ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను పుణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బారామతిలో ఉన్న ఆయన అనారోగ్యం పాలు కావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవలే శరద్ పవార్ మేనల్లుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ బారామతిలో జరిగిన విమానప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. బారామతిలో ఎన్నికల ప్రచారం చేయడానికి వెళుతుండగా దురదృష్టవశాత్తు ఫ్లైట్ కులి అజిత్ పవార్ మరణించారు. అజిత్ పవార్ మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
అజిత్ పవార్ మరణంతో మూడురోజుల సంతాప దినాలు ప్రకటించడంతో ఫిబ్రవరి 5 న జరగాల్సిన ఎన్నికలు ఏడుకు వాయిదాపడ్డాయి. అయితే ఈ విషాదం జరిగిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలు జరిగియి.


