యూపీలో పొగమంచు బీభత్సం | Thick Fog Triggers Major Multi-Vehicle Pileup in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో పొగమంచు బీభత్సం

Dec 24 2025 5:46 AM | Updated on Dec 24 2025 5:46 AM

Thick Fog Triggers Major Multi-Vehicle Pileup in Uttar Pradesh

రహదారిపై ఒకదానితో మరోటి ఢీకొన్న పలు వాహనాలు 

ఇద్దరు మృతి

16 మంది గాయాలు

అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.

మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్‌ఖాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్‌పూర్‌ మలుపు వద్ద జరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement