breaking news
Maharashtra
-
ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్'!
ముంబై: ఇతరుల డ్రెస్ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సూరజ్ శంకర్ ధోలె(26), బాబా సాహెబ్ అలియాస్ సుబోధ్ భీమ్రావ్ వాంఘ్మారేలు గోరెగావ్లోని ఓ పెట్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: గుజరాత్కు ఎందుకు తరలించారు? -
గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశమంతా గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే మహారాష్ట్రలో ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. గణపయ్యను ఒక్కచోట దర్శించుకోవడం కాదు.. ఎనిమిది పవిత్ర క్షేత్రాల్లో ఎనిమిది విశిష్ట రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడమే ‘అష్టవినాయక యాత్ర’. స్వయంభూ గణేశులుగా భక్తులు విశ్వసించే ఈ ఎనిమిది ఆలయాలు.. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎనిమిది క్షేత్రాలు మహారాష్ట్రలోని పుణె, రాయ్గఢ్, అహ్మద్నగర్ జిల్లాల్లో ఉన్నాయి. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అసలు ఈ సంప్రదాయ అష్టవినాయక యాత్ర ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.వినాయక చవితి వేళ మహారాష్ట్రలోని గణేశ ఆలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. ముఖ్యంగా అష్టవినాయక యాత్రకు ఈ సమయంలో మరింత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయంగా ఈ యాత్ర మొరగావ్ నుంచి ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది.1. మొరగావ్ మయూరేశ్వరుడుఅష్టవినాయక యాత్రలో మొరగావ్లోని శ్రీ మయూరేశ్వర ఆలయం తొలి, చివరి దర్శన స్థలంగా ఉంటుంది. ఇక్కడ గణేశుడిని మయూరేశ్వరుడు లేదా మృగమూర్తి రూపంలో పూజిస్తారు. ఈ రూపానికి వాహనం నెమలి అని చెబుతారు. మహారాష్ట్ర టూరిజం సమాచారం ప్రకారం.. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే సంప్రదాయ యాత్రలో మొరగావ్ ప్రత్యేక ప్రారంభ, ముగింపు క్షేత్రంగా నిలుస్తుంది.2. సిద్ధటెక్ సిద్ధివినాయకుడుఅష్టవినాయక యాత్రలో తదుపరి ముఖ్యమైన క్షేత్రం సిద్ధటెక్లోని సిద్ధివినాయక ఆలయం. ఇక్కడ గణేశుడిని ‘సిద్ధివినాయకుడు’గా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం పౌరాణిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంలో ముఖ్యమైన అంశంగా భావిస్తారు.3. పాలి బల్లాళేశ్వరుడురాయ్గఢ్ జిల్లాలోని పాలి గ్రామంలో ఉన్న బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడి పేరుతో కాకుండా ఆయన భక్తుడైన బల్లాళుడి పేరుతో ఉన్న ఏకైక ఆలయం ఇదే. గణేశుడిపై బల్లాళుడికి ఉన్న భక్తితో ఈ ఆలయ కథ ముడిపడి ఉంది. అందువల్ల అష్టవినాయక క్షేత్రాల్లో బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.4. మహడ్ వరదవినాయకుడురాయ్గఢ్ జిల్లాలోని మహడ్లో వరదవినాయక ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది మరో ముఖ్యమైన మజిలీ. ఇక్కడ గణేశుడిని వరదవినాయక రూపంలో పూజిస్తారు. ఆనందం, సౌభాగ్యం, సమృద్ధి, మనశ్శాంతి కోసం భక్తులు ప్రధానంగా స్వామివారిని ప్రార్థిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలోని ప్రముఖ గణేశ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి.5. థేవూర్ చింతామణిపుణె సమీపంలోని థేవూర్లో చింతామణి ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది కూడా కీలకమైన క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంతో పాటు అధికమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర టూరిజం ప్రకారం.. మూళా, ముఠా, భీమా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దీంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది.6. లేణ్యాద్రి గిరిజాత్మజుడులేణ్యాద్రిలోని గిరిజాత్మజ ఆలయం ప్రత్యేక ఆరాధనా రూపానికి ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడిని బాలరూపంలో పూజించే ఏకైక క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది. పార్వతిదేవి తపస్సు అనంతరం గణేశుడు ఇక్కడ గిరిజాత్మజుడిగా ప్రత్యక్షమయ్యాడనే నమ్మకం ఉంది. ఈ కారణంగా అష్టవినాయక యాత్రలో గిరిజాత్మజ క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.7. ఓజర్ విఘ్నేశ్వరుడుఓజర్లోని విఘ్నేశ్వర గణపతి ఆలయం కూడా అష్టవినాయక యాత్రలోని ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మాణశైలి, బంగారు విగ్రహాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడిని ‘విఘ్నేశ్వరుడు’గా, అంటే అడ్డంకులను తొలగించే స్వామిగా పూజిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.8. రంజన్గావ్ మహాగణపతిఅష్టవినాయక యాత్రలో ఎనిమిదో ప్రధాన ఆలయం రంజన్గావ్లోని మహాగణపతి ఆలయం. ఇది పుణెకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ శివుడు, త్రిపురాసురుడి కథతో ముడిపడి ఉంది. ఇలా ఎనిమిది గణేశ క్షేత్రాల దర్శనంతో అష్టవినాయక యాత్ర పూర్తవుతుంది. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. యాత్రకు వెళ్లాలని భావించేవారు దర్శన సమయాలు, స్థానిక రవాణా సదుపాయాలు, పండుగ సమయంలో అమల్లో ఉండే ప్రయాణ సంబంధిత సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని వెళ్లడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో చోరీ యత్నం కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంక్ కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఒక నిరుద్యోగి క్యాష్ కౌంటర్ వద్ద గలాటా సృష్టించాడు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి, రూ. 4 లక్షల నగదుతో పరారు కావడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్రాజ్ బోర్కర్గా గుర్తించారు. ఇతను B.Sc పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడు. సాధారణ వినియోగ దారుడిలా నటిస్తూ బ్యాంక్లోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లడంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రూ. 4 లక్షల నగదుని తస్కరించి అక్కడినుంచి ఉడాయించాడు. కానీ బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిందితుడిని వెంటాడారు. బ్యాంక్కు సుమారు కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అతడిని పట్టుకున్నారు.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్ महाराष्ट्र,नागपुर इनसे मिलिए,इनका नाम है सूरज भगवा कपड़ा पहन कर उसका भी इज़्ज़त डूबा दिए,दरअसल इसने SBI बैंक में चोरी की प्लानिंग की और लालमिर्च का पाउडर कर्मचारियों के आँख में झोंक दिया,कम से कम 4.5 लाख लेकर फरार हुआ था लेकिन कुछ ही देर में धर लिया गया pic.twitter.com/fXzOd3DUJ4— Anvi Yadav (@Yadavanviroyal) September 11, 2026 పోలీసులు అతని వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను ఉద్యోగం లేకపోవడం వల్లే ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి: బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం -
మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
సాక్షి ముంబై: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేదికను గుజరాత్లోని కెవాడియాకు తరలించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 72 ఏళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ముంబైను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్కు ప్రాధాన్యం ఎందుకు?ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గుజరాత్లోని కెవాడియా (ఏక్తానగర్)లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 1954లో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక ఇన్నేళ్లుగా ఢిల్లీలోనే జరుగుతోంది. తొలిసారిగా రాజధాని వెలుపల కార్యక్రమాన్ని నిర్వహించనుండటంపై రాజ్ ఠాక్రే సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు.దేశంలోని కీలక కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో గుజరాత్కే వరుసగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దేశ అభివృద్ధికి గుజరాతే కేంద్రం అన్న భావనను కల్పించే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రశ్నించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసిన దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రకు చెందినవారని రాజ్ ఠాక్రే గుర్తుచేశారు. దేశంలో అత్యధిక చిత్రాల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేయకుండా గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు.ఇదీ చదవండి: 'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు''‘జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను ఢిల్లీ నుంచి తరలించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అలా తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. భారతదేశపు ప్రస్తుత స్థాయికి ఏ ఒక్క రాష్ట్రం మాత్రమే కారణం కాదని.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరతరాలుగా చేసిన కృషి, త్యాగం, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు.కళాకారులు ప్రశ్నించాలిప్రస్తుత పాలకులకు కళలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా మారిందని రాజ్ ఠాక్రే విమర్శించారు. కళాకారులు అధికారాన్ని పొగడటానికే పరిమితం కాకుండా.. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి అధ్యక్షులు తమ సొంత రాష్ట్రానికి ఆ కార్యక్రమాన్ని తరలించేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు.దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తాలి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక తరలింపు విషయంలో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా స్పందించాలని రాజ్ ఠాక్రే కోరారు. ఈ అంశంపై కళాకారులు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేడుకలను ఢిల్లీ నుంచి గుజరాత్కు తరలించడాన్ని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా వ్యతిరేకించారు. -
కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు తుపాకీతో ఒక యువకుడు అరెస్ట్ అయిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO) నకిలీ ఐడీ కార్డు, తుపాకీతో షాపింగ్ మాల్ నుండి 24 ఏళ్ల రోహన్ పారిఖ్, అతని అంగరక్షకుడు దిలీప్ కుండేలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పిన సంగతులు విని పోలీసులు విస్తుపోయారు. తన కాబోయే భార్య, అత్తమామలను ఇంప్రెస్ చేయడానికి డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రోహన్ తాను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన అధికారినని , ప్రధాని కార్యాలయంతో నేరుగా సంబంధాలున్నాయి గప్పాలు కొట్టాడు. ఈ విషయాలో వారిని నమ్మించాలనుకుని పథకం వేశాడు.ఇందుకు ప్రధాని మోదీ హాజరు కానున్న ఎన్ఎంఏసీసీ వేదికను ఎంచుకున్నాడు. ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలుఏఐ టూల్స్ ఉపయోగించి నిజమైన పీఎంఓ కార్డ్ను పోలిన డిజిటల్ ఐడీ కార్డును (దీన్ని 2025లోనే తయారు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది) ఉపయోగించి వీవీఐపీ మార్గం ద్వారా దర్జాగా లోపలికి వెళ్లాలనే ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. జియో వరల్డ్ ప్లాజాలోకి వివిఐపి (VVIP) ప్రవేశ మార్గం ద్వారా వెళ్ళి,వారికి "పవర్" చూపించాలని ప్లాన్ చేశాడు. కానీ ప్రధాని పర్యటనకు ముందు భారీ భద్రతా తనిఖీల్లో దొరికిపోయాడు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజంఈ కేసులో రోహన్, అతని బాడీగార్డ్, డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, పారిఖ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రథమేష్ బాగుల్ కోసం గాలిస్తున్నారు. వీరిపై మోసం, ఫోర్జరీ, VVIP భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నాగ్పూర్-రాయ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం -
ఆ టీచర్ ధైర్యానికి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే..! ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఒక టీచర్ చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆకట్టుకుంటోంది. పదుల సంఖ్యలో కూడా లేని విద్యార్థుల చదువు కోసం ప్రతిరోజూ దట్టమైన అడవిలో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కవల్తేక్ ధంగర్వాడా అనేది కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామం. కేవలం మూడు ఇళ్లు, తొమ్మిది మంది నివాసితులు. వ్యవసాయం, పశుపోషణ వారి జీవనాధారం. ఈ ఊరిలో ఉన్న బడికి వెళ్లాలంటే చాలా కష్టం. దట్టమైన అడవిని, క్రూరమైన జంతువులను, కొండకోనలను దాటుకుని వెళ్లాలి. కానీ జీవన్ మిథారీ అనే ఉపాధ్యాయుడు మాత్రం ఆ గ్రామంలో ఉండే ఐదారుగురు పిల్లల చదువుకోసం పదమూడేళ్లుగా అడవిలో ప్రయాణిస్తున్నాడు. మిథారీ నివసించే కాలే గ్రామం నుంచి కవల్తేక్ ధంగర్వాడా 28 కిలోమీటర్లు. అడవిలోకి వెళ్లే ముందు మిథారీ తన వాహనాన్ని అక్కడే ఆపివేసి 5 కిలోమీటర్ల నడక దారిలో వెళ్తాడు. వర్షం పడితే ఈ మార్గమంతా పూర్తి జారుడుగా ఉంటుంది. అందుకే మిథారీ డబుల్ రెయిన్ కోట్, హెల్మెట్ వంటి రక్షణ పరికరాలతో ప్రయాణిస్తాడు. అంతేకాకుండా ఈ మార్గంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, విష సర్పాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. అయినా అతను వెనక్కి తగ్గడు. అడవిలో నడుస్తున్నప్పుడు పాటలు పాడుతూ లేదా శబ్దాలు చేస్తూ వెళ్తుంటాడు. పట్టణాల్లోని పిల్లలతో సమానంగా ఈ పేద పిల్లలు కూడా చదువుకోవాలన్నదే తన కోరిక అని ఈ ఉపాధ్యాయుడు చెబుతుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజూ అడవి బాట పడుతున్న ఈ ఉపాధ్యాయుడు ఎంతో మంది టీచర్లకు ఆదర్శం.(చదవండి: క్యాట్లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..) -
రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్ముఖ్గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నవనాథ్ జగ్తాప్ తెలిపారు.MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడిసొంత ఖర్చుల కోసం దేశ్ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీమరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు -
12వ తరగతిలో 95.7% మార్కులు.. అయినా ఆత్మహత్య
ముంబై: కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం లభించకపోవడంతో ఓ 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే నగరం, ఘోడ్బందర్ రోడ్డులోని హీరానందాని ఎస్టేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్పూర్లో బీఎస్-ఎంఎస్ డ్యుయల్ డిగ్రీ చదవాలని అతడు అనుకున్నాడు. ఆ బాలుడు ఇటీవల 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసి 95.7% మార్కులు సాధించాడు. అయితే ప్రవేశ పరీక్షలో 10,474 ర్యాంకు రావడంతో తాను కోరుకున్న విద్యాసంస్థలో సీటు పొందలేకపోయాడు.కుటుంబానికి మెసేజ్ పంపిన బాలుడుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న రాత్రి 7.30 గంటల సమయంలో సైకిల్ తొక్కేందుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సుమారు 45 నిమిషాల తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ వాట్సాప్ గ్రూపులో సందేశం పెట్టాడు.కుటుంబ సభ్యులు ఆ సందేశాన్ని గమనించి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో కాసర్వడవలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు నివాస సముదాయం పరిసరాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.అయితే కుటుంబ సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకునేలోపే నివాస భవనంలోని 22వ అంతస్తు నుంచి బాలుడు కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అపార్ట్మెంట్ సమీపంలోని ఫుట్పాత్పై బాలుడు పడి ఉన్నట్లు తర్వాత గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని థానే సివిల్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తాను కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం పొందలేకపోవడం వల్ల బాలుడు తీవ్ర విద్యాపరమైన ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏటీఎంలలో ఫెవిక్విక్.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా
ముంబై: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లినప్పుడు కార్డును కార్డ్ స్లాట్లో పెట్టి, భాషను ఎంచుకుని, 4 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్), తీసుకోవాల్సిన నగదు మొత్తాన్ని నమోదు చేస్తారు. నగదు తీసుకున్న తర్వాత డెబిట్ కార్డును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే అది బయటకు రాకుండా ఇరుక్కుపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కొల్సేవాడిలో ఓ ముఠా ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఏటీఎం యంత్రాల కార్డ్ స్లాట్కు ఫెవిక్విక్ను పూసి కార్డులను ఇరుక్కుపోయేలా చేసేది. కల్యాణ్లోని కొల్సేవాడి పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం కేంద్రాల వద్ద వేచి ఉండి, వినియోగదారుల కార్డులు స్లాట్లో ఇరుక్కుపోయేలా ఫెవిక్విక్ పూసినట్లు దర్యాప్తులో తేలింది.కార్డు ఇరుక్కుపోయి వినియోగదారుడు అయోమయానికి గురైన వెంటనే ముఠాలోని ఓ సభ్యుడు సహాయం చేస్తున్నట్లు అక్కడికి వచ్చేవాడు. ఏటీఎం పిన్ను 3 సార్లు నమోదు చేయాలని అతడు వినియోగదారుడిని కోరేవాడు. పిన్ నమోదు చేసినా నగదు బయటకు రాకుండా చేసేవారు. అనంతరం ఓ ప్రత్యేక మొబైల్ నంబర్కు ఫోన్ చేయాలని వినియోగదారుడికి చెప్పేవారు. ఆ నంబర్ ముఠాలోని మరో సభ్యుడిదే.తర్వాత వినియోగదారుడిని ఓ నిర్దిష్ట ప్రాంతానికి రావాలని చెప్పేవారు. దర్యాప్తులో భాగంగా వినియోగదారుల నుంచి ఏటీఎం పిన్ తెలుసుకున్నట్లు లేదా ఇతర మార్గాల్లో వారి బ్యాంకింగ్ వివరాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలతో బాధితుల ఖాతాల నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడైంది.కల్యాణ్ ఈస్ట్లోని కొల్సేవాడి ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రంలో ఓ వ్యక్తిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో రాజేశ్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ వ్యవహారంలో మరో ముగ్గురు ఉన్నట్లు రాజేశ్ పోలీసులకు తెలిపాడు. వారు భివాండీలోని కొంగావ్ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించాడు.ఆ ముగ్గురు నిందితులు పాట్నా ఎక్స్ప్రెస్ రైలులో బిహార్కు వెళ్తున్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు వారిని వెంబడించి పాట్నా ఎక్స్ప్రెస్లోనే అరెస్ట్ చేశారు. ఇదే పద్ధతిలో ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విధానంలో ఇంకా ఎంతమందిని మోసం చేశారో, బాధితుల ఖాతాల నుంచి ఎంత నగదు తీసుకున్నారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చిన్న విమానం అదృశ్యం.. ఫ్యామిలీ మిస్సింగ్ -
భార్య ఇంటికొస్తేనే కిందకు దిగుతా
నాందేడ్: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్యను ఎలాగైనా తన వద్దకు రప్పించాలంటూ ఒక భర్త వినూత్న రీతిలో డిమాండ్చేసి భారీస్థాయిలో ట్రాఫిక్ జామ్కు కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 40 ఏళ్ల షాదుల్ షేక్ సోమవారం ఉదయం లోహా పట్టణంలోని బస్టాండ్ సమీపానికి చేరుకున్నాడు. రోడ్డు పక్కన ఉన్న 200 అడుగుల ఎత్తయిన మొబైల్ టవర్ చకచకా ఎక్కేసి ఒక భారీ బ్యానర్ను ప్రదర్శించడం మొదలెట్టాడు. వినికిడిలోపంతోపాటు మాట్లాడే సామర్థ్యంలేని షేక్.. ‘నా భార్యను పుట్టింటికి తీసుకొచ్చేదాకా కిందకు దిగిరాను’అని దానిపై రాశాడు. ఈ బ్యానర్ ప్రదర్శన చూసి అటుగా వెళ్తు న్న ప్రయాణికులు వాహనాలతో సహా ఆగిపోవడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. చాలా సేపటి త ర్వాత భార్యను ఘటనాస్థలికి తీసుకురావడంతో భార్యను చూసిన ఆనందంలో షేక్ చకచకా కిందకు దిగొచ్చాడు. -
సహ్యాద్రి గుండెల్లో ఛత్రపతి అడుగులు
సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.ఒక చారిత్రాత్మక యాత్రమహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదుం సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ... ఇలా సహ్యాద్రి ప్రకతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కతమవుతుంది.శివనేరిఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది.కొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్పీరియెన్స్ మిగిలిపోయేలా చేస్తాయి.తోరణ... తొలి అడుగు సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ను ఇస్తాయి. ఒకవైపు ప్రకతి, మరోవైపు చరిత్ర... రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.ప్రతాపగఢ్...ప్రతాపగఢ్ పేరు వినగానే 1659లో అఫ్జల్ ఖాన్తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్లో మహా యుద్ధం, సింహగఢ్లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.1674లో రాయగఢ్లోనే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.సింహగఢ్ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.ఎక్కడ ఉండాలిపుణె, మహాడ్, సతారా, జున్నర్ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్ను స్లోగా ఎంజాయ్ చేయవచ్చు. నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్లో మరో హైలైట్.ఏం తినాలి ?మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ్ర΄ాంతాల్లో ΄ోహా, మిసల్ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుశివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.తోరణను ప్రచండగఢ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.1659లో అఫ్జల్ ఖాన్తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్ చరిత్రలో నిలిచిపోయింది.సింహగఢ్ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది గుర్తు చేస్తుంటారు.1674లో రాయగఢ్లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది.ఏం చూడాలిశివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్లో యుద్ధగాథలను తెలుసుకోవడం, సింహగఢ్లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్లో పట్టాభిషేకం జరిగినప్రాంతం వైబ్ను ఫీల్ అవ్వడం.. ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్ను ఒక కంప్లీట్ మెమోరీగా మార్చేస్తాయి.ఎలా వెళ్లాలిహైదరాబాద్ నుంచి సహ్యాద్రి ్ర΄ాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్. దీని కోసం రైలు లేదా ఫ్లైట్లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్ చేస్తారు. పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్ జోన్ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్ అనేది ప్రయాణికుల లైఫ్స్టైల్ను బట్టి మారుతుంది. యావరేజ్గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, యాక్టివిటీస్ను బట్టి మారుతాయి.ఇక హోటల్ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్ నైట్ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్ అవ్వొచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్లో తక్కువ ధరకు దొరికే రూమ్స్ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్నే ఎంచుకోవడం ఉత్తమం.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ వివరాలను సొంతంగా రీసెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఎం జి కిశోర్ ప్రయాణికుడు(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
ఒక్కసారిగా భారీ కొండచిలువను చూసి గుండెలు గుభేల్
ముంబైలోని దహిసర్ వెస్ట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ కారులో సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించడంతో కలకలం రేగింది. నివాస భవనం పార్కింగ్లో నిలిపి ఉంచిన కారు బానెట్ తెరవగానే అందులో కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా అంత పెద్ద పామును చూసిన అక్కడున్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటన దహిసర్ వెస్ట్లోని కాందర్పాడా ప్రాంతంలో జరిగింది. బాపూ బాగ్వే రోడ్డులోని మహేశ్వర్ భవనం పార్కింగ్లో ఓ కారు నిలిపి ఉంది. ఆదివారం సాయంత్రం కారు బానెట్ తెరిచినప్పుడు అందులో భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే చుట్టుపక్కల ఉన్నవారిలో ఆందోళన మొదలైంది.వెంటనే స్థానికులు పాము రక్షణ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బృందం అక్కడికి చేరుకుని కొండచిలువను కారు నుంచి బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించింది. సుమారు 7 అడుగుల పొడవు ఉండటంతో దాన్ని బయటకు తీయడం అంత సులభం కాలేదు. రక్షణ బృందం తీవ్రంగా శ్రమించి కొండచిలువను సురక్షితంగా కారు బానెట్ నుంచి బయటకు తీసింది.కొండచిలువను రక్షిస్తున్న దృశ్యాల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కారు బానెట్ లోపల కొండచిలువ కనిపించింది. రక్షించిన అనంతరం దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కొండచిలువను సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో వదిలిపెట్టారు. కారు బానెట్లో ఇంత పెద్ద కొండచిలువ దాక్కుని ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కొంతసేపు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.Panic gripped Kandarpada in Dahisar after a python was spotted inside a car’s bonnet. The owner alerted a snake rescuer, who carefully rescued the python and later released it at a safe location. The incident left locals in a state of panic. #Dahisar #Mumbai #SnakeRescue pic.twitter.com/CA09M6QHiJ— Visshal Singh (@VishooSingh) September 7, 2026 -
‘‘పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ్బు కంటే తక్కువ’’
న్యూఢిల్లీ: ఆశ్రమ పాఠశాలల్లో మృతి చెందిన ఆదివాసీ విద్యార్థుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ఆ పరహారం కొంతమంది రాజకీయ నాయకులు ఏడాదిలో తమ పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ్బు కంటే కూడా తక్కువగా ఉందని చెప్పారు. ఎక్స్లో దీప్కే స్పందిస్తూ.. 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థుల కుటుంబాలకు కేవలం రూ.2 లక్షల చొప్పున పరిహారం మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.“కేవలం 2 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని ఆశ్రమ పాఠశాలల్లో 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు మృతి చెందారు. వారి కుటుంబాలకు కేవలం రూ.2 లక్షల చొప్పున పరిహారం మాత్రమే అందింది” అని దీప్కే పేర్కొన్నారు. విద్యార్థులకు భద్రతను ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, నిర్లక్ష్యం కారణంగానే వారు మృతి చెందారని దీప్కే ఆరోపించారు.“వారి భద్రత, సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్ధారించడంలో విఫలమైంది. నిర్లక్ష్యం, శ్రద్ధ లేకపోవడం, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులు మృతి చెందినప్పుడు వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందజేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏడాదిలో తమ పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే మొత్తం కంటే ఇది తక్కువే కావచ్చు. రాష్ట్రం దృష్టిలో ఆదివాసీ విద్యార్థి జీవితం విలువ ఇంతేనా?” అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులను నియమించాలని, గిరిజన పిల్లల కోసం నిర్వహిస్తున్న వసతి పాఠశాలల పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థులు నిరసనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.గడ్చిరోలి జిల్లాలోని ఒక వసతి పాఠశాలలో పాముకాటుకు గురై ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటన తర్వాత పుణె, నాగ్పూర్, నాసిక్లలో నిరసనలు ప్రారంభమయ్యాయి. గిరిజన వసతి గృహాల్లో ఉంటూ, గిరిజన వసతి పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.10 కోట్ల బీమా కవరేజీ కల్పించాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. -
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె సన్నిహితుడు చేతన్ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.మూడో నిందితుడు అరెస్ట్జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రితేష్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్ హాంగే ప్రధాన నిందితుడు చేతన్ చౌదరికి స్నేహితుడు. కేతన్ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్ను హత్య చేయాలన్న ప్లాన్ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్, సియా గోయల్ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్ తొలుత కేతన్ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. పక్కా స్కెచ్.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్, విసాపూర్ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.హత్య తర్వాత రితేష్కు ఫోన్..అనుకున్నట్టుగానే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్.. తన స్నేహితుడు రితేష్కు ఫోన్ చేసి కేతన్ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్ను పోలీసులు విచారిస్తున్నారు. -
పరుగు అందుకున్న జీవితం
బిడ్డ పుస్తకాలకి డబ్బుల్లేవ్... చేస్తున్న పనికి వచ్చే జీతం చాలదు.. ఇద్దరు కూతుర్లున్నారు.. ఆస్తుల్లేవ్ కాని బాగా బతకాలన్న ఆశ ఉంది. అప్పుడొచ్చిందో అవకాశం.. పరుగెడితే పైసలొస్తాయని ఎవరో అంటే... ఒంట్లో ఓపిక లేకపోయినా, శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని, జారిన జోళ్లని చేత పట్టుకుని లంఘించిందో మహిళ.. ఆమే రమాబాయి రణ్వీర్.చెప్పులు చేతపట్టుకుని పరుగులు తీసిన రమాబాయిని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే అది కాస్తా వైరల్గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆమె ప్రయత్నానికి ముచ్చటపడి షూ కొనిస్తానని వెల్లడించారు. నటుడు మాధవన్ రమాబాయ్ పట్టుదలను ప్రశంసించారు. బీడ్ జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ ఆమెను సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. మరోవైపు దేశవ్యాప్తంగా రమాబాయికి ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు లక్షన్నర వరకు నగదు సాయం కూడా అందింది. ప్రభుత్వం ఆమె కుమార్తెల చదువుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రమాబాయి పెద్ద కూతురు పూజ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. చిన్న కూతురు బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధపడుతోంది.ఎవరీ రమాబాయి?మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన రమాబాయి రణవీర్కు 47 ఏళ్లు. భర్త మరణించిన తర్వాత ఇద్దరి కుమార్తెల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న రమాబాయి వారి చదువుకోసం ఇళ్లలో వంట చేస్తూ జీవించేది. ఆమె కుమార్తె చదువు కోసం పుస్తకాలు కొనాల్సి వచ్చింది కాని రమా దగ్గర డబ్బుల్లేవు. అంబాజోగైలోని భారతీయ శిక్షణ ప్రసారక సంస్థకు చెందిన ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ‘అమృత్ దౌడ్’ పేరుతో పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ పోటీలో పాల్గొని, అందులో గెలుపొందితే పరుగెడితే డబ్బులొస్తాయని తెలిసి రమాబాయి కూడా ఆ పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.చెప్పులు చేత పట్టుకుని...సాధారణంగా రన్నింగ్ రేస్ అంటే ట్రాక్స్ వేసుకుని షూ వేసుకుని స్టైల్గా గాగుల్స్ పెట్టుకుని సిద్ధమవుతారు. కాని అవేవి రమాబాయికి తెలీదు. మామూలు చీర కట్టుకుని, ఆకు చెప్పులు వేసుకుని పందేనికి సిద్ధపడింది. రేసు మొదలైంది. రమాబాయి చెప్పులు జారిపోయాయి. కంగారు మొదలైంది. వెంటనే చెప్పులు చేతపట్టుకుని ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని పరుగులు తీసింది. వర్షంతో తడిసిన రోడ్డుపై చిన్నచిన్న రాళ్లు, పెంకులు లాంటివి గుచ్చుకుంటున్నా ఆమె బెదరలేదు.. పరుగు ఆపలేదు. ఎలాగైనా సరే, బిడ్డకు పుస్తకాలు కొనాలన్న పట్టుదల, బిడ్డ చదువు ఆగిపోకూడదన్న అమ్మతనం గెలిచాయి. అందరు రన్నరప్లను దాటుకుంటూ ఆమె విన్నర్గా నిలిచింది మూడు వేల రూపాయల బహుమతిని అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పెద్ద కుమార్తె పూజా కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంది. మూడు వేల కోసం మొదలైన పరుగుతో రమాబాయి కూతుళ్ల జీవితాలకు కొండంత భరోసా వచ్చింది. -
అన్నం వడ్డించనందుకు భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త
నాగ్పూర్: అన్నం వడ్డించనందుకు ఓ మహిళను ఆమె భర్త కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలాల్ (41) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్య యామిని మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ హరేశ్ కల్సేకర్ మాట్లాడుతూ.. కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్య యామినిని భోజనం వడ్డించాలని అడిగాడని తెలిపారు. అయితే యామిని అందుకు నిరాకరించి, తాను డ్యాన్స్ క్లాస్కు వెళ్లాలనుకుంటున్నానని, భోజనం అతడే వడ్డించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.దీంతో దంపతుల మధ్య మొదలైన విభేదం తొలుత వాగ్వాదానికి, ఆ తర్వాత భౌతిక ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి ఫ్లాట్లో మహిళలకు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఘర్షణ సమయంలో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్ యామినిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మెడ, పొత్తికడుపుపై లోతైన గాయాలయ్యాయి. ఆ గాయాలు ప్రాణాంతకంగా మారడంతో యామిని మృతి చెందింది.పోస్టుమార్టంతో అనుమానాలుయామిని మృతి తర్వాత పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యామిని కుటుంబ సభ్యులకు ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో యామినిని హత్య చేసినట్లు కృష్ణలాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు 14 ఏళ్లు కాగా, చిన్న కుమారుడి వయసు 4 ఏళ్లు. -
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (Ashwini Manohar Paul) ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. నాల్దుర్గ్ చారిత్రక కోటలో 100 అడుగుల లోతైన లోయలోకి తన ముగ్గురు పిల్లలతో సహా దూకేసిన విషాద ఘటన క్రీడా లోకంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ ఘటనలో అశ్వినితో పాటు ముగ్గురు పిల్లలలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. ఒక కుమార్తె ప్రాణాలతో బయట పడింది. అశ్విని ఆమె ఐదున్నర ఏళ్ల కుమారుడు అజింక్య అక్కడికక్కడే మరణించారు. రెండేళ్లన్నర కవల కుమార్తెలలో ఒకరైన క్రాంతి, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరో కుమార్తె వీర తీవ్ర గాయాలతో ప్రస్తుతం ధారాశివ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స పొందుతోంది.తన భర్త, అత్తమామల నుండి అశ్విని నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: దివ్యాంగ మహిళపై లైంగిక దాడి యత్నం.. తరిమి కొట్టిన వీధి కుక్కలు!కాగా అశ్విని పాల్ రెజ్లింగ్ వర్గాల్లో సుపరిచితురాలు. ఆమెను "మహారాష్ట్ర టైగ్రెస్" (Maharashtra's Tigress) అని పిలిచేవారు. తన క్రీడా జీవితంలో ఆమె జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ , ఆరు రజత పతకాలను గెలుచుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా, క్రీడా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది; ఈ క్రీడాకారిణి ,ఆమె పిల్లల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యమకారుడిపై దాడి
పుణే: పండుగల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే సిస్టమ్స్, లౌడ్స్పీకర్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న నగరానికి చెందిన ఉద్యమకారుడు విద్యానంద్ బాపట్పై గురువారం ఉదయం ఓ వ్యక్తి దాడి చేశాడు. తిలక్ రోడ్ ప్రాంతంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో బాపట్పై దాడి జరిగింది. రోడ్డుపై విలేకరులకు తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఓ వ్యక్తి బాపట్ను చెంపపై కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బాపట్ను పోలీసు వ్యాన్లో అక్కడి నుంచి తీసుకెళ్లారు. “దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. బాపట్ భద్రత దృష్ట్యా ఆయనను వ్యాన్లో తీసుకెళ్లాం” అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాడి చేసిన వ్యక్తి గుర్తింపు, దాడికి గల కారణం సహా మరిన్ని వివరాలు తెలియరాలేదు.లౌడ్స్పీకర్లు, అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థలలను బాపట్ వ్యతిరేకిస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతు ఒక వ్యవస్థీకృత పౌర ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. పండుగల సమయంలో పెద్ద శబ్దంతో సంగీతం, డీజేలకు వ్యతిరేకంగా బాపట్ ప్రచారం చేస్తున్నారు. అధిక శబ్దం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పాటు వారి ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం పడుతుందని ఆయన వాదిస్తున్నారు.రాబోయే గణేశ్ ఉత్సవాల కోసం పుణే మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఇటీవల సన్నాహక సమావేశానికి హాజరైన తర్వాత బాపట్ వెలుగులోకి వచ్చారు. ఆ సమావేశంలో యాంప్లిఫైడ్ డీజే సంగీతం, అధిక శబ్దంతో కూడిన స్పీకర్లపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఆయన కోరారు. ఆయన డిమాండ్పై స్థానికంగా ఉన్న పలు గణేశ్ మండళ్ల ప్రతినిధులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనలు, నినాదాల మధ్య పోలీసులు చివరకు ఆయనను భవనం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ ఘర్షణకు సంబంధించిన వీడియోలు త్వరలోనే వైరల్ కావడంతో బాపట్ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది. -
తెలంగాణకు తుమ్మిడిహెట్టి ప్రాణహితం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు ప్రాణహిత జలాలే ప్రాణాధారమని, వాటిని గరిష్ట స్థాయిలో గ్రావిటీ పద్ధతిన వినియోగించుకునేందుకు 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించుకునేందుకు సహకరించాలని మహారాష్ట్రను తెలంగాణ మరోమారు కోరింది. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణ అనుమతుల అంశమై మంగళవారం కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ నుంచి శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ రమేశ్బాబు, సీఈ విజయ్లతోపాటు అంతర్రాష్ట్ర విభాగ అధికారులు హాజరయ్యారు. మహారాష్ట్ర తరఫున సీఈ సోనాలి చావ్డేతో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్లు గోదావరి అవార్డు మొదలు, నీటి లభ్యత, కేటాయింపులు, హక్కులు, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలు, మహారాష్ట్రతో ఒప్పందాలు, ప్రస్తుతం బరాజ్ నిర్మాణ అవసరం, ముంపు సమస్యలు, వాటికి అందించే పరిహారం వంటి అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పునరావాస, పరిహార పూర్తి బాధ్యత మాదే..తుమ్మిడిహెట్టి బరాజ్ను 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో నిర్మించి, 160 టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా 16.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, అయితే రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో దీనిని 148 మీటర్లకు తగ్గిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగిన విషయాన్ని ఇంజనీర్లు ప్రస్తావించారు. అయితే 148 మీటర్లతో ప్రస్తుతం బరాజ్ నిర్మిస్తే తమ అవసరాలకు ఆ నీరు ఏమాత్రం సరిపోదని, 80 నుంచి 100 టీఎంసీల నీటి అవసరాలు ఉన్న దృష్ట్యా 152 మీటర్లకు బరాజ్ను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు 5,247 హెక్టార్లు మాత్రమేనని, ఇందులో నదీగర్భంలోనే ముంపు ఎక్కువగా ఉందని, వ్యవసాయా««ధారిత భూమి 2వేల హెక్టార్లు కంటే తక్కువనే ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిహారాన్ని మహారాష్ట్ర కోరిన మేరకు నిర్వాసితులకు అందిస్తామని వివరించా రు. బరాజ్ సాధారణ నిర్వహణ సమయంలో నీటిముంపునకు గురయ్యే భూమిని, బరాజ్ వల్ల ఏర్పడే ముంపు ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభు త్వం భూమిని సేకరిస్తుందని, అవసరమైతే ప్రభావిత ప్రాంతాలను రక్షించేందుకు ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని వెల్లడించింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రకు నీటి హక్కులకు ఎలాంటి విఘాతం కలగదని తెలిపింది. గత నివేదికలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న మహారాష్ట్ర రాష్ట్ర అభిప్రాయాలను విన్న మహారాష్ట్ర ఇంజనీర్లు.. తెలంగాణ నుంచి పలు అంశాలపై అదనపు సమాచారం కోరినట్టు తెలిసింది. బరాజ్ నిర్మాణ ప్రాంతంలో నీటి లభ్యత, 152 ఎఫ్ఆర్ఎల్తో మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే ముప్పు, దీనిపై సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) గతంలో ఇచ్చిన నివేదికలు, రెండు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర బోర్డుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను తమకు అందించాలని కోరారు. ఇవన్నీ సమర్పిస్తే మూడు వారాల్లో మరోమారు భేటీ అవుదామని నిర్ణయించినట్టు తెలిసింది. భేటీ అనంతరం మహారాష్ట్ర కోరిన వివరాలు, రాష్ట్ర ప్రజెంటేషన్ వివరాలను తెలంగాణ ఇంజనీర్లు ఢిల్లీలోనే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి వివరించారు. -
47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్..గెలిచిన అమ్మ!
తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు అని మరోసారి రుజువైంది. ఓ తల్లి తన కుమార్తెల కోసం మారథాన్లో పాల్గొంది. కనీసం అనువైన డ్రెస్, షూలు లేకపోయినా..పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయం అన్నట్లుగా రేసులోకి దిగింది. మరి ఆ తల్లి గెలిచిందా అంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన వంటమనిషి రమాబాయి చెప్పలు లేకుండా మారథాన్లో పరిగిఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచింది. ఓ అమ్మ తలుచుకుంటే పిల్లల కోసం ఎంతటి అనితర సాధ్యమైనదైనా.. చేధించగలదని ప్రపంచానికి చూపించింది. ఇంతలా మారథాన్లో పాల్గొని గెలిచి తీరాల్సినంత అవసరం ఆమెకు ఎందుకంటే..ముంబైలో జరిగిన ఒక ప్రమాదంలో భర్తని కోల్పోయింది రమాబాయి. దాంతో తన ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచుతూ వారి బాగోగులను చూసుకుంటూ వచ్చింది. అయితే తన పిల్లలకు మంచి చదువు అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేదే ఆమె ప్రగాఢ ఆకాంక్ష. అయితే ఆర్థిక వనరులు ఏమాత్రం సహకరించడం లేదామెకు. అయినా సరే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అంతేగాదు కుమార్తె చదివే చోట అంబాజోగైలోని అకాడమీలో వంటమనిషిగా పనిలో చేరి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోందామె. ఆమె అకాడమీలో వంట చేస్తూ కాలం వెళ్లదీస్తుండగా, ఆమె కుమార్తెలు చదువులు, పోటీపరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా..ఇద్దరు కుమార్తెలకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే పట్టుదలతో రమాబాయి ముందుకు సాగుతోంది. ఆ క్రమంలోనే ఒక స్థానిక సంస్థ నిర్వహించిన 'అమృత్ దౌడ్' మారథాన్లో పాల్గొంది రమాబాయి. ఆ మారథాన్లో అంతా ట్రాక్సూట్లు, షూలు ధరించిన యువ పోటీదారుల మధ్య సాధారణ చీర కట్టుకుని పాల్గొంది రమాబాయి. ఆమె మొదట చెప్పులు వేసుకుని పరుగుని ప్రారంభించింది. కానీ పరిగెత్తేటప్పుడు అవి జారిపోతుండటంతో వాటిని తీసేయక తప్పలేదు. దాంతో ఆమె చేతిలో చెప్పులు పట్టుకుని చీరను జాగ్రత్తగా సర్దుకుంటూ..చల్లని రోడ్డుపై పరిగెత్తిందామె. కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదర పోటీదారుల కంటే వేగంగా దూసుకుపోయి..ముగింపు రేఖను చేరుకుంది. రమబాయి అచంచలమైన పట్టదలను చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందించారామెను. రేసు తదనంతరం రమాయి మాట్లాడుతూ..ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారని తెలసుని కానీ బహుమతి గెలవాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పారామె. పరిగెత్తేటప్పుడు తాను నిరంతరం తన కుమార్తెల గురించి, వారి భవిష్యత్తునే ఆలోచిస్తూ పరుగు ప్రారంభించానని అన్నారామె. మరి గెలిచిన సోమ్ముని ఏం చేస్తావంటే..వారి పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పింది. అంతేగాదు మరోఅద్భుతం ఏంటంటే ఇదే మారథాన్లో పాల్గొన్న ఆమె కుమార్తె పూజా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. తానే తల్లిని పాల్గొనమని ప్రోత్సహించానని, కానీ ప్రథమ స్థానంలో నిలుస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందంగా చెబుతోంది. ఇక పూజా పోలీస్ రిక్రూట్మెంట్ కోసం సిన్నద్ధమవుతోంది. ఇక ఆమె సోదరి బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతంది. చాలా కఠినమైన పరిస్థితులను తట్టుకుని మమ్మల్ని ఎంతో ప్రయాస పడి పెంచిందని చెబుతోంది ఆమె కూతురు పూజా. అంతేగాదు పూజా అంకితభావానికి ముగ్ధుడైన అకాడమీ డైరెక్టర్ ఆమె ఫీజును కూడా మాపీ చేశారు. కాగా, రమాబాయి కుటుంబం గతంలో వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తుండేది. అయితే పిల్లల చదువుకి సాయం అందించేందుకు ఇలా కూతురి అకాడమీలోనే చేరి వంటమనిషిగా పనిచేస్తోందామె. ఈ తల్లికి కుమార్తెల కలను నెరవేర్చడానికి మారథాన్ను ఒక అవకాశంగా ఉపయోగించుకుంది. పైగా ఆమె పోటీలో వేసిన ప్రతిఅడుగు అపురూపమైనది. ఎందుకంటే ఆ రేసులో వేసిన అడుగులన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించాలనే ఆశతో వడివడిగా నడిచినవే. View this post on Instagram A post shared by Avani (@avaniarya) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..) -
కుమార్తెల చదువు కోసం ఓ తల్లి తెగింపు...చెప్పుల్లేకుండానే!
బీడ్: ఎన్నికష్టాలు ఎదురైనా సరే, తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించి, ప్రయోజకులను చేయాలన్నదే ఆ తల్లి లక్ష్యం. వారి కోసమే రోజంతా కష్టపడి పనిచేస్తోంది. అనుకోకుండా వచ్చిన ఓ చిన్న అవకాశాన్ని సైతం వదలుకో దల్చలేదు. ఎన్నడూ పరుగుపోటీలో పాల్గొన్న అనుభవం లేకపోయినా సరే, ధైర్యంగా ముందుకు వచ్చింది గతుకుల, రాళ్ల రహదారిలో కాళ్లకు చెప్పులుసైతం లేకుండా పరుగు తీసి, విజేతగా నిలిచింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి బహుమతిగా రూ.3 వేలు గెల్చుకుంది. మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన రమాబాయి రణవీర్(47) భర్త చనిపోవడంతో బతుకు దెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో బీడ్ జిల్లా అంబాజోగైలో ఉంటూ ఇళ్లలో పనిచేస్తోంది. శనివారం ఉదయం భారతీయ శిక్షణ్ ప్రసారక్ సంస్థ నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొనేందుకు వెళ్లింది. నేత చీర, రబ్బరు చెప్పులు ధరించి అక్కడికి వెళ్లిన ఆమెకు పరుగెత్తడమెలాగన్న అనుమానం పట్టుకుంది. పరుగు మొదలైంది. చెప్పులు జారి పోతుండటంతో పరుగెత్తడం కష్టంగా మారింది. దీంతో, చెప్పుల్ని చేతిలో పట్టుకుని, చీరకొంగును పైకి ఎగసి కట్టి..కంకర రాళ్లు, గుంతలు అడ్డుపడ్డా లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఒక్కొక్కరినీ అధిగమించి, ఒంటరిగా మూడు కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వేల రూపాయల బహుమతిని, ట్రోఫీని గెల్చుకుంది. ఇల్లు గడవటానికి రోజూ పరుగులు తీస్తూనే ఉంటా. ఈ రోజు మాత్రం నా ఇద్దరి కూతుళ్ల చదువుల కోసం పరుగెత్తా’అంటూ బహుమతి అందుకుంటూ రమాబాయి సగర్వంగా ప్రకటించింది. ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? -
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.అహింసా పద్ధతుల్లో.. శాంతియుత మార్గాల్లో అన్నా హజారే గతంలో పలు సత్యాగ్రహాలు చేశారు. ఇప్పటిదాకా ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా అగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) మాత్రం ఆయనకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత రైతు చట్టాలు సహా అనేక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలి నీట్ నిరసనలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా జూలై 23న రెండు గంటలపాటు మౌన దీక్ష కూడా చేపట్టారు.89 ఏళ్ల హజారే.. వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో.. తీవ్రమైన డీహైడ్రేషన్తో బాధపడుతున్నారు. రాలేగావ్ సిద్ధిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. బాంబే ఆస్పత్రిలో వైద్యుడు గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.కేజ్రీవాల్తో కలిసి..2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్లో జనలోక్పాల్ బిల్లును బలంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ప్రభుత్వం జనలోక్పాల్ బిల్లుపై చర్చలకు దిగింది. ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు హజారేకు కీలక సహచరులుగా ఉన్నారు. హజారే ఉద్యమానికి కేజ్రీవాల్ బలమైన మద్దతు ఇవ్వడంతో ఇద్దరి పేర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. అనంతరం అదే ఉద్యమం నేపథ్యంలో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.ఇదీ చదవండి: బీజేపీ సర్కార్కు ఆరేళ్ల పిల్లాడి వార్నింగ్! -
కూతురి చదువు కోసం చీరలో, చెప్పులు లేకుండా పరిగెత్తిన మహిళ
ముంబై: పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా వెనుకాడదు తల్లి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల మహిళ రామాబాయి రణ్వీర్ కూడా అటువంటి తల్లే. పిల్లల చదువు కోసం చీర ధరించి, చెప్పులు లేకుండా పరుగెత్తిన రామాబాయి మారథాన్లో విజయం సాధించారు.బూట్లు, ట్రాక్సూట్లు ధరించి పోటీలో పాల్గొన్న పలువురు యువకులను వెనక్కి నెట్టి ఆమె గెలిచారు. భారతీయ శిక్షణ ప్రసారక సంస్థకు చెందిన ఖోలేశ్వర్ విద్యా సముదాయంలో అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘అమృత్ దౌడ్’లో ఆమె పాల్గొన్నారు. రేసులో విజయం సాధించి రూ.3,000 నగదు బహుమతి అందుకున్నారు. ఆ మొత్తాన్ని తన కూతురి చదువుకు ఉపయోగించాలని ఆమె భావిస్తున్నారు.అంబాజోగైలో ఈ మారథాన్ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమైన పరుగు భాగ్యనగర్ చౌక్ వద్ద ముగిసింది. ఈ పోటీలో స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామాబాయి సాధారణ చీర, చెప్పులు ధరించి పోటీ ప్రదేశానికి వచ్చారు. సాధారణంగా ఒక పోటీదారుగా ఆమె రేసులో చేరారు. చివరికి తానే విజేతగా నిలుస్తారని అప్పటికి ఎలాంటి సూచన కనిపించలేదు.రేసు ప్రారంభమైనప్పుడు ఆమె పట్టుదలతో పరుగెత్తారు. అయితే పరుగులో ఆమె చెప్పులు జారిపోయాయి. అయినా ఆగిపోకుండా ఆమె చెప్పులు విప్పి చేతిలో పట్టుకుని, చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. రోడ్డుపై చెప్పులు లేకుండా పరిగెత్తడం, రాళ్లు ఎదురుకావడం, పరుగెత్తుతూనే చీరను సర్దుకోవడం వంటి సవాళ్లు ఎదురైనా ఆమె ముగింపు రేఖను చేరడంపైనే దృష్టి పెట్టారు. ఆమె పట్టుదలతో యువ పోటీదారులను వెనక్కి నెట్టి ముందుకు సాగారు.ఆమె అందరికంటే ముందుగా ముగింపు రేఖను దాటి మారథాన్లో విజయం సాధించారు. ఆమె పట్టుదల, తన కూతుళ్ల చదువు పట్ల అంకితభావానికి ప్రేక్షకులు, నిర్వాహకులు భావోద్వేగానికి లోనై చప్పట్లతో అభినందించారు. రూ.3,000 బహుమతి మొత్తాన్ని తన కూతురి చదువుకు ఉపయోగించనున్నారు. -
‘ఖాళీ చేసిన నాలుగు గంటలకే హోటల్ కొట్టుకుపోయిది’
ముంబై: కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన మహారాష్ట్రలోని విరార్ వాసి ప్రదీప్ టెండూల్కర్ నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఆయన బస చేసిన హోటల్ను ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఖాళీ చేయడం వల్ల ప్రాణాలు దక్కాయి. ఆగస్టు 22న విరార్ నుంచి యాత్ర ప్రారంభించిన ప్రదీప్ టెండూల్కర్ నేపాల్ మీదుగా ప్రయాణిస్తూ ఒక హోటల్లో బస చేశారు.అయితే ఆ హోటల్ నుంచి ఆయన బయలుదేరిన నాలుగు గంటల వ్యవధిలోనే అక్కడ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. నీటి ఉద్ధృతికి ఆ హోటల్ పేకమేడలా కొట్టుకుపోయింది. కొద్ది గంటల వ్యత్యాసమే ఆయన ప్రాణాలను కాపాడింది. ప్రదీప్ ప్రస్తుతం దాదాపు 18,500 అడుగుల ఎత్తులోని డోల్మా లా పాస్కు సురక్షితంగా చేరుకుని, యాత్రను కొనసాగిస్తున్నారు. తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతం పూర్తిగా శిథిలమైపోయిన వార్త తెలుసుకుని ప్రదీప్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. తమ ప్రాణాలు దక్కినప్పటికీ, ఈ విపత్తు వల్ల ప్రజలకు జరిగిన నష్టం తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విపత్తు కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసమై మానససరోవర యాత్రకు వెళ్తున్న ఇతర యాత్రికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు భారత్, నేపాల్, చైనా సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో వసాయ్-విరార్ నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవగా, నగరానికి చెందిన పౌరులెవరూ ఈ ప్రమాదంలో చిక్కుకోలేదని మేయర్ అజీవ్ పాటిల్ తెలిపారు.ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో.. -
భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం
ముంబై: మహారాష్ట్రలో ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష నేర్చుకోవడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ఇటీవల నిబంధన తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఓ వైపు మరాఠీ భాష నేర్చుకుంటూనే మరోవైపు ప్రయాణికులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేసేందుకు తన ఆటోలో హిందీ నుంచి మరాఠీకి అనువదించిన చేతిరాత నోటును అతికించుకున్నారు. భాష కోసమై ఆటో డ్రైవర్ చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ షీట్లో ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో ఉపయోగించే సాధారణ హిందీ పదాలు, వాక్యాలను వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్లో రాసి ఉంచారు. మరాఠీ నేర్చుకుంటున్న ఆటో డ్రైవర్.. ప్రయాణికులతో మాట్లాడే సమయంలో అవసరమైన వాక్యాలను చూసుకుని ఉపయోగించుకునేలా ఈ షీట్ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో నిత్యం ఎదురయ్యే సాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ షీట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో అవసరమయ్యే పలు సాధారణ వాక్యాలను హిందీతో పాటు వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్లో పొందుపరిచారు. ప్రస్తుతం మరాఠీ నేర్చుకుంటున్న వ్యక్తికి ప్రయాణికులతో మాట్లాడే సమయంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండేలా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు ఆటో డ్రైవర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషపై ప్రాథమిక స్థాయిలో అవగాహన ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. అంటే పూర్తి స్థాయిలో మరాఠీ చదవడం, రాయడం లేదా ఫ్లూయెంట్గా మాట్లాడడం తప్పనిసరి అని కాదు ప్రయాణికులతో సాధారణ సంభాషణ చేయగలిగేంత మరాఠీ భాష రావాలి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రవాణా శాఖ అధికారిక సైట్లో 2026లో మోటార్ వెహికల్ రూల్స్కు చేసిన సవరణలు సైతం నమోదు చేసింది. -
తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తుకారాం ముండేకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తుకారం నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జారీ చేసిన రెండు ప్రధాన చర్యలపై బాంబే హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించకుండా, "సహజ న్యాయ సూత్రాలకు" (principles of natural justice) విరుద్ధంగా,చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండానే అతిగా ప్రవర్తించి హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహించింది. దీంతో పుణేలోని సిప్లా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ యూనిట్ డ్రగ్ సేల్ లైసెన్స్, బీకేసీ ఎంబీఏ (MCA) రెస్టారెంట్ల మూసివేత రద్దు చేస్తూ ఇచ్చిన రెండు ఆదేశాలను ఎఫ్డీఏ వెనక్కి తీసుకోవలసి వచ్చింది.ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని ఆహారశాలలకు సంబంధించి చట్టాన్ని విశ్లేషించకుండా ఉత్తర్వులు జారీ చేయడాన్ని తొందరపాటు చర్యగా పేర్కొంటూ ఎఫ్డీఏను మందలించింది. ఈ సందర్భంగా హైకోర్టు ముండేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార ధోరణితో హద్దులు దాటి ప్రవర్తిస్తోందని గట్టిగా మందలించింది. అంతేకాదు "మీరేదో దేవుడనుకుంటున్నారా? అంటూ మండిపడింది.యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్ లతో కూడిన ధర్మాసనం ఎఫ్డీఏ వైఖరిని తప్పుబడుతూ ‘‘మీరేదో దేవుడనుకుంటున్నారా? మీరు తలచుకుంటే ఏదైనా చేయవచ్చని భావిస్తున్నారా? దోమను చంపడానికి కత్తిని ఎందుకు ఉపయోగిస్తున్నారు?" అని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వ సెలవు దినాన విచారణకు రావాలని ఇమెయిల్ పంపడం, సరైన ప్రక్రియను అనుసరించకపోవడంపై కోర్టు ఎఫ్డీఏను మందలించింది. దీంతో ఎఫ్డీఏ తన రద్దు ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. ఎఫ్డీఏ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు (Contempt action) తీసుకుంటామని హెచ్చరించడంతో, ఎఫ్డీఏ సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీనితో ఆ రెస్టారెంట్లు తిరిగి ప్రారంభించేందుకు కోర్టు అనుమతించింది. ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!మరోవైపు ఎఫ్డీఏ పనితీరును ప్రశంసిస్తూనే, హద్దులు దాటుతున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. తప్పు చేశారు, కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం పేర్కొంది. -
మహారాష్ట్రలో ఈ టిఫిన్ కోసం జనం ఎందుకు క్యూ కడతారు?
‘మిసల్’ అంటే మరాఠీ భాషలో ‘కలయిక‘ అని అర్థం. 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాష్ట్రలోని ఖాందేశ్, నాసిక్ ప్రాంతాల్లోని రైతులు, రోజువారీ కూలీల కోసం ఈ వంటకం పుట్టుకొచ్చింది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ శక్తినిచ్చే ఆహారం కావడంతో... ఇళ్లలో మిగిలిపోయిన ఉడకబెట్టిన పెసళ్లు, శనగలు, మసాలా రసం, చుట్టూ దొరికే కరకరలాడే స్నాక్స్ను కలిపి ఒక డిష్గా అందించడం ప్రారంభించారు. అలా మిసల్ పావ్ వంటకం ప్రజలందరికీ ఇష్టమైన వంటకంగా మారిపోయింది.మహారాష్ట్ర వీధుల్లో ఎక్కడ చూసినా కనిపించే ‘మిసల్ పావ్’ కేవలం ఒక టిఫిన్ మాత్రమే కాదు... పుణె సంస్కృతిలో భాగమైన ఒక ఎమోషన్. ఘాటైన కారం, కరకరలాడే ఫర్సాన్, ఉడకబెట్టిన మొలకెత్తిన ధాన్యాలు, వేడివేడి పావ్ల కాంబినేషన్ ప్రతి ఒక్కరి నాలుకపై నీరూరిస్తుంది. ఒకప్పుడు పేద ప్రజలు, కూలీల ఆకలి తీర్చడానికి మొదలైన ఈ మిసల్ పావ్... నేడు పుణె సిటీలోనే అత్యంత ఐకానిక్ డిష్గా మారిపోయింది.తక్కువ ధరలో లభించే పోషకాహారం కావడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, పర్యాటకులు మిసల్ పావ్ రుచికి దాసోహమయ్యారు. నేడు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాకాహార అల్పాహారాల్లో ఒకటిగా లండన్లో గుర్తింపు పొందే స్థాయికి మిసల్ పావ్ ఎదిగింది. షాపుల ముందు మైళ్ల పొడవునా క్యూ నిలబడినా సరే... పొగలు కక్కే మిసల్ పావ్ తింటే వచ్చే ఆ తృప్తి ముందు ఆ నిరీక్షణ చిన్నబోతుందంటారు పుణె వాసులు.ఇవీ చదవండి: ఆఫీస్ వర్క్లో ఫోకస్ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్ తప్పనిసరి! -
లంచగొండి ఆఫీసర్కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
“వాళ్లను కొడతాం.. దెబ్బలు తింటారు”
ముంబై: మరాఠీ భాషా నిబంధనపై ఒత్తిడి పెంచుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమిత్ ఠాక్రే హెచ్చరికలు జారీ చేశారు. హిందీలో మాత్రమే మాట్లాడాలని పట్టుబట్టే ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లను కొడతామని ఆయన అన్నారు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే అన్న విషయం తెలిసిందే.మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆటోరిక్షా, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు పని నిర్వహణకు అవసరమైన మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది సమయం ఇచ్చింది. ఈ నిర్ణయం తర్వాత అమిత్ ఠాక్రే స్పందించారు. డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు మరింత సమయం కావాలని కోరారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ రంగంలో వివిధ వయసులు, విద్యా నేపథ్యాలకు చెందిన వారు పనిచేస్తున్నారని వారు చెప్పినట్లు ఆయన వివరించారు.దీంతో అమిత్ ఠాక్రే మాట్లాడుతూ.. ఆటోరిక్షా డ్రైవర్లు హిందీలో మాట్లాడుతున్నారని లేదా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తే తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. “ఆటోరిక్షా డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నట్లు లేదా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వాళ్లను కొడతాం. మీరు ప్రజలను ఇబ్బంది పెడితే దెబ్బలు తింటారు. ప్రజలు ఉత్తరప్రదేశ్ భాషలోనే మాట్లాడాలని లేదా హిందీలోనే మాట్లాడాలని వారికి చెప్పకండి. మేం మరాఠీలో మాట్లాడతాం. అంతమాత్రం మీరు అర్థం చేసుకోండి” అని ఆయన అన్నారు.పని నిర్వహణకు అవసరమైన మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది అదనపు సమయం ఇచ్చిన నిర్ణయంపై ఫడ్నవీస్ను ఠాక్రే కూడా లక్ష్యంగా చేసుకున్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాలకు మరాఠీ భాష కంటే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. “వారికి 10 సంవత్సరాల గడువు ఇవ్వండి. 15 సంవత్సరాల గడువు ఇవ్వండి. మరాఠీ భాషపై, మా రాష్ట్రంపై మీకు ఎంత ప్రేమ ఉందో మేం అర్థం చేసుకున్నాం” అని ఆయన అన్నారు.వేరే రాష్ట్రాల్లో చూడండి.. “మీరు గుజరాత్కు వెళ్లండి, పంజాబ్కు వెళ్లండి లేదా దక్షిణాదికి వెళ్లండి.. ప్రతిచోటా ప్రజలకు తమ సొంత భాషపై అనుబంధం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నందున ఏడాది అదనపు గడువు ఇస్తున్నారు” అని ఠాక్రే అన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన సవాలు కొనసాగుతున్న సమయంలో ఈ ఏడాది అదనపు గడువు ఇచ్చారు. నలుగురు క్యాబ్ డ్రైవర్లు ఈ ఆదేశాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేశారు.ఆటోరిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లతో సహా వాణిజ్య ప్రయాణికుల వాహనాల డ్రైవర్లకు ఆగస్టు 12 నుంచి మరాఠీపై పరిజ్ఞానం తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. సవరించిన నిబంధనల ప్రకారం, మరాఠీని పని నిర్వహణ స్థాయిలో ఉపయోగించగలమని నిరూపించలేని డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ అనుమతిని 3 నెలల పాటు నిలిపివేయవచ్చు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే వారి అనుమతులను శాశ్వతంగా రద్దు చేయవచ్చు.ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సులకు ఎలాంటి భాషా నిబంధనను విధించలేదని, అందువల్ల ఈ నిబంధన ఆ చట్టం పరిధిని మించిపోయిందని పిటిషన్లో వాదించారు. -
చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం
ముంబైలో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’ అన్న చందంగా.. నేలను తాకాల్సిన ఆమె భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ‘బతికితే బలుసాకు తినవచ్చు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమెకు ఆ చెట్టే ప్రాణరక్షకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముంబైలోని భాండూప్ వెస్ట్ తుల్షెట్పాడ ప్రాంతంలోని సన్షైన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీక్ష హివ్రాలే(26) సన్షైన్ బిల్డింగ్లోని పదో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. పదో అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమె నేరుగా నేలను తాకకుండా.. భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. దీంతో చెట్టుపై సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.A woman fell from the 10th floor of a residential building at #Bhandup , #Mumbai, but was miraculously saved as she stuck to a tree. Later on, the fire brigade rescued her safely and had her admitted to a hospital. pic.twitter.com/WdhAiGj80o— Hiren Antani (@HirenAntani) August 26, 2026సమాచారం అందిన వెంటనే ఉదయం 9.32 గంటలకు ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుక్ ల్యాడర్ సహాయంతో చెట్టు వద్దకు చేరుకున్న సిబ్బంది.. ఎంతో జాగ్రత్తగా ప్రతీక్షను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రైవేట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయం అయినట్లు తేలింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సియాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.చదవండి: నేపాల్కు అత్యవసర సాయం పంపిన భారత్పోలీసుల వివరాల ప్రకారం ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆమె పదో అంతస్తు నుంచి ఎందుకు దూకింది? అసలు ఏం జరిగింది? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. వైద్యుల నుంచి మెడికల్ ఎండార్స్మెంట్ తీసుకున్నారు. ఆమె కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
క్లోరిన్ గ్యాస్ లీకై 56 మంది ఆస్పత్రిపాలు
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ప్రభుత్వ ఆదీనంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్యాస్ను పీలి్చన 56 మంది ఆస్పత్రి పాలుకాగా, వీరిలో 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గోధని గ్రామపంచాయతీలోని నీటిశుద్ధి ప్లాంట్లో 900 కిలోల సామర్థ్యమున్న క్లోరిన్ గ్యాస్ సిలిండరుంది. వేకువజాము నుంచి ఈ గ్యాస్ లీకవడం మొదలైంది. గమనించిన అధికారులు 5.30 గంటలకు ఆ సిలిండర్ను పూర్తిగా నీటిలో ముంచి, ప్రమాదం తగ్గించారు. అప్పటికే గ్యాస్ను పీల్చిన కొందరు దగ్గు, శ్వాసలో ఇబ్బందులతో అవస్థలు పడ్డారు. ఇందులో 56 మంది ఆస్పత్రి పాలుకాగా, 11 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. మరో 45 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న8 మందిని ఐసీయూలో ఉంచారు. గ్యాస్ లీకేజీ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలోని 200 మీటర్ల పరిధిలోని వారందరినీ ఖాళీ చేయించారు. -
సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ యువతతో మమేకమయ్యే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీల కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ విద్యార్థిని.. అందరి ముందే రాహుల్ గాంధీ చెంపపై ముద్దుపెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మహారాష్ట్రలోని పూణేలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ వేదికపై యువతతో మాట్లాడటంతో పాటు వారితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్ వద్దకు వచ్చి ఆయన చెంపపై ముద్దు పెట్టింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో రాహుల్ షాకయ్యారు. అనంతరం రాహుల్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమం మొత్తం కచేరీ తరహా లైటింగ్, భారీ ఏర్పాట్లతో సాగింది.#rgtwt gurls are not not ready fr this 😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026ఈ ఘటన అనంతరం, 11వ తరగతి చదువుతున్న సదరు యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.It's my dream to become like Rahul Gandhi.♥️Mariyam, an 11th-grade student, aspires to walk in the footsteps of Rahul Gandhi.Rahul Gandhi flat-out owns the narrative among the youth right now. His rivals are just picking up whatever crumbs he leaves behind. 🔥💯 pic.twitter.com/VN3j1OwwzQ— Krishna Yadav (@Control_Krishna) August 24, 2026సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లుఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీతో మహిళలు, యువతులు ఎంత సౌకర్యంగా మెలుగుతున్నారో కొందరు ప్రస్తావించగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ‘మనుస్మృతి’ భావజాలాన్ని విమర్శించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.రాహుల్ సభపై బీజేపీ ఫైర్రాహుల్ కార్యక్రమంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై సీరియస్గా మాట్లాడకుండా రాహుల్ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని మహారాష్ట్ర బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. సభకు జనాన్ని సమీకరించేందుకు కాలేజీ బస్సులను ఉపయోగించారని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. LoP @RahulGandhi Ji's craze among GenZ 🔥A student kissed him with affection.....! This is how safe girls feel around him. It can never happen with any BJP leader. pic.twitter.com/shbLJi6QSK— Venisha G Kiba (@KibaVenisha) August 24, 2026 -
అమరావతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నవజాత శిశువులు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమరావతిలోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు శిశువుల పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ మహిళా ఆసుపత్రి మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై NICUలో ఉన్న శిశువులను బయటకు తరలించారు.ఇది కూడా చదవండి: హెచ్1ఎన్1 టెన్షన్.. ఒక్కరోజే 114 పాజిటివ్ కేసులుఆ సమయంలో NICUలో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సిబ్బంది సకాలంలో స్పందించి పలువురు శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. తీవ్ర వైద్య సంరక్షణ అవసరమైన ఆరుగురు శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 22న మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లా ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. NICUలోని వార్మర్ యంత్రం నుంచి మంటలు చెలరేగడంతో ఓ నవజాత శిశువు మృతి చెందగా, మరో ఇద్దరు శిశువులు గాయపడ్డారు.Amravati, Maharashtra: Three newborns died after a fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) of Amravati District Women's Hospital at around 3:30 AM. The fire reportedly started following an explosion in a ventilator on the hospital's third floor, where 39… pic.twitter.com/Yde1uEk3W6— IANS (@ians_india) August 24, 2026 -
ఆ విషాదానికి ఒక్కరోజు ముందు తల్లి సంచలన వీడియో
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజినగర్లోని కొండపై భర్త, కుమారుడితో కలిసి ప్రాణాలు కోల్పోవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. సంగీత తన యూట్యూబ్ ఛానెల్లో బంధాలు-విలువలపై పోస్ట్ చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. సంగీత... ఆమె భర్త మురళీధర్ చంద్గుడే, వారి 18 ఏళ్ల కుమారుడు కునాల్.. శుక్రవారం మధ్యాహ్నం కోడ్యా డోంగార్లోని 200 అడుగుల లోతైన లోయలో పడి మరణించారు. కుమారుడి కొత్త ఫోన్ ఈఎంఐల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.అయితే, ఘటన జరిగిన ఒకరోజు ముందే (గురువారం) సంగీత తన యూట్యూబ్ వేదికగా రికార్డ్ చేసిన ఒక సెల్ఫ్ వీడియోను షేర్ చేస్తూ, "ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తి కోసం ఏ పనీ చేయడంలో అర్థం లేదంటూ పేర్కొన్నారు. ‘‘మీరు మీ సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. కానీ అది మిమ్మల్ని, మీ ప్రేమను విలువైనదిగా భావించే వారికే. ఒక వ్యక్తి మిమ్మల్ని విలువైనదిగా భావించకపోతే.. మీ ప్రేమను పట్టించుకోకపోతే, మీరు అతని కోసం చేసే పనులకు విలువ లేకపోతే.. అలాంటి వ్యక్తి కోసం ఏ పనీ చేయడంలో అర్థం లేదు" అంటూ ఆమె మరాఠీ భాషలో నిమిషం పాటు సాగిన ఆ వీడియోలో చెప్పారు.చపాతి అనేది రెండు వైపులా కాలిస్తేనే రుచిగా ఉంటుంది. సంబంధాల విషయంలోనూ అంతే. రెండు వైపుల నుంచి నడిస్తే, ఇద్దరూ దానికి విలువ ఇస్తేనే అలాంటి సంబంధంలో ఉండాలి. లేదో ఒకరు మాత్రమే విలువ ఇస్తూ మరొకరు పట్టించుకోకపోతే ఆ బంధానికి అర్థం లేదు. అలాంటి సంబంధం నుండి బయటపడటమే ఎప్పుడైనా మంచిదంటూ ఆమె తెలిపారు. యూట్యూబ్లో 29 వేల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న సంగీత.. తన ఛానెల్లో అనేక మోటివేషనల్ వీడియోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా, ఆమె తన కుమారుడితో కూడిన షార్ట్ వ్లాగ్లను కూడా షేర్ చేసేవారు.ఇదీ చదవండి: ఐఫోన్ ఈఎంఐ గొడవ.. వెలుగులోకి పాత వీడియోలుఅసలేం జరిగిందంటే..ఐ ఫోన్ విషయంలో జరిగిన గొడవ విషాదంగా మారింది. కుమారుడు కునాల్ ఐఫోన్ కొనుగోలు చేయగా.. దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు.. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. కుమారుడు కునాల్ పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీతతో పాటు మరికొందరు స్థానికులు కొండపైకి వెళ్లి అతనితో మాట్లాడి ఇంటికి తిరిగి రావాలని ఒప్పించేందుకు ప్రయత్నించారు.సుమారు మూడు గంటల తర్వాత.. మురళీధర్ కునాల్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అతన్ని కొండ అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి సుమారు 250 అడుగుల లోతైన లోయలో పడిపోయారు. తన భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన సంగీత తట్టుకోలేక కొన్ని సెకన్ల తర్వాత తాను కూడా దూకింది. దీంతో ఈ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. -
ఎమ్మెల్యే పీఏ కుమార్తె అనుమానాస్పద మృతి
పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అజిత్ దశావతారే కుమార్తె ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. శనివారం రోజున సదరు బాలిక తన తల్లితో చిన్న విషయమై వాగ్వాదానికి దిగింది. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం బారామతి పరిధిలోని రూయ్ గ్రామం సాయినగర్ ప్రాంతంలో ఆమె నివాసానికి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం బారామతి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్ -
ఐఫోన్ ఈఎంఐ గొడవ.. వెలుగులోకి పాత వీడియోలు
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో కొండపై జరిగిన విషాద ఘటనలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల మీద అలిగిన కుమారుడు కొండ మీద నుంచి దూకుతానంటూ వెళ్లగా.. తన కుమారుడిని కాపాడుకునేందుకు వెళ్లిన తండ్రి కూడా మరణించాడు. వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. క్షణాల్లో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.మరణించిన 18 ఏళ్ల కునాల్ చాంద్వాడే, అతని తల్లి సంగీత చాంద్వాడేకు సంబంధించిన రెండు తేదీ లేని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ వీడియోలో కునాల్ తన తల్లితో కలిసి టీ తాగుతూ కనిపించగా.. మరో వీడియోలో అతను తన తల్లి కాళ్లు కడిగి ఆమె ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించాడు.ఐ ఫోన్ విషయంలో జరిగిన గొడవ విషాదంగా మారగా.. కునాల్, సంగీత, అతని తండ్రి మురళీధర్ చాంద్గుడే మరణించారు. కుమారుడు కునాల్ ఐఫోన్ కొనుగోలు చేసి.. దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు.. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. కుమారుడు కునాల్ పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన మురళీధర్, సంగీతతో పాటు మరికొందరు స్థానికులు కొండపైకి వెళ్లి అతనితో మాట్లాడి ఇంటికి తిరిగి రావాలని ఒప్పించేందుకు ప్రయత్నించారు.ఇదీ చదవండి: నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!Whole feed is filled with this mother and son.Honestly, I just can't believe this guy costed everyone's life because of an iPhone. In every reel, she seems like she's the breadwinner of the family. She earns for herself.Even in the video where Kunal fell off, he was screaming… pic.twitter.com/7S9xm9w1LR— ` (@worshipVK) August 23, 2026దాదాపు మూడు గంటల తర్వాత, మురళీధర్ కునాల్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అతన్ని అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి సుమారు 250 అడుగుల లోతైన లోయలో పడిపోయారు. తన భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన సంగీత తట్టుకోలేక కొన్ని సెకన్ల తర్వాత తాను కూడా దూకింది. నగరంలోని జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. -
అధికారుల లంచం చిట్టా బట్టబయలు!
లాథూర్: ఓ గ్రామ సర్పంచ్ నోట్లోంచి వచ్చిన మాటలివి. ఆ డబ్బు ఎవరికీ అన్నది మీ డౌటా? ఇంకెవరికి సంబంధిత అధికారులకేనని, అంత మొత్తం లంచం ఇస్తే కానీ పనులు కావడం లేదని సర్పంచ్ ఆనాటి గ్రామ సభలో చెప్పాడు. ఈ గ్రామసభ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అధికారులు నాలుక్కరుచుకుని...‘‘లంచాలకు సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వండి.. చర్య తీసుకుంటాం’’అని గంభీరంగా చెబుతున్నారు. మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, చకూర్ తహశీల్, అటోలా గ్రామంలో ఆగస్టు పదిహేడున ఈ ఘటన చోటు చేసుకుంది. వేర్వేరు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? అని గ్రామస్తులు సర్పంచ్ను ప్రశ్నించారు. దీంతో ఆయన ఈ లంచాల చిట్టా విప్పక తప్పింది కాదు. పంచాయతీ సమితి సభ్యులతోపాటు అధికారుల చేతులూ తడిపితేగానీ పనులు కావడం లేదని సర్పంచ్ చెప్పుకొచ్చాడట. ఉపాధి హామీ పథకం కింద బావి తవ్వుకునేందుకు అనుమతి కావాలంటే రూ.20 వేలు, పశువుల కొట్టానికైతే రూ.ఏడు వేలు అవసరమవుతాయని, బావి విషయంలోనైతే పంచాయతీ సమితి సభ్యులు రూ.15 వేలకు సర్దుకుంటారని, మిగిలిన రూ.ఐదు వేలను ఇంటి, నీటి పన్ను బకాయిల కింద జమచేస్తారని కూడా సర్పంచ్ వివరించారు. అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గ్రామసభ సమావేశాలను వీడియో తీయమని స్వయానా సర్పంచే చెప్పడం. ‘‘ఈ సత్యం ప్రపంచం మొత్తానికి తెలియాల్సిందే’’అని కూడా ఆయన మాట్లాడటం వీడియోలో రికార్డయింది. అయితే ఈ విషయమై అధికారులు మాత్రం అంత సంతృప్తిగా ఏమీ లేరు. ‘‘లంచాలకు సంబంధించిన ఆధారాలు మూడు రోజుల్లో ఇవ్వాలని, ఎవరికి? ఎప్పుడు లంచమిచ్చారో రాతపూర్వకంగా తెలపాలని, చకూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంతాజి మానె ఇప్పటికే గ్రామ సర్పంచ్ను కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. పౌరులు ఎవరూ పనుల కోసం పంచాయతీ సమితికి డబ్బులు ఇవ్వరాదని కోరారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సలహా కూడా ఇచ్చారు. -
మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు
పుణె: మహిళలు తమ తండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందినవారు కాదని.. తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఒక మహిళ తన జీవితంలో ప్రతి దశలోనూ పురుషుడి అధికారం కింద ఉండాలన్న మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు అని ఆక్షేపించారు. భారతదేశపు అతిపెద్ద బలం ఇక్కడి మహిళల 70 కోట్ల విశిష్ట ప్రయాణాలు, విశిష్ట ఊహలు, విశిష్ట కలలు అని అభివర్ణించారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాత్రోంకీ గూంజ్’కార్యక్రమంలో యువతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. మహిళలు బాల్యంలో తండ్రికి లోబడి ఉండాలని, యవ్వనంలో భర్తకు చెందాలని, భర్త మరణించిన తర్వాత ఆమె తన కుమారుల అ«దీనంలో ఉండాలని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతి చెబుతోందని గుర్తుచేశారు. ఇలా చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మహిళలు ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, తమను తాము విశ్వసించాలని చెప్పారు. ‘‘మీరు మీకు తప్ప మరెవరికీ చెందినవారు కాదు. మీకు మీ తండ్రి, సోదరుడు, భర్త, కొడుకుతో సంబంధం ఉండవచ్చు. కానీ మీరు వారికి చెందినవారు కాదు, మీరు మీకు మాత్రమే చెందినవారు’’అని మహిళలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఉపన్యాసాలు ఇవ్వడానికో, రాజకీయాల గురించి చర్చించడానికో కాకుండా.. యువత తమ భావాలను వ్యక్తపరచడానికి, వారి ఆలోచనలను చర్చించుకోవడానికి అవకాశం కల్పించడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు. సంకెళ్లను బద్దలు కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడని, వారికి వారి సొంత కలలు, ఆశయాలు ఉంటాయని చెప్పారు. పురుషుల కంటే మహిళలు స్వభావరీత్యా ఎక్కువ సున్నిత మనస్కులు, సౌమ్యులు, కరుణామయులు, దూరదృష్టి కలవారని తెలిపారు. అందుకే వారు మన దేశానికి అసలైన సంపద అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మహిళలు తరచుగా కుమార్తె, భార్య లేదా తల్లి అనే మూడు గుర్తింపులకే పరిమితమవుతున్నారని, ఈ సంబంధాలలో తప్పేమీ లేనప్పటికీ, అవే వారి ఏకైక గుర్తింపుగా ఉండకూడదని తేల్చిచెప్పారు. నన్ను పిలవండి.. నిరసనలో కూర్చుంటా హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేవని, భద్రత కూడా కల్పించడం లేదని ‘ఛాత్రోంకీ గూంజ్’లో ఓ గిరిజన యువతి రాహుల్ గాం«దీ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం పుణేలోని మంజరిలో గిరిజన విద్యార్థులు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఈ నిరసనలో ఇద్దరు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారని, వారిలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. దీనిపై ఆయన స్పందిస్తూ... సమస్యల పరిష్కారం కోసం పుణేలో నిరసన వ్యక్తంచేస్తున్న గిరిజన విద్యార్థులకు అండగా ఉంటానని, తాను కూడా నిరసనలో పాల్గొంటానని చెప్పారు. ‘‘నన్ను పిలవండి.. నేను వచ్చి మీతోపాటు నిరసనలో కూర్చుంటాను’’అని పేర్కొన్నారు. విద్యావకాశాలు, ఆర్థిక స్వాతంత్య్రం, ప్రజా రవాణా భద్రత, హింస, సైబర్ వేధింపులతో సహా పలు అంశాలపై విద్యారి్థనులతో సంభాíÙంచారు. -
కుటుంబాన్ని బలితీసుకున్న ఐ ఫోన్..!
-
సంక్షేమ పథకానికి తూట్లు.. అనర్హుల ఖాతాల్లోకి రూ. 9,605 కోట్లు!
ముంబై: మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహీన్’ పథకంలో భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) గణాంకాల ద్వారా వెల్లడైంది. అనర్హులైన లబ్ధిదారులకు దాదాపు రూ.9,605 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం అందించే ఈ పథకాన్ని జూలై 2024లో ప్రారంభించారు.అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో ఈ పథకం కీలక పాత్ర పోషించినప్పటికీ, ఖజానాపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నదన్న విమర్శలు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో లబ్ధిదారుల జాబితాను పలుమార్లు సరిచేసినప్పటికీ అనర్హులను పూర్తిగా తొలగించలేకపోయారు. జూన్ 2026 నాటికి 92 లక్షల మంది అనర్హుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ అయినట్లు ‘ఆర్టీఐ’ నివేదిక పేర్కొంది.అనర్హుల తొలగింపునకు సంబంధించి..ఈ-కేవైసీ పూర్తి చేయనందుకు 62 లక్షల మందిని తొలగించారు. వార్షిక ఆదాయ పరిమితి రూ. 2.5 లక్షలు దాటిన 16 లక్షల మంది పేర్లను రద్దు చేశారు. సంజయ్ గాంధీ నిరాధార్ అనుదాన్ యోజన లబ్ధిదారులు 3.6 లక్షల మంది, ఒకే కుటుంబం నుంచి రెండో దరఖాస్తు చేసుకున్న 2.5 లక్షల మంది, 65 ఏళ్ల వయోపరిమితి దాటిన 1.8 లక్షల మందిని తప్పించారు.4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా స్థాయి పరిశీలనలో మరో 1.7 లక్షల మంది అనర్హులుగా తేలారు. గత 24 నెలల్లో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.76,261 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అర్హుల సంఖ్య 1.65 కోట్లుగా ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందిన సాధారణ పౌరుల నుంచి కాకుండా, కేవలం 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నుంచి మాత్రమే ఆ నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో అరుదైన సంప్రదాయం.. రాష్ట్రపతి, ప్రధానికి శాంతా దేవి రాఖీలు! -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం -
‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి
ముంబై: మహారాష్ట్ర ఆహార, ఔషధాల కమిషనర్ తుకారాం ముండే(2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి)కు ప్రజల నుంచి వచ్చిన ప్రశంసలు మరే ఇతర ఎఫ్డీఏ కమిషనర్కూ ఇప్పటివరకూ దక్కలేదనే చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఈటరీ కేంద్రాల్లో అపరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. నిబంధనలను కఠినంగా అమలు చేసే తీరుతో తరచూ “ఐఏఎస్ సింగం”గా ముండేను పిలుస్తారు. ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించే తీరుతో తన కెరీర్లో పలువురు రాజకీయ నాయకులతో తరచూ విభేదించారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి వస్తారా? అని ఆయనను అడిగారు. దీనికి కూడా ఆయన నిజాయితీగా, సూటిగా సమాధానం ఇచ్చారు.“అసలు లేదు. దానికి దాని సొంత అవసరాలు ఉంటాయి. నేను సూటిగా మాట్లాడే వ్యక్తిని, చాలా బహిరంగంగా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. రాజకీయాలకు ఈ లక్షణాలు నచ్చుతాయో లేదో నాకు తెలియదు” అని ముండే అన్నారు. ప్రజాసేవలో ఉండాల్సిన విధానానికి రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.బ్యూరోక్రాట్గా తాను అన్ని పనులు చేసినట్టే రాజకీయాల్లోనూ కొత్త ఒరవడిని సృష్టించగలరా? అని ముండేను అడగగా.. ఆయన స్పందిస్తూ.. “నేను ఒక విషయంలో మంచిగా ఉంటే, దానినే కొనసాగించాలి” అని చమత్కరించారు. మహారాష్ట్ర ఎఫ్డీఏగా బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలలే అయినా, రాష్ట్రంలోని రెస్టారెంట్లు, గోదాములు, ఆహార దుకాణాలపై కఠిన చర్యలతో ముండే అందరి దృష్టిని ఆకర్షించారు.నాకు నేనే సవాలు విసురుకుంటా.. వంటగదుల్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు కనిపించడంతో డొమినోస్, పిజ్జా హట్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. ముంబైలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను కొంతకాలం నిలిపివేశారు. బ్లింకిట్, జెప్టోకు చెందిన డార్క్ స్టోర్లలో నిర్వహించిన దాడుల్లో బల్లులు, బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు బయటపడ్డాయి. బాంబే హైకోర్టు క్యాంటీన్లలోనూ తనిఖీలు నిర్వహించడానికి ఆయన వెనుకాడలేదు. జూలై 31 నాటికి తన విభాగం 3,000 తనిఖీలు నిర్వహించిందని, రూ.55 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని, 165 సంస్థల లైసెన్సులను నిలిపివేసిందని ముండే తెలిపారు.కఠిన పరిపాలనా నిర్ణయాలు తీసుకునే అధికారిగా ముండేకు ఉన్న పేరుతో 21 ఏళ్లలో ఆయన దాదాపు 25 సార్లు బదిలీ అయ్యారు. సవాళ్లు విసరడం ఇష్టమా? అని ఆయనను అడగగా.. ముండే వెంటనే స్పందిస్తూ.. “నాకు నేనే సవాలు విసురుకుంటాను” అని చెప్పారు.కాగా, బీడ్లోని ఓ గ్రామంలో సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి మహారాష్ట్ర ఎఫ్డీఏగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ముండే చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన పలువురు ముఖ్యమంత్రుల కింద పనిచేశారు. ఎవరైనా తనకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఉన్నారా? అని అడగగా ముండే చమత్కరిస్తూ “అందరూ నాకు ఇష్టమైనవారే” అని అన్నారు.ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ -
తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
-
కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా దేవళాయ్ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖవ్డా కొండపైకి వెళ్లిన 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, అతడిని కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులతో సహా ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మరణించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.దాదాపు మూడు గంటలు పాటు సాగిన ఈ వ్యవహారం చివరికి విషాదాంతమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో యువకుడు ఖవ్డా కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ప్రారంభించాడో యువకుడు. దాదాపు 3 గంటల పాటు అతడి తల్లి, స్థానిక గ్రామస్తులు, పోలీసులు అతడిని కిందకు దిగిరావాలని ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది.దీంతో ఆందోళనకులోనైన తండ్రి మధ్యాహ్నం 1 గంట సమయంలో, కొండ ఎక్కి కొడుకును కాపాడేందుకు ప్రయత్నించాడు. కొడుకును పట్టుకునే క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కొండపై నుంచి కిందకు పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కిందపడిపోవడం చూసి భయాందోళనకు గురైన తల్లి కూడా కొద్దిక్షణాల్లోనే కొండపై నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఈ ఉదంతాన్ని అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!
నీట్ లీకేజీ వ్యవహారంపై నెలకు పైగా ఆందోళనలు చేసి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. ఇప్పుడు మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతోంది. ‘‘మంత్రుల కుక్కలకు కూడా ఇంత కంటే మెరుగైన సౌకర్యాలు ఉంటున్నాయి. మరి ఈ పిల్లలేం పాపం చేశారు?’’ అంటూ సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఈ ఉద్యమాన్ని నడిపించబోతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాజీ భూసే(Dadaji Bhuse) పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితులకు ఆయనే నైతిక బాధ్యత వహించాలని అంటోంది. మంత్రి గనుక రాజీనామా చేయకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. లాతూర్ జిల్లా ఔసా తెహశీల్ ఉజని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే గురువారం సందర్శించారు. సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు.తరగతి గదుల్లో బెంచీలు లేకపోవడం, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, పాఠశాలలకు వెళ్లేందుకు సురక్షితమైన రహదారులు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. “మంత్రుల కుక్కలకు కూడా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు లేవు” అని దీప్కే ఘాటు వ్యాఖ్యలు చేశారు.జంతువుల కంటే హీనంగా చూస్తున్నారుకొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన సమస్య అని, రాజకీయ నాయకులు విద్యార్థుల కోసం ఏమీ చేయకపోతే ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నాయకులు హెలికాప్టర్లలో తిరగడానికే ప్రజలు ఓట్లు వేస్తున్నారా? అని నిలదీశారు.తమ గ్రామాలకు వచ్చే అన్ని పార్టీల నాయకులను విద్య కోసం పనిచేయాలని ప్రజలు డిమాండ్ చేయాలని సూచించారు. పాఠశాలలను బాగు చేసే వరకు ఓట్ల కోసం గ్రామాలకు రావొద్దని నేతలకు చెప్పాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో రాజకీయాల కోసం బయటకు వచ్చే ప్రజలు.. తమ పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలల సమస్యలపై కూడా పోరాడాలని కోరారు.మంత్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తారా?మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని దీప్కే డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి తెలుస్తాయని అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ పాఠశాలల్లో ప్రాథమిక సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు.కొన్ని పాఠశాలల్లో రేకుల పైకప్పులు కారుతున్నాయని, విద్యార్థులు సరైన బెంచీలు లేకుండానే చదువుకుంటున్నారని చెప్పారు. పాఠశాలల పరిసరాల్లో చెత్త, పాత సామగ్రి పేరుకుపోవడంతో పాములు సంచరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పాముకాటుతో విద్యార్థులు మృతి చెందిన ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు(ఆ వివరాలు చివర్లో..).మంత్రి తప్పుకోవాల్సిందే.. లేదంటే ఉద్యమంపాఠశాలల పరిస్థితి చూస్తుంటే దాదా భూసే విద్యాశాఖ మంత్రిగా కొనసాగకూడదని దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.సీజేపీ చేపట్టిన పాఠశాలల తనిఖీలతో కొన్ని చోట్ల అధికారులు పనులు ప్రారంభించారని దీప్కే తెలిపారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. 2029 ఎన్నికల నాటికి జెన్జీ కీలక ఓటు బ్యాంకుగా మారుతుందని, విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలను వారు ప్రశ్నిస్తారని పేర్కొన్నారు.ఎవరీ దాదాజీ భూసే..దాదాజీ భూసే మహారాష్ట్రకు చెందిన శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) సీనియర్ నేత, మాలేగావ్ ఔటర్ ఎమ్మెల్యే. 2024 డిసెంబర్ నుంచి మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనను రాజీనామా చేయాలని సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. పాముకాటును నోటిఫయబుల్ డిసీజ్..మహారాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటును నోటిఫయబుల్ డిసీజ్గా ప్రకటించింది. ఇందుకు కారణం.. గడ్చిరోలి జిల్లాలో జరిగిన విషాద ఘటన. ఆగస్టు 9న జప్తలై గ్రామంలోని ప్రభుత్వ సహాయంతో నడిచే గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషపాము కాటుకు ముగ్గురు బాలికలు మృతి చెందగా.. మరో ముగ్గురు విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత పాముకాటు కేసులను వెంటనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడంతో పాటు యాంటీ-స్నేక్ వెనమ్ (ASV) లభ్యతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, వైద్యులు ప్రతి పాముకాటు కేసు, మరణాన్ని తప్పనిసరిగా అధికారులకు నివేదించాలి. దీంతో పాముకాటు ఘటనలపై సమగ్ర సమాచారం సేకరించి, ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ యాంటీ-వెనమ్ కొరత ఉంది వంటి అంశాలను గుర్తించి సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. -
ఇన్స్టామార్ట్లో బొద్దింక : ఎఫ్డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు. రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా తనిఖీల పేరుతో ఎఫ్డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్అసలు ఏమైంది? శ్వేతా తివారీ ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్ఫామ్కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
9 ఏళ్ల బాలికపై హత్యాచారం : గ్రామంలో ఉద్రిక్తత
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పైగా బాలిక కనిపించడం లేదన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో నిందితుడు కూడా వారితో కలిసి వెతుకుతూ నాటకం ఆడాడు. చివరికి పోలీసులు అతని యవ్వారాన్ని బయటపెట్టారు. ఈ ఘటన జున్నార్ తాలూకా పింపాల్వండి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. ఈ కేసును వేగంగా విచారించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూణే-నాసిక్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. అసలేం జరిగింది అంటేపోలీసుల సమాచారం ప్రకారం బాధిత చిన్నారి 4వ తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా, ఆమె అనారోగ్యం వల్ల ఆ రోజు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన పొరుగింటి 25 ఏళ్ల కీచకుడు సాహిల్ ఖైరే ఆమెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది తెలియని తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం గాలించి, ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అప్పటివరకూ నిందితుడు సాహిల్ కూడా ఏమీ ఎరగనట్టుగా వీరితో పాటే ఉండటం గమనార్హం.అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ను పరిశీలించగా, సైకిల్పై వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తిని సాహిల్ ఖైరేగా గుర్తించి ప్రశ్నించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతడు చూపించిన ప్రదేశం (ఓ వాగు వద్ద ఉన్న చెట్టు కింద) నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి: ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్ఆందోళనలు-ఉద్రిక్తతఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పుణే-నాశిక్ రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని ఉరితీయాలని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి 15 రోజుల్లోగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్పందనఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, పుణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్తో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య -
ముగ్గురు స్టార్ హీరోలకు భారీ షాక్! ఈ షాక్ ఏంటి?
-
తుకారాం ముండేకు బిగ్ షాక్.. జరిమానా
నిబంధనలు పాటించని ఆహార దుకాణాలపై చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది.. కానీ నిబంధనలు పాటించిన తర్వాత కూడా లైసెన్స్ పునరుద్ధరించకుండా ఆ వ్యాపారాన్ని అడ్డుకోవం ఎంత వరకు సబబు?. ఈ వ్యవహారాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది అతిగా వ్యవహరించడమేనని పేర్కొంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు జరిమానా విధించింది.తుకారాం ముండే మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు చూస్తున్నదే. నిత్యం ఏదో ఒక రెయిడ్తో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారాయన. అయితే.. పుణెలోని ఓ స్వీట్స్ దుకాణం లైసెన్స్ను 98 శాతం నిబంధనలు పాటించినట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలింది. అయినప్పటికీ పునరుద్ధరించకపోవడంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, తినుబండారాల లైసెన్సులను సస్పెండ్ చేయడం FDA అనుసరిస్తున్న విధానంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ‘వింతైన, విపరీతమైన విధానం’గా అభివర్ణించింది.98 శాతం కంప్లయన్స్ ఉన్నా..పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్పై ఆహార కలుషితానికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో FDA అధికారులు జూన్ 12న తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని పారిశుద్ధ్యం, సిబ్బంది పరిశుభ్రతకు సంబంధించి పలు లోపాలను గుర్తించారు. అదే రోజు దుకాణం లైసెన్స్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుకాణ యాజమాన్యం FDA కమిషనర్కు అప్పీల్ చేయడంతో పాటు లోపాలను సరిచేసినట్లు పేర్కొంటూ కంప్లయన్స్ రిపోర్ట్ సమర్పించింది.దీనిపై జూలై 13న FDA అధికారులు మరోసారి దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈసారి దుకాణం 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ లైసెన్స్ సస్పెన్షన్ను ఎత్తివేయలేదు. లైసెన్స్ను పునరుద్ధరించాలని యాజమాన్యం FDAకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది.లక్షల ఆదాయం కోల్పోయామని..లైసెన్స్ సస్పెన్షన్ కారణంగా జూన్లో దుకాణం మూసివేసినప్పటి నుంచి రూ.8.74 లక్షల ఆదాయాన్ని కోల్పోయామని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కేసును విచారించిన ధర్మాసనం దుకాణాన్ని తిరిగి తెరిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా దుకాణ యజమానులకు నెల రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర FDAను ఆదేశించింది.‘మీరు హద్దులు దాటుతున్నారు’FDA ఉద్దేశం మంచిదేనని, ఆహార భద్రత విషయంలో ఒక విభాగం కనీసం చర్యలు తీసుకుంటోందని ప్రశంసించిన ధర్మాసనం.. అదే సమయంలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలిన వెంటనే లైసెన్స్ సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిందని స్పష్టం చేసింది. అలా చేయకుండా దుకాణాన్ని కొనసాగనివ్వకపోవడం సరికాదని పేర్కొంది.కోర్టు ఉత్తర్వులు పరిశీలిస్తా: FDA కమిషనర్బాంబే హైకోర్టు ఆదేశాలపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ.. ముందుగా కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తానని తెలిపారు. ఆ తర్వాతే స్పందిస్తానన్నారు. FDA చట్టం, నిర్దేశిత విధానాల ప్రకారమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. చట్టం, ప్రక్రియలను అనుసరిస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. -
‘‘నేను కిడ్నాప్ అయ్యాను.. రూ.5 లక్షలు పంపండీ’’
పుణేలో 19 ఏళ్ల ఓ యువకుడు తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. తాను ఏడుస్తున్న వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించి, తనను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. అయితే పోలీసులు అతడిని ఓ లాడ్జిలో గుర్తించారు.ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ గౌరీశంకర్ ఉద్యోగం కోసం పుణేకు వచ్చాడు. నెలల తరబడి ఉద్యోగం లేకపోవడంతో అతడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.దీంతో కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకునేందుకు అతడు ఓ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరీశంకర్ తన బంధువులు, అన్నయ్యకు తాను కిడ్నాప్కు గురయ్యానని చెప్పాడు. తనను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు.తన మాటలు నిజమని నమ్మించేందుకు తాను ఏడుస్తున్న వీడియోలను వారికి పంపించాడు. కిడ్నాప్ విషయం తెలిసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించారు. వారు పుణే పోలీసులకు సమాచారం అందించారు.ఆగస్టు 16 అర్ధరాత్రి పుణే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలు పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు, రాత్రి గస్తీ బృందాలు, ఇతర సిబ్బంది ఈ గాలింపులో పాల్గొన్నారు. గౌరీశంకర్ ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ను పోలీసులు ట్రాక్ చేయగా, ఓ హోటల్ సమీపంలో ఆ ఫోన్ పనిచేస్తున్నట్లు గుర్తించారు.దీంతో ఓ పోలీసు బృందం, రాత్రి గస్తీ సిబ్బంది, మార్షల్స్తో కలిసి ఖడ్కీలోని క్రౌన్ ప్లాజా లాడ్జింగ్కు చేరుకుంది. అక్కడ గౌరీశంకర్ కనిపించాడు. ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి కిడ్నాప్ జరగలేదని తేలింది. కుటుంబం నుంచి డబ్బు పొందేందుకు యువకుడు మొత్తం ఘటనను కల్పించినట్లు పోలీసులు గుర్తించారు. View this post on Instagram A post shared by Pune Times Mirror (@thepunemirror) -
త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్ : మాజీ జడ్జికి షాక్!
సాక్షి, ముంబై: మాజీ మిస్ పుణే త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త, మాజీ మహిళా న్యాయమూర్తి గిరిబాల సింగ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వివాహమైన ఐదు నెలలకే ఈ ఏడాది మే 12న, త్విషా శర్మ భోపాల్లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పదంగా కన్నుమూయడం సంచలన రేపింది.సీబీఐ దాఖలు చేసిన 636 పేజీల ఛార్జ్షీట్లో కట్న వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్మెంట్ టు సూసైడ్), ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో పనిచేయడం వంటి చట్టపరమైన సెక్షన్లను చేర్చారు. నోయిడాకు చెందిన త్విషాకు, భూపాల్కు చెందిన న్యాయవది సమర్థ్ సింగ్తో 2025 డిసెంబర్లో పెళ్లి జరిగింది. ఎంబీఏ చదువుకున్న ఆమె పెళ్లికి ముందు ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసింది. అలాగే మిస్ పూణె టైటిల్ కూడా గెలుచుకున్నది. కార్పొరేట్ కెరీర్తో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఆమె యోగా శిక్షకురాలు కూడా. మే 12వ తేదీన అత్తారింట్లో ఆత్మహత్యు పాల్పడింది. అయితే త్విషాశర్మ కుటుంబ సభ్యులు ఆమెపై మానసిక,శారీరక వేధింపులు జరిగాయని, అధికారాన్ని ఉపయోగించి ఆధారాలను తుడిచిపెట్టేందుకు అత్తగారి కుటుంబం ప్రయత్నించిందని ఆరోపించారు. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు తొలుత పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ను మే 22న జబల్పూర్లో అరెస్టు చేశారు. త్విషా అత్త రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కూడా కేసు పెట్టారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంమరణానికి కారణం ఉరివేసుకోవడమే అయినప్పటికీ, బాధితురాలి శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించారు. సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా జోక్యం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో కేసును సీబీఐకి అప్పగించారు. మృతదేహాన్ని ఉరి నుంచి కిందకు దించేందుకు ఉపయోగించినట్లు చెప్పిన 'జిమ్నాస్టిక్స్ బెల్ట్' ఆధారంగా సీబీఐ ఆ ఇంట్లో నేర స్థలాన్ని రీక్రియేట్ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే! -
పుట్టినరోజు వేడుకకు వచ్చిన వారంతా షాక్
నలసోపారా: ప్రతి పుట్టినరోజు వేడుకలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆహార పదార్థం కేక్. అతిథుల నుంచి పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ కేక్ కోసం ఎదురుచూస్తారు. అయితే, అదే కేక్ వల్ల కొందరు ఆసుపత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన బల్లి ఉన్న కేక్ తినడంతో 11 మంది అస్వస్థతకు గురయ్యారు.కేక్ తిన్న కొద్దిసేపటికే ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు అకస్మాత్తుగా కడుపు, ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. వారందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆహార భద్రత, బేకరీ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది.రెండు రోజుల ముందే థానేలోని కల్యాణ్లో గోద్రేజ్ హిల్ ప్రాంతంలోని బ్లింకిట్ దుకాణంలో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో ఎలుక పరుగెత్తినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి.మరోవైపు, మలాడ్ వెస్ట్లో బ్లింకిట్తో సంబంధం ఉన్న మరో కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో ఆ కేంద్రం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను సస్పెండ్ చేశారు.మహారాష్ట్ర అంతటా ఇన్స్టాంట్ సర్వీసు వేదికలకు సంబంధం ఉన్న కేంద్రాలను ఆహార భద్రత అధికారులు ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మరో ఉద్యమం ప్రారంభించిన దీప్కే.. ఇక వీళ్ల పని ఏమైపోతుందో
హింగోలి (మహారాష్ట్ర): కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని ఆయన ఆరోపించారు. పగిలిన కిటికీలు, పూడుకుపోయిన మరుగుదొడ్లు, కూర్చునేందుకు సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.తన గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన తర్వాత దీప్కే ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఎక్స్లో దీప్కే స్పందిస్తూ.. “స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలు లేవు. నేను మా గ్రామ సర్పంచ్తో మాట్లాడాను. వారంలోపు ఈ సమస్యలన్నింటినీ పంచాయతీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మనమంతా కలిసి చర్యలు తీసుకుంటే మార్పు సాధ్యమే’’ అని చెప్పారు.మరో పోస్టులో పగిలిన కిటికీల వీడియోను పోస్ట్ చేసిన దీప్కే.. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో ప్రభుత్వ పాఠశాలలోని పగిలిన కిటికీలను కప్పేస్తున్నారు” అని ఆరోపించారు. పాఠశాలలో పూడుకుపోయిన మరుగుదొడ్లను చూపించే మరో వీడియోను కూడా దీప్కే పంచుకున్నారు. “ఈ మరుగుదొడ్డిని ఏ పిల్లాడు ఎలా ఉపయోగించాలి?” అని రాశారు.పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా లేదని, పలు కిటికీలు పగిలిపోయాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని దీప్కే ఆరోపించారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 4 బెంచీలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో తదుపరి దశలో మహారాష్ట్రలోని ఇతర తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తానని దీప్కే తెలిపారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు.ఈ ప్రచార ప్రారంభానికి ముందు ఈ వారం ప్రారంభంలో జంతర్ మంతర్ ‘సీజన్ 2’ను సీజేపీ ప్రారంభించబోతోందని దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఇతర కీలక డిమాండ్లపై హామీలు రావడంతో 37 రోజుల పాటు సాగిన జంతర్ మంతర్ నిరసనను జూలై 25న విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా.. పాఠశాలల దుస్థితికి కారణమైన వారి తక్కురేగ్గొట్టనుంది సీజేపీ. స్వాతంత్య్ర దినోత్సవం వేళ సీజేపీకి షాక్కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను శనివారం ఉదయం తొలగించారు. అయితే ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ తమ గొంతును అణచివేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ చర్య అని సీజేపీ ఆరోపించింది.ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనకు నాయకత్వం వహించిన సీజేపీ.. తమ ఖాతాను విజయవంతంగా తిరిగి పొందినట్లు తెలిపింది. “సీజేపీని వ్యతిరేకించే వారు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకుని మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం ఎంత అవమానకరం. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేము భయపడము” అని ఆ పార్టీ ఒక పోస్టులో పేర్కొంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఖాతా తొలగింపుపై స్పందించారు. “కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు. పిరికిపందలు” అని అన్నారు. ఆ తర్వాత అదే రోజు ఖాతాను పునరుద్ధరించినట్లు సీజేపీ తెలిపింది.ఇటీవల సీజేపీ చేపడుతున్న వరుస ప్రచారాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ పాఠశాలల పరిస్థితిపై అవగాహన కల్పించడం, విద్యార్థులు, విద్యకు సంబంధించిన సమస్యలపై నిరసనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి.స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు యువతకు సంబంధించిన సమస్యలను జాతీయ స్థాయి చర్చలోకి తీసుకురావాలని సీజేపీ ప్రయత్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దేశ యువతను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతూ సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. నిరుద్యోగం, విద్య, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తింది.ఇటీవలి నెలల్లో సీజేపీ విద్య, పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఇతర సమస్యలపై నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో దీప్కేకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. How is any kid supposed to use this toilet? #SchoolThikKaro pic.twitter.com/WNkDAFn5sn— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026Broken windows in govt school being covered with the banners of Dy CM of Maharashtra. #SchoolThikKaro pic.twitter.com/XgXIcvbbnC— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026Even after 80 years of Independence, our govt schools still lack basic amenities.I spoke to the Sarpanch of my village, who has assured that the Panchayat will resolve all these issues within a week.Change is possible when we come together and act.#SchoolThikKaro pic.twitter.com/HB4cWKj4D8— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026 -
3 నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నాడుగా.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పరిశుభ్రత , ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, డెయిరీలు ,ఈ-కామర్స్ సంస్థలపై విస్తృతమైన దాడులతో కొరడా ఝళిపిస్తున్నారు. లైసెన్సుల రద్దు లాంటి చర్యలపై వస్తున్న విమర్శలను కూడా లెక్క చేయకుండా ఫుడ్ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే అధికారం FDAకి ఉందని ఆయన సమర్థించుకున్నారు.ఆహార కల్తీ, పరిశుభ్రత మరియు లైసెన్స్ లేని వ్యాపారాలపై చేపట్టిన వార్తల్లో నిలిచారు.ఇంతకీ ఎవరీ తుకారాం ముండే పదండి తెలుసుకుందాం.ఒక స్నేహితుడితో కలిసి రెస్టారెంట్ విందుకెళ్లారు. అప్పుడే ఆ రెస్టారెంట్లో ఎఫ్డీఏ నిబంధనలు అమలు కావడం లేదని, తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన ఆహార భద్రతా లైసెన్స్ స్పష్టంగా కనిపించేలా ఉంచలేదని గమనించారు. అలాగే, అక్కడ తాగునీటి ఏర్పాట్ల గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత స్నేహితుడు ఆర్డర్ చేసిన పనీర్ నిజమైందా? కృత్రిమైందా (అనలాగ్) అని ప్రశ్నించారు. చివరికి అది నకిలీది అని తేల్చారు. అంతే 24 గంటల్లో నగరంలో వివిధ దుకాణాల్లో తనిఖీలు మొదలైనాయి.మెరుపు దాడులతో ప్రముఖ రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, ఇలా ఒక్కటనేమిటి జెప్టో, బ్లింకిట్కు చెందిన ఔట్లెట్లకు చుక్కలు చూపించారు. ఈ దాడుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, గడుపు తీరిన పదార్థాలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకల మయంతో కూడిన వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. దీంతో గత రెండు నెలల్లో అధికారులు 3,100కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 165 లైసెన్సులు రద్దు చేయగా, 750కి పైగా సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.ఇటీవల నాగ్పూర్ మరియు సోలాపూర్లలో అక్రమ అబార్షన్ మందుల రాకెట్ను గుట్టురట్టు చేసి, ఆన్లైన్ పోర్టల్ ఇండియామార్ట్ (IndiaMART) డైరెక్టర్లతో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పలువర్గాలనుంచి ఆయనపై ప్రశంసలు లభించాయి.మరోవైపు ఈ దాడులపై విమర్శలు కూడా చెలరేగాయి. అయితే తన ప్రజాదరణను పెంచుకోవడానికే ఈ ప్రచారం చేస్తున్నారన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇది తగిన చర్యగా అనిపించకపోతే, అసలు ప్రోపర్ యాక్షన్ (proportionate action) అంటే ఏమిటో నాకైతే తెలియదు," అని ముండే వ్యాఖ్యానించారు. ఇది తన గురించి కాదనీ, ఆహార రంగానికి, ఆహార భద్రతకు , ఆహార ప్రమాణాలకు సంబంధించిన విషయమని 'NDTV ప్రాఫిట్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలురాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?చట్టాలను కచ్చితంగా అమలు చేసే అధికారిగా పేరుపొందిన ఆయన, రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు "ఖచ్చితంగా రాను (Absolutely not)" అని స్పష్టం చేశారు. తన లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల వ్యక్తులకు రాజకీయాలు సరిపడవని పేర్కొన్నారు. కొందరు తనను "అహంకారి" అని పిలుస్తారని, అయితే ముక్కుసూటితనానికి మరియు అహంకారానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని, అది తన సహజ సిద్ధమైన నైజమని తెలిపారు. 21 ఏళ్ల కెరీర్లో 25 సార్లు బదిలీలు అయ్యాయనీ అయినా తన నిబద్ధతలో మార్పులేదని చెప్పుకొచ్చారు. ఎక్కువ బదిలీలు జరిగితే సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావడానికి మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ముండే చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి: రెండు రోజుల్లో బర్త్డే : 11 నెలల చిన్నారిని యమునలో విసిరేసిన తండ్రి -
సియా కుటుంబానికి మరో షాక్, నేరం రుజువైతే భారీ జరిమానా, జీవిత ఖైదు
సాక్షి, ముంబై: పుణే కోట హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కఠిన చర్యలు తీసుకుంది. పుణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్కు చెందిన మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ షాప్ను అధికారులు మూసివేశారు.గోయల్ కుటుంబానికి చెందినలైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న ('M/s BG గోయల్ & కంపెనీ) అనే షాప్ నుండి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందుకు గాను దాదాపు రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు జప్తు చేశారు. నాసిరకం ఉత్పత్తులు, సరైన లేబెల్లింగ్ లేకపోవడం మరియు కల్తీ జరిగినట్లు అనుమానించబడిన ఆహార పదార్థాలను దుకాణంలో గుర్తించారు. ఈ సందర్బంగా అధికారులు నాలుగు శాంపిల్స్ను ('సంత్', 'సాధు' బ్రాండ్ పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్) ల్యాబ్ పరీక్ష నిమిత్తం ల్యాబోరేటరీకి పంపారు. నివేదికలు వచ్చే వరకు షాప్ను మూసివేయాలని ఆదేశించారు. అలాగే వ్యాపారానికి సంబంధించి ఒక చిరునామాపై లైసెన్స్ తీసుకొని, మరొక ప్రదేశంలో నిల్వ చేయడం, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు FDA జాయింట్ కమిషనర్ దిగంబర్ భోగవాడే తెలిపారు.ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలుల్యాబ్ నివేదికలలో కల్తీ రుజువైతే, ప్రవీణ్ గోయల్పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. నేరం తీవ్రతను బట్టి రూ.5 లక్షల జరిమానా నుండి తీవ్రమైన సందర్భాల్లో జీవిత ఖైదు వరకు విధించే అవకాశముంది.FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న "సేఫ్ ఫుడ్, సేఫ్ డ్రగ్, సేఫ్ మహారాష్ట్ర" ప్రచారంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పుణే డివిజన్లో ఇప్పటివరకు 12 ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు రూ. 41 లక్షలకు పైగా విలువైన నిషేధిత ఉత్పత్తులను జప్తు చేశారు.కాగా కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ ,ఆమె సహ నిందితుడు చేతన్ చౌదరి యెరవాడ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) క్విక్-కామర్స్ ప్లాట్ఫారమ్స్కు భారీ షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీ డ్రైవ్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహారం వంటి పలు ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు బయటపడటంతో, బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), ఇన్స్టామార్ట్ (Instamart) సంస్థలకు చెందిన 14కేంద్రాల (Dark Stores/Warehouses) లైసెన్స్లను ఎఫ్డీఏ నిలిపి వేసింది.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల గడువు తీరిపోవడం, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు ఉండటం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో, మాల్వానీలోని మార్వే రోడ్డులో ఉన్న బే వ్యూ బిల్డింగ్లోని ఒక బ్లింకిట్ కేంద్రం యొక్క ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సును ఎఫ్డీఏ నిలిపివేసింది.గడువు ముగిసిన ఆహారం కారణంగా జెప్టో కేంద్రంపై సస్పెన్షన్ వేటు వేసింది. <In a major crackdown on quick-commerce storage facilities, the Maharashtra FDA conducted a surprise raid on a Swiggy Instamart dark store located on Hill Road in Bandra West.During the inspection, officials discovered severe hygiene and storage violations, including cockroaches… pic.twitter.com/em18ndLPJ2— Mid Day (@mid_day) August 14, 2026 మొత్తం 86 కేంద్రాలు తనిఖలు చేయగా కోల్డ్ స్టోరేజ్ ఉష్ణోగ్రతలలో తీవ్ర లోపాలు , 40 మంది సిబ్బందికి వైద్య పరీక్షల రికార్డులులేకపోవడం వర్కర్లు హెడ్గేర్, ఆప్రాన్, గ్లౌజులు ధరించకపోవడంలాంటి కనీస నిబంధనల ఉల్లంఘనలను గమనించారు. ఆహార ప్యాకెట్ల పక్కనే ఎలుకల పిండెల (Rodent droppings) కుప్పలు, బల్లుల సంచారం , తుప్పు పట్టిన ర్యాక్లను అధికారులు కనుగొన్నారు. ఇంకా కుప్పలుగా గడువు తీరిన చికెన్తోపాటు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, తీవ్రమైన బొద్దింకల బెడద, లోపభూయిష్టమైన సీలింగ్ , ఫ్లోరింగ్లను గుర్తించారు. ఈ కేంద్రానికి 74 మార్కులకు గాను కేవలం 34 (46%) మార్కులు మాత్రమే లభించాయి. 60 కేంద్రాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 14 కేంద్రాల లైసెన్సులను నిలినివేసింది. బ్లింకిట్,జెప్టోకి చెందిన చెరో 5 కేంద్రాలు ఉండగా, ఇన్స్టామార్ట్ కేంద్రాలు రెండు,ఇతరాలు రెండు ఉన్నాయి.గోరేగావ్ ఈస్ట్లోని దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ సిటీలో ఉన్న 'బాలీవుడ్ కేఫ్' పై కూడా FDA దాడులు నిర్వహించింది. అత్యంత పరిశుభ్రత లేని వాతావరణంలో ఈగలు, మురికి డ్రెయిన్లు, తుప్పు పట్టిన పరికరాల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు కనుగొని, ఆహార భద్రతా చట్టం (Section 69) కింద చర్యలు ప్రారంభించారు. ఇదీ చదవండి: సియా కుటుంబానికి మరో షాక్, నేరం రుజువైతే భారీ జరిమానా, జీవిత ఖైదు -
పిరికిపందలు.. మా గొంతు నొక్కాలని చూశారు: దీప్కే సంచలన వ్యాఖ్యలు
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ ఉద్యమానికి సంబంధించిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు. ఖాతా అందుబాటులో లేదని చూపిస్తున్న స్క్రీన్షాట్లను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే ఎక్స్లో స్పందిస్తూ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించారు. పిరికిపందలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్షాట్లలో సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ అందుబాటులో లేదని, ‘User not found’ అనే సందేశం కనిపించింది. దీంతో మెటానే తమ ఖాతాను తొలగించిందని ఆయన ఆరోపించారు.ఈ పరిణామంపై సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా కూడా స్పందించింది. తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఉదయం తొలగించారని, అయితే కొద్దిసేపటికే ఖాతాను విజయవంతంగా తిరిగి పొందామని వెల్లడించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తమ గొంతును నొక్కేందుకు ప్రయత్నించారని పార్టీ ఆరోపించింది. తమను వ్యతిరేకించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. అయితే సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తాత్కాలికంగా ఎందుకు అందుబాటులో లేకుండా పోయిందనే విషయంపై మెటా నుంచి అధికారిక వివరణ వెలువడినట్లు సమాచారం లేదు.🚨CJP Instagram handle was taken down this morning 🚨But we have been able to successfully recover the account. What a shame that those who oppose CJP chose India’s Independence Day to try to muzzle our voice. We will not be intimidated by such cowardly acts! ✊ https://t.co/Wz3rhExHpu— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 15, 2026అభిజీత్ దీప్కే సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివాదం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని ఆయన ఆరోపించారు. తన ఖాతాలోకి ప్రవేశించలేకపోతున్నానని, తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని అప్పట్లో ఎక్స్లో పేర్కొన్నారు. సీజేపీ కోసం ఉపయోగిస్తున్న బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు.‘స్కూల్ ఠీక్ కరో’ ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని దీప్కే స్వగ్రామం సంతుక్ పింప్రిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మరమ్మతులు చేయించి, విద్యార్థులకు బెంచీలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్ను కోరనున్నట్లు దీప్కే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇతర గ్రామాలకూ విస్తరించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామస్థులు, సర్పంచ్ల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలను స్వయంగా సందర్శించి, అక్కడ ఏవైనా సౌకర్యాల కొరత ఉంటే CJPకి సమాచారం ఇవ్వాలని దీప్కే పిలుపునిచ్చారు. దీంతో సోషల్ మీడియా ఖాతా వివాదం మధ్యే గ్రామీణ పాఠశాలల సమస్యలపై ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు CJP సిద్ధమవుతోంది. -
లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు
మహారాష్ట్రలోని నాందేడ్లోని మాతా సాహిబ్ గురుద్వారాను సందర్శించి బయటకు వస్తున్న శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్న బాదల్ సర్జరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్ర పోలీసు భద్రతా బృందానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ సంతోష్ వైజ్నాథ్ కేంద్రే సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే బాదల్ ఈ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. దీంతో పోలీసు అధికారి నెట్టింట విశేషంగా నిలుస్తున్నారు. సమయానికి స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్న ఇన్స్పెక్టర్ కేంద్రే , మహారాష్ట్ర పోలీసు బృందంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఎలా కాపాడారు? గురుద్వారాలో పనిచేసే జస్పాల్ సింగ్ అనే నిహంగ్ సిఖ్, తన శాలువా కింద కిర్పాన్ (కత్తి) దాచుకుని సుఖ్బీర్ సింగ్ బాదల్ పొట్టలో పొడవడానికి యత్నించాడు. అయితే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ కేంద్రే క్షణాల వ్యవధిలో స్పందించి దుండగుణ్ని అడ్డుకుని కిందకు పడేసారు. ఈ క్రమంలో బాదల్ చేతికి స్వల్ప గాయమైంది. అలాగే ఇన్స్పెక్టర్ కేంద్రే చేతికి కూడా గాయమైంది. పోలీసులు వెంటనే నిందితుడు జస్పాల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.హరి సిమ్రత్ కౌర్ కృతజ్ఞతలుఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్స్పెక్టర్ కేంద్రేను సుఖ్బీర్ సింగ్ బాదల్ భార్య హరి సిమ్రత్ కౌర్ సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యుపకారంగా ఏదైనా చేయగలనా అని ఆమె ప్రశ్నించినపుడు "ఇది నా బాధ్యత. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికే మాకు శిక్షణ ఇస్తారు. స్పందించడానికి నాకు క్షణకాలం మాత్రమే సమయం లభించింది, నా విధిని నేను నిర్వహించాను" అని కేంద్రే వినమ్రంగా బదులిచ్చారు.ఎవరీ కేంద్రే 2001లో మహారాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరిన సంతోష్ కేంద్రే, ఆ తర్వాత ప్రమోషన్లు పొంది ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్మరోవైపు పంజాబ్ను స్వాధీనం చేసుకోవాలని, రాష్ట్రంలో శాంతిని భంగం చేయాలని చూస్తున్నారని, కానీ అకాలీదళ్ నేతగా ఆ పరిస్థితి రానివ్వబోనని సుఖ్బీర్ సింగ్ వెల్లడించారు. రెండు సార్లు పవిత్రమైన ప్రదేశాల్లో తనపై అటాక్ జరిగిందని, అయినా తానెప్పుడూ భయపడలేదని, ఇప్పుడూ భయపడలేదన్నారు. పంజాబీల సంక్షేమానికి శిరోమణి అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు. కాగా 2024 డిసెంబర్లో కూడా సుఖ్బీర్ బాదల్పై గోల్డెన్ టెంపుల్లో కూడా హత్యాయత్నం జరిగింది. ఈ రెండు ఘటనలనుంచి ఆయనపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ (Tadoba-AndhariTiger Reserve) సమీపంలోని రహదారిపై పులి కనిపించినప్పుడు పర్యాటకులు ప్రవర్తించిన తీరు, ప్రమాదకర ప్రవర్తనపై వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల పట్ల పర్యాటకుల ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ప్రజలు తమ వాహనాల నుండి దిగి, ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి, సోషల్ మీడియా రీల్స్ (Reels) కోసం పెద్ద పులికి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్లడం కనిపిస్తుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు . జంగిల్ సఫారీల సమయంలో అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పర్యాటకులను కోరారు. సఫారీ ఉద్దేశం వన్యప్రాణులను సురక్షితమైన దూరం నుంచి పరిశీలించడమే తప్ప, వాటికి అంతరాయం కలిగించడం లేదా వాటిని రెచ్చగొట్టడం కాదని నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు అటవీ అధికారుల సూచనలు:పులులు లేదా ఇతర అడవి జంతువులు సోషల్ మీడియా సెల్ఫీల కోసం వస్తువులు కావని అధికారులు స్పష్టం చేశారు.వాహనాలు దిగడం, జంతువులకు అడ్డంగా వెళ్లడం, వాటిని తారసపడటం లేదా గట్టిగా అరిచి శబ్దాలు చేయడం వల్ల అవి ఒత్తిడికి గురై దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. View this post on Instagram A post shared by Responsible Sane (@thenewscurrenthq)నిజమైన వన్యప్రాణి అనుభూతికి దగ్గరగా వెళ్లడం అవసరం లేదని, కానీ జంతువు స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇచ్చి, దానిని దాని సహజ స్థితిలో ఉండనివ్వాలని పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు గుర్తుంచుకోవాలని కోరారు.సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం క్రూర మృగాలను వేధించకుండా, అటవీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పర్యాటకులకు, సఫారీ గైడ్లకు విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంవన్యప్రాణులను దగ్గరగా చూడటం కోసం లేదా వైరల్ వీడియో కోసం పర్యాటకులు వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లి,ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న ఘటన ఇదే తొలిసారికాదు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాలానే ఉన్నాయి.జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (జనవరి 2026): ఉత్తరాఖండ్లోని ఫాటో ఎకో-టూరిజం జోన్లో ఒక పులిని సఫారీ వాహనాలు వేగంగా తరిమిన వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గైడ్లపై అటవీశాఖ నిషేధం విధించింది.ముదుమలై టైగర్ రిజర్వ్ (నవంబర్ 2024): తమిళనాడులోని ఈ రిజర్వ్లో వాహనం దిగి జింకల మందను తరిమిన ముగ్గురు పర్యాటకులకు అటవీ అధికారులు రూ. 15,000 జరిమానా విధించారు.ఇదీ చదవండి: 360 ఎకరాల ‘దెయ్యాల నగరం’ : రూ. 13.3 కోట్లకు వ్యాపారవేత్త డీల్ -
మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్పై దాడి
నాందేడ్: మహారాష్ట్రలో అకాలిదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నాందేడ్ నగర శివార్లలోని ఓ గురుద్వార దర్శనానికి వచ్చిన సమయంలో దాడి జరిగింది. సుఖ్బీర్సింగ్తో పాటు సెక్యూరిటీ సిబ్బందికీ గాయాలయ్యాయి. నాందేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.దాడి జరిగిన సమయంలో బాదల్ సతీమణి, అకాలిదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఆయనతోనే ఉన్నారు. సుఖ్బీర్ సింగ్ అంతకుముందు రోజు తన కుటుంబంతో కలిసి నాందేడ్లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ను సందర్శించారు. సుఖ్బీర్ బాదల్ చేతికి గాయమైందని, అయితే అది ప్రాణాపాయం లేనిదని అకాలిదళ్ వర్గాలు తెలిపాయి. చేతికి గాయం కావడంతో ఆయన చేతికి వైద్యులు కుట్లు వేశారు. -
కళ్లు చెదిరే వేగం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్పూర్లోని పవన్గావ్–భరత్వాడా వి-పాయింట్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.సీసీటీవీ ఫుటేజ్లో కారు అత్యంత వేగంగా దూసుకొస్తూ ఎలాంటి బ్రేకులు వేయకుండానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతినాగ్పూర్లోని భరత్వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారుదీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు pic.twitter.com/k2Q3moSozR— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026 -
సాహస రైడ్ సరదా తీరకముందే..
బైక్ రైడ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్ రిద్ధి థక్కర్(Riddhi Thakkar) ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్ టూర్కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో.. బైకింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..ముంబై కందివలీ వెస్ట్కు చెందిన రిద్ధి థక్కర్.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్పూర్ నుంచి కాంకేర్ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్ ఆమె బైక్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణంప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పరారీలో డ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తుప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే లైసెన్స్పై వేటు!
మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.పాటించకపోతే ఏమవుతుంది?మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వేలాది మందికి శిక్షణఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్టీవోలు, డిప్యూటీ ఆర్టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. -
కూలిన కొండ.. శిథిలాల కింద ప్రాణాల కోసం వేట!
ముంబైలో భారీ వర్షాల వేళ మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని చిరాగ్ నగర్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు ప్రాణాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో కుర్లా పశ్చిమ ప్రాంతంలోని గౌసియా చాల్, చిరాగ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని మట్టి ఒక్కసారిగా కూలిపడి సమీపంలోని రెండు మూడు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలతో గాలింపుప్రమాదం జరిగిన వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, ముంబై పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాల ద్వారా శిథిలాల లోపల కదలికలు, మనుషుల ఉనికి వంటి సంకేతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించడంతోపాటు.. లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంపై అత్యంత జాగ్రత్తగా గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కుర్లాలోని భాభా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి మేయర్.. సహాయక చర్యల పరిశీలనముంబై మేయర్ రీతూ తావ్డే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. ముంబైలో వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం అందిన తర్వాత మృతుల సంఖ్య, చిక్కుకున్న వారి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు?అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.చిన్నారి సహా ఇద్దరి మృతిప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.గాయపడిన వారిలో ఫైర్మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. Watch: A fire broke out at Shanta Bhavan Building in Mumbai's Vile Parle area. After receiving information about the incident, 10 fire brigade vehicles reached the spot and began efforts to bring the fire under control. No injuries have been reported so far. Firefighters are… https://t.co/PaDkqJiRcZ pic.twitter.com/qvUdBe9Mkn— IANS (@ians_india) August 11, 2026 -
ఒకే ఫ్రేమ్లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
130 మందిని కరిచిన కుక్క!
థానే (మహారాష్ట్ర): వీధి కుక్కలు ఒకరిద్దరిని కరవడం, రాత్రిళ్లు వాహనాల వెంటపడి అరవడం మనం తరచూ చూసే విషయాలు. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్లో ఓ కుక్క కొన్ని గంటల వ్యవధిలో 130 మందిని కాటేసింది. ఫలితంగా పదకొండేళ్ల బాలిక తీవ్రంగా గాయపడి వైద్యసాయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. మరో 25 మంది స్థానిక రుక్మిణీబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక అధికారులు సోమవారం తెలిపారు. కుక్కకు రేబిస్ ఉన్నదీ లేదని ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ వ్యవహారమంతా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదలైంది. కళ్యాణ్ (వెస్ట్)లోని సందీప్ హోటల్ ప్రాంతంలో ఓ కుక్క ఉన్నట్టుండి అటుపక్క వెళుతున్న పాదాచారులపై దూసుకెళ్లి కరవడం మొదలుపెట్టింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలనూ వెంటపడి తరమడంతోపాటు భౌ భౌమని అరుచుకుంటూ వాటిల్లో ప్రయాణిస్తున్న వారిని కరిచింది. ప్రధాన రహదారితోపాటు చుట్టుపక్కల ఉన్న సందుగొందుల్లోనూ ఈ ‘శూనక విహారం చాలాసేపు కొనసాగింది. ఈ వ్యవహారంతో స్థానిక బిర్లా కాలేజీ రోడ్, ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్, భోయిర్వాడీ ప్రాంతాల్లో ప్రజలు తలుపులేసుకుని ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆదివారమైనప్పటికీ పిల్లల్ని బయట అడుగుపెట్టనివ్వలేదు. కుక్క కాటుకు గురైన పాతిక మందికి స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తూండగా 11 ఏళ్ల చిన్నారిని మాత్రం ముంబైలోని లోక్మాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి (సియాన్ ఆసుపత్రి)కి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంకాలానికి 110 నుంచి 130 వరకూ కుక్క కాటు కేసులు నమోదైనట్లు రుక్మిణీబాయి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సందీప్ పగారే తెలిపారు. వీరిలో చాలామందిని ప్రాథమిక చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసినట్లు ఆయన చెప్పారు. -
మంచివాళ్లకే ఎందుకు ఇలా కష్టాలొస్తాయ్?
ముంబై: ఓ నెటిజన్ ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన హృదయాన్ని హత్తుకునే అనుభవాన్ని పంచుకున్నాడు. పాత ఆటో నడుపుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనిపించినా, అసలు చార్జీ కంటే రూ.5 కూడా ఎక్కువ తీసుకోవడానికి ఓ డ్రైవర్ నిరాకరించాడు. అతడి స్టోరీని నెటిజన్ రెడిట్లో రాసుకొచ్చాడు. రెడిట్లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆ నెటిజన్ పోస్టు చేశాడు. మహారాష్ట్ర, థానే జిల్లాలో కల్యాణ్ స్టేషన్కు షేర్డ్ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘటనను వివరించాడు. అదనపు డబ్బు అడగకుండా, నిర్ణయించిన చార్జీ ప్రకారమే ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుంటున్నట్టు గమనించానని తెలిపాడు.కష్టాల్లోనూ నిజాయితీ“ఈ రోజు నా ప్రాంతం నుంచి కల్యాణ్ స్టేషన్కు ఆటోలో వెళ్లాను. నిబంధనల ప్రకారం డ్రైవర్ అంకుల్ నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కరికి చార్జీ రూ.15. ముగ్గురిని మాత్రమే ఎక్కించుకుంటే మాత్రమే రూ.20. దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఈ నిబంధన పాటించరు. నలుగురు ఉన్నా రూ.20 వసూలు చేస్తారు” అని రెడిట్ యూజర్ రాశాడు.నలుగురు కూర్చునే ప్రయాణానికి డ్రైవర్ ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15 మాత్రమే తీసుకున్నాడని అతడు తెలిపాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి రూ.20 ఇచ్చి, మిగతా రూ.5 డబ్బు ఉంచుకోవాలని చెప్పాడు. అయితే డ్రైవర్ వెంటనే రూ.5 తిరిగి ఇచ్చేశాడు. “ఆ చిన్న చర్య అతను ఎలాంటి వ్యక్తో స్పష్టంగా చూపించింది” అని రెడిట్ యూజర్ పేర్కొన్నాడు.‘‘ఆటో బాగా పాతదిగా కనిపించింది. భారీ వర్షం పడుతున్నా విండ్షీల్డ్ వైపర్ పనిచేయడం లేదు. భారీ వర్షం పడుతోంది. వైపర్ పనిచేయకపోవడంతో అతను చేతితో అద్దాన్ని తుడుస్తూ వెళ్లాల్సి వచ్చింది” అని రాశాడు.ఈ ఘటనపై ఆలోచిస్తూ, “అంత నిజాయితీగా, విలువలతో జీవించే వ్యక్తి ఇలాంటి కష్టాల్లో ఉండటం చూసి ఒక ప్రశ్న వచ్చింది. మంచి వాళ్లే ఎందుకు ఎక్కువగా బాధలు పడుతున్నట్టు కనిపిస్తారు? అతను రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా సంపాదిస్తున్నట్టే కనిపించింది. అయినా కొన్ని అదనపు రూపాయల కంటే నిజాయితీకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది నిజంగా నన్ను బాధపెట్టింది. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ రోజుల్లో నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి వస్తుందా?” అని ప్రశ్నించాడు. ఈ పోస్టును “నిజాయితీ మీ దగ్గర ఉన్నదంతా కోల్పోయేలా చేస్తుందా?” అనే శీర్షికతో పంచుకున్నాడు. Being honest can cost you everything?by u/Guilty-Kick-5617 in mumbai -
మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సంభవించిన స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జాతీయ భూకంప కేంద్రం నివేదిక ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆదివారం ఉదయం 5.33 గంటలకు 3.3 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి.ఈ భూకంప కేంద్రం మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హత్గడ్ పర్వత శ్రేణుల వద్ద, భాన్వాడ్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాసిక్ నగరంతో పాటు సుర్గాణ, కల్వాన్, దేవళ, చాంద్వాడ్, పేట్, దిండోరి, నిఫాడ్ తాలూకాల్లో ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.సుర్గాణ తాలూకాలోని భదర్, దిండోరి తాలూకాలోని నానాషి ప్రాంతాల్లోని కొన్ని నివాస గృహాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆనకట్టలను తనిఖీ చేయగా, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని నాసిక్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ సూచించారు. అయితే, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా గత జూలై 25 నుండి 28 వరకు, అలాగే ఆగస్టు 6న కూడా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: ‘హనీమూన్ హత్యకేసు’: ఇండోర్లో సోదరుల అరెస్ట్ -
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
టీసీఎస్ నిదా ఖాన్ కేసు.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలైన మాజీ టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి మతీన్ పటేల్కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పోలీసులు మతీన్ పటేల్ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం నాసిక్కు తరలించారు. అదే సమయంలో అధికారులు మతీన్ పటేల్ నివాసం, కార్యాలయాలపై బుల్డోజర్ చర్యలు కూడా ప్రారంభించారు. అతడి నివాసం, ఆఫీసును నేలమట్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#WATCH | Chhatrapati Sambhaji Nagar: The Chhatrapati Sambhaji Nagar Municipal Corporation initiates the demolition of properties belonging to AIMIM Corporator Matin Patel. pic.twitter.com/JHrmuLf8ie— ANI (@ANI) May 13, 2026టీసీఎస్ కేసు ఇదే.. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ కార్యాలయంలో పనిచేసిన నిదా ఖాన్పై మతమార్పిడి, మానసిక వేధింపులు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె పేరు కేసులో వెలుగులోకి రావడంతో టీసీఎస్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ కేసు 2022లో ప్రారంభమైన ఘటనతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ తన సహోద్యోగి దానిష్ షేక్ పెళ్లి చేస్తానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అయితే అప్పటికే అతడికి మరో మహిళతో వివాహం జరిగిన విషయం తర్వాత తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసుల దర్యాప్తులో దానిష్ షేక్ సోదరి నిదా ఖాన్ బాధితురాలిని మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు, ఆమె మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అంతేకాకుండా బాధితురాలికి బుర్ఖా, ఇస్లామిక్ మత గ్రంథాలు అందించడం, మొబైల్ ఫోన్లో ఇస్లాం సంబంధిత యాప్లు ఇన్స్టాల్ చేయించడం, ఇంటికి వెళ్లి నమాజ్ చేసే విధానం నేర్పించడం, హిజాబ్ ధరించేలా ప్రోత్సహించడం వంటి ఆరోపణలను పోలీసులు తమ దర్యాప్తులో నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా ఉద్యోగులపై బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు తదితర అంశాలపై మొత్తం తొమ్మిది కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.#BREAKING 🚨 Hijaban Jihadi Nida Khan remanded in judicial custody till May 24 in TCS sexual harassment-forced conversion case. pic.twitter.com/cSe5AGv2xw— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2026సుమారు 25 రోజులపాటు పరారీలో ఉన్న నిదా ఖాన్ను ఈ ఏడాది మే 7న ఛత్రపతి సంభాజీనగర్లోని అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తాను గర్భవతినని పేర్కొంటూ బెయిల్ కోరగా, ప్రసవ సమయంలో జైలులో ఉండటం ఏ మహిళకైనా తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తుందని వ్యాఖ్యానించిన నాసిక్ కోర్టు గత నెల ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు, బలవంతం, వివక్షను సహించబోమని, సంస్థలో ఇటువంటి చర్యలపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని టీసీఎస్ స్పష్టం చేసింది. -
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7— Daily Bollywood (@Bollywooz) August 6, 2026ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
అనలాగ్ పనీర్ బ్యాన్.. తయారు చేసినా, అమ్మినా జైలు శిక్ష..
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, కల్తీ పాల ఉత్పత్తులపై కఠిన చర్యలకు దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. అనలాగ్ లేదా నాన్-డెయిరీ పనీర్ (పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే పనీర్) తయారీ, విక్రయం, పంపిణీపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, హోల్సేల్, రిటైల్ విక్రయాలు, పంపిణీ, అమ్మకానికి ఉంచడం వంటి అన్ని కార్యకలాపాలను నిషేధించారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దేశంలో ఇలాంటి నిషేధం విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అనలాగ్ పనీర్పై నిషేధం విధించింది.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేర తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకుంటారు. అనలాగ్ పనీర్ను అసలు డెయిరీ పనీర్గా చూపించి విక్రయిస్తే వినియోగదారులను మోసం చేసినట్లుగా పరిగణిస్తామని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది. అనలాగ్ పనీర్ సాధారణంగా పాలు నుంచి కాకుండా.. కూరగాయల కొవ్వులు, నూనెలు, ఇతర నాన్-డెయిరీ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. చూడటానికి సంప్రదాయ పనీర్లానే కనిపించినప్పటికీ, దానిని అసలు పాలతో తయారు చేసిన పనీర్గా విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం (FSSAI).. అసలు పనీర్ పాలు ఆధారంగానే తయారు కావాలి. అందులో స్టార్చ్, నాన్-డెయిరీ కొవ్వులు లేదా సింథటిక్ పదార్థాలు కలపకూడదు. అయితే అనలాగ్ పనీర్ను విక్రయించడానికి FSSAI కొన్ని నిబంధనలతో అనుమతి ఇస్తుంది. అది అనలాగ్ ఉత్పత్తి అని స్పష్టంగా లేబుల్పై పేర్కొనాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో కొందరు వ్యాపారులు తక్కువ ఖర్చుతో తయారయ్యే అనలాగ్ పనీర్ను అసలు పాల పనీర్గా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.1,400 కిలోల నకిలీ పనీర్గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అనలాగ్ పనీర్ను పూర్తిగా నిషేధించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తాజాగా జూలై 30న జారీ చేసిన ఉత్తర్వులతో ఆ డిమాండ్కు అధికారిక రూపం వచ్చింది. కల్తీ పాల ఉత్పత్తులపై మహారాష్ట్రలో ఇప్పటికే విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. మే నెల నుంచి సింథటిక్ పాలు, నకిలీ పనీర్ తయారీ యూనిట్లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. పుణేలోని మంజరి ఖుర్ద్ ప్రాంతంలో నిర్వహించిన ఓ భారీ దాడిలో అధికారులు సుమారు 1,400 కిలోల నకిలీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ పదార్థాలతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అదే సమయంలో భారీగా ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 1,800 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 400 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్ (GMS) పౌడర్, 718 లీటర్ల పామ్ ఆయిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు కొన్ని లైసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ పనీర్కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయం.. వినియోగదారుల ఆరోగ్య రక్షణలో కీలక అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. -
‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’
ముంబై: భారత పాలనా వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగని,అవినీతిపై రాజీలేని పోరాటం చేసే నిప్పులాంటి అధికారులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఐఏఎస్ అధికారి తుకారాం ముండే. తన సుదీర్ఘ కెరీర్లో నిబంధనల అమలు విషయంలో ఎక్కడా తగ్గకపోవడం వల్ల సుమారు 25 సార్లు బదిలీలు ఎదుర్కొన్న ఈ రియల్ లైఫ్ సింగం తాజాగా మహారాష్ట్రలో మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా చట్టాన్ని రక్షించే బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లనే సీల్ చేయించి దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారారు.ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఆహార కల్తీ ముఠాలపై, అపరిశుభ్ర హోటళ్లపై ఉక్కుపాదం మోపారు. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 10వేలకంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులపై ముండే తన ఎఫ్డీఏ బృందాలతో మెరుపు దాడులు చేయించారు. కోట్ల విలువైన కల్తీ పాలు, నూనెలు, నిషేధిత గుట్కాలను సీజ్ చేయడమే కాకుండా, కనీస పరిశుభ్రత పాటించని వందలాది ప్రసిద్ధ సంస్థల లైసెన్స్లను కూడా తక్షణమే రద్దు చేస్తూ వస్తున్నారు.తుకారాం ముండే తీసుకుంటున్న ఈ మెరుపు చర్యలపై తీవ్రంగా నష్టపోయిన పలువురు పెద్ద పెద్ద వ్యాపారస్థులు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ధర్మాసనం ఎఫ్డీఏ తీరును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీరు కేవలం ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాంటీన్లలో కూడా ఇలాగే తనిఖీలు చేస్తున్నారా? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.కోర్టు అడిగిన ప్రశ్నకు స్పందనగా, మరుసటి రోజే మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారుల బృందం బాంబే హైకోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించింది. అప్పటికే బాంబే బార్ అసోసియేషన్ తమ ప్రధాన క్యాంటీన్ను స్వచ్ఛందంగా మూసివేసినప్పటికీ, ఎఫ్డీఏ తనిఖీలలో ఆ క్యాంటీన్కు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ (FSSAI) లేదని వెల్లడైంది. దీనితో నిబంధనల ప్రకారం అధికారులు ఆ క్యాంటీన్కు 'స్టాప్ బిజినెస్' (వ్యాపార నిలిపివేత) నోటీసులు జారీ చేసి, లీగల్గా సీల్ వేశారు.చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ, సరైన లైసెన్స్ , పరిశుభ్రత ప్రమాణాలు పాటించని కారణంగా హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్పై ఈ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. దీనితో పాటు, మహారాష్ట్ర సచివాలయ (మంత్రాలయ) పరిధిలోని ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా ఎఫ్డీఏ బృందాలు దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాటికి నోటీసులు జారీ చేసి మూసివేయించాయి.ప్రభుత్వ వ్యవస్థలను సైతం వదలకుండా తుకారాం ముండే తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంపై సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి 57 సార్లు ట్రాన్స్ఫర్లయిన ఐఏఎస్ అశోక్ ఖేమ్కా నిజమైన వారసుడు తుకారాం ముండే అంటూ మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నారు. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తన 21 ఏళ్ల సర్వీసులో రికార్డు స్థాయిలో మొత్తం 25 సార్లు బదిలీ అయ్యారు.ఆయన 2005 బ్యాంచ్ మహారాష్ట్ర కేడర్ అధికారి. అవినీతిపై రాజీలేని పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే ఆయనకు సగటున ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువగానే బదిలీలు జరిగాయి.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఆయనకు దక్కిన బాధ్యత ఆయన కెరీర్లో 25వ పోస్టింగ్. -
మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది?
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అజింక్య భుజ్బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Ajinkya Bhujbal (@bhujbal_ajinkya18) -
ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు
ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్వర్క్ వాడుతున్నట్లు తేలింది.టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు -
5న సీజేపీ కీలక భేటీ
ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందించామని తెలిపాయి. 5న సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్తో సీజేపీ జంతర్మంతర్లో నిరసనలు కొనసాగించడం తెల్సిందే. -
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్లైట్ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
జెన్జీ టెన్షన్?.. CJI కార్యక్రమం వాయిదా!
విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS రిజిస్ట్రార్ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.కాక్రోచ్ నిరసనల భయమేనా?TISS అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.CJIతో పాటు పలువురు ప్రముఖులు.. ఈ కాన్వొకేషన్కు జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్ వాయిదాకు నిరసనలే కారణమని TISS అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.టికెట్లు బుక్.. చివరికి వాయిదాకాన్వొకేషన్ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ గదులు కూడా రిజర్వ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.ఆర్థిక నష్టంపై పరిశీలనవిద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.బొద్దింకల వ్యాఖ్యలతోనే..అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. జంతర్ మంతర్ నిరసనల పిటిషన్ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది. -
ఎంత పని అయిపోయింది అన్న..!
-
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి
ముంబై: మహారాష్ట్ర భీవండిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం శిథిలావస్థకు చెందిన ఓ భవనం మరమ్మత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.భీవండి నిజంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో భవనం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనా వివరాలు తెలుసుకున్న వెంటనే భీవండి ఫైర్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు భారీ యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు వెలికితీశామని అధికారులు పేర్కొన్నారు. -
రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ
ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్షిప్లో ఉన్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్గావ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్ఫేక్ కంటెంట్పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్పూర్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది. శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వార్ధా: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న మార్గంలో ఇథనాల్తో వెళ్తున్న కంటైనర్ ట్రక్కు బోల్తా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఆ మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్కు.. ముందున్న కారును బలంగా ఢీకొంది.ఈ ప్రమాదం విరుల్ గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. -
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.నాసిక్లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్ఖేడ్కు చెందినవారు. -
సీసీటీవీ, సీట్ బెల్టులు, జీపీఎస్..
ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ బెల్టులు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది. 2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ (రెగ్యులే షన్ ఫర్ స్కూల్ బస్సెస్) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్ రుసుమును ఆర్టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం. నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్ బస్ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, కొత్తగా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, పానిక్ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్ అటెండెన్స్, ఆటోమేటిక్ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది. సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది. -
శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)
-
కార్పొరేటర్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ జైలుకి!
ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. -
అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్ గేమ్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్టాపిక్గా మారాయి.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీ వ్యూహంలో మూడు దశలు?రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీకి అసలు లాభం ఏంటి?ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్గా మారనుంది.కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులుఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్కు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారంమరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
సియా గోయల్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
పూణే: కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కేసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ.. తమ కుటుంబాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన దుకాణంపై సోదాలపై ఆయన మాట్లాడుతూ.. జూలై 14వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారని తెలిపారు.లైసెన్స్కు సంబంధించిన ఈ తనిఖీలు జరిగాయని.. ఇప్పటికే తాము కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఎనిమిది నుండి పది రోజుల్లో అది వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ఆదేశించిన ప్రకారం ప్రస్తుతానికి దుకాణాన్ని మూసి ఉంచామని.. అయితే దుకాణాన్ని సీజ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని తాము గౌరవిస్తామన్నారు.‘‘నా కుమార్తె చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఆమెను ఉరితీయండి.. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను న్యాయవ్యవస్థకు, చట్టానికి కట్టుబడి ఉన్నాను. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తాను. కానీ దయచేసి మమ్మల్ని శిక్షించకండి. మమ్మల్ని రోజురోజుకూ చంపేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.కొందరు వ్యక్తులు కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని.. తప్పు చేయకపోయినా తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆయన వాపోయారు. పూణే మార్కెట్ యార్డ్లోని ప్రవీణ్ గోయల్కు చెందిన దుకాణంపై మహారాష్ట్ర ఎఫ్డీఏ.. జూలై 14న దాడులు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనల కింద రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగడ్ కోట ట్రెక్కింగ్ సమయంలో కేతన్ అగర్వాల్ మృతి చెందగా.. మొదట ప్రమాదంగా భావించారు. అయితే, సియా గోయల్, చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ ప్రకారం కేతన్ను కొండపై నుంచి నెట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.ట్రెక్కింగ్కు వెళ్లాలని సియా పదే పదే ఒత్తిడి చేయడం, బాలి పర్యటనకు ముందు కేతన్ పాస్పోర్ట్ అదృశ్యం కావడం.. వీరి వెంట హుడీ ధరించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ లభించడంతో ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. నిందితులిద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి పోలీస్ కస్టడీకి తరలించారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
2 వారాల పాటు అక్కడ చికెన్, మటన్ బంద్
సాక్షి ముంబై: ఆషాఢీ వారీ సందర్భంగా విఠోబా దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు పండరీపూర్కు చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ నేటి నుంచి 29 వరకు మహారాష్ట్రలోని పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోలాపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి జయకుమార్ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.ఆషాఢీ వారీ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్కు చేరుకుంటారని, ఈ పవిత్ర వేళలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆదేశాలను ఉల్లంఘించి మాంసం లేదా మటన్ అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.గజానన్ మహారాజ్ పల్లకీ యాత్రకు ముమ్మర ఏర్పాట్లు సోలాపూర్: శ్రీ క్షేత్ర షేగావ్ నుంచి పండరీపూర్ బయలుదేరిన శ్రీ గజానన్ మహారాజ్ పల్లకీ, వార్కారీల పాదయాత్ర ఈనెల 18న సోలాపూర్ చేరుకోనుంది. పల్లకీ, వార్కరీలు రెండు రోజులు ఇక్కడే బస చేయనున్న నేపథ్యంలో మేయర్ వినాయక కొండ్యాల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట స్టాండింగ్ కమిటీ చైర్మన్ రంజిత చాకోతే, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సచిన్ ఓంబాసే, అదనపు కమిషనర్ వీణా పవార్, కార్పొరేటర్లు వందన గైక్వాడ్ , శ్రీదేవి పూలారే, కల్పన కదం , గౌతం కస్బే, దిలీప్ కొల్హె, సిటీ ఇంజనీర్ సారిక ఆకులువార్, అగ్నిమాపక విభాగం ప్రముఖ అధికారి రాకేష్ సాలుంకే, శ్రీ గజానన మహారాజ్ షేగావ్ సంస్థాన్కు చెందిన స్థానిక ప్రతినిధులు సునీల్ కులకర్ణి, సునీల్ ఫాల్కే, ఉద్యానవన అధికారి కోమల్ కాశిది సంబంధిత విభాగాల అధికారులు ఉన్నారు.రూప భవాని చౌక్, తుల్జాపూర్ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్ చౌక్ శ్రీ సద్గురు ప్రభాకర్ స్వామి మహారాజ్ మందిర్, బాలివేస్ టెలిఫోన్ భవన్, కుంబార్ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్ మార్గాలతో పాటు పద్మశాలీ శిక్షణ సంస్థకు చెందిన కుఛన్ పాఠశాలల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వార్కారీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపాన్ని, అక్కడి నుండి తరలి వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్ మార్గాల వద్ద సన్నాహాలను సమీక్షించారు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు లేదువార్కరీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులను ఆదేశించారు. పల్లకి మార్గంలో అడ్డువచ్చే చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలని అలాగే రోడ్లపై గుంతలను పూడ్చాలని, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. కమిషనర్ డాక్టర్ సచిన్ ఓం బాసే పల్లకి మార్గాల వెంబడి అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే పారిశుధ్యం, నీటి సరఫరా, ఆరోగ్య, అగ్నిమాపక, అత్యవసర విభాగాల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.ప్రతిపక్ష కూటమికి షాక్?గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతుఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రహస్య భేటీలతో పెరిగిన చర్చతాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.కాంగ్రెస్ ఆందోళనమరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.శరద్ పవార్ వ్యూహం ఏమిటి?మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి. -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
సునేత్రా పవార్కు బిగ్ షాక్.. ఎన్సీపీలో కొత్త ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ సింగ్ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించారు. అధ్యక్ష ఎన్నిక చెల్లదని, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించారని ఆరోపిస్తూ, తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఎన్సీపీలో నాయకత్వంపై కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.వివాదం ఎలా మొదలైంది?అజిత్ పవార్ మరణానంతరం పార్టీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సునేత్రా పవార్ను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టీ రాజ్యాంగం ప్రకారం సభ్యులకు నోటీసులు ఇవ్వలేదని, నామినేషన్లకు అవకాశం కల్పించలేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని సచ్చిదానంద్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఎన్నిక పేరుతో కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమే నిర్వహించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.లీగల్ నోటీసులో డిమాండ్లు.. ఆమె ఎన్నికపై సింగ్ పంపిన నోటీసులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సునేత్రా పవార్ ఎన్నికను రద్దు చేయాలి. పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. పార్టీలో అర్హులైన సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి అని అన్నారు. అయితే, పార్టీ ఈ డిమాండ్లపై స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని కూడా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యలుఈ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అంగీకరించారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సరిదిద్దే చర్యలు అవసరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందనే చర్చకు మరింత బలం చేకూర్చాయి. కాగా, సునేత్రా పవార్ నాయకత్వాన్ని న్యాయపరంగా సవాలు చేయడం వల్ల ఎన్సీపీలో నాయకత్వ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఈ పిటిషన్ను స్వీకరిస్తే అధ్యక్ష ఎన్నికల చెల్లుబాటుపై విచారణ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆమె పెద్ద కుమారుడు, రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్ పెళ్లి చేసుకోబోతున్నారు. మోడల్, వ్యాపారవేత్త కైనత్ ధర్ను ఆయన వివాహమాడనున్నారు. జులై 29న పుణెలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పవార్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవార్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోయే కైనత్ ధర్ గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎవరీ కైనత్ ధర్?కైనాత్ ధర్ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె మోడల్గా, వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే తన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మోడలింగ్ రంగంలో చేసిన ప్రాజెక్టులు, వ్యాపార కార్యకలాపాలు లేదా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.పవార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుపార్థ్ పవార్, కైనత్ ధర్ (Kaiynaat Dhar) బంధం గురించి కొంతకాలంగా ప్రచార మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని పార్థ్తో కలిసి కైనత్ సందర్శించిన ఫొటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ వేడుకల్లో కైనత్ పాల్గొనడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. పార్థ్ కుటుంబం కష్టకాలంలో ఉన్న సందర్భాల్లో కైనత్ వారి వెంట కనిపించారని, ఆమెకు పవార్ కుటుంబంతో సన్నిహిత అనుబంధం చాలా కాలంగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.జూలై 29న నిశ్చితార్థంపార్థ్ పవార్, కైనత్ ధర్ల నిశ్చితార్థం (Parth Pawar, Kaiynaat Dhar Engagement) జులై 29న పుణెలో జరగనుంది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అతిథుల జాబితా, వేదిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యంఅజిత్ పవార్ రాజకీయ వారసుడుమహారాష్ట్ర రాజకీయాల్లో పార్థ్ పవార్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. ఆయన తల్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి అజిత్ పవార్. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన ఈ ఏడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు. అజిత్ పవార్ మరణానంతరం ఆయన సతీమణి సునేత్రకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. వీరి పెద్ద కుమారుడు పార్థ్ పవార్ ఈ ఏడాది ఏప్రిల్ 9న మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. -
ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు నుంచి ముగిసేవరకూ.. ఈ నెల 25న పండరీపూర్లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ ఇలా పొందాలి... అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.చదవండి: బీజేపీ నాయకులపై రాజ్ఠాక్రే ధ్వజంఅన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది. -
కుంభమేళా ఏర్పాట్లకు ప్రకృతి బ్రేక్.. సాధుగ్రామ్కు కొత్త స్థలం!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్–త్రయంబకేశ్వర్లో 2027లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధువుల కోసం ఏర్పాటు చేయనున్న సాధుగ్రామ్ స్థలాన్ని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం పూర్తిగా నీటమునిగి, బురదమయంగా మారడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తైన ప్రాంతంలో కొత్త స్థలాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.త్రయంబకేశ్వర్ కుంభమేళా దేశంలోని అత్యంత పవిత్ర హిందూ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి. ఇక్కడ శైవ సంప్రదాయానికి చెందిన దశనామి అఖాడాల సాధువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరోవైపు నాసిక్లో వైష్ణవ సంప్రదాయానికి చెందిన సాధువులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కారణంగా ప్రతి కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు, సాధువులు తరలివస్తారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఏర్పాట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారుల నిర్మాణం, కుశావర్త తీర్థం అభివృద్ధి పనులు, సరస్సుల సుందరీకరణ వంటి ప్రాజెక్టులు మందగించాయి. ముఖ్యంగా సాధువుల నివాస శిబిరం ఏర్పాటు చేయాల్సిన స్థలం పూర్తిగా బురదమయంగా మారడంతో అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు.దీంతో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీరు నిల్వ కాకుండా ఉండే ఎత్తైన ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తున్నారు. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసి, సాధువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పరిపాలనా వర్గాలు తెలిపాయి. 2027 సింహస్థ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాల సవాళ్లు ఉన్నప్పటికీ, కుంభమేళా ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. -
ఉగ్ర నెట్ వర్క్ పై ATS నిఘా
-
పవన్కు ముంబైలో సర్జరీ పూర్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్ కఫ్) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్ రెండు భుజాల కండరాలు (రొటేటర్ కఫ్) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.@PawanKalyan— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026 -
అయోధ్య విరాళాల చోరీపై పశ్నించకూడదా?
సాక్షి, ముంబై: పుణే–ముంబై ఎక్స్ప్రెస్వేపై నిర్మిస్తున్న ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టు, అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, రైల్వేల్లో స్థానికుల ఉద్యోగాల అంశాలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర నవనిర్మాణ రైల్వే కార్మిక్ సేన వార్షికోత్సవం, నూతన కార్యాలయం, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బెదిరింపు ధోరణి తగదు ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్ ఠాక్రే విమర్శించారు. మహారాష్ట్ర శాసనసభలో మరాఠీ సభ్యుల మధ్య హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి ’చూసుకుంటాం’ అనే భాష ఉపయోగించడం సరికాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ బెదిరింపుల ధోరణి తగదు‘ అని వ్యాఖ్యానించారు. ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజలు ప్రశ్నిస్తే దానిని మహారాష్ట్రకు అవమానంగా చిత్రీకరించడం సరికాదని రాజ్ ఠాక్రే అన్నారు. ప్రజలు అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, అధికారంలో లేనప్పుడు ఇదే అంశాలపై బీజేపీ కూడా ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు.అన్నీ సహజమేనా?ప్రభుత్వం ప్రతి లోపాన్నీ ’సహజం’గా పేర్కొంటోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకే అన్ని ఘటనలను సమర్థించుకోవడం సరికాదని, రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరంలో విరాళాలు, నిధుల చోరీ ఆరోపణలపై స్పందించిన రాజ్ ఠాక్రే.. భక్తుల దేవుడి సొమ్ము భద్రతపై ప్రశ్నిస్తే మతవ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదన్నారు. రామమందిర ట్రస్ట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితుల్లో చోరీ ఎలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చదవండి: ప్రజల మరణాలపై వెకిలి నవ్వులా?‘స్థానిక’ హక్కులపై అప్రమత్తంగా ఉండాలి 2008లో రైల్వే నియామకాల కోసం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేసిన రాజ్ ఠాక్రే.. ఆ పోరాటం వల్లే స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా రైల్వే నియామకాలు, స్టాళ్ల కేటాయింపుల్లో స్థానికుల హక్కులు దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. -
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్లో అసోసియేట్గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
మహా రాజకీయం.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య జరిగిన భేటీ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశం తర్వాత ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA)లో విభేదాలు తలెత్తాయా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా, శరద్ పవార్ మహారాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అక్కడే సమావేశమయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య ఏదైనా కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయా అనే చర్చ మొదలైంది.ఈ భేటీపై స్పందించిన సంజయ్ రౌత్..‘శరద్ పవార్పై మాకు పూర్తి గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతంపై, ఆయన రాజకీయ నిబద్ధతపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించడం మాకు బాధ కలిగించింది. మా దృష్టిలో పార్టీని చీల్చిన వారు ద్రోహులు. అలాంటి వారికి గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టుగా ఈ సమావేశం కనిపించింది. ఈ సమావేశానికి మరో స్థలం దొరకలేదా? తప్పనిసరిగా షిండే కార్యాలయంలోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల శివసేన (UBT) కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా బాధపడ్డారు. ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.ఎన్సీపీ నేతలు ఫైర్.. అయితే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(SP) నాయకులు మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని, ఎంవీఏ కూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ భేటీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే శరద్ పవార్ వర్గం నుంచి మహా వికాస్ అఘాడీ కూటమిని వీడుతున్నట్లు లేదా అధికార కూటమితో చేతులు కలుపుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి. -
మహారాష్ట్రలో భూకంపం
మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుజామునహింగోలి జిల్లాలో వరుసగా భూమి స్వల్పంగా కంపించింది. రెండు గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. హింగోలిలో నమైదన భూకంపం 4.6 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నాలుగు భూకంపాలు హింగోలి జిల్లాలోని సమీప ప్రాంతాలలోనే సంభవించాయని, 10 కిలోమీటర్ల లోతులో ఇవి నమోదైనట్లు పేర్కొన్నారు. వీటితో పాటు లాతూర్, పర్భణి, నాందేడ్ సహా పొరుగు జిల్లాల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఇలాంటి భూకంపాలు చాలాసార్లు సంభవించాయి. జూలై 2, 2026న, హింగోలిలో 5 కిలోమీటర్ల లోతులో 3.6, 3.5 తీవ్రత గల రెండు భూకంపాలు నమోదయ్యాయి. అంతకుముందు, ఏప్రిల్ 11, 2026న, 10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా ఇటీవల ఇలా వరుసగా భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. Maharashtra: Earthquake tremors were felt in Nanded, Hingoli and Parbhani districts of Marathwada region in the state. The tremors were recorded between 1.37 am and 3.23 am and measured between 3.6 and 4.6 on the Richter scale. pic.twitter.com/i9pxCOhc9i— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2026 -
నదిలోకి కొట్టుకుపోయిన.. 3000 LPG సిలిండర్లు
-
ఫడ్నవీస్ను కాదని షిండేతో భేటీ దేనికి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణ మర్యాదపూర్వక భేటీగానే ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ సమావేశం జరిగిన సమయం, కలిసిన నేతల ప్రాధాన్యం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శరద్ పవార్ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏక్నాథ్ షిండే ఛాంబర్కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) నేతలు జయంత్ పాటిల్, జితేంద్ర అవ్హాద్, శశికాంత్ షిండే కూడా ఉన్నారు.ఆ సమయంలో షిండే క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు. పవార్ వచ్చిన విషయం తెలుసుకున్న షిండే సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయనను కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం షిండే తిరిగి క్యాబినెట్ సమావేశానికి వెళ్లగా.. పవార్ కొంతసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అసలు చర్చంతా ఫడ్నవీస్ చుట్టూనే..ఈ భేటీలో ఆసక్తిని పెంచిన అంశం ఒక్కటే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక నిర్ణయాధికారిగా ఉన్నప్పటికీ.. పవార్ ఆయనను కాకుండా షిండేను కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కేవలం ఫడ్నవీస్ను పక్కన పెట్టిన చర్యగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండేకు ఉన్న ప్రత్యేక రాజకీయ స్థానం ఈ భేటీకి కారణంగా కనిపిస్తోంది.శివసేనలో చీలిక తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి పలువురు నేతలు షిండే శిబిరంలోకి వెళ్లడం, ఇటీవల ఆ వర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు.. షిండేను ఒక ప్రత్యేక రాజకీయ కేంద్రంగా నిలిపాయి.షిండే ఎందుకు కీలకం?శరద్ పవార్కు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ రాజకీయ సంబంధాలు కొనసాగించడం ఆయన శైలిలో భాగం. ఈ నేపథ్యంలో షిండేతో భేటీని కూడా అదే రాజకీయ సంప్రదింపుల కోణంలో చూడాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు.. శివసేనలోని పరిణామాలు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం కొత్త ఊహాగానాలకు కారణమైంది.ఎంవీఏలో పెరుగుతున్న ఒత్తిళ్లుకాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) కలిసి ఉన్న మహా వికాస్ అఘాడీకి ఇటీవలి కాలంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లడం ప్రతిపక్ష కూటమిలో కలకలం రేపింది. భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ముందు కూటమి ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పవార్–షిండే భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.రాజకీయ సంకేతమా? లేక..అయితే ఈ సమావేశంలో రాజకీయ సమీకరణాలపై చర్చ జరిగిందని ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షిండే కార్యాలయం దీనిని మర్యాదపూర్వక సమావేశంగానే పేర్కొంది. పవార్ కూడా భేటీ వివరాలను వెల్లడించలేదు. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో నేతల మధ్య జరిగే ప్రతి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరద్ పవార్ వంటి సీనియర్ రాజకీయ నాయకుడు.. అధికార కూటమిలో కీలకంగా ఉన్న షిండేను ప్రత్యేకంగా కలవడం సహజంగానే చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఆపరేషన్ ఫడ్నవీస్.. షిండేకు బీజేపీ పెద్దల సాయం? -
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు..
ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా రాయ్గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు కనిపిస్తే ప్రజలు వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లు నివాస ప్రాంతాలు, రోడ్లు, నదీ ప్రవాహాల సమీపంలో కనిపించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని తరలించేందుకు లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉండే అవకాశం ఉన్నందున లీకేజీ, మంటలు లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.Raigad,Maharashtra - Several empty cylinders of HPCL were washed away in a sudden flood at Chavane village in Khalapur taluka.The empty tanks had been brought to the HPCL plant in Chavane for processing and refilling. However, heavy rainfall on the hilltop caused a massive surge… pic.twitter.com/08PVx2k5XJ— NextMinute News (@nextminutenews7) July 8, 2026మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ పెంచింది. ఇక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాయ్గఢ్లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.ముంబైపై పంజా..ఇదిలా ఉండగా.. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో నమోదైన వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకుంది. శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 1,017.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత ఏడాది మొత్తం జూలై నెలలో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.मुंबई और उसके आसपास के इलाकों में मूसलाधार बारिश के कारण कई जगहों पर रेलवे ट्रैक जलमग्न हो गए हैं।भारी बारिश होने के कारण। pic.twitter.com/n0Jn1MFtRW— Cockroach Janta Party (@CJP_for_India) July 9, 2026భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇక భారీ వర్షాలతో ముంబైకి తాగునీటిని అందించే విహార్, తులసి సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో నగర నీటి సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Mumbai rains giving no respite this time! Hope it stops soon. 🙁 Stay safe#MumbaiRain pic.twitter.com/o9OSpM6GA2— Puneet Kumar (@puneetiitm) July 8, 2026 -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ జల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్టాపిక్గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
ఆగస్టు 1 నుంచి ‘బైక్ టాక్సీలు’ చట్టబద్ధం!
మహారాష్ట్ర రవాణా విభాగంలో భారీ మార్పు రాబోతుంది. గత కొంతకాలంగా చట్టపరమైన చిక్కులు, ఆంక్షల నడుమ యాప్ ఆధారిత బైక్ టాక్సీలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను చట్టబద్ధం చేస్తూ సరికొత్త రవాణా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం.4.5 లక్షల బైక్ టాక్సీలుప్రస్తుతం మహారాష్ట్రవ్యాప్తంగా సుమారు 4-4.5 లక్షల బైక్ టాక్సీలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జులై చివరి నాటికి రవాణా శాఖ ఈ కొత్త పాలసీకి తుది అనుమతులు ఇవ్వనుండటంతో ఆగస్టు 1 నుంచి ఈ అసంఘటిత రంగం నియంత్రణ చట్రం పరిధిలోకి రానుంది. గతంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు స్థానిక యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సవరించుకోవడం గమనార్హం.నిబంధనలు ఇవే!స్థానిక నిరుద్యోగ యువత ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ పాలసీలో కొన్ని కీలకమైన నిబంధనలు పెట్టింది.స్థానికంగా మహారాష్ట్ర నివాసితులకు మాత్రమే బైక్ టాక్సీ పర్మిట్లు మంజూరు చేస్తారు.బైక్ టాక్సీ నడిపే డ్రైవర్లు స్థానిక భాష మరాఠీ కచ్చితంగా అర్థం చేసుకోగలగాలి.మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం సూచించిన పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ కలిగి ఉండాలి.డ్రైవర్ల సంక్షేమం కోసం నిధిబైక్ టాక్సీ రంగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా సరికొత్త రెవెన్యూ మోడల్ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఆపరేటర్లు లేదా డ్రైవర్లు రోజుకు రూ.5 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రైడ్ బుకింగ్పై వచ్చే ఆదాయంలో 2 శాతం నిధులను డ్రైవర్ల సంక్షేమ పథకాల(ఆరోగ్య, జీవిత బీమా, పీఎఫ్) కోసం కేటాయించాలి.‘మహారాష్ట్రలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఈ కొత్త విధానం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే రైడర్ల సంక్షేమం కోసం 2 శాతం నిధిని కూడా వినియోగిస్తాం’ అని ప్రతాప్ సర్నాయక్ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ఆ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. IMD అలర్ట్!
-
శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎదుర్కొన్న ‘‘పార్టీ ఎవరిది?” అనే సంక్షోభం.. దేశ రాజకీయాల్లోనే పెద్ద మలుపుగా నిలిచింది. నాయకత్వం, గుర్తు, ఎమ్మెల్యేలు.. అన్నీ ఒకేసారి చీలిపోయి చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ తుపాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చుట్టూ తిరుగుతుండడంతో.. బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.తాజాగా కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గం కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించడం.. లోపలే సమావేశాలు నిర్వహించడం.. “మాదే అసలు టీఎంసీ” అంటూ ప్రకటించుకోవడం.. మళ్లీ తాళాలు వేసుకుని వెళ్లడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ బల ప్రదర్శన స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇది అప్పటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన.. మహా పొలిటికల్ డ్రామాను తలపిస్తోంది.మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కూడా ఇదే తరహా రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టి, అసెంబ్లీ సంఖ్యాబలం ఒక్కసారిగా మారిపోయింది. గోవా, గుజరాత్ క్యాంప్లలో జరిగిన రాజకీయ కదలికల తర్వాత చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఉద్ధవ్ వర్గం, మరోవైపు షిండే వర్గం అంటూ అసలు శివసేన ఎవరిదన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తు, పేరు, అధికారిక హక్కులపై జరిగిన పోరులో.. షిండే పై చేయి సాధించారు. దీంతో బెంగాల్లోనూ సీన్ రిపీట్ కాక తప్పదా? అనే చర్చ జోరందుకుంది.ఇక బెంగాల్ టీఎంసీ సంక్షోభానికి కేవలం ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా ఎంపీల స్థాయిలో కూడా కొనసాగుతుందని తెలిసిందే. టీఎంసీకి చెందిన 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది సభ్యులు ఎన్సీపీఐ అనే రాజకీయ వేదికలో విలీనం కావడం.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం.. తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకు..ఇదే తరహా రాజకీయం మహారాష్ట్రలోనూ కనిపించింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీల్లో కొందరు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధపడ్డారు. శివసేన సంక్షోభ సమయంలో ఎలా అయితే ఎమ్మెల్యేల మార్పు జరిగిందో.. ఇప్పుడు బెంగాల్లోనూ అదే తరహా చీలిక ఎపిసోడ్ నడుస్తోంది. అలాగే.. ఇరు చోట్ల “పార్లమెంటరీ షిఫ్టింగ్” ఒకేసారి చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో అంతర్గత చీలిక.. ఎమ్మెల్యేల వేరు వర్గం.. ఎంపీల షిఫ్టింగ్.. మహారాష్ట్ర, బెంగాల్ రాజకీయాల్లో ఒకే ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద టీఎంసీ పార్టీ పేరు, గుర్తు, నిర్మాణంపై హక్కుల వివాదం పెండింగ్లో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే శివసేన తరహా సంక్షోభమే ఇప్పుడు టీఎంసీకి కూడా ఎదురవుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. -
ఇంత బలుపా? మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్
-
పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉంటుందని చెబుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే.. పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు కాదని.. ప్రజా సేవకులని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రన చర్యలు తీసుకోవడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.ముంబై పోలీసులు ఒక రాజకీయ కార్యకర్తపై విధించిన నగర బహిష్కరణ (externment) ఆదేశాన్ని తాజాగా ముంబై హైకోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జందార్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పౌరులు ప్రభుత్వానికి బానిసలు కారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పోలీసులు ప్రజల సేవకులు.. అంతేకానీ రాజకీయ నాయకుల సేవకులు కారు’’ అని వ్యాఖ్యానించారు.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ చౌదరిపై ముంబై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు FIRలు నమోదు చేశారు. అందులో సీఏఏ, ఎన్ఆర్సీతోపాటు బాబ్రీ మసీదు–జ్ఞానవాపి వివాదాలు, ఇంధన ధరల పెరుగుదల వ్యతిరేక నిరసనల్లాంటివి ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా కొంకణ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్లో చౌదరిని ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను డివిజనల్ కమిషనర్ కూడా సమర్థించారు. ఈ బహిష్కరణ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేసింది. పోలీసులు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా నిలబడవని స్పష్టం చేసింది.కోర్టు ప్రధాన పరిశీలనలుకేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నగర బహిష్కరణ విధించడం సరైనదికాదు. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛ (Article 19), జీవించే హక్కు (Article 21)ను ఉల్లంఘిస్తుందని తేల్చింది. అలాగే, ఆ ఆరోపణలు ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా పోలీసులు నిరూపించలేకపోయారు అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఆదేశాన్ని, అలాగే అప్పీల్ స్థాయిలో ఇచ్చిన ఆమోదాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు మూలాధారం అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరం కాదని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి
సాక్షి ముంబై: ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముంబైతో పాటు థానే, నవీ ముంబై, కల్యాణ్–డోంబివలీ, భివండి, పాల్ఘర్, రాయగడ్, కొంకణ్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముంబైకి ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ , రత్నగిరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 2న పాల్ఘర్, జూలై 3, 4 తేదీల్లో రాయగడ్, జూలై 4న థానే, జూలై 5న సతారా ఘాట్ ప్రాంతాలకు, జూలై 2 నుంచి 4 వరకు పుణే ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కొంకణ్, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రకూ హెచ్చరిక కొంకణ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మరాఠ్వాడాలో చాలా ప్రాంతాల్లో, ఉత్తర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా వేసింది.ముంబై జలమయం.. అంధేరి సబ్వే మూసివేత ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అంధేరి సబ్వేలో నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను చాల సమయం పాటు పూర్తిగా నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, ములుండ్, శాంతాక్రూజ్, బాంద్రా తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.హైవేలపై భారీ ట్రాఫిక్.. లోకల్ రైళ్లకు అంతరాయం నవీ ముంబైలోని జూయినగర్ సమీపంలో సైన్–పన్వేల్ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు భివండి బైపాస్ వద్ద ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో లోకల్ రైళ్లు 15–20 నిమిషాలు, వెస్ట్రన్ రైల్వేలో 5–10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుండ్లోని బీఎంసీకి చెందిన ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రైతులకు ఊరట.. ప్రజలకు అప్రమత్తత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ముంబై మహానగర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటమునిగిన రహదారుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్కల్యాణ్–డోంబివలీ జంట నగరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. శిల్ఫాటా ప్రాంతంలో రహదారి పక్కన నిలిపిన కార్లు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కల్యాణ్ తూర్పులోని ఆడివలి, ఢోకళి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భాండుప్ విలేజ్ రోడ్డులో కాలువలు పొంగిపొర్లడంతో విద్యార్థులు వరద నీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని భివండీ, ఉల్హాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, షాహాపూర్, ముర్బాడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగ్లే ఎస్టేట్లో చెట్టు కూలి ఓ వ్యక్తి గాయపడగా, పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. డోంబివలీ ఎంఐడీసీ ప్రాంతంలో విద్యుత్ లైన్లపై చెట్టు పడటంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మ్యాన్హోల్లో పడి..
ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్కోపర్తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుగురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు. -
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్ను లోహన్గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
మహారాష్ట్ర యువనేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ యూబీటీ(ఉద్దవ్ థాక్రే) శివసేన నుంచి జరుగుతున్న వరుస వలసలు యాదృచ్ఛికం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగుందని అంటున్నారాయన. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ షిండే నేతృత్వంలో జరుగుతున్న ‘‘ప్లాన్డ్ పొలిటికల్ ఆపరేషన్’’లో భాగమని ఠాక్రే ఆరోపించారు.ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జూనియర్ థాక్రే.. మహారాష్ట్రలో గత కొంతకాలంగా జరుగుతుందని ఆపరేషన్ టైగర్ కాదని.. దానిని ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవిస్ అని అభివర్ణించారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందని, షిండేను ముందుంచి ఆ పెద్దలు ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం.. ఫడ్నవిస్ను ఎదగకుండా అడ్డుకోవడమే సంచలన వ్యాఖ్యలు చేశారు.శివసేన (UBT) నుంచి ఇటీవల 9 మంది ఎంపీల్లో 6 మంది షిండే వర్గానికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆదిత్య ఠాక్రే.. తమ పార్టీని ఈ పెద్ద రాజకీయ ఎత్తుగడలో “కాలాటరల్ డ్యామేజ్”గా(లక్ష్యంగా కాకపోయినా దెబ్బతినడం) వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గానికి తరలించబడే అవకాశం ఉందని, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘‘బహుశా ఇది దేవేంద్ర ఫడ్నవీస్కు చివరి అసెంబ్లీ సెషన్ కావచ్చు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. షిండే కూడా తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.వలసల వెనుక డబ్బు పాత్ర ఉందన్న ఆరోపణలను కూడా ఆదిత్య ఠాక్రే పునరుద్ఘాటించారు. కొన్ని వీడియోలు, మీడియా క్లిప్స్ను ఆధారంగా చూపుతూ, ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. “పార్టీ మారిన వెంటనే లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన కార్లు ఎలా వస్తాయి?” అని ఆయన వ్యాఖ్యానించారు.అదేవిధంగా బీజేపీపై కూడా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. రామమందిర ట్రస్ట్ నిధులపై వచ్చిన వివాదాలను ప్రస్తావిస్తూ, పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. బీజేపీని ‘‘బాబర్ జనతా పార్టీ’’గా అభివర్ణించారు.అయితే ఈ ఆరోపణలపై బీజేపీ, షిండే వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే.. ఉద్దవ్ శివసేన (UBT) రాజకీయంగా ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీని బాబర్జనతా పార్టీగా అభివర్ణించడమూ రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. -
మహారాష్ట్రను శాసిస్తున్న ‘షుగర్ సామ్రాజ్యం’
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉందనేది కేవలం ఎన్నికల ముంగిట కనిపించే ముచ్చట మాత్రమే.. తెరవెనుక మాత్రం అందరిదీ ఒకటే వ్యాపార సామ్రాజ్యం.. అదే చక్కెర మిల్లులు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (పెట్రోల్లో ఇథనాల్ కలపడం) వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే పెద్ద ఆయుధం దొరకకపోయినా ప్రతిపక్షాలు ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి? ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న ‘షుగర్ ఫ్యాక్టరీ’ కనెక్షన్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఆ చక్కెర సామ్రాజ్యం గురించిన పూర్తి వివరాలు..పాలిటిక్స్ కాదు.. ఇది ఇథనాల్ బిజినెస్మహారాష్ట్రలో రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ, చక్కెర వ్యాపారంలో మాత్రం నాయకులంతా భాగస్వాములే. ఒకప్పుడు కేవలం పంచదార ఉత్పత్తికే పరిమితమైన ఈ షుగర్ మిల్లులు, ఇప్పుడు ఆధునిక ‘బయో-రిఫైనరీలు’గా మారిపోయాయి. చెరకు నుండి చక్కెర మాత్రమే కాకుండా, గ్రీన్ ఫ్యూయల్ అయిన ఇథనాల్ను తయారు చేస్తూ ఈ మిల్లులు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్ బ్లెండింగ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో ఈ వ్యాపారానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. అందుకే, ప్రజా సమస్యగా మారిన ఈ అంశంపై ఏ ఒక్క విపక్ష నేత కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు.బీజేపీ నేతల చక్కెర సామ్రాజ్యందేశంలోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నాగపూర్లో మూడు చక్కెర మిల్లులు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత సుభాష్ దేశ్ముఖ్ సోలాపూర్లో మూడు మిల్లులున్న ‘లోకమంగళ్ గ్రూప్’ను నడుపుతున్నారు. వీరితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, హరిభావూ బగాడే, బబన్రావ్ పాచ్పుతే వంటి దిగ్గజాలు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ అతుల్ భోసలే (యశ్వంత్రావ్ మోహితే కృష్ణ మిల్స్), మనోజ్ ఘోర్పడే, అభిమన్యు పవార్ వంటి బీజేపీ నాయకులకు ఈ చక్కెర పరిశ్రమలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.శరద్ పవార్, అజిత్ పవార్ల హవాఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని రెండు గ్రూపుల నేతలను పరిశీలిస్తే, మహారాష్ట్ర షుగర్ బెల్ట్పై వీరి పట్టు అంతా ఇంతా కాదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు శ్రీ అంబాలికా షుగర్ (అహ్మద్ నగర్), దౌండ్ షుగర్ (పూణే), జరందేశ్వర్ షుగర్ మిల్స్ (సతారా) వంటి భారీ ప్రైవేట్ మిల్లులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన సోదరుడు రాజేంద్ర పవార్ ‘బారామతి ఆగ్రో’ అధ్యక్షుడిగా ఇందాపూర్, కన్నడ ప్రాంతాల్లో మిల్లులను నడుపుతున్నారు. స్వయంగా శరద్ పవార్ ‘వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్’ అధ్యక్షుడిగా ఉంటూ ఈ మొత్తం పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే-పాటిల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే, ధనంజయ్ ముండే వంటి ఎన్సీపీ కీలక నేతలందరికీ సొంతంగా మిల్లులు ఉన్నాయి.కాంగ్రెస్, శివసేనల హస్తం కూడా ఇందులోనేప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మాజీ సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ స్థాపించిన లాతూర్లోని జాగృతి షుగర్, మంజ్రా శేత్కరీ మిల్లులను ప్రస్తుతం అమిత్ దేశ్ముఖ్, దిలీప్రావ్ దేశ్ముఖ్ పర్యవేక్షిస్తున్నారు. సాంగ్లీలో పతంగ్రావ్ కదమ్ స్థాపించిన సోనహీరా సహకారి మిల్లును ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, సతేజ్ పాటిల్, విశ్వజీత్ కదమ్ వంటి కాంగ్రెస్ ప్రముఖులకు ఈ వ్యాపారాలు ఉన్నాయి. అలాగే శివసేనకు చెందిన శంభూరాజ్ దేశాయ్ (బాలాసాహెబ్ దేశాయ్ షుగర్ ఫ్యాక్టరీ), విజయ్ శివతారే (స్వామి సమర్థ్ షుగర్) లాంటి నేతలు కూడా ఇందులో భాగస్వాములే.గ్రామీణ ఓటు బ్యాంక్కు ఇదే కీలకంఈ చక్కెర మిల్లుల నెట్వర్క్ కేవలం లాభాలు ఆర్జించే వ్యాపారం మాత్రమే కాదు, మహారాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో పట్టు సాధించడానికి ప్రధాన వనరు. ఈ మిల్లుల ద్వారానే నాయకులు స్థానిక రైతులను, జిల్లా సహకార బ్యాంకులను, విరివిగా నడిచే డైరీ సొసైటీలను తమ గుప్పిట్లో ఉంచుకుంటారు. తద్వారా ఎన్నికల్లో భారీగా ఓట్లను, నిధులను సమీకరించుకోగలుగుతారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమికి చెందిన నాయకుల మిల్లులకు రూ.487 కోట్ల మార్జిన్ ఫండ్ను కేటాయించడం, రాజకీయాలకు-చక్కెర పరిశ్రమకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టం చేస్తోంది.మౌనమే నీ నైజమా విపక్షమా?ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఇంజన్ల సామర్థ్యం తగ్గడం, మైలేజీ సమస్యలు రావడం వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నా ప్రతిపక్షాలు ఎందుకు వీధి పోరాటాలు చేయడం లేదు? మహాయుతి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోయినా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సమాధానం స్పష్టం.. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మహారాష్ట్రలోని టాప్ లీడర్లందరి ప్రయోజనాలు ఈ ఇథనాల్ పరిశ్రమతో ముడిపడి ఉన్నాయి.ఇది కూడా చదవండి: సరళా భట్ కేసు: కశ్మీర్ ‘రియల్’ ఫైల్స్ రీ ఓపెన్! -
చిన్నారి ప్రాణం తీసిన చెట్టు.. మంత్రి షాకింగ్ కామెంట్
ముంబైలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు స్కూల్ బస్సుపై కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెట్లు కూలడం సహజమే అంటూ చాలా సింపుల్గా తీసిపారేశారు. "నిన్న జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఈ విషయంపై ప్రభుత్వం ఈరోజు సభలో ప్రకటన చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్కు కూడా ఆదేశాలు ఇచ్చాం" అని ఆయన బుధవారం చెప్పారు. సంజయ్ షిర్సాట్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి మంత్రిగా ఉన్నారు.జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న కొద్దీ ఆయన సమాధానాలు కాస్త మారుతూ వచ్చాయి. "ఒకటి-రెండు చెట్లు కూలడం, పిడుగు పడడం మనిషి చేతిలో ఉండదు. ఏ చెట్టు ఇప్పుడు కూలబోతోందో ముందే తెలిసిపోదు" అని అన్నారు.ఇదీ చదవండీ: స్కూల్ బస్సుపై పడ్డ చెట్టుమంగళవారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సుమారు 70 ఏళ్ల చెట్టు వేర్లతో పాటు కూలి, యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న మేక్ ఫోర్స్ సంస్థ స్కూల్ బస్సుపై పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ మృతి చెందాడు. బయటకు తీసిన పిల్లల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చెట్ల తనిఖీ చేయడం కూడా బాధ్యతే కదా? అని సంజయ్ను మీడియా ప్రశ్నించింది. "తనిఖీలు చేస్తూనే ఉంటాం" అని మంత్రి చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చెబుతున్నారని మీడియా మళ్లీ ప్రశ్నించింది.దీనికి సంజయ్ స్పందిస్తూ... "అలా కాదు. పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చెట్లు కూలడం సహజం. కొన్నిసార్లు గాలి బలంగా వీచితే అవి కూలిపోతాయి" అని అన్నారు. అయితే ఈ ప్రమాదం బాధాకరమని మంత్రి స్పష్టం చేశారు.మంత్రి సంజయ్ వ్యాఖ్యలను "సిగ్గుచేటు"గా శరద్ పవార్ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో అభివర్ణించారు. "ఇది పూర్తిగా సిగ్గుచేటైన వ్యాఖ్య. ఒక చిన్నారి ప్రాణం పోయింది. అలాంటి సమయంలో చెట్టు కూలడం సహజ ప్రక్రియ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఇది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చదివాను. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల శాఖపై నింద వేస్తోంది. ప్రతి వర్షాకాలానికి ముందు చెట్ల తనిఖీ తప్పనిసరిగా జరగాలి" అని కాస్ట్రో అన్నారు.కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ ప్రమాదాన్ని హైకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ఈ అంశంపై సభలో ప్రభుత్వ నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను దోచుకుంది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలం" అని నానా పటోలే అన్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు."ఈ ఘటన దురదృష్టకరం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూస్తాం. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం" అని కదమ్ చెప్పారు.భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ ఈ ఘటనను "అత్యంత దురదృష్టకరం"గా పేర్కొంటూ సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. "చెంబూర్లో రావిచెట్టు స్కూల్ వాహనంపై కూలి చిన్నారి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం. వర్షాకాలంలో చెట్ల కొమ్మలను సమయానికి కత్తిరించడం చాలా అవసరం. నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చెట్లను సంరక్షించాలి. అదే సమయంలో మానవ ప్రాణాలు కూడా అమూల్యం. నిన్న జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. మున్సిపల్ పరిపాలన చెట్ల కొమ్మలను కత్తిరించాలి. బలహీనంగా ఉన్న చెట్లను తొలగించాలి" అని చెప్పారు. -
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
శరద్ పవార్(85)కు చెందిన ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. ఎన్డీఏలో చేరదాం శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం. -
లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?
ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్గ్రౌండ్సర్గిగా చెక్చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు. జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్ను ఊరడించారు. కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానంజూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్యపూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలంఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. -
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. -
ఉద్ధవ్కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ ఉద్ధవ్ వర్గాన్ని వీడి, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే గూటికి చేరిన వెంటనే, అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి శివసేన అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుండి, ముఖ్యంగా ఉద్ధవ్ క్యాంప్ నుండి నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఎకనాథ్ షిండే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’ లో భాగంగానే ఈ తాజా చేరిక చోటుచేసుకుంది.ఈ పరిణామానికి కొన్ని రోజుల ముందే శివసేన (యూబీటీ) కి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించి ఉద్ధవ్కు కోలుకోలేని దెబ్బ తీశారు. ఢిల్లీలో జరిగిన కీలక పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన ఈ ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్ (యావత్మాల్), సంజయ్ జాదవ్ (పర్భని), సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్), నాగేష్ పాటిల్-అష్టికర్ (హింగోలి), ఓంప్రకాష్ రాజేనింబాల్కర్ (ధారాశివ్), భౌసాహెబ్ వాక్చౌరే (శిరిడీ)—దక్షిణ ముంబైలోని యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఉద్ధవ్ వర్గంలో ముగ్గురు లోక్సభ ఎంపీలు మాత్రమే మిగిలారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, తమ వ్యూహాలు పక్కాగా సాగాయని, ‘ఆపరేషన్ టైగర్’ ఇప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ప్రకటించారు. చేరిన ఎంపీలను క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న దిగ్గజాలుగా ఆయన అభివర్ణించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన అభ్యర్థులపై గెలిచిన ఈ ఎంపీల మార్పుతో మహారాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలను షిండే లాక్కోవడంతో, అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ)లో షిండే బేరసారాల శక్తి మరింత బలపడింది. మరోవైపు, దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రధానమంత్రి రేసు నుండి తప్పించడానికి అమిత్ షాయే ఈ ‘ఆపరేషన్ టైగర్’ ను నడిపించారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
-
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీల పరంపరకు పుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. సంచలనం రేపిన నీట్ లీకేజీ వ్యవహారం మరువక మునుపే తాజాగా మహారాష్ట్రలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం, ఈ నెల 28న జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (మహా–టెట్) 2026 ప్రశ్నపత్రం లీకైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్సీఈ) చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసుల ఆకస్మిక దాడులు.. మహారాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన టెట్ పరీక్షకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున థానే జిల్లా పరిధిలోని భివండీలో కొందరి వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. వెంటనే పోలీసులు భివండీలోని ఓ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పరీక్షకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యం కావడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఎస్సీఈ అధికారుల నిర్ధారణ అనుమానితుల వద్ద లభ్యమైన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు వెంటనే పుణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్సీఈ) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యాశాఖ, పరీక్షల మండలి అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన అసలు టెట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పేపర్ లీకైనట్లు అధికారికంగా స్పష్టమైంది. త్వరలో కొత్త తేదీల ప్రకటన .. పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది. ఈ స్థాయిలో పరీక్షను నిర్వహించేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమవుతుందని ఎంఎస్సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే చెప్పారు. పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అభ్యర్థులు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తదుపరి అధికారిక అప్డేట్స్ కోసం అభ్యర్థులు వేచిచూడాలని సూచించారు. కాగా, లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ముగ్గురిపై క్రిమినల్ కేసు ఈ వ్యవహారంపై భివండీ పోలీస్ స్టేషన్లో ముగ్గురు అనుమానితులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ లీకేజీ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.యువత భవిష్యత్తును దోచుకోవడమే: రాహుల్ గాంధీ మహారాష్ట్ర–టెట్ను లీకేజీ ఆరోపణలతో వాయిదా వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం పరీక్ష పత్రం లీక్ మాత్రమే కాదు..యువత భవితను దోచుకోవడమేనన్నారు. ‘మరో పేపర్ లీక్. మరో పరీక్ష రద్దు, ఈసారి మహారాష్ట్ర టెట్ వంతు..!’అంటూ ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. పరీక్షల విధానాన్ని వసూళ్ల దందాకు అడ్డాగా మార్చుకున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు. లీకేజీ సూత్రధారులు అన్ని రకాలుగా ప్రభుత్వం రక్షణలను పొందుతున్నారన్నారు. లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పత్రమే లీకైనప్పుడు ఇక ఏ పరీక్ష కూడా సురక్షితంగా కానేకాదని ఎన్సీపీ(ఎస్పీ) వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యవస్థలపై నమ్మకం కల్పించాలని పేర్కొంది. -
మరో పేపర్ లీకేజీ కలకలం.. మహా 'టెట్' పరీక్ష వాయిదా
మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) వాయిదా పడింది. భివాండీలో పరీక్షా పత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ (MSCE) ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,028 కేంద్రాల్లో జూన్ 28న టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని భద్రతా చర్యలను ముందే కట్టుదిట్టం చేసిందని అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందగా తక్షణమే స్పందించిన పోలీసులు భివాండిలో టెట్ పేపర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. పేపర్-1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరగాల్సి ఉంది. -
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
ముంబై: మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ కళాఖండాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సాంకేతికతను ఉపయోగించనున్నారు. భారతదేశం తరఫున ఈ అరుదైన ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.హరప్పా నాగరికత కంటే పురాతనమైన శిల్పాలుఈ పెట్రోగ్లిఫ్స్ మహారాష్ట్ర తీర ప్రాంతాలైన రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోని లాటరైట్ పీఠభూములపై లభించాయి. ఇక్కడ రాళ్లపై చెక్కిన తాబేళ్లు, ఏనుగులు, నెమళ్లు, ఖడ్గమృగాల ఆకారాలు అబ్బురపరుస్తున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శిల్పాలు క్రీస్తుపూర్వం 20,000 నుండి 10,000 సంవత్సరాల నాటివి. అంటే ఇవి హరప్పా నాగరికత కంటే కూడా ఎంతో పురాతనమైనవి. కొంకణ్ ప్రాంతంలోని 107 గ్రామాల్లో దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శిల్పాలు, భారతదేశంలోనే ఆదిమానవుల తొలి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.రంగాన నిలిచిన ఐఐటీ మద్రాస్ సాంకేతికతఈ భారీ శిల్పాలను మానవ రహితంగా డాక్యుమెంట్ చేయడం కష్టతరమైన పని కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 15 కోట్ల బడ్జెట్ను కేటాయించి, నాలుగేళ్ల ప్రాజెక్టును రూపొందించింది. ఈ బాధ్యతను ఐఐటీ మద్రాస్కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ ప్రవర్తక్’ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కింద డ్రోన్ల ద్వారా హై-రిజల్యూషన్ వైమానిక చిత్రాలను సేకరించి, వాటిని ఏఐ సిస్టమ్స్ ద్వారా విశ్లేషిస్తారు. రాతి ఉపరితలాలు దెబ్బతిన్న చోట ఏఐ సాయంతో వాటిని పునర్నిర్మించి, ప్రపంచంలోని ఇతర పురాతన నాగరికతలతో పోల్చి పరిశోధనలు చేస్తారు.యునెస్కో గుర్తింపే అంతిమ లక్ష్యంఈ శిల్పాల్లో గుర్రాలు, ఎద్దుల ఆకారాలు ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది అవి వ్యవసాయం, రవాణా యుగానికి పూర్వపు మధ్యరాతి యుగానికి చెందినవని నిరూపిస్తోంది. 2025లోనే ఈ ప్రాంతం యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినప్పటికీ, శాశ్వత గుర్తింపు కోసం పూర్తి స్థాయి పరిశోధన నివేదిక అవసరం. రాబోయే 2030 నాటికి యునెస్కో తుది నామినేషన్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ ఏఐ అధ్యయనాన్ని వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను, పురాతత్వ పరిశోధనలను మిళితం చేస్తూ సాగుతున్న ఈ ప్రయోగం మహారాష్ట్ర ప్రాచీన సంపదను ప్రపంచ వేదికపై నిలపనుంది. -
కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్..? కేతన్ బట్టతలే హత్యకు కారణమా?
-
కేతన్ అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్..? కొత్త విషయాలు వెలుగులోకి!
-
దయచేసి ఇక ఆపండి! కేతన్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్ అగర్వాల్ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్స్టాగ్రామ్తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్ చేస్తుండటంతో ఈ ట్రెండ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్-సియాల వీడియోలను కూడా వైరల్ చేయడం ఆపమంటున్నారు.People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.'Killing Ketan Was Easier Than Confronting My Family': Siya Goyal's Confession to Pune PoliceThe Ketan Agarwal murder investigation has taken a fresh turn after police claimed that accused Siya Goyal made a startling statement during interrogation.According to investigators,… pic.twitter.com/FZYImt2ZIm— upuknews (@upuknews1) June 26, 2026జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద ఫొటోషూట్ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేతన్, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.Meet Siya Goyal who is accused of murdering her fiancée businessman Ketan AgarwalLook closer story was posted on 2022She is 20 yo nowIt means she was consuming alcohol at 16 yo even before turning on 18This is women empowerment for feminists pic.twitter.com/FCsfL99RJB— aaru (@buttermasale) June 27, 2026ఈ వీడియోలను చూసిన కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్ కంటెంట్ను నియంత్రించేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు! -
కొండపై నుంచి తోసేసింది సియానే!
పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. కేతన్ అగర్వాల్ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్ను లోహగఢ్ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుందని స్పష్టంచేశారు. ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్–ట్రాక్ కోర్టు ట్రయల్ నిర్వహించాలంటూ కేతన్ అగర్వాల్ కుటుంబం డిమాండ్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్ నికమ్ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్ అగర్వాల్(25)ను పుణే సమీపంలోని లోహగఢ్ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే. హత్యకు పకడ్బందీగా ప్లాన్ కేతన్ అగర్వాల్ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్ఫోన్లలో చాటింగ్ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్కాల్స్ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. కేతన్ బట్టతల నచ్చకనే హత్య! కాబోయే భర్త కేతన్ అగర్వాల్కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. కేతన్కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్మెంట్కు ముందే సియా గోయల్కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. -
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్లో కుప్పకూలింది!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, టీకా తీసుకున్న వెంటనే మరణం సంభవించినప్పటికీ, టీకానే మరణానికి కారణమని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్, శాస్త్రీయ దర్యాప్తు అనంతరమే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.ఘటన ఎలా జరిగింది?నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు టీకా తీసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తల తిరుగుతోందని చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. పడిపోయే సమయంలో తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.సీసీటీవీలో రికార్డైన ఘటనఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, బాలిక మరణానికి టీకానే కారణమని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు వాటిని ఖండించారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేసిన వివరాల మేరకు.. ప్రస్తుతం టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది టీకా వల్ల వచ్చిన అరుదైన ప్రతికూల ప్రతిస్పందనా? లేక ముందుగా ఉన్న గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా?. లేదా కిందపడినప్పుడు తలకు తగిలిన గాయం కారణమా? అనే కోణాల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.Nashik - A tragic and shocking incident has sent shockwaves through Nashik, where a 17-year-old girl died within minutes after receiving a routine vaccination. Shravani Anil Patil collapsed shortly after being administered the TT vaccine — meant to prevent tetanus, often given in… pic.twitter.com/iBVVxIsTWh— NextMinute News (@nextminutenews7) June 25, 2026టీకా బ్యాచ్ నిలిపివేత.. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు. ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు, బాలికకు ఇచ్చిన అదే టీకా బ్యాచ్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్కు చెందిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే టీకా సీసా నుంచి మరో ఆరుగురికి టీకాలు ఇచ్చారు. వీరిలో నలుగురు గర్భిణులు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నమోదు కాలేదు. అదే టీకా బ్యాచ్కు చెందిన డోసులతో ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 120 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఆరోపణలుమృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం టీకా తీసుకున్న వెంటనే తమ కుమార్తె కుప్పకూలిందని, అందువల్ల ఈ మరణానికి టీకానే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువతి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆరోగ్య శాఖ పలు స్థాయిల్లో విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా యువతికి పూర్తి స్థాయి పోస్ట్మార్టం నిర్వహించారు. రక్తం, ఇతర జీవ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. టీకా బ్యాచ్ నాణ్యతపై ప్రత్యేక ప్రయోగశాల పరీక్షలు జరుగుతున్నాయి. అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం కూడా కేసును విశ్లేషించనున్నారు.ఆరోగ్య శాఖ ఏమంటోంది?ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక నివేదికలు వెలువడే వరకు టీకాలపై అపోహలు సృష్టించవద్దు. టీకాలు ఇప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పోస్ట్మార్టం, ఫోరెన్సిక్, ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాతే బాలిక మరణానికి గల అసలు కారణంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.Ketan Agarwal Siya Goyal this video proves:Not everything you see on SOCIAL MEDIA is real. Filters hide flaws. Edits hide truth. pic.twitter.com/OvfbL3zrt3— बुलेट bhaiya (@bullet_bhaiya_) June 25, 2026కేసు ఏమిటి?మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!
పుణేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ, అతని కాబోయే భార్య (ఫియాన్సే) సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పక్కా స్కెచ్తో చేసిన హత్య అని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. మొదటి ప్రయత్నంలో ఒకసారి కొండంపై నుంచి తోసేసినప్పటికీ, కాబోయే భార్యను గుడ్డిగా నమ్మిన కేతన్ చివరకు ఆమె కుట్రకు బలికాక తప్పలేదు. వారు పక్కాగా అమలు చేసిన వారి ప్లాన్ గురించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు.పక్కా ప్లాన్ ప్రకారం హత్యపోలీసుల విచారణ ప్రకారం జూన్ 18న సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరి, ఆ జంటను రహస్యంగా లోహగఢ్ కోట వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు తన ఫోన్ను రూంలోనే వదిలి వచ్చాడు. కోటపై ఉన్న ఒక నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నాక, సియా ముందుగా అనుకున్న సిగ్నల్ ఇచ్చింది. ఏంటా సిగ్నల్అందేంటి అంటే సడెన్ కూడా ఒకచోట కూర్చోవడం. అలా యాక్షన్కు "సమయం వచ్చింది" అని సైగ (సిగ్నల్) చేయాలి. అలా ఒకచోట కూర్చుని సియా సిగ్నల్ ఇవ్వగానే, వెనుక నుండి మాటు వేసిన చేతన్ చౌదరి, కేతన్ను ఒక్కసారిగా లోయలోకి తోసేసి అక్కడి నుండి పారిపోయాడు.దీనికి సంబంధిచి పోలీసులు కీలక ఆధారారాలను కూడా సేకరించారు. కోట కింద ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. తలకి హుడీ (టోపీ) ధరించి పాలో అయిన వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. చేతన్ చౌదరి కేవలం 50 నిమిషాల్లోనే కోట ఎక్కి, పని ముగించుకుని కిందకు దిగాడు. కోట పైన అతను గడిపింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎక్సర్సైజ్ కోసం వచ్చానని అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు పోలీసులకు ధృవీకరించాడు.ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలుసాధారణ రోజుల్లో (వీక్డేస్) పెద్దగా జనం ఉండరనే కారణంతో పవనా డ్యామ్ వైపు ఉండే 'వించు కాటా' (Vinchu Kata) అనే లోయ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు.ఇది నాలుగో ప్రయత్నంఅంతేకాదు కేతన్ను చంపేందుకు సియా, చేతన్లు అంతకుముందు కూడా మూడుసార్లు విఫలయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాము నుండి రక్షిస్తున్నట్లు నటిస్తూ కేతన్ను తోసేయడానికి సియా ప్రయత్నించిందని విచారణలో తేలింది. అలాగే ఎలాగైనా కేతన్ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు వేడుకల పేరుతో జూన్ 18న లోహగడ్ కోటను సందర్శించేలా సియా, కేతన్ను ఒప్పించినప్పుడు ఆ అవకాశం లభించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు షిండే శిబిరంలో చేరిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే..‘మనం నిజంగానే కలిసి ఉన్నామా?’ అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇటీవల శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార శివసేన నేత ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం ఉద్ధవ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమైన ఉద్ధవ్.. కేవలం పార్టీ అంతర్గత పరిస్థితులపైనే కాకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి ఉన్న ఎంవీఏ కూటమి ఐక్యతపైనా సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఫిరాయింపుతో పెరిగిన ఒత్తిడి2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో పార్టీ చీలిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే భారీ రాజకీయ నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడటంతో ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరం బలపడుతుందని భావించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉద్ధవ్కు ఇబ్బందికరంగా మారింది.ఎంవీఏలో సమన్వయం లోపిస్తోందా?ఉద్ధవ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం కేవలం ఎంపీల ఫిరాయింపులే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంవీఏ భాగస్వాముల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదనే భావన శివసేన (యూబీటీ)లో పెరుగుతోందని చెబుతున్నారు. అందుకే మనం నిజంగానే కలిసి ఉన్నామా? అనే ప్రశ్న ద్వారా ఉద్ధవ్ తన మిత్రపక్షాలకు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం దీనిని ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తోంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా బయటకు వస్తుండటం ఉద్ధవ్పై విశ్వాసం తగ్గిపోవడానికే నిదర్శనమని ఆ వర్గం వాదిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే-బీజేపీ కూటమి మరింత బలపడుతుండగా, ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతోందని పేర్కొంటోంది.ముందున్న సవాళ్లుఎంవీఏ కూటమికి రాబోయే స్థానిక ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యతపై అనుమానాలు వ్యక్తమవడం ప్రతిపక్షానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉద్ధవ్ థాక్రే పార్టీని కాపాడుకోవడమే కాకుండా, కూటమి భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సవాలు కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఉద్ధవ్ వేసిన ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమేనా? లేక ఎంవీఏలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.


