతడిని గుర్తించి పోలీసులు నవంబర్ ఏడో తేదీన అరెస్ట్చేశారు. అతడిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్లోని అనంత్నాగ్లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఆదిల్కు చెందిన లాకర్ను తెరవగా అందులో ఏకే–47 రైఫిల్ లభించింది. మరింతగా విచారించగా ముజామిల్ ఘనీ షకీల్ అనే మరోవైద్యుడు సైతం ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అని తేలింది. తర్వాత అతడినీ అరెస్ట్చేశారు. షకీల్ ఇచ్చిన సమాచారంతో హరియాణాలోని ఫరీదాబాద్లో మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్లోని గదిలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలుచేసి 8 పెద్ద, 4 చిన్న సూట్ కేసులు, ఒక బకెట్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఏకంగా 2,563 కేజీల ఐఈడీ పేలుడుపదార్థాలున్నాయి. దీనిని అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్గా భావిస్తున్నారు. వాస్తవానికి షకీల్ కశ్మీర్లోని పుల్వామాలోని కోలీవాసి. ప్రస్తుతం ఇతను హరియాణాలోని ఆల్–ఫలాహ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు.ఢిల్లీలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే మా లక్ష్యంఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) లో మత కల్లోలాలు, విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా దాడులతో తెగబడాలని పాకిస్తాన్, కశ్మీర్లోని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు వచ్చాయని అరెస్టయిన షకీల్, ఆదిల్ విచారణలో బయటపెట్టారు. అయితే ఏఏ లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారో వాళ్లకు ఇంకా ఆదేశాలు రాలేదు. ‘‘ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో వైద్యులను ఉగ్రకోణంలో ఎవరూ అనుమానించబోరు. అందుకే మమ్మల్నే ఈ పనికి ఎంచుకున్నారు. లక్ష్యాలను నిర్దేశించేదాకా వేచి ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. ఈ ఉగ్రమాడ్యూల్కు పథకరచన పాకిస్తాన్లో జరిగింది. ఆదేశాలు మాత్రం కశ్మీర్ హ్యాండ్లర్ల నుంచే వస్తాయి. మేం గతంలో కశ్మీర్లో డాక్టర్లుగా పనిచేసిన కాలంలో 2018–2021 భద్రతా బలగాలతో పోరాడి గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేశాం’’అని షకీల్, ఆదిల్ పోలీసు విచారణలో వెల్లడించారు. -
ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు..
హథ్రాస్: ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోగా 21 మంది గాయపడ్డారు. అలీగఢ్ నుంచి హథ్రాస్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును అలీగఢ్–ఆగ్రా హైవేపైనున్న సమామాయి గ్రామ సమీపంలో ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 21 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ బైక్ను తప్పించేందుకు ప్రయతి్నంచిన క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెకర్ బస్సు.. యూపీలోని ఉన్నావ్లో బుధవారం అర్ధరాత్రి ఆగ్రా–లక్నో ఎక్స్ప్రెస్వే పైన ప్రైవేట్ డబుల్ డెకర్ బస్సు, కూరగాయలతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. హసన్పూర్లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు లోని 60 మందికి గాను 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, ప్ర యాణికులను బయటకు లాగారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన కొందరిని లక్నోకు తరలించారు. బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నేడు వారణాసికి మోదీ
వారణాసి: ఉత్తరప్రదేశ్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సొంత పార్లమెంటరీ నియో జకవర్గం వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్న ఆయన.. బీహెచ్ఈఎల్ యూనిట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వారణాసికి చెందిన 3,200 మంది ప్రముఖులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. బనారస్ రైల్వేస్టేషన్ను సందర్శిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ఇందులో బనారస్–ఖజురహో, లక్నో– సహరాన్పూర్, ఫిరోజ్పూర్–ఢిల్లీ, ఎర్నాకులం–బెంగళూరు ఉన్నాయి. -
మనుషులపై దూసుకెళ్లిన రైలు.. ఆరుగురి మృతి
-
యూపీలో రైలు ప్రమాదం.. భక్తులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం..మీర్జాపూర్లోని చునర్ రైలు స్టేషన్లో ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన భక్తులు రైలు ఆగిన వెంటనే ప్లాట్ఫామ్ ఉన్న వైపు కాకుండా పట్టాలు ఉన్న వైపునకు దిగారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న భక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాద కారణంగా రైల్వేస్టేషన్లో పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు. Aleast six killed at Chunar Railway Station in Mirzapur on Wednesday morning, when several pilgrims were run over by the Kalka Express while crossing the railway tracks. The victims were on their way to Varanasi to take part in Kartik Purnima festivities. pic.twitter.com/df6PZSCmw5— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 5, 2025ఇదిలా ఉండగా.. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. నిన్న ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రైలు కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్పుర్కు వెళ్తుండగా.. గటోరా- బిలాస్పుర్ స్టేషన్ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.🚨 Mirzapur Accident | Tragic Incident in Chunar on Kartik Purnima — 4 Devotees Killed After Being Hit by Train While Crossing Railway Tracks Tribute 📷 #Mirzapur #Chunar #KartikPurnima #UttarPradesh #TrainAccident #BreakingNews #IndiaNews https://t.co/SKsHmX4r07 pic.twitter.com/i3crPQq0Hz— Indian Observer (@ag_Journalist) November 5, 2025ఘటనా స్థలంలో రైల్వేశాఖ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది. -
మూకదాడి బాధితుల పరిహారానికి సుప్రీం నో
న్యూఢిల్లీ: మూకదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జమియత్ ఉలేమా–ఇ–హింద్ వేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలంటూ పిటిషనర్ను అలహాబాద్ హైకోర్టు ఆదేశించడాన్ని సమర్థించింది. దీనిపై తాము జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేసింది. తెహ్సీన్ పూనావాలా కేసులో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని జమియత్ ఉలేమా–ఇ– హింద్ తదితర పిటిషనర్లు తెలిపారు. అయితే, జమియాత్ ఉలేమా తదితరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేయ డంపై అలహాబాద్ హైకోర్టు జూలై 15వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా తప్పు బట్టింది. మూకదాడి ప్రత్యేకమైన ఘటన అయినందున పిల్గా స్వీకరించలేమని తెలిపింది. అయితే, అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాల అమలు గురించి బాధితులు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. -
రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన అమర్ సింగ్ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా తోడయ్యారు. తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?అభిజీత్ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పొట్టలోని పేగులు బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్ తల్లి నీలం సింగ్ చందేల్ వాపోయారు. అయితే చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం అయోధ్య ఆదివారం 2025 దీపోత్సవంలో సరికొత్తగారెండు ప్రపంచ రికార్డును సృష్టించింది. 2.6 మిలియన్ల దీపాల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో గత ఏడాది అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తిరిగ రాసింది. రెండోది 2,128 మంది పూజారులు , భక్తులు ఒకేసారి మా సరయు ఆరతి ప్రదర్శించడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బాణా సంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు కాంతులతో వెలిగిపోయింది.వేలాది మంది భక్తులు, యాత్రికులు , సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఇది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో లక్షలాది దీపాలు (మట్టి దీపాలు) సరయు నదీ ఒడ్డు దీదీప్య మానంగా వెలిగిపోయింది. భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని పంచింది. ఈ సందర్బంగా ఈ ఏడాది 2100 మంది భక్తులు సరయూ నదీ తీరాన దీపాలను వెలిగించి తరించారు. అయోధ్య అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన ఘాట్లలో 26,17,215 దివ్య దీపాలు వెలిగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్ను ధ్రువీకరించారు. ఇది 14 సంవత్సరాల వనవాసం ,రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని గౌరవంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.2017లో మొదలైన ఈ వేడుక ఇలా సాగింది. యూపీ ముఖ్యమంత్రి యోగి నాయత్వంలో 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2018లో 3.01 లక్షలు, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షలు, 2023లో 22.23 లక్షలు , 2024లో 25.12 లక్షలకు చేరింది. 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించిన సంగతి తె లిసిందే. Ayodhya lit up with 26 lakh diyas this Deepotsav 2025, making two world records! 🪔Diwali celebrates Lord Ram’s return and the victory of light over darkness. ✨Happy Deepawali! 🪔 💫#Diwali #Deepotsav #Ayodhyapic.twitter.com/oaQLbLWsuR— Swapnil Srivastav (@theswapnilsri) October 20, 2025 -
పాక్లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది. -
చరిత్ర సృష్టించిన రింకూ సింగ్
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.దిగ్గజాలను దాటేసి..తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.ఆంధ్ర క్రికెటర్ల శతకాలుఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రింకూ సింగ్ భారీ శతకంఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.యూపీదే పైచేయిఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు రింకూ రెడ్బాల్ క్రికెట్లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
Ranji Trophy: దేశవాళీ ధమాకా
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 91వ సీజన్కు నేడు తెరలేవనుంది. ఎలైట్ గ్రూప్లో 32 జట్లు, ప్లేట్ గ్రూప్లో 6 టీమ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. మొత్తం 138 మ్యాచ్లు జరగనుండగా... రెండు దశల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఒకప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు రంజీ ట్రోఫీలో రాణించడం తప్పనిసరి కాగా... ఇప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు వీలు ఉంటే దేశవాళీల్లో ఆడాలని బీసీసీఐ సూచించింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మినహా... టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడేది లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ ప్రదర్శనతో ఇప్పటికిప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే అయినా... సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇది చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. నేటి నుంచి నవంబర్ 19 వరకు తొలి దశ మ్యాచ్లు జరగనుండగా... ఆ తర్వాత నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ జరగనుంది. అనంతరం డిసెంబర్ 26 నుంచి జనవరి 18 వరకు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఫైనల్తో సీజన్ ముగియనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. ఎనిమిదేసి జట్లు ఉన్న ఒక్కో గ్రూప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. పలువురు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు... యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టు మరో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. కరుణ్ నాయర్ తిరిగి కర్ణాటక జట్టులో చేరగా... తొమ్మిదేళ్ల తర్వాత జలజ్ సక్సేనా కేరళ నుంచి మహారాష్ట్రకు మారాడు. పృథ్వీ షా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించనుండగా... ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రిపుర తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం... » ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన బంతికి గాయపడిన పంత్ అప్పటి నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. రంజీ ట్రోఫీ తొలి పోరులో ఢిల్లీ జట్టు హైదరాబాద్తో తలపడనుండగా... ఢిల్లీ సెలెక్టర్లు 24 మందితో ప్రకటించిన జట్టులో పంత్ను ఎంపిక చేయలేదు. దీన్ని బట్టి అతడు ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ నెల అఖరులో హిమాచల్ ప్రదేశ్తో జరిగే మ్యాచ్ వరకు పంత్ జట్టులో చేరొచ్చు. వచ్చే నెల 14 నుంచి ప్రపంచ చాంపియన్ దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. దానికి ముందు పంత్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలెక్టర్లు ఆశిస్తున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్టు తొలి పోరులో నాగాలాండ్తో తలపడనుంది. దేశవాళీల్లో స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న విదర్భ రంజీ ట్రోఫీతో పాటు... ఇటీవల ఇరానీ కప్ను సైతం కైవసం చేసుకొని జోరు మీదుంది. గత సీజన్ రన్నరప్ కేరళ, సౌరాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై జట్లు కూడా టైటిల్పై కన్నేశాయి. » గత సీజన్లో ముంబై జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహరించగా... ఇప్పుడు ఆ బాధ్యతలు శార్దుల్ ఠాకూర్ తీసుకున్నాడు. భారత టెస్టు జట్టులో పునరాగమనంపై ఇంకా ఆశలు పెట్టుకున్న రహానే... ప్లేయర్గా కొనసాగనున్నాడు. సహచరుడు పుజారా కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన కామెంటేటర్ అవతారమెత్తగా... రహానే మాత్రం ఇంకా పోరాడేందుకు సిద్ధమయ్యాడు. » గత సీజన్లో రంజీ మ్యాచ్లు ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపక బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... ఈ సీజన్లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రజత్ పాటీదార్ దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరి వీరిద్దరూ రంజీ సీజన్లో తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలి. » సుదీర్ఘ కాలంగా భారత రిజర్వ్ ఓపెనర్గా జట్టుతో పాటు ఉన్న బెంగాల్కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ కూడా తన బ్యాట్ పవర్ చూపేందుకు రెడీ అవుతున్నాడు. » రవిచంద్రన్ అశి్వన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... తదుపరి తరం స్పిన్నర్ ఎవరనేది రంజీ ట్రోఫీ ద్వారా తేలనుంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టిన విదర్భ స్పిన్ ఆల్రౌండర్ హర్‡్ష దూబేపై అందరి దృష్టి నిలవనుంది. రాజస్తాన్కు చెందిన మానవ్ సుతార్, ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. » సీజన్ ఆరంభానికి ముందు పలువురు యువ ఆటగాళ్లు ఆకర్షిస్తున్నారు. స్మరణ్ (కర్ణాటక), ఆండ్రె సిద్ధార్థ్ (తమిళనాడు), యశ్ ధుల్ (ఢిల్లీ), ప్రియాన్ష్ఆర్య (ఢిల్లీ), వైభవ్ సూర్యవంశీ (బిహార్), ఆయుశ్ మాత్రే (ముంబై), దానిశ్ మాలేవర్ (విదర్భ) వంటి వాళ్లు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా... దాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. » గత రంజీ సీజన్లో తన వేగంతో ఆకట్టుకున్న కేరళ పేసర్ ఎడెన్ టామ్తో పాటు, గుర్నూర్ బ్రార్, గుర్జపనీత్ సింగ్పై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. » దేశవాళీల్లో రాణించడం ద్వారానే ఎనిమిదేళ్ల తర్వత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ స్ఫూర్తిగా... పలువురు ఆటగాళ్లు రెండో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా ఇందులో ఉన్నారు. ఈ సీజన్లో పరుగుల వరద పారించి తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. » 38 ఏళ్ల జలజ్ సక్సేనా ఈ సీజన్లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత తొమ్మిది సీజన్లుగా కేరళ తరఫున ఆడిన జలజ్ రాకతో... మహారాష్ట్ర బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది. టీమిండియా ప్లేయర్ జితేశ్ శర్మ విదర్భ నుంచి బరోడాకు మారాడు. » రెండేళ్లుగా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన షమీ... పునరాగమనంపై ఆశలు పెట్టుకున్నాడు. ఢిల్లీ x హైదరాబాద్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై వీరోచిత ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించిన ఠాకూర్ తిలక్ వర్మ... హైదరాబాద్ రంజీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం మొదలుకానున్న మ్యాచ్లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోరులో తిలక్తో పాటు తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమతేజ, మిలింద్, రాహుల్ సింగ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీ జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఆయశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టులో యశ్ ధుల్, ప్రియాన్ష్ఆర్య, అనూజ్ రావత్, నితీశ్ రాణా, నవ్దీప్ సైనీ కీలకం కానున్నారు.రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ల వివరాలుగ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్, బరోడా. గ్రూప్‘బి’: కర్ణాటక, సౌరాష్ట్ర, చండీగఢ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘సి’: గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్, సర్వీసెస్, త్రిపుర, రైల్వేస్, బెంగాల్, హరియాణా. గ్రూప్ ‘డి’: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్. ఉత్తరప్రదేశ్ x ఆంధ్రగ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ప్రారంభం కానున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో ఆంధ్ర జట్టు తలపడనుంది. కాన్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. కెప్టెన్ రికీ భుయ్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, షేక్ రషీద్, అశ్విన్ హెబ్బర్, సత్యనారాయణ రాజు, చీపురుపల్లి స్టీఫెన్, విజయ్, శశికాంత్ ఆంధ్ర జట్టుకు కీలకం కాగా... ఉత్తరప్రదేశ్ జట్టు కరణ్ శర్మ, ఆర్యన్ జుయల్, ప్రియమ్ గార్గ్, విప్రాజ్ నిగమ్, శివమ్ మావి, రింకూ సింగ్పై ఆశలు పెట్టుకుంది. -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్షిప్లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్షిప్లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య.. ఐదుగురి దుర్మరణం
లక్నో: భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది(Ayodhya Blast). ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయోధ్య సమీంలోని పగ్లాభారీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోగా.. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని.. శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. अयोध्या के पुरा कलंदर में एक ज़ोरदार ब्लास्ट से एक मकान ढह गया। राम कुमार के परिवार के 5 लोगों की दर्दनाक मौत हो गई। कहा जा रहा है अवैध पटाखे बन रहे थे या सिलेंडर ब्लास्ट हुआ जांच में साफ होगा।#Ayodhya@ayodhya_police pic.twitter.com/2BX9IRqAhp— Hussain Rizvi हुसैन حسین رضوی (@TheHussainRizvi) October 10, 2025గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెజర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే.. పేలుడు జరిగిన చోట గన్పౌడర్, పటాకుల మిగులు భాగాలు బయటపడ్డాయి. దీంతో అనుమతులు లేకుండా బాణాసంచాలు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి యాజమానిని రామ్కుమార్ కసౌధన్ అలియాస్ పప్పు గుప్తాగా పోలీసులు నిర్ధారించారు. ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే ఇంట్లో పేలుడు జరిగి యజమాని భార్య, తల్లి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు(CM Yogi on Ayodhya Blast). ఘటనపై త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. దీంతో క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మొన్నే కాన్పూర్లో స్కూటర్ పేలుడు సంభవించి(Kanpur Scooter Blast).. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొలుత బాణాసంచాల వల్లే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు.. అది సిలిండర్ బ్లాస్ట్ అని తాజాగా ప్రకటించారు. ఈ రెండు పేలుళ్లపై కుట్ర కోణం ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని ఖండించారు.ఇదీ చదవండి: శబరిమలై వ్యవహారంలో మరో ట్విస్ట్ -
రన్వే పైనుంచి జారి పొదల్లోకి...
ఫరూఖాబాద్: ప్రైవేట్ జెట్ విమానమొకటి రన్ వే పైనుంచి జారి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా మహ్మదాబాద్లో చోటుచేసుకుంది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఇద్దరు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జెట్ సర్వీస్ ఏవియేషన్కు చెందిన విమానం ఉదయం 10.30 గంటల సమయంలో రన్ వేపై ల్యాండయిన అనంతరం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ఓ బీర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
నా భార్య నాగిని!
సీతాపూర్ (యూపీ): అక్టోబర్ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభి షేక్ ఆనంద్ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్ తహ సీల్లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్ కూడా కలెక్టర్ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్... స్... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు.పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు. -
దొంగనుకుని దళితుడ్ని చావబాదారు
రాయ్బరేలీ: రాత్రి వేళ చోరీలు జరక్కుండా గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు..తామడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో, దొంగగా అనుమానించి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. తీవ్రమైన గాయాలు, రక్తస్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఉంఛాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత బుధవారం చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగు చూ సింది. డ్రోన్లతో సర్వే చేసి మరీ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి సంచరిస్తోందంటూ కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పుకార్లు వస్తున్నాయి. దీంతో, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి ఏరి యాలో వారే గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. బుధ వారం రాత్రి జమునాపూర్ క్రాసింగ్ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు నిలదీశారు. తమ ప్రశ్నలకు అతడిచ్చిన సమాధా నాలతో సంతృప్తి చెందని గ్రామస్తుల గుంపు అతడిపై దాడికి పాల్పడింది. విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఈశ్వర్దాస్పూర్ రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లి వదిలేశారు. గురువారం ఉదయం పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫతేహ్పూర్కు చెందిన హరిఓం(40)అనే దళితుడిగా అతడిని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఘటనపై సమాచారం అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ కుమార్ సిన్హా వెల్లడించారు. దారుణంలో పాలుపంచుకున్న మరికొందరిని సైతం గుర్తించి, అరెస్ట్ చేసే పనిలో ఉన్నామన్నారు. -
మ్యాగీ పిచ్చి: ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మి.. విషయం తెలిసి తల్లి భావోద్వేగం
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని, కాన్పూర్లోని శాస్త్రి నగర్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్మెంట్ను రింగ్ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.చదవండి : కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది. -
యూపీలో ఘోరం.. కుప్పకూలిన కోచింగ్ సెంటర్
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్పూర్ మండి రోడ్లోని ఒక భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఈ పేలుడు తీవ్రతకు భవనం పైకప్పుతో సహా ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. పేలుడు గ్యాస్ సిలిండర్ కారణామా? షార్ట్ సర్క్యూటా? లేదా పేలుడు పదార్థం వల్ల ఈ ఘటన జరిగిందా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళ వివాహం.. మొదటి రాత్రికి ముందే..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళకు వివాహం జరిపించారు. తీరా పెళ్లి తర్వాత రోజే.. హనీమూన్కు ముందే సదరు వ్యక్తి మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని కుచ్ముచ్ గ్రామానికి చెందిన సంగ్రురామ్(75) భార్య గతేదాడి చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే, తనకు తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, జలల్పూర్ ప్రాంతానికి చెందిన మన్బవతిని(35) వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమెకు అప్పటికే వివాహం కాగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సెప్టెంబర్ 29వ తేదీన వారికి వివాహం జరిగింది.ఇక, ఈ జంట కోర్టులో వివాహాన్ని నమోదు చేసుకున్నారు. తరువాత స్థానిక ఆలయంలో సాంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం, వధువు మన్భవతి మాట్లాడుతూ.. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నా పిల్లలను పోషించే బాధ్యత సంగ్రురామ్ చూసుకుంటానని చెప్పారు. నన్ను ఇంటి బాధ్యతలు చూసుకోమన్నారు. తనకు ఉన్న ఆస్తిని కూడా పిల్లల పేరు మీదకు మారుస్తానని చెప్పినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ తమ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సరికి సంగ్రురామ్.. చనిపోయి ఉన్నాడు. దీంతో, స్థానికుల సాయంతో అతడికి ఆసుపత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, ఒక్కసారిగా మన్బవతిని షాక్కు గురైంది. అనంతరం, అతడికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సంగు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. పోస్టుమార్టం చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, మొదటి రాత్రి ముందు రోజే సంగ్రురామ్ ఇలా మృతి చెందడం పట్ల స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి చితిని కర్రతో కొట్టి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదనే కోపంతో ఓ వ్యక్తి చనిపోయిన తన స్నేహితుడి అంత్యక్రియల చితిపై కర్రతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతుడు అతని వద్ద నుండి తీసుకున్న రూ.50 వేలు రుణాన్ని తిరిగి చెల్లించకుండా మరణించడంతో.. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి కర్రతో వచ్చి మరణించిన వ్యక్తిని కొట్టడంతో మృతుని భార్య, పిల్లలతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది.గతం కొంతకాలంగా స్నేహితుల మధ్య రుణ వివాదం జరుగుతోంది. మృతుడు రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనుల కోసం రుణం తీసుకున్నాడు. పంట అమ్మిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. కానీ అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించాడు. తన స్నేహితుడు ఉద్దేశపూర్వకంగానే డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కలియుగం.. స్నేహం కూడా వ్యాపారంగా మారింది” అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు “కోపం అర్థం చేసుకోగలిగినదే.. కానీ చితిపై కూడా దాడి చేయడం? అతి క్రూరం” అంటూ కామెంట్లు పెడుతున్నారు."Debt Beyond Death"I watched a video — it shocked me… and made me laugh too.A man was standing by a burning funeral pyre, furiously beating it with a stick and yelling:👉 “You won’t even find peace in hell — I’ll see you there too!”The reason for his rage?Unpaid debt.… pic.twitter.com/g5h41hnVPV— Manish Kumar ad 🇮🇳 (@ma427906099) September 28, 2025 -
బహరాయిచ్లో మళ్లీ కలకలం.. వణికిస్తున్న తోడేళ్లు
బహరాయిచ్: ఉత్తరప్రదేశ్ బహరాయిచ్లో తోడేళ్లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం సాయంత్రం కైసర్గంజ్ ప్రాంతంలోని ఓ మగ తోడేలు కదలికలను గుర్తించారు. లభ్యమైన తోడేలు కళేబరం.. నరభక్షక తోడేలుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ధ్రువీకరించగమంటూ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెల్లడించారు.ఇటీవల గ్రామాల్లో తోడేళ్ల దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే తోడేళ్ల దాడుల్లో నలుగురు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో స్థానికులపై తోడేళ్ల దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో తోడేళ్ల బెడదను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టారు.ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్లో గత ఏడాది నుంచి నరభక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు గతంలో అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మళ్లీ ఆదివారం( సెప్టెంబర్ 29) సాయంత్రం తోడేలు కదలికలను గుర్తించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు గతంలో ఆరు తోడేళ్లను పట్టుకున్నారు. -
బారాబంకీ, మౌ జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు
బరేలీ/బారాబంకీ/వారణాసి: ఉత్తరప్రదేశ్లో ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమంపై తలెత్తిన వివాదం ముదిరింది. శుక్రవారం బరేలీలో ఆందోళనకారులు పోలీసులతో తలపడటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి ఇల్లిల్లూ సోదాలు జరిపి గొడవలకు కారణమైన వారిని అరెస్ట్ చేశారు. పొలీసులపై రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనల్లో పాలుపంచుకున్న 500 మందిని గర్తించామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందంటూ 8 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే, పొరుగునున్న బారాబంకీలోని ఫైజుల్లాగంజ్లో ‘ఐ లవ్ మహ్మద్’అని ఉన్న బ్యానర్ను తొలగించారన్న వార్తలు రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యానర్ చించినట్లు ఆరోపణలున్న ధన్ని అనే వాచ్మన్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అక్కడికి సమీపంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయ్యింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఫైజుల్లాగంజ్లో శాంతియుత వాతావరణం నెలకొందని ఎస్పీ అజయ్ సింగ్ చెప్పారు. అదేవిధంగా, మౌ జిల్లా నయీ బజార్ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ‘ఐ లవ్ మహ్మద్’అని నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఘటన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని మౌ ఎస్పీ ఇలమారన్ చెప్పారు. వారణాసిలోని సిగ్రాలో ఈ నెల 22వ తేదీన ‘ఐ లవ్ మహ్మద్’పోస్టర్లు, బ్యానర్లు చేబూని, నినాదాలతో ర్యాలీ చేపట్టిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర వర్గాల ప్రజల్లో తమ ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు కొందరు ఈ కొత్త ఒరవడిని మొదలుపెట్టారని పోలీసులు అంటున్నారు.మత పెద్ద రజా అరెస్ట్బరేలీలో ఘర్షణలకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఇత్తెహాద్–ఇ– మిల్లత్ పరిషత్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఐ లవ్ మహ్మద్’కు మద్దతుగా రజా ర్యాలీకి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసిందని, ప్రణాళిక ప్రకారం జరిగిన గొడవలకు ప్రధాన సూత్రధారి ఈయనేనని ఉన్నతాధికారులు తెలిపారు. రజా సహా 8 మందిని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. వీడియో ఫుటేజీలో గుర్తించిన మరో 36 మంది వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై రజా, మరో 25 మందితోపాటు గుర్తు తెలియని మరో 200 మందిపై ప్రేమ్నగర్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆందోళనకారులు ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంను చించివేశారన్నారు. బరేలీలో శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, స్కూళ్లు, దుకాణాలు యథావిథిగా పనిచేశాయని డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని తెలిపారు. ఘర్షణలపై దర్యాప్తులో కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించాలని చూసే వారిపై గూండా చట్టం, జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. బరేలీ నగరంలో 8 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
వాలు జడ తోలు బెల్టు!
ఆయనో స్కూల్కు హెడ్మాస్టర్. ఓ మహిళా టీచర్ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్కు హెచ్ఎం వెళ్లారు. చేతిలో ఫైల్ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..సీతాపూర్ హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్ను వర్మ బెల్ట్తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్పై సంచలన ఆరోపణలకు దిగారామె.అవంతిక గుప్తా మహ్ముదాబాద్లోని నద్వా ప్రైమరీ స్కూల్కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్గా రావడం లేదు.దీంతో.. హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..హెచ్ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.UP govt headmaster slams file, flogs BSA using beltIn UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025 ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్ఏ అఖిలేష్ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
‘ఐ లవ్ మహ్మద్’ ర్యాలీ వివాదం
బరేలీ: ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమానికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ చీఫ్, మత పెద్ద తౌకీర్ రజా ఖాన్ చేసిన ప్రకటన యూపీలో బరేలీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందుకు కారకులుగా గుర్తించిన డజను మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏదేమైనా ర్యాలీని నిర్వహిస్తామంటూ గురువారం ప్రకటించిన రజా ఖాన్.. అధికారులు అనుమతి ఇవ్వనందున ర్యాలీని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రకటించారు. దీంతో, ‘ఐ లవ్ మహ్మద్ అని రాసిన పోస్టర్లను చేబూనిన జనం పెద్ద సంఖ్యలో కొత్వాలీ ఏరియాలోని రజా ఖాన్ నివాసం, మసీదు వద్ద గుమికూడారు. ప్రదర్శనను వాయిదా వేయడంపై ఆగ్రహంతో ఇస్లామియా ఇంటర్ కాలేజీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్నాం. దీంతో రాళ్లు రువ్వుతూ, వాహనాలు, దుకాణాలపై దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టాం’అని పోలీసు అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ను అహ్మద్ రజా ఖాన్ ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం కలిగిన సున్నీ ఇస్లాంలోని బెరేల్వీ వర్గాన్ని స్థాపించింది ఈయనే. ఈయన వారసుడే తౌకీర్ రజా ఖాన్. కాగా, ‘ఐ లవ్ మహ్మద్’నినాదంలో ఎలాంటి తప్పూ లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఇదిగో ఇ–రిక్షా సోషల్ మీడియా సెంటర్!‘
అప్పు చేసి ఇ–రిక్షా కొన్నాడు సుమిత్ తండ్రి. ఆ అప్పు తీరకుండానే ఆయన మంచం పట్టాడు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్ ప్రజాపతి( Sumit Prajapati) కు ఇ–రిక్షాయే దిక్కు అయింది. దిక్సూచి అయింది. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 22 సంవత్సరాల సుమిత్ ప్రజాపతి ఇ–రిక్షాను సోషల్ మీడియా సెంటర్గా చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు...గ్యాస్స్టవ్ వెలిగించే క్రమంలో సుమిత్ తండ్రి అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం వల్ల అతడు రిక్షా నడపలేని పరిస్థితి. మరోవైపు రిక్షా కోసం చేసిన అప్పులు. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తూనే ‘ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.పేదరికం వల్ల చిన్నప్పుడు పొలం పనులు, కూలీ పనులు చేశాడు సుమిత్. కార్లు కడిగాడు. కూరగాయలు అమ్మాడు. తన పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదని ఎన్నో పనులు చేశాడు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అయితే విధి నిర్ణయం మరోలా ఉంది’ అంటాడు సుమిత్.తండ్రికి ఆసరాగా ఉండడానికి ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరాడు. చెప్పిన జీతంలో సగం జీతం కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగం మానేయ్యడమే కాదు ఇక ఎప్పుడూ ఉద్యోగం చేయకూడదనుకున్నాడు. చాలామంది యువకులలాగే సుమిత్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు. తండ్రి ప్రమాదానికి గురి కావడంతో ఇ–రిక్షా నడపాలనుకున్నాడు సుమిత్. ‘ఇ–రిక్షా, సోషల్ మీడియాను ఒకేచోట చేరిస్తే’ అనే దిశలో ఆలోచించాడు. కార్లు, బైక్లపై కంటెంట్ను క్రియేట్ చేసేవారు ఉన్నారు. ఇ–రిక్షాపై ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది అనుకున్నాడు. View this post on Instagram A post shared by Sumit Prajapati (@sumit_prajapati87) ‘నా రిక్షాను స్టార్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను’ నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుమిత్. కంటెంట్ క్రియేటర్గా అతడి వైరల్ మూమెంట్ గురించి చెప్పుకోవాలంటే...తన కుటుంబసభ్యులు ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ వచ్చాయి.‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వీడియోలు ఏమిటి! నిన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వెక్కిరిస్తారు’ అని తండ్రి అన్నాడు. కొన్ని అనుభవాల తరువాత ఆయన మాటలు వాస్తవం అనే విషయం అర్థమైంది. ‘ప్రజలు చిన్న చూపు చూడకుండా, అభిమానించేలా కంటెంట్ క్రియేషన్ చేయాలి’ అనుకున్నాడు. నవ్వించడానికి ఒకప్పుడు ఏవేవో వీడియోలు చేసిన సుమిత్ ఆ తరువాత రూట్ మార్చాడు. వ్యక్తిత్వవికాస వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రాండ్లకు సంబంధించి రిక్షాలో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.‘ఏ పనీ చిన్నది కాదు. మనం చేసే ప్రతి పని పెద్దదే. గౌరవనీయమైనదే’... ఇలాంటి మాటలెన్నో తన వ్యక్తిత్వ వికాస వీడియోల్లో వినిపిస్తుంటాడు సుమిత్. తాజా విషయానికి వస్తే...తనకు వచ్చే ఆదాయంతో సుమిత్ కుటుంబ అప్పులన్నీ తీర్చాడు. చెల్లిని చదివిస్తున్నాడు. సుమిత్కు ఇన్స్టాగ్రామ్లో 87వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.చదవండి : ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీమొదట చిన్న లక్ష్యాలు... ఆ తరువాత పెద్ద లక్ష్యాలు ఇక నా పనిఅయిపోయినట్లే’ అని నేను ఎప్పుడూ నిరాశపడలేదు. నిలదొక్కుకోవడం కోసం ఎంత చిన్న పనైనా చేయాలనుకున్నాను. కూలి పనులు కూడా చేశాను. ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాను. అప్పుల భారంతో మా సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి ఆ ఇంటిని కొనాలనేది నా కల. – సుమిత్ ప్రజాపతి -
‘దటీజ్ యోగి’.. పోలీసింగ్లో సరికొత్త అధ్యాయం!
ఉత్తర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్కౌంటర్లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్పై వెళ్తున ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది. ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.उक्त सम्बन्ध में श्रीमती उपासना पाण्डेय, सहायक पुलिस आयुक्त नन्दग्राम की वीडियो बाइट-@Uppolice https://t.co/VOUOjuBHf8 pic.twitter.com/x9XCNGSqwh— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 22, 2025యోగి ప్రశంసలు దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్ను మహిళా పీఎస్ స్టేషన్ హెడ్ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్లో మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్కౌంటర్లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్లలో 63 మంది క్రిమినల్స్ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త! -
ప్రియుడి కోసం స్వాతి స్కెచ్.. మతిపోవాల్సిందే!
వివాహేతర సంబంధాల మోజుతో భర్తలను, భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య చూస్తున్నవే. అలాగే.. ప్రేమ మత్తులో తల్లిదండ్రులకు, అయిన వాళ్లకూ ద్రోహాన్ని తలపెడుతున్న జంటలనూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్వాతి తన ప్రేమికుడి కోసం చేసిన పని మాత్రం.. నెక్ట్స్ లెవల్ అంతే!.స్వాతి(21).. స్థానికంగా సెలూన్ నడిపించే మనోజ్(22) అనే యువకుడ్ని గాఢంగా ప్రేమించింది. కానీ, ఇంట్లో వాళ్లు తమ ప్రేమకు ఒప్పుకోరని భయపడింది. ఈ క్రమంలో రోజూ రాత్రి ఇంట్లో వాళ్లు తినే తిండిలో మత్తు మందు మాత్రలు కలుపుతూ వచ్చింది. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో ఊరిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఏకాంతంగా గడపం చేస్తూ వచ్చింది. అలా.. ఓ రోజు స్వాతి కదలికలపై ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. దీంతో..ఆమె మనోజ్ను సలహా అడిగింది. గప్చుప్గా ఇంట్లో వాళ్లను చంపేయమని చెప్పాడు మనోజ్. స్వాతి అన్నంత పని చేయబోయింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. దీంతో.. ఆ ప్రేమ జంట ఓ క్రైమ్ షో స్పూర్తితో మరో భయంకరమైన స్కెచ్ వేసింది.తమ ప్లాన్ను మనోజ్ తన దగ్గరి బంధువు మాంజిత్కు సాయం కోరాడు. మాంజిత్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. సెప్టెంబర్ 17వ తేదీన.. స్థానికంగా పెయింటింగ్ పనులు చేసే యోగేష్.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాడు. అతన్ని గమనించి మనోజ్.. మద్యం ఆఫర్ చేసి అతన్ని జనసంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలవడంతో యోగేష్ సోయి లేకుండా పడిపోయాడు. ఆపై అతన్ని మనోజ్, మాంజిత్లు తమ బైక్పై ఎక్కించుకుని దగ్గర్లోని ఓ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక రాళ్లతో కొట్టి యోగేష్ను దారుణంగా హతమార్చారు. ఆపై యోగేష్ ఫోన్ నుంచి స్వాతి సోదరుడు గౌరవ్కు ఫోన్ చేసి.. కాల్ కట్ చేశారు. అటుపై పోలీస్ హెల్ప్లైన్కు కాల్ చేసి ‘‘యోగేష్, కపిల్(స్వాతి సోదరులు), శోభారామ్(స్వాతి తండ్రి) తనపై దాడి చేస్తున్నారని.. తనను కాపాడాలని’’ వేడుకుంటూ ఫోన్ కట్ చేసి యోగేష్ డెడ్బాడీ దగ్గర పడేసి వెళ్లిపోయారు.తెల్లారి స్మశానంలో శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలతో.. ఈ కేసులో పోలీసులు స్వాతి తండ్రి, సోదరులే నిందితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో.. యోగేష్కు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా తండ్రి, సోదరులు అరెస్ట్ అయినా స్వాతి ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండిపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో.. ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె మనోజ్ను రహస్యంగా కలవడంతో.. అనుమానం అతనిపైకి మళ్లింది. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో.. యోగేష్ హత్యలో మనోజ్ పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు అప్పటికే పరారైన అతని కోసం గాలింపు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం(సెప్టెంబర్ 22వ తేదీ) అతనిపై కాల్పులు జరిపి(కాలికి బుల్లెట్ గాయం అయ్యింది) మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల ఎదుట మనోజ్, మాంజిత్లు నేరం ఒప్పుకున్నారు. అయితే.. ఈ కేసులో మాస్టర్ మైండ్ స్వాతినే అని చెప్పేసరికి పోలీసులు కంగుతిన్నారు. తన తండ్రిని, సోదరులను ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తే కటకటాల పాలవుతారని, అలా తమకు ఏ అడ్డు ఉండబోదని స్వాతి భావించిందట. అలా పాపం అమాయకుడైన యోగేష్ను కూడా చంపేందుకు ఆమెనే ఎంపిక చేసిందట. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. ఈ ఘాతుకం ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో జరిగింది. -
కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కట్నం డబ్బుల(dowry) కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) కాన్పూర్నగరంలోని కల్నల్గంజ్లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది.బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. చదవండి: నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది! -
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్ఫ్రెండ్కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో యమునా నదిలో దొరికిన ‘సూట్కేసులో యువతి డెడ్బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు. ఆగస్టు 8వ తేదీన కాన్పూర్కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో.. అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో.. జరిగిన విషయాన్ని మరో గర్ల్ఫ్రెండ్కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి మోటార్సైకిల్పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యూపీలో మాయావతి ‘రాజకీయం’.. బీఎస్పీలోకి భారీగా చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్లో తిరిగి తన బలాన్ని నిరూపించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సిద్ధమయ్యారు. 2027లో జరిగే ఎన్నికలకు తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఆమె, వచ్చే నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ వర్గాల్లో తనకున్న పాత ఇమేజ్ను తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. పాత ఛరిష్మా కోసం పాట్లు... బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగు మార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గాను 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 22 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టుంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకు పోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓడినప్పటికీ ఆమె గెలుచుకున్న 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు.2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ 13 శాతం ఓట్లు పడినా కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. ఈ పరిణామాలన్నీ బీఎస్పీ ఉనికిలో లేవన్న సందేశాన్ని పంపడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో 2027 ఎన్నికలకు ముందే పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని, అక్టోబర్ 9న ఐదు లక్షల మందితో నిర్వహించే సభ ద్వారా తన బలాన్ని చూపించాలని మాయావతి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. వార్డు స్థాయి సమావేశాలు జరిగాయి. మొత్తం కేడర్ను ఉత్తేజపరిచేలా నేతలు పర్యటనలు సాగుతున్నాయి.అక్టోబర్ 8 నుంచే లక్నోలోని రమాబాయి మైదాన్కు సుదూర జిల్లాల నుంచి మద్దతుదారులు రావడం ప్రారంభిస్తారని, చాలా ఏళ్ల తర్వాత మాయావతి ఈ సభలో ప్రసంగించబోతున్నారని బీఎస్పీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంíపీ గిరీష్ చంద్ తెలిపారు. తమకు పట్టున్న ఎస్సీ వర్గాలతో పాటు ముస్లిం, బ్రాహ్మణ, ఓబీసీ వర్గాలను ఏకం చేసేలా ఈ సభ ఉంటుందన్నారు. పార్టీలోకి తిరిగి తీసుకొని జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాష్ ఆనంద్ సైతం ఈ సభను హిట్ చేయడం ద్వారా పారీ్టకి కొత్త జవసత్వాలను అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఆయన ఇప్పటికే యూపీ అంతా తిరుగుతూ బూత్ స్థాయి కమిటీల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 95 శాతం కమిటీలు పూర్తి చేశారు. ఈ సభలోనే సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, నిషాద్ పార్టీతో సహా అనేక పార్టీల సీనియర్ నాయకులు బీఎస్పీలో చేరవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ నేత ఆజం ఖాన్, బీజేపీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య రాజ్భర్ వర్గానికి చెందిన ఓం ప్రకాష్ రాజ్భర్, సంజయ్ నిషాద్, నసీముద్దీన్ సిద్ధిఖీ వంటి నాయకులు బీఎస్పీ శిబిరంలో చేరుతారనే చర్చ జరుగుతోంది. -
యూపీలో ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల జాబితాలో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం ఆరోపించారు. మహోబా జిల్లాలోని ఒకే ఒక ఇంటి నంబర్తో 4,271 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. లక్నోలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఉన్నట్లు కనుగొని షాకయ్యా.తాజాగా, ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లున్నారు. అంటే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు కనీసం 12 వేల మంది ఉండి ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే గ్రామంలో మొత్తం ఓటర్లు సుమారు 16 వేలు కావడం మరింత తీవ్రమైన అంశమన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి యూపీలో ఓట్ల చోరీ మొదలుపెట్టాయన్నారు. అదేవిధంగా, బిహార్లో బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలోని భాగల్పూర్లో పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్కు ఎకరా కేవలం రూ.1కే ఏకంగా వెయ్యి ఎకరాల భూమిని పవర్ ప్లాంట్ కోసం 25 ఏళ్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఈప్లాంట్ విద్యుత్ను యూనిట్ రూ.7 చొప్పున 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. -
విమానం టేకాఫ్ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. -
విషాదం.. 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు."మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
లైట్ తీసుకోవద్దు!.. నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం రియాక్షన్
లక్నో: నేపాల్ సంక్షోభాన్ని ఉటంకిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలేనని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్లో ఏం జరిగిందో చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన లక్నోలోని రామ్ మనోహర్ లోహియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేపాల్లోని ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం.. అది పెద్ద సమస్యలకు దారి తీస్తుందన్నారు.‘‘చిన్నవిగా కనిపించే విషయాలు, అవి పెద్ద సమస్యను తెస్తాయి. సమాజంలో అభివృద్ధి, పురోగతిని ఎలా అడ్డుకుంటాయో, అశాంతిని ఎలా రగిలిస్తాయో నేపాలే నిదర్శనం. జెన్-జడ్(Gen-Z) నిరసనకారుల ఆందోళనతో నేపాల్ హింసాత్మక ఘటనలు చవిచూసింది. కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి.. మారుతున్న పరిస్థితులకు సిద్ధపడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ కట్టుబడి ఉందన్నారు. వైద్య విద్యార్థులు, డాక్టర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతిక సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. -
ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్లే!
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటేఅక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.మాధోపట్టి మహిమస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!విజయ రహస్యంఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!మాధోపట్టి అనేది కేవలం మ్యాప్లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. -
యూపీఎస్సీ టాపర్స్ చిరునామా.. ఆ రాష్ట్రం!
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాఅయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అభ్యర్థులు సివిల్స్లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారే ఉన్నారు.యూపీఎస్సీ టాపర్లు2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)ఎలా సాధ్యమైంది?ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతవరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి. -
దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. -
ఫ్రిడ్జ్లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!
పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.ఏమిటీ పోస్ట్పార్టమ్ సైకోసిక్.. సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजहRead more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025


