breaking news
Maharashtra
-
మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్ వీడియోలు
ముంబైలో జరిగిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి వీడియోల రికార్డ్ చేశారు కొంతమంది దుండగులు. ఎదురు తిరిగి మాట్లాడితే, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది.మేనేజింగ్ డైరెక్టర్ , వ్యవస్థాపక సభ్యుడు అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ సహా ఒక ప్రైవేట్ కంపెనీ సీనియర్ అధికారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమావేశం నెపంతో ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ (FIPPL) కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆమెను వేధించి, తుపాకీతో బెదిరించి ఆమె నగ్నంగా మారాలని బలవంతం చేశారు. మహిళపై దుర్భాషలాడి, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి, దాని గురించి ఎవరికైనా తెలియజేస్తే వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించి 51 ఏళ్ల బాధిత మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి మరియు క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అసలే ట్రాఫిక్, రోడ్డుపై అనుకోని అతిధి, వైరల్ వీడియో
సాక్షి,ముంబై: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలోంచి బైటికి వచ్చిన ఒక పులి రోడ్డుమీది తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు బెంబేలెత్తిపోయారు. చంద్రపూర్-మొహర్లి రోడ్డులోని తడోబా సమీపంలో కనిపించిన ఈ దృశ్యం పలువురిన్ని ఆశ్చర్యపర్చింది. సఫారీలలో కూడా కనిపించని ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఏమి అదృష్టం అనుకుంటూ పులిని చూసి మురిసిపోయారు. ఈ సంఘటన తడోబా టైగర్ రిజర్వ్లోని బఫర్ జోన్లో జరిగిందీ సంఘటన.ఆకాష్ ఆలం అనే స్థానిక యువకుడు ఈ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వైరల్ వీడియో ప్రకారం తడోబా టైగర్ రిజర్వ్ పార్క్ నుండి రోడ్డుమీదకు వచ్చింది. ఒక పులి రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల రెండు వైపులా చాలా గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. అయినా తమ కళ్ల ముందు పులి రోడ్డుపై చాలా సేపు ఉన్న దృశ్యాన్ని చూసి బాటసారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు కూడా స్పందించారు. చంద్రపూర్ నుండి మొహర్లికి వెళ్లే మార్గం ఈ అడవి గుండా వెళుతుంది. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవులు ఉండటం మూలంగా తరచుగా జంతువుల కదలికలు మామూలు అంటున్నారు గ్రామస్తులు. ఉదయం, సాయంత్రం వేళల్లో జంతువులు రోడ్డు దగ్గర తరచుగా కనిపిస్తాయని చెప్పారు. రోడ్డుపై అకస్మాత్తుగా అడవి జంతువులు కనపడటం, మానుషులకు, వాటికి మధ్యఘర్షణలు జరుగుతాయట. దీంతోఅటవీ శాఖ ఆ అడవి గుండా వెళ్లేవారికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం, రాత్రివేళల్లో ఈ దారి వాడకాన్ని పరిమితం చేయాలని, అలాగే వేగాన్ని నియంత్రించాలని కోరింది. ముఖ్యంగా జంతువులు ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగించ వద్దని లేదా వారి వాహనాల నుండి దిగవద్దని కోరింది. -
ఎన్ కౌంటర్ భయం.. లొంగిపోయిన కీలక మావోయిస్టులు
-
ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టు అనంత్ టీమ్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయుధాలు విడిచి జనవరి 1న లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎంసీ (మహారాష్ట్ర –మధ్యప్రదేశ్–ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో గురువారం రాత్రి విడుదల చేసిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచి్చంది. కాల్పుల విరమణపై ప్రతిపాదన చేస్తూ ఇటీవలే అనంత్ లేఖ విడుదల చేయగా.. తాజా లేఖలో ఏకంగా కాల్పుల విరమణ తేదీ ప్రకటనతోపాటు ఉమ్మడిగా తాము లొంగిపోయేందుకు సిద్ధమన్న కీలక నిర్ణయాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్లను ఉద్దేశించి రాసిన రెండు పేజీల లేఖలో అనంత్ పలు అంశాలను ప్రస్తావించారు. అయితే, లేఖ విడుదల చేసిన మరుసటి రోజే అనంత్ టీమ్ లొంగిపోవడం గమనార్హం. అప్పటి వరకు సంయమనం పాటించాలి ‘కామ్రేడ్స్, 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుని, ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వం ఇచ్చే పునరావాసాన్ని అంగీకరించడం ద్వారా జన జీవన స్రవంతిలోకి చేరతాం. అప్పటివరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అభ్యరి్థస్తున్నాం. జోన్లో ఎక్కడా భద్రతా దళాలు అరెస్టులు లేదా ఎన్కౌంటర్ వంటి వాటికి పాల్పడకూడదు. అదే సమయంలో జోన్ అంతటా చెల్లాచెదురుగా ఉన్న మా సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం ప్రయతి్నస్తాం. ఛత్తీస్గఢ్లో సతీశ్ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా, మేము మా ఆయుధాలను ఈ మూడు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రికి లేదా హోంమంత్రికి అప్పగించి, ప్రధాన స్రవంతిలో చేరాలనుకుంటున్నాం. వచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో మద్దతును అందించే రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆయుధాలను అప్పగించాలనుకుంటున్నాం. ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నా. భద్రతా దళాలు ఆ తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేసి ఎన్కౌంటర్ వంటి ఘటనలకు పాల్పడకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ సుఖాంతమయ్యే వరకు మన సహచరులందరూ తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి. కామ్రేడ్లందరూ బహిరంగంగా సంప్రదించడానికి నేను బావోఫెంగ్ ఓపెన్ ఫ్రీక్వెన్సీ (నంబర్) 435.715ను జారీ చేస్తున్నాను. వచ్చే నెల రోజులు రోజూ ఉదయం 11 నుంచి 11:15 గంటల మధ్య ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు తమ సహకారాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. సోను దాదా, సతీశ్ దాదా కూడా మా ఆందోళనలను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయాలని, వారి పూర్తి మద్దతును ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’అని అనంత్ లేఖలో పేర్కొన్నారు. మహరాష్ట్రలో లొంగుబాటు అజ్ఞాత జీవితం వదిలేస్తామని వరుసగా లేఖలు జారీ చేస్తూ వచి్చన ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ శుక్రవారం లొంగిపోయింది. ఎంఎంసీ అధికార ప్రతినిధి అనంత్తోపాటు మరో 11మంది మావోయిస్టులు మహారాష్ట్రలో అడవిని వీడారు. అక్కడే వారి కోసం వేచి ఉన్న ఓ మీడియా ప్రతినిధి ద్వారా మహారాష్ట్రకు చెందిన పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. లొంగుబాటు ప్రక్రియ సాఫీగా జరుగుతుందని సదరు అధికారి హామీ ఇచ్చాక వారు అడవి నుంచి మైదానం వైపు నడక ప్రారంభించారు. అనంతరం వారు గోండియా పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిర్బంధం పెరగడంతోనే అడవిని వీడాల్సి వస్తోందని అనంత్ చెప్పారు. హిడ్మా తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగిన రణ్«దీర్ ఇంకా అడవిలోనే ఉన్నాడని, వారు కూడా అజ్ఞాతం వీడాలని అనంత్ కోరారు. కాగా ఎంఎంసీకి ఇన్చార్జిగా ఉన్న అనంత్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బత్తుల కాశీరామ్ అనే వ్యక్తి అనంత్ పేరుతో పార్టీలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్కి వెళ్లిపోయాడు. అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనూ ఫోన్తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్లు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్లైన్ మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్నే ఉదాహరణ. (చదవండి: ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..) -
పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్.. ఐపీఎల్ జట్లకు సందేశం!
భారత క్రికెటర్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. హైదరాబాద్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి భారీ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్కతా వేదికగా జాదవ్పూర్ యూనివర్సిటీ క్యాంపస్ స్టేడియంలో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రాణించిన హైదరాబాద్ బ్యాటర్లుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (12), అమన్ రావు (11) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.మిగిలి వారిలో భవేశ్ సేత్ (19) విఫలం కాగా.. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 32), కెప్టెన్ సీవీ మిలింద్ (20 బంతుల్లో 35 నాటౌట్), మొహ్మద్ అర్ఫాజ్ అహ్మద్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనాకు రెండు, ఆర్ఎస్ హంగ్రేగ్కర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్ ఒక్కో వికెట్ తీశారు.దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లుఇక హైదరాబాద్ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా (Prithvi Shaw) 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.మరోవైపు... అర్షిన్ కులకర్ణి సైతం ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్డౌన్లో వచ్చిన అజిమ్ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఐపీఎల్ జట్లకు సందేశం!కాగా సచిన్ టెండుల్కర్ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్నెస్ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు
ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు, జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.ఉత్తరప్రదేశ్లో..ఉత్తరప్రదేశ్లో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా అంగీకరించబోమని ప్రణాళిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ కార్డుకు జనన ధ్రువీకరణ పత్రం జతఅవ్వదు. అందువల్ల దీన్ని బర్త్ సర్టిఫికేట్గా పరిగణించలేం’ అని ఆ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.మహారాష్ట్రలో..మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. జనన ధ్రువీకరణ పత్రాల జారీలో ఆధార్ కార్డును కీలకంగా పరిగణించబోమని, జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం కేవలం ఆధార్ కార్డు ద్వారా జారీ చేసిన అన్ని జనన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నకిలీ పత్రాలను చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిలిపివేయడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఆధార్ కార్డులను ఉపయోగించి జారీ చేసిన అన్ని అనుమానాస్పద సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఆదేశించారు. అంతేకాక, ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.అక్రమ వలసదారులపై కఠిన వైఖరిమరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించారు. శాంతిభద్రతలు, జాతీయ భద్రత తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు అని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లా యంత్రాంగం తమ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేలా చూడాలని, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రతి జిల్లాలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న అక్రమ వలసదారులను ఈ కేంద్రాల్లో ఉంచి తదుపరి వారి స్వస్థలాలకు పంపాలని తెలిపారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
‘మారుతి’ కార్లు అంటేనే ఇక్కడ అపశకునమట!
దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ కార్లను బ్యాన్ చేసిన గ్రామం గురించి తెలుసా? మహారాష్ట్రలోనే ఈ ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన నమ్మకాలతో మిళితమైన గ్రామం అని చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు. స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే శ్రీరాముడికి గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న పవిత్ర సంప్రదాయం అంటారు ఈ గ్రామ ప్రజలు. ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట. (రూ. 80 లక్షల తల్లి పెన్షన్ కోసం ఏ కొడుకూ చేయని పని!) -
షేర్ మార్కెట్ దందా : రూ. 35 కోట్లు ముంచేశారు!
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త భారీగా మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.35 కోట్లు మోసపోయిన దిగ్భ్రాంతికర వార్త కలకలం రేపుతోందితన భార్య పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతాను ఒక బ్రోకరేజ్ సంస్థ అన్యాయంగా వాడి మోసం చేసిందని 72 ఏళ్ల వ్యాపారవేత్త వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ మోసానికి తెగబడిందని మతుంగా వెస్ట్ నివాసి భరత్ హరక్చంద్ షా అనే బ్రోకరేజ్ సంస్థ గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్పై ఆరోపణలు గుప్పించారు.అసలేమైంది అంటే.పరేల్లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతున్న షా, తన భార్యతో పాటు, 1984లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన షేర్ పోర్ట్ఫోలియోను వారసత్వంగా పొందారు. కానీ ఆ జంటకు స్టాక్ మార్కెట్పై ఎలాంటి పరి జ్ఞానం లేదు. ఎపుడూ ట్రేడింగ్ చేసిన అనుభవమూ లేదు. దీంతో స్నేహితుడి సలహా మేరకు షా తనకు , తన భార్యకు గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతాను తెరిచి, వారి వారసత్వంగా వచ్చిన షేర్లను కంపెనీకి బదిలీ చేశాడు. అక్షయ్ బరియా ,కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులకు వీరి పోర్ట్ఫోలియోను "నిర్వహించే" బాధ్యతను అప్పగించారు. ఇక అక్కడినుంచి వీరి మోసానికి తెరలేచింది. వారి ఖాతాలకు పూర్తిగా నియంత్రణలోకి తీసుకొన్నారు. మొదట్లో కొద్దో గొప్పో సమాచారం ఇచ్చినప్పటికీ, ఆ తరువాత అసలు వీళ్లని సంప్రదించేవారు కాదు. అయితే మార్చి 2020 -జూన్ 2024 మధ్య, లాభాలు, క్లీన్ స్టేట్మెంట్ రావడంతో ఎలాంటి అనుమానం రాలేదు. తన ఖాతాల ద్వారా విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని షాకు తెలియదు. ఇదీ చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?మోసం ఎలా బైట పడింది?జూలై 2024లో షాకు గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుండి అకస్మాత్తుగా కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటయ్యా అంటే.. మీ భార్యాభర్తలఖాతాల్లో రూ. 35 కోట్ల డెబిట్ ఉంది. వెంటనే దాన్ని చెల్లించాలి, లేకపోతే మీ షేర్లన్నీ అమ్మేస్తాం’’ అని చెప్పడంతో నిర్ఘాంత పోవడం షా వంతైంది. కంపెనీని సందర్శించినప్పుడు, భారీ, అనధికార వ్యాపారం జరిగిందని అతనికి సమాచారం అందింది.జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: వేధింపులపై మహిళలకు కీలక సందేశం : ఐశ్వర్యారాయ్ వీడియో వైరల్ -
దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరిదో తెలుసా?
భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరు. ఆమె వంట గ్యాస్, టాయిలెట్ లేదా విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తుండటం ఆసక్తికరం. పదండి మరి ఆమె ఎవరో? ఎక్కిడి వారో వివరాలు తెలుసుకుందాం.భారతదేశంలో తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లి గ్రామ నివాసి. ఆధార్ కార్డు మహిళగా ప్రసిద్ధి చెందిన రంజనా సోనావానే. 2010న సెప్టెంబర్ 29,అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హాజరైన ఆధార్ కార్యక్రమం జాతీయ ప్రారంభోత్సవంలో ఈ కార్డు జారీ చేశారు. ఆధార్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?ఎవరీ రంజన సోనావానే?మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో ఒక పూరిగుడిసెలో నివసించే మహిళ రంజనా. ఆమె భర్త సదాశివ్ దినసరి కూలీ.వీరికి ముగ్గురు పిల్లలు. ప్రత్యేక గుర్తింపు కార్డు పొందిన తొలి వ్యక్తి అయినప్పటికీ, వంట గ్యాస్, టాయిలెట్, విద్యుత్తు లాంటి కనీస సౌకర్యాలేవీ లేవు. అందుకే తొలి ఆధార్ కార్డు పొండదంలో గొప్ప ఏముంది? ఇదో గొప్ప విజయమా. లాటరీ గెలిచనట్టుగా కాదు కదా అని అప్పట్లోనే తన నిర్లిప్తతతను ప్రకటించింది. తమలాంటి పేదవాళ్లు, గిరిజనుల కోసం ఏ మీ చేయాలేదు, ఓట్లు మాత్రం అడుగుతారు అంటూ అప్పటి మంత్రులపై నిరసనను సోనావానే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించింది. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాప్యతకు అంత్యంత కీలకమైన ఈ కార్డు ద్వారా తనకు ఒరిగిందేమీ లేదని ఒక సందర్భంలో వాపోయింది. ఆధార్ కార్డు తనకు ఉద్యోగం పొందడానికి సహాయ పడుతుందని మొదట్లో భావించానని, కానీ తర్వాత తాను పొరబడ్డానని గ్రహించానని కూడా చెప్పింది. ఆధార్ కార్డు పొందిన తొలి భారతీయురాలిగా పదిహేను సంవత్సరాలు గడిచినా, 54 ఏళ్ల రంజనా సోనావానే తనకు ప్రభుత్వపరంగా ఉద్దేశించిన ప్రాథమిక సంక్షేమ ఫలాలేవీ అందలేదని తెలిపింది. ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్ -
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత.. ట్రోల్స్కు దిమ్మతిగిరేలా కౌంటర్ ఇచ్చారు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
ట్రాఫిక్ బంధనం నుంచి బయటపడేలా అదిరిపోయే ప్లాన్!
జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్వర్క్ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. ఎలా సహాయపడుతుందంటే.. ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్వర్క్”లా ఉంటుందన్నమాట. డీకన్జెషన్తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. -
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్గా, వైస్ కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!.. స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!
ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్ ముచ్చల్తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.తప్పనిసరి పరిస్థితుల్లో..ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.నాన్న చూడని వేడుక నాకొద్దుకానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము.వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. వారం రోజులుగా వేడుకలుకాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ, సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్ -
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స -
ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల సంచలన ప్రకటన
ముంబై: ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. వివరాల ప్రకారం.. ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదలు చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న ‘పోరాటం నిలిపివేయాలన్న’ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15, 2026 వరకు సమయంఈ లేఖలో మావోయిస్టులు.. ఎంఎంసీ జోన్లోని మావోయిస్టులందరూ సామూహికంగా లొంగిపోతారు. ఎప్పటి నుంచి ఆపరేషన్ కూంబింగ్ను నిలిపివేస్తారో.. అప్పుడే మేము ఆయుధాలను వీడటం జరుగుతుంది. ఆ వెంటనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు తమ ఈ కీలక నిర్ణయంపై సమష్టి నిర్ణయానికి రావడానికి కొంత సమయాన్ని కోరారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయడానికి తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని, కేవలం అంతర్గతంగా చర్చించుకోవడానికి, తుది నిర్ణయాన్ని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఈ సమయం అవసరమని వారు లేఖలో స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్..అయితే, ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల అభ్యర్థనను ప్రభుత్వాలు ఏ విధంగా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఎలాంటి చర్యలు లేదా హామీలు ఇస్తాయనే చర్చ మొదలైంది. మావోయిస్టులు అడిగిన సమయం లోపల, ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు కూడా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించవచ్చు. -
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఆరంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను ఎంసీఎ నియమించింది. కాగా ఎంసీఎ రెండు రోజుల క్రితం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండేది. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు రుతురాజ్ను భారత సెలక్టర్లు పిలుపునివ్వడంతో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర కెప్టెన్ మార్పు అనివార్యమైంది. ఎంసీఎ సెలక్టర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని షాకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం(నవంబర్ 24) అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షాకు కెప్టెన్గా అనుభవం ఉంది. గతంలో ఫస్ట్క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో ముంబై జట్టుకు పలు మ్యాచ్లలో సారథ్యం వహించాడు. కాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు ముందు పృథ్వీ తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్ అసోయేషిన్తో విబేధాలు కారణంగా షా మహారాష్ట్రకు వచ్చాడు. ముంబై నుండి మహారాష్ట్రకు మారినప్పటి నుంచి పృథ్వీ షా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుత రంజీ సీజన్లో షా 7 ఇన్నింగ్స్లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర అదే రోజున తమ తొలి మ్యాచ్లో జమ్మూ అం్డ్ కాశ్మీర్తో తలపడనుంది.మహారాష్ట్ర జట్టురుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, రాజవర్ధన్ హంగర్గేకర్, జలజ్ సక్సేనా, అజీమ్ కాజీ, అర్షిన్ కులకర్ణి, ముఖేష్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి, మందార్ భండారి, యోగేష్ డోంగరే, యోగేష్ డోంగరే -
మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్’.. అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు
పుణె: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే లేకుండా చేస్తాం, ఓటేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమంటూ వారిని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. శుక్రవారం బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–ఎన్సీపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉండటం గమనార్హం. ‘మా ఎన్సీపీ అభ్యర్థులు 18 మందిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే ఉండదు. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే, నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తా. మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులివ్వను. మీ వద్ద ఓట్లుంటే, నా దగ్గర నిధులున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. Baramati, Maharashtra: Deputy CM Ajit Pawar says, "Give me victory for all 18 Mahayuti candidates in the Malegaon Nagar Panchayat, and I will fulfill every promise and demand I have made to you. But if you cut votes, then I will also cut. You have the votes, and I have the funds,… pic.twitter.com/AiFyTgc0A6— IANS (@ians_india) November 22, 2025మరోవైపు.. అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలషేబ్ బిటి) నాయకుడు అంబదాస్ దన్వే స్పందిస్తూ..‘నిధులు అజిత్ పవార్ ఇంటి నుండి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఇవ్వబడతాయి. పవార్ వంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? అని ప్రశ్నలు సంధించారు. ఇక, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం. -
రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R— ANI (@ANI) November 21, 2025 -
వీడియో: డ్రైవర్కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనపై అంబర్నాథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శైలేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం..‘థానే జిల్లాలోని అంబర్నాథ్లో శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు వచ్చిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి కారు దూసుకెళ్లడంతో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయని తెలిపారు. మృతుల గుర్తింపును నిర్ధారించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.Horrible accident in Maharashtra's Thane caught on camera. A Nexon car lost control and rammed into multiple approaching vehicles. Four people, including the driver of the car, lost their lives in the accident. pic.twitter.com/9rd4UKkuVg— Vani Mehrotra (@vani_mehrotra) November 22, 2025 -
ఆల్ టైం హైకి...కొనాలంటే ‘గుడ్లు’ తేలేయాల్సిందే!
ముంబై: మహారాష్ట్రల్లో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. అటు శీతాకాలం, గుడ్ల మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్ల ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరాయి. ఛత్రపతి శంభాజీనగర్లో గుడ్ల హోల్సేల్ ధరలు ఒక్కింటికి దాదాపు రూ. 8 చొప్పున పలుకుతోంది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ ధరలు మాత్రం హైలో ఉన్నాయని టోకు వ్యాపారులు తెలిపారు. దీని ప్రభావం ఉభయ తెలుగురాష్ట్రాల్లో కూడా ఉంటుందని మార్కెట్ నిపుణులు, వ్యాపారులు చెప్పారు. శీతాకాలంలో గుడ్ల డిమాండ్ మహారాష్ట్రలో రోజుకు సుమారు మూడు కోట్లు ఉంటుందని అధికారులు , తాజా లోటుతో కారణంగా రోజుకు 1.5 కోట్ల కొరత ఉంటుందని అంచనా. కోళ్లలో వ్యాధుల వ్యాప్తి గుడ్ల ఉత్పత్తిని దెబ్బతీసిందని వ్యాపారులు చెప్పారు. వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రధాన సరఫరా కేంద్రాలలో పక్షి సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందడం వల్ల లోటు ఏర్పడిందని పశుసంవర్ధక శాఖ అదనపు కమిషనర్ శీతల్కుమార్ ముకానే అన్నారు. చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!వ్యాధులు ప్రబలినప్పటికీ, ఏపీ, తమిళనాడులోని పౌల్ట్రీ యజమానులు కోళ్లను మార్చలేదనీ, ఇది ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే చలి వాతావరణం సహజంగానే గుడ్ల వినియోగం , డిమాండ్ను పెంచుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి, ముఖ్యంగా తమిళనాడు నుండి గుడ్ల దిగుమతి గణనీయంగా పెరిగిందని ముకానే చెప్పారు. పౌల్ట్రీ ఫీడ్లో కీలకమైన మొక్కజొన్న ధర తగ్గిన కారణంగా, ప్రస్తుత మార్కెట్ ఉత్పత్తిదారులకు అనుకూలమని పౌల్ట్రీ వ్యాపారవేత్త ఫిరోజ్ పింజారి అన్నారు. చదవండి: ఉదయపూర్లో బిలియనీర్ కుమార్తె పెళ్లి : జూ. ట్రంప్ స్పెషల్ గెస్ట్గత సంవత్సరం ఇదే రోజున నమోదైన రూ. 6.10 6.30 వరకు ఉన్న గుడ్డు ప్రస్తుత హోల్సేల్ రేటు గణనీయంగా పెరిగింది. మారుతున్న వినియోగదారుల అలవాట్లు, గుడ్లలో లభించే అధిక పోషక విలువలు, కల్తీ తక్కువ లాంటి అంశాలు డిమాండ్ పెరగడానికి కారణమని వసంతరావు నాయక్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పౌల్ట్రీ నిపుణురాలు అనితా జింతర్కర్ పేర్కొన్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులకు మంచి రేటు లభించడం సానుకూల పరిణామన్నారు. -
అవమానాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నాడు..!
మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇలానే ఉంటారు అనేది కొన్ని సందర్భాల్లో మనకు బోధపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తులను బాధపెట్టి, వారు అమితానందాన్ని పొందడం కొంతమందికి అలవాటు. ఒక మనిషిని చచ్చిపోయేంతగా ప్రేరేపించడం అంటే అది మన నైతిక విలువను కోల్పోవడమే. అది ఎంతటి వివాదామైన కావొచ్చు.. మనిషి ఊపిరి తీసుకునేలా ప్రేరేపించడం విలువలు కోల్పోతున్న సమాజానికి నిదర్శనం.మనిషికి ఒక భాష రాకపోతే చచ్చేలా కొట్టి,.. చివరకు చచ్చిపోయేలా ప్రేరేపించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. హిందీ వర్సెస్ మరాఠీ వివాదం ఎంతో కెరీర్ ఉన్న విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. అర్నవ్ ఖారే.. వయసు 19 ఏళ్లు. థానేలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ సైన్స్ స్టూడెంట్. ప్రతీరోజూ ముంబైలోని ములంద్ ప్రాంతానికి కాలేజ్కి వెళ్తూ వస్తున్నాడు. కాలేజ్కి వెళ్తున్నాడు.. కానీ క్లాస్లకు రెగ్యులర్గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావం అతనిలో . అందుకే కాలేజ్లకు డుమ్మూ కొడుతూ వస్తున్నాడు. దీనికి కారణం అవమానం అనే ‘మహమ్మారి. కాలేజ్తో పాటు, తాను రోజూ ప్రయాణించే ట్రైన్లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకు మరాఠీ రాదనే తోటి, సాటి వారు రోజూ ఎగతాళి చేయడం, టార్చర్ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒక రోజైతే ఆ విద్యార్థిని ట్రైన్లో కొట్టారు,. ‘వీడికి మరాఠీ రాదు’ అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు పలువురు ప్రబుద్ధులు. దాంతో ములంద్ వెళ్లాల్సిన ఆ యువకుడు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్లో చెప్పాడు. ఆపై ఇంటికి వచ్చేసి ఉరేసుకున్నాడు. తండ్రి తన డ్యూటీ ముగించకుని వచ్చేసరికి విగతా జీవిలా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఇది తండ్రి జిజేంద్ర ఖైరేకు మనోవేదనను తీసుకొచ్చింది. భాష మాట్లాడలేదని తన కుమారుడిని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజ్లోనే కాకుండా ట్రైన్లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. మహారాష్ట్రలో హిందీ–మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే, 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వం పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి, హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చిందిమరాఠీ వర్సెస్ హిందీ వివాదంపై తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు.. మరొక ప్రయాణికుడ్ని మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. -
కెప్టెన్గా రుతురాజ్
త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్, షా ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్లో జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఛండీఘడ్, బిహార్, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ కోల్కతా వేదికగా జరుగనున్నాయి.SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), పృథ్వీ షా, అర్శిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్కీపర్), రామకృష్ణ ఘోష్, విక్కీ ఓస్త్వాల్, తనయ్ సంఘ్వీ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, మందర్ బండారీ (వికెట్కీపర్), జలజ్ సక్సేనా, రాజవర్దన్ హంగార్గేకర్, యోగేశ్ డోంగరే, రంజిత్ నికమ్చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు -
రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు ఎక్కువ ఫుడ్ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ , టీ-కాఫీ వరకు రకరకాలుగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు. మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే క్యాంటీన్లో ఆర్డర్ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని చార్జింగ్ సాకెట్లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్లో ఇన్స్టంట్ నూడుల్స్ ప్రిపేర్ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే తినడం బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మినిమం సెన్స్ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు. This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్కు రైలులో వెళుతుండగా, ఒక కుటుంబం పూజ చేసి అగర్ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాను ఈ రోజుల్లో జనానికి బుద్ధి లేదు. ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్ చేశారొకరు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. -
వంద గుంజీలు.. చిన్నారి మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ పరిధిలో గల వాసాయిలో జరిగిన ఒక ఘటన పలువురిలో ఆందోళనను నింపింది. పాఠశాలకు కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందనే నెపంతో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాజల్ గోండ్కు ఉపాధ్యాయుడు కఠినమైన శిక్ష విధించారు. భుజాలపై స్కూల్ బ్యాగు ఉంచుకుని, ఏకబిగిన వంద గుంజీలు తీయాలంటూ ఆదేశించాడు.పాఠశాల తరగతులు ముగిసి, ఇంటికి చేరుకున్న కాజల్ తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనమేరకు ఆ చిన్నారిని ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్ తల్లి షీలా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉపాధ్యాయులు విధించిన శిక్ష కారణంగా కాజల్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనలాగే మరికొందరు పిల్లలు కూడా 50 నుండి 100 గుంజీలు తీసినట్లు కాజల్ తెలిపింది. రెండుమూడు నిమిషాల ఆలస్యం అయిన కారణంగా టీచర్ తమ కూతురికి కఠిన శిక్ష విధించారని, అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు పెరిగాయని ఆ తల్లి కన్నీటితో మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సంఘటనపై ముంబైలోని సర్ జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లో తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా (Accidental Death) కేసు నమోదైంది. తరువాత ఈ కేసు వాలివ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది. పాఠశాలలో విధించిన అమానుష శిక్ష కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జేజే ఆస్పత్రి వైద్యులు కాజల్ కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాజల్కు ఆస్తమా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అదనపు బరువున్న బ్యాగును మోస్తూ, అధిక సంఖ్యలో గుంజీలు తీసిన కారణంగా ఆమె అంతర్గత రక్తస్రావానికి గురైంది. అది ఆ చిన్నారి మరణానికి దారితీసింది. పాఠశాలల్లో పిల్లలపై కఠిన శిక్షలు విధించడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.ఇది కూడా చదవండి: పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి -
ఆలస్యంగా వచ్చినందుకు గుంజీలు.. ప్రాణాలు కోల్పోయిన బాలిక
పాల్ఘార్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో టీచర్లు ఆరో తరగతి బాలికతో వంద గుంజిళ్లు తీయించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక వారం తర్వాత చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వసాయ్ ప్రాంతంలోని సతివలికి చెందిన అన్షిక గౌడ్, మరో నలుగురు ఈ నెల 8న స్కూలుకు ఆలస్యంగా వెళ్లారు.ఇందుకు శిక్షగా స్కూల్ టీచర్, బ్యాగు సహా తలా 100 గుంజీలు తీయించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన అన్షిక ముంబైలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. టీచర్ విధించిన అమానవీయ శక్షే తన బిడ్డ ప్రాణాలు తీసిందని ఆమె తల్లి ఆరోపించింది. తీవ్రమైన మెడ, వీపు నొప్పితో ఆమె అల్లాడిందని ఆవేదన చెందింది. ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. టీచర్ విధించిన శిక్ష బాలిక ప్రాణాలు తీసిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని, బాధ్యులని తేలితే చర్యలు తీప్పవని బీడీవో పాండురంగ్ తెలిపారు. -
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు. -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అటవీ అధికారిపై చిరుత దాడి
-
సూపర్ ఫామ్లో పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు డబుల్ సెంచరీ (141 బంతుల్లో) చేసిన షా.. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో షా 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేశాడు.ఇవాళ షా 26వ జన్మదినం. తన పుట్టిన రోజున షా అర్ద సెంచరీ బాది తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈ రంజీ ట్రోఫీకి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. సెంచరీల మోత మోగిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. చండీఘడ్పై డబుల్ సెంచరీకి ముందు కేరళపై అర్ద సెంచరీ (75) చేశాడు.అంతకుముందు ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు చేశాడు. దానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. షా ప్రస్తుత ఫామ్ చూస్తే మరోసారి టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాడు. అయితే ఇది అంత ఈజీ ఏమీ కాదు. టెస్ట్ల్లో టీమిండియా ఓపెనర్ స్థానానికి చాలా పోటీ ఉంది. యువ ఓపెనర్లంతా రాణిస్తున్నారు. షా సహచరుడు రుతురాజ్ గైక్వాడ్ సైతం పరుగుల వరద పారిస్తున్నా అతనికే చోటు దక్కడం లేదు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా స్థిర పడిపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర 113 పరుగులు వెనుకపడి ఉంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులు చేయగా.. మహారాష్ట్ర 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.కర్ణాటక తరఫున కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (80), స్మరన్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించగా.. మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా ఒక్కడే అర్ద సెంచరీతో మెరిశాడు. శ్రేయస్ గోపాల్ (23-3-46-3) బంతితోనూ రాణించి మహారాష్ట్రను దెబ్బ కొట్టాడు.చదవండి: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా -
నెట్టింట భయానక వీడియో.. అధికారుల వార్నింగ్
భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే.. ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే.. అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N— Himmu (@Himmu86407253) November 7, 2025AI వల్ల కలిగే ప్రమాదాలు:• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం• డీప్ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం ప్రజలకు సూచనలు:• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి -
కుమారుడిపై కుంభకోణం కేసు.. అజిత్ పవార్ రియాక్షన్
ముంబై: ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడి సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సంబంధిత తహశీల్దార్పై సస్పెండ్ వేటు వేసిన ప్రభుత్వం, తాజాగా రూ.300 కోట్ల విలువైన ఆ భూ విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని అజిత్ పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు.అంతకుముందు, ఆయన సీఎం ఫడ్నవీస్తో అజిత్ పవార్ సమావేశమయ్యారు. ‘పుణె నగరంలోని మౌజె ముంధ్వా ప్రాంతంలో ఉన్న ఆ 40 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తి. దానిని విక్రయించరాదు. ఈ విషయం తన కుమారుడు పార్థ పవార్కు, అతడి వ్యాపార భాగస్వామి దిగ్విజయ్ పాటిల్కు తెలియదు. భూ విక్రయం, రిజిస్ట్రేషన్ వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులోనే తేలుతుంది. ఆ భూమిని పార్థకు చెందిన సంస్థకు విక్రయించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు’అని అజిత్ పవార్ వివరించారు. భూ రిజిస్ట్షేషన్ కోసం రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లిన ముగ్గురిలో తన కుమారుడు లేడన్నారు.Modi has surrounded himself with masters of corruption and nepotism.Modi survives by Vote Chori and thrives by the loot it gives in power. https://t.co/nw6KTwpWXW pic.twitter.com/qsOTmjS0o5— Srivatsa (@srivatsayb) November 7, 2025కేవలం భూ ఒప్పందం మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన.. భూ బదిలీ, చెల్లింపులు చేయలేదని చెప్పారు. ఈ సేల్డీల్ను రద్దు చేయాలంటూ సంబంధిత అధికారులకు తిరిగి పత్రాలను పంపించారని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారంపై అదనపు ప్రధాన కార్యదర్శి వికాస్ ఖర్గే సారథ్యంలోని బృందం దర్యాప్తు చేపట్టనుందని డిప్యూటీ సీఎం తెలిపారు.ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ఈ బృందం అంచనా వేసి నెలరోజుల్లో నివేదిక అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ భూమి మార్కెట్ విలువ రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులకు కేటాయించిన ఆ భూమిని ప్రభుత్వం కొట్టేసిందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కనుసన్నల్లోనే జరిగిందని ఉద్యమ కారుడు అన్నా హజారే తప్పుబట్టారు. మరోవైపు.. పూణే భూ ఒప్పందంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. కానీ డబ్బు మార్పిడి ఇంకా పెండింగ్లో ఉంది. అయితే, రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. రెండు పార్టీలు ఇప్పుడు రిజిస్ట్రీని రద్దు చేయాలని దరఖాస్తు దాఖలు చేశాయి. అయితే, రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి వారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారికి నోటీసు జారీ చేయబడింది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులపై చర్చలు కచ్చితంగా ఉంటాయి. మొత్తం విచారణ ఒక నెలలోపు పూర్తవుతుంది. దీనిలో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.Nagpur | On the Pune land deal involving the son of Maharashtra Deputy CM Ajit Pawar, Maharashtra CM Devendra Fadnavis says, "There was an agreement between the parties, but the exchange of money was still pending. However, the registry had already been completed. Both parties… pic.twitter.com/JMggDoKP5Y— ANI (@ANI) November 7, 2025ఇది కూడా చదవండి: రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు -
రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు
పుణే: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపణము భగ్గుమన్నాయి. ఈ కుంభకోణంలో అజిత్ పవార్ కుమారుడి హస్త ఉందన్న ఆరోపణల నేపత్యంలమహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది.1800 క కోట్ల రూపాయల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించారన్న కేసులో ఒక రెవెన్యూ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కమిటీకి అదనపు చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) వికాస్ ఖర్గే సారథ్యం వహించనున్నా రు. కమిటీ తుది నివేదిక ఎనిమిది రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించిన తర్వాత, పార్థ్ పవార్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కుంభకోణంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన విషయమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పుణేకు చెందిన తహసీల్దార్ సూర్యకాంత్ యెవా లెను సస్పెండ్ చేశారు. బీజేపీ, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష మహాయుతి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుణేలోని ముంధ్వారాలో ఉన్న 40 ఎకరాల ప్రభు త్వ భూమిని రూ.300 కోట్ల కు పార్థసారథి భాగ స్వామిగా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే రూ. 21 కోట్ల స్టాంప్ డ్యూటీని కేవలం రూ. 500 కు తగ్గించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ డీల్ విలువ రూ. 300 కోట్లు అయినప్పటికీ, పన్నులతో సహా మొత్తం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 21 కోట్లు ఉండాలని అదికారులు తెలిపారు. -
పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది. -
ఐదేళ్లలో.. 5 లక్షల ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో.. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను స్థానిక పరిశ్రమలు సృష్టించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, సాధించవచ్చని ఆయన అన్నారు. 'నాగ్పూర్ స్కిల్ సెంటర్' ప్రారంభోత్సవంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్లలో నైపుణ్య శిక్షణ.. ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించడం అనే లక్ష్యం చాలా పెద్దది అయినప్పటికీ లక్ష్యాన్ని చేసుకోవచ్చు. నాగ్పూర్లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ విమానాశ్రయంతో సహా.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను అందించిన వివిధ ప్రాజెక్టుల ఉదాహరణలను ఆయన వివరించారు, ఇవి లక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారికి శిక్షణ అందించడానికి నాగ్పూర్ నైపుణ్య కేంద్రాన్ని కోర్సులు ప్రారంభించాలని ఆయన సూచించారు.టాటా స్ట్రైవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అమేయా వంజరి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమ-సంబంధిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ వందలాది మంది యువతకు ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది, గత 11 సంవత్సరాలలో 2.5 మిలియన్లకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లమేము తయారీ, విద్యుత్, సౌర, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలో రెండు నుంచి మూడు నెలల కోర్సులను రూపొందించాము. వీటి తర్వాత ఉద్యోగ శిక్షణ.. నియామక అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను నాగ్పూర్ యువతను కోరుతున్నానని అమేయా వంజరి అన్నారు. -
సంజయ్ రౌత్కు ఏమైంది?
ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో తన అభిమానులకు, మద్దతుదారులకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.అంతకుముందు, ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా..‘అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకం తనకు ఉందని చెప్పారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. కొత్త సంవత్సరంలో అందరినీ తప్పక కలుసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్కు సూచించినట్టు సమాచారం.మరోవైపు.. సంజయ్ రౌత్ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రి జీకి ధన్యవాదాలు!. నా కుటుంబం నుంచి మీకు కృతజ్ఞతలు! జై హింద్! జై మహారాష్ట్ర! అని బదులిచ్చారు.ఇదిలా ఉండగా.. సంజయ్ రౌత్ ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ఆయన అస్వస్థతకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. धन्यवाद! https://t.co/jQOqgw2foc— Sanjay Raut (@rautsanjay61) October 31, 2025 -
‘రోహిత్ ఆర్య’ ఎన్కౌంటర్లో ట్విస్ట్
ముంబై: ఆడిషన్స్ పేరుతో చిన్నారులను కిడ్నాప్ చేసి, పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ముంబై చిత్ర నిర్మాత ‘రోహిత్ ఆర్య’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రోహిత్ ఆర్య అప్సర మీడియా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లను దక్కించుకున్నాడు. వాటిల్లో విద్యాశాఖలో పూర్తి చేసిన ప్రాజెక్టు నిమిత్తం రోహిత్ ఆర్యకు మహా ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఆ మొత్తం ఇవ్వలేదని కారణంతో రోహిత్ ఆర్య పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్2022-2023లో ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్ అనే పట్టణ పారిశుధ్య డ్రైవ్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని నాటి మహరాష్ట్ర ప్రభుత్వం రోహిత్ ఆర్యకు అప్పగించింది. అప్సర మీడియా పేరుతో ఆ ప్రాజెక్ట్ పనుల్ని చేసింది. ప్రభుత్వ ప్రాజెక్ట్లో శుభ్రతా చర్యలు సూచించటం, రిపోర్ట్ చేయటం, విద్యార్థులు,సిబ్బందికి అవగాహన కల్పించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2023 జూన్ 30న నాటి ప్రభుత్వం రూ. 9.9 లక్షలు చెల్లించింది.ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహరాష్ట్రలో ప్రభుత్వం మారడం, నూతన ప్రభుత్వానికి రోహిత్ ఆర్య చేస్తున్న ప్రాజెక్ట్పై అసంతృప్తిని వ్యక్తి చేసింది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసింది. ప్రభుత్వం నిర్ణయంతో రోహిత్ ఆర్యకు భారీ మొత్తంలో నష్టం వచ్చింది.సంవత్సరం తర్వాత మరోసారిఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఏడాది తర్వాత ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ఈసారి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరాడు. దీనికోసం రూ. 2.42 కోట్లు డబ్బు ఇవ్వాలని మరొక డిమాండ్ను సమర్పించాడు. అదే సమయంలో ‘ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్’ డైరెక్టర్ హోదాలో ఆర్య పాఠశాలల నుంచి రిజిస్టేషన్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీజును వసూలు చేయడానికి ఆర్యకు అధికారం లేదని ప్రభుత్వం తెలిపింది.పైగా,పాఠశాలల నుంచి వసూలు చేసిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించనని హామీ ఇచ్చి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. కానీ ఆర్య డబ్బును జమచేయకపోగా.. అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తెలిపింది.ఈ క్రమంలో ఆడిషన్స్ పేరుతో గురువారం పిల్లల్ని కిడ్నాప్ చేసి మహరాషష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పిల్లల్ని విడిపించేలా పోలీసులు ఆర్యతో చర్చలు జరిపారు. ఆ సమయంలో పిల్లల ప్రాణాలు తీసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం రోహిత్ ఆర్యను ఆస్పతత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య కన్నుమూశారు. -
కోటి రూపాయల డిజిటల్ అరెస్ట్ స్కాం : ఆగిన రిటైర్డ్ ఆఫీసర్ గుండె
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎంత అవగాహన కల్పించిన దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక మోసం నమోదవుతనూ ఉంది. తాజాగా ముంబై పోలీసులమని చెప్పి ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేశారు. జీవితంతం కష్టపడి సంపాదింఇ, పొదుపు చేసుకున్న సొమ్ము "డిజిటల్ అరెస్ట్" స్కాంలో పోవడంతో ఆయన గుండే ఆగిపోయింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ స్కామ్ స్టోరీ ఎలా మొదలైంది అంటే..పూణేకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ఆయన 80 ఏళ్ల భార్యని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఆగస్టు 16న ముంబై పోలీసులం, "ఎన్కౌంటర్ స్పెషలిస్ట్" అంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్ని అతలా కుతలం చేసింది. ఆగస్టు 16-సెప్టెంబర్ 17 మధ్య సాగిన ఆ స్కాంలో విదేశాల్లో స్థిరపడిన ముగ్గురు కుమార్తెలు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ భార్యభర్తల్లిద్దరినీ మోసగాళ్లు బెదిరించారు. ఒక ప్రైవేట్ ఎయిర్లైన్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన బ్యాంక్ ఖాతా , ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉన్నాయంటూ మూడు రోజుల పాటు వారిని కదలకుండా, మెదలకుండా డిజిటల్ అరెస్ట్" చేసిన భయభ్రాంతులకు గురి చేశారు.ఫోన్ కెమెరాను స్విచ్ ఆన్లో ఉంచమని ఆదేశించారు. ఆ తరువాత సీబీఐ ఢిల్లీ ఆఫీసునుంచి IPS అధికారిణిగా చెప్పుకుంటూ మరొకాల్ వచ్చింది. మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు కాబట్టి మిమ్మల్ని 'హోమ్ అరెస్ట్' లేదా 'జైలు అరెస్ట్'లో ఉంచుతామని చెప్పారు. అలా వారికి సంబంధించిన అన్ని బ్యాంక్ , ఆధార్ వివరాలను సేకరించి, ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు. అలా ఈ దంపతుల పొదుపు మొత్తాన్ని, వారి కుమార్తెలు విదేశాల నుండి పంపిన డబ్బులు కలిపి మొత్తం రూ.1.19 కోట్లు కొట్టేశారు. ఇక అప్పటినుంచి కాల్స్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించి, వారి కుమార్తెలలో ఒకరిని సంప్రదించారు, వారు నేరాన్ని పోలీసులకు నివేదించమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పూణే సైబర్ పోలీసులకు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ అందించిన వివరాల ప్రకారం "డిజిటల్ అరెస్ట్" స్కామ్లో తాము మోసపోయామని గ్రహించిన సదరు అధికారి అక్టోబర్ 22న ఆ షాక్లో, ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పోగొట్టుకోడం, స్కామర్ల వేధింపుల కారణంగా తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని , అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయింది.సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరికలుఫోన్ కాల్ ద్వారా ఎవరినీ "అరెస్టు" అనేది జరగదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అంటున్నారు సైబర్ క్రైమ్ పరిశోధకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎపుడూ ఎవరికీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని, ఈ వివరాలు లేదా డబ్బును డిమాండ్ చేసే హక్కు ఏ అధికారికీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్పట్ల భయపడకుండా, అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. మోసగాళ్ళు చిన్న నగరాల నుండి సిమ్ కార్డులు, VPN నెట్వర్క్లను ఉపయోగించి తమ గుర్తింపును దాచిపెడుతున్నారన్నారు.చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. అయినా పృథ్వీ షాకు తప్పని భంగపాటు!
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో మహారాష్ట్రతో తన ప్రయాణం మొదలుపెట్టాడు టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). తొలుత కేరళతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (75)తో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్తో మ్యాచ్లో మాత్రం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీచండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే పృథ్వీ పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి మహారాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రంజీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (Fastest Double Century) నమోదు చేశాడు.222 Runs of pure statement. 💥Prithvi Shaw lights up the Ranji stage with a jaw-dropping 222 — his maiden double ton for Maharashtra, laced with 28 fours and 5 sixes against Chandigarh. A knock that screams class, confidence, and comeback. #mca #mcacricket #teammaharashtra… pic.twitter.com/g3vcoropH8— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025పృథ్వీ షాకు భంగపాటు!మొత్తంగా 156 బంతుల్లో 222 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఇన్నింగ్స్లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, అర్జున్ ఆజాద్ బౌలింగ్లో నిషాంక్ బిర్లాకు క్యాచ్ ఇవ్వడంతో పృథ్వీ షా ఇన్నింగ్స్కు తెరపడింది. ఏదేమైనా డబుల్ సెంచరీతో సత్తా చాటిన పృథ్వీ షాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.పృథ్వీ షాకు రుతురాజ్ సర్ప్రైజ్అయితే, పృథ్వీని కాదని.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (163 బంతుల్లో 116) సాధించిన రుతురాజ్ గైక్వాడ్కు ఈ బహుమానం దక్కింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రుతు.. పృథ్వీకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పృథ్వీని దగ్గరికి పిలిచి అతడితో కలిసి అవార్డును పంచుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమిష్టి కృషి, పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా చండీగఢ్పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.Shared Glory, True Spirit 🫡Ruturaj Gaikwad shared his Player of the Match award with Prithvi Shaw, recognising Shaw’s sensational 222-run knock that set up Maharashtra’s victory. A gesture that speaks volumes — teamwork, respect, and mutual excellence at its best.#mca… pic.twitter.com/yMWHsW7Miq— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025చండీగఢ్ వర్సెస్ మహారాష్ట్ర సంక్షిప్త స్కోర్లు👉మహారాష్ట్ర: 313 & 359/3 డిక్లేర్డ్👉చండీగఢ్ : 209 &319👉ఫలితం: చండీగఢ్పై 144 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు.. మహారాష్ట్రకు ఆరు పాయింట్లు.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
Cyclone Montha.. మోంథా తుపాను ప్రభావంతో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాటించాలని సూచనలు చేసింది.హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు ఇవే..ఏపీలో.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు.మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలు. Weather warning ⚠️ #TelanganaNow I'm warning once again for North East Central TG see heavy during next 24 hours stay safe 🚨 Flash floods possible 🌧️🌀⚠️ https://t.co/5PvVp8klDy— Warangal Weatherman (@tharun25_t) October 29, 2025 -
‘స్థానికం’లో ప్రతిపక్షాలను తుడిచిపెట్టండి
ముంబై: త్వరలో మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని బీజేపీ శ్రేణులకు హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అందరం కష్టించి పనిచేసి, ప్రతిపక్ష పారీ్టల ప్రాతినిథ్యం బూతద్దంతో వెదికినా కనిపించని స్థాయికి తగ్గించాలన్నారు. దక్షిణ ముంబైలోని చర్చ్గేట్ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీకి సొంతంగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఊతకర్రలపై ఆధారపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ‘దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని మనం నిరూపించి చూపాం. పనితీరు, ప్రతిభ ఆధారంగా చేసే రాజకీయాల వల్లే దేశం ప్రగతిబాటన పయనిస్తుంది. ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోదీయే చక్కని ఉదాహరణ’అని అమిత్ షా తెలిపారు. నిరుపేద టీ దుకాణం యజమాని ఇంట్లో పుట్టిన మోదీ..అంకితభావం, త్యాగశీలత, కష్టించే తత్వంతోనే భారత ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. మోదీ సారథ్యంలో బీజేపీ సైద్ధాంతిక పరమైన హామీలు..ఆరి్టకల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని అమల్లోకి తెచి్చందన్నారు. ఇందులో భాగమైన ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడిక 2047నాటికి వికసిత్ భారత్ అనే కల సాకారానికి నడుం బిగించిందని అమిత్ షా వివరించారు. అనంతరం సీఎం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చేసిన ఊతకర్రలనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. స్నేహితులను ఊతకర్రలుగా భావించడం లేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు అర్థం తెలియని వారికే ఇలాంటి సందేహాలు వస్తాయన్నారు. -
ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14వ సెంచరీ.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని డబుల్ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్గా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..! -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్మార్టం రిపోర్ట్పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. -
గోదావరి-కావేరి అనుసంధానంపై ముందడుగు!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించేలా అనుసంధానం చేపడతామని చెబుతున్నారని, హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని, అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది.జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి 75వ సమావేశం ఈ నెల 1న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించారు. ఆ వివరాలను పాలకమండలి విడుదల చేసింది.రాష్ట్రాల సమ్మతి ప్రకారమే.. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్ల మీదుగా కావేరికి గోదావరి జలాలను తరలించేలా 2022లో ఎన్డబ్ల్యూడీఏ డీపీఆర్ను రూపొందించింది. అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని పేర్కొంది. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు కలిపి మొత్తం 166.5 టీఎంసీల్లో... తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు సాగునీరు, తాగునీటిని అందించవచ్చని పేర్కొంది.ఈ డీపీఆర్పై బేసిన్లోని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తాజా సమావేశంలో ఇంద్రావతి సబ్ బేసిన్లో ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను తాము వాడుకుంటామని.. అదనంగా ఉన్న నీటిని కావేరికి మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని ఛత్తీస్గఢ్ పేర్కొంది. ఈ అనుసంధానానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అనుసంధానం ద్వారా మళ్లించే జలాల్లో 50 శాతం తమకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదని.. తాత్కాలికంగా ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని నీటినే కావేరికి తరలిస్తామని కేంద్రం చెబుతోంది.హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక.. ఆ నీటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో హిమాలయ నదుల నీటిని గోదావరికి ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ కోరింది. లేదంటే తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ చేశాయి. తక్షణమే అనుసంధానం చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరగా.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. బేసిన్లోని రాష్ట్రాల సమ్మతి, ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారమే ఈ అనుసంధానం చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ ‘బీజేపీతో సంబంధం కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని రాహుల్ పేర్కొన్నారు.గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్ను వేధించిన భారత నర్సుకు జైలు -
‘ ఏ ఒక్కరూ నా కూతుర్ని కాపాడలేకపోయారు’
సతారా: మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకున్న యువ వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు ఎలా చనిపోయిందో అదే తరహాలో నిందితులిద్దరికీ శిక్ష పడాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్కు తన కన్నీటి వ్యథను మీడియా ద్వారా తీసుకెళ్లారు. ‘ నా కూతురు ఎలా అయితే చనిపోయిందో అదే రకంగా వారికి ఉరిశిక్ష పడేలా చేయండి సీఎం సార్, అంతకు మించి నాకు ఇక వేరే న్యాయం ఏమీ అక్కర్లేదు. ఇదే నా డిమాండ్’ అంటూ గద్దగద స్వరంతో విన్నవించాడు‘ నా కూతుర్ని కాపాడటానికి ఎవరూ రాలేదు. అన్యాయం జరుగుతుంటే, అందరూ నిలబడి చూస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నారు, కానీ ఒక్క కృష్ణుడు కూడా నా కూతురికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూతుళ్ల కోసం, కనీసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ‘ఆమె’ గౌరవాన్ని కాపాడాలి’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, మహారాష్ట్రలో ఓ సన్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్హన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉం టున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచా రం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి.. వైద్యురాలి బలవన్మరణం -
అవినీతిలో మహారాష్ట్ర టాప్.. తర్వాత స్టేట్..?
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడయ్యాయి. టీఎంసీ డీసీ అవినీతి కేసు సంచలనం థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తరువాత స్ధానాల్లో రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్ సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.వారు పథకం ప్రకారం కాపు కాస్తారు. ఆ తరువాత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఏసీబీ అధికారులు ఎన్సీఆర్బీకి నివేదిస్తారు. రాష్ట్రాల వారీగా అవినీతి కేసుల సంఖ్యను విడివిడిగా తెలియజేస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతి, లంచం కేసులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర (Maharashtra) అగ్రస్ధానంలో ఉంది.ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్ అవినీతిలో టాప్లో ఉన్నాయి. అక్కడ ఒక్క అవినీతి కేసు లేదు!ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక (NCRB Report) వెల్లడించింది.చదవండి: ఇదేం విచిత్రం.. చెట్లకు సెల్ఫోన్లు ఎందుకు? -
Maharashtra: ‘పలుమార్లు ఎస్ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్ నోట్లో ‘దారుణాలు’
ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు అధికారి సస్పెండ్బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్లైన్ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు. -
పోలీసులు లైంగిక వేధింపులు.. అరచేతిపై బాధితురాలి లేఖ
-
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్యాక్టివ్గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
అరచేతిపై సూసైడ్ నోట్ రాసి... వైద్యురాలు బలవన్మరణం
సతారా: మహారాష్ట్రలో ఓ సబ్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయ దుమారం డాక్టర్ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్ దోషీకి ఫోన్చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్ దోషీ తెలిపారు. డాక్టర్ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్ను కోరినట్లు తెలిపారు. సతారా సివిల్ సర్జన్తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధించారు మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు. నిందితుడికి చివరి ఫోన్కాల్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్కు ఫోన్చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్లో చాటింగ్ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.మలుపు తిప్పిన ఆలోచనఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు. మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.పెద్ద సమూహం, ఎంతో మేలుగ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.‘ఈ బంధుగణం కావాలి’‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది. పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’ఊరిలోని వాళ్ల ఫండ్స్తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు. -
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)నేత బాల నంద్గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత జయంత్ పాటిల్లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు. -
చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష
జల్నా/థానే: తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి, అందులో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మహారాష్ట్రలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించరు. వారిని విముక్త, సంచార జాతుల (వీజేఎన్టీ) జాబితాలో చేర్చారు. అయితే, హైదరాబాద్ గెజిట్ ప్రకారం తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ సాధనకోసం మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి సమీపంలో ఉన్న అంబద్ చౌఫుల్లీ ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి ఇలా మంచాన్ని చెట్టుకు వేలాడదీసి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పూర్వపు హైదరాబాద్ స్టేట్లో తమ జాతిని ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారని, మండల్ కమిషన్ సమయంలో మహారాష్ట్రలోని బంజారాలను వీజేఎనీ్టలుగా వర్గీకరించటంతో ఆ హోదా కోల్పోయామని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తిరిగి ఎస్టీ హోదా సాధనకోసమే తీను నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే దీక్షకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. ఎస్టీ హోదా కోసం మహారాష్ట్రలో బంజారాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంతో ఇతర వర్గాలు కూడా తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేశాయి. ఎస్టీ హోదా కోసం నవంబర్ 9న ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్ ప్రకటించారు. -
Maharashtra: లోయలో పడిన పికప్ వ్యాన్.. ఎనిమిదిమంది దుర్మరణం
నందూర్బార్: మహారాష్ట్రలోని నందూర్బార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. Maharashtra: 8 dead after vehicle falls into a valley at Chandshaili GhatRead @ANI Story | https://t.co/QJOc5iOuif#Maharashtra #death #vehicle #valley #ChandshailiGhat pic.twitter.com/aWT4EHMtjB— ANI Digital (@ani_digital) October 18, 2025ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్నే.. నువ్వు చైర్మన్వి కదా!
జలజ్ సక్సేనా (Jalaj Saxena).. దేశవాళీ క్రికెట్లో అతడొక దిగ్గజం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో ఇప్పటి వరకు ఏడు వేలకు పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖాతాలో 484 పైగా వికెట్లు కూడా ఉన్నాయి.టీమిండియాకు ఆడే అవకాశమే రాలేదుటీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev), మదన్ లాల్, రవీంద్ర జడేజా తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. వికెట్లు తీసిన ఘనత జలజ్ సక్సేనాదే. అయితే, 38 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ప్లేయర్కు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదు.కేరళ టు మహారాష్ట్రఇదిలా ఉంటే.. దేశీ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కేరళకు ప్రాతినిథ్యం వహించిన జలజ్ సక్సేనా.. తాజా రంజీ సీజన్లో మహారాష్ట్రకు మారాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా మహారాష్ట్ర బుధవారం కేరళతో మ్యాచ్ మొదలుపెట్టింది.తిరునంతపురం వేదికగా టాస్ ఓడిన మహారాష్ట్ర.. కేరళ జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యారు.హాఫ్ సెంచరీ మిస్.. అయినా భేష్కెప్టెన్ అంకిత్ బవానే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (91) నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోగా.. ఏడో స్థానంలో వచ్చిన జలజ్ సక్సేనా కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యమేఈ క్రమంలో కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ సెలక్టర్లు సలీల్ అంకోలా, చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జలజ్ సక్సేనాను ఉద్దేశించి..‘‘సక్సేనా టీమిండియాకు ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని సలీల్ అన్నాడు.నువ్వు చైర్మన్వి కూడానూఇందుకు బదులిస్తూ.. ‘‘సలీల్.. నువ్వు.. ఆశ్చర్యకరం అనే మాటను ఉపయోగించావు. అయితే, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం మాజీ సెలక్టర్లమే’’ అని చేతన్ శర్మ నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వు చైర్మన్వి కూడానూ’’ అంటూ చేతన్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సలీల్.దీంతో.. ‘‘నిజమే.. వేళ్లన్నీ మన వైపే చూపించేవి’’ అని చేతన్ శర్మ కవర్ చేశాడు. ఏదేమైనా ప్రతిభ ఉన్న జలజ్ సక్సేనాకు అంతర్జాతీయ క్రికెట్లో కనీసం అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నవ్వుతూనే అయినా తప్పును ఒప్పుకొన్నారంటూ మాజీ సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.239 పరుగులకు ఆలౌట్ఇదిలా ఉంటే.. కేరళతో మ్యాచ్లో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులకు ఆలౌట్ అయింది. రుతు, జలజ్తో పాటు విక్కీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) రాణించడంతో ఈ మేర నామమాత్రపు స్కోరు సాధ్యమైంది. కేరళ బౌలర్లలో నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నెడుమంకులి బాసిల్ మూడు, ఈడెన్ ఆపిల్, అంకిత్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...When they showed Jalaj Saxena's domestic stats one commentator said he has such great stats but it's surprising that he hasn't played for India and the other commentator replied"Surprisingly" both of us were the selectors and you were the chairman. pic.twitter.com/QvtzZEbWkG https://t.co/q8kHY6rkkv— Aditya Soni (@imAdsoni) October 15, 2025 -
ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం
ముంబై: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్(Devendra Fadnavis) సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు.బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు(maoists) ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్వాంటెడ్గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd— ANI (@ANI) October 15, 2025అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.#WATCH | Gadchiroli, Maharashtra: Naxalites surrender in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 surrendered today, including Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati surrendered today. pic.twitter.com/DoZucnsWGH— ANI (@ANI) October 15, 2025 -
Maharashtra Gurukul: ‘అభ్యంతరకరంగా తాకాడు’: బాధిత విద్యార్థిని
రత్నగిరి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తప్పుదారి పట్టిన ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో గల వార్కారి గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహారాజ్ ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.గురుకుల క్యాంపస్లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ అనే ఉపాధ్యాయుని పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన బాలురు, బాలికలు ఆధ్యాత్మిక విద్యను చదువుకునేందుకు ఈ గురుకులంలో చేరారు. బాధితురాలు జూన్ 12న ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకుంది. అనంతరం మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయని, ఆ తరువాత తాను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చి, తనను కొట్టేవాడని, తాకరాని చోట తాకేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించాడని కూడా బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో ప్రీతేష్ ప్రభాకర్ తనను మాట్లాడవద్దని హెచ్చరించాడని, కోకరే తన పలుకుబడితో తన తండ్రిని, సోదరుడిని చంపేస్తాడని బెదిరించాడని బాధితురాలు వివరించింది. కాగా బాధితురాలు సోమవారం తన తండ్రికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.దీంతో అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టంలోని సెక్షన్ 12, 17 కింద గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్లపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్ లైంగిక వేధింపులకు పలువురు బాలికలు గురై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతల బండారం త్వరలోనే బయటపడనున్నదని భాస్కర్ జాదవ్ అన్నారు. -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ -
చెట్లకు సెల్ఫోన్లు కడుతున్నారు.. ఎందుకంటే?
ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింతగా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్.. ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కడతారు. ఇలా ఎందుకు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే నమ్ముతారా? అవును ఇది అక్షరాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి.అరగంట నడిచి కొండపైకి ఎక్కుతారు. తర్వాత సెల్ఫోన్లను చెట్లకు కట్టేసి దానికి వచ్చే ఓటీపీ కోసం ఎండలో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మహిళలకు ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. సెల్ఫోన్లో వచ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మరాఠా మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లబ్ధిదారులు రెండు నెలల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో మహిళలు కేవైసీ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్ (Cell Phone Signal) లేక కష్టాలు పడాల్సివస్తోంది. రోజంతా కష్టపడినా వంద మందిలో నలుగురైదురికి మాత్రమే కేవైసీ పూర్తవుతోంది.మహిళల అవస్థలుఖార్డే ఖుర్ద్ గ్రామ మహిళలకు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహాయం చేస్తోంది. దగ్గరలోని కొండగుట్టపై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండపైకి చేరుకోవడానికి మహిళలు అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన మహిళలకు మాత్రమే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇబ్బందులు ఉన్నాయి.. కానీఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కేవైసీ నమోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.బలహీనంగా కనెక్టివిటీప్రభుత్వం విధించిన గడువు నవంబర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.చదవండి: ఖరీదైన స్టంట్.. ట్విస్ట్ అదిరింది! సమస్యను పరిష్కారిస్తాంలడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు సెప్టెంబర్లో ఆర్థిక సహాయం చేశామని, లబ్ధిదారులు మరో రెండు నెలల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాలని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవల ప్రకటించారు. ఇంటెర్నెట్, ఆధార్ సమస్యలతో కేవైసీ ఆలస్యమవుతోందని మహిళలు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం
నవీ ముంబై: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చిందని మండిపడ్డారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈ పార్టీ నిర్వాకాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైలు నెట్వర్క్లో ఆక్వా లైన్తోపాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా, గొప్ప మెట్రోనగరంగా ప్రఖ్యాతి గాంచిన ముంబైని ఉగ్రవాదులు ఎప్పటినుంచో టార్గెట్ చేశారని చెప్పారు. 2008లో భీకర దాడులు జరిగాయని అన్నారు. అప్పట్లో పాక్ ఉగ్రవాదుల భరతంపట్టాలని ప్రజలంతా కోరుకున్నారని, మన సైనిక దళాలు సైతం అందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. కానీ, మరో దేశం అడ్డుకోవడంతో సైనిక చర్య ఆగినట్లు కేంద్ర హోంమంత్రే చెప్పారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయొద్దంటూ అప్పట్లో అమెరికా కోరుకుందని చిదంబరం పేర్కొన్నారు. పౌరుల భద్రతే ముఖ్యం ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను బలోపేతం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భద్రతపై రాజీపడిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో బదులిస్తున్నామని, ముష్కరుల భూభాగంలోకి చొరబడి మరీ బుద్ధి చెప్తున్నామని వివరించారు. దేశంతోపాటు పౌరుల భద్రత కంటే తమకు ఇంకేదీ ముఖ్యం కాదన్నారు. వికసిత్ భారత్కు ప్రతీక పద్మం ఆకారంలో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వికసిత్ భారత్కు ఒక ప్రతీక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రూ.19,650 కోట్లతో 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్పోర్ట్ మొదటి దశను నిర్మించారు. దేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా ఇది రికార్డుకెక్కింది. డిసెంబర్లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయ ప్రారం¿ోత్సవంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబై మెట్రో లైన్–3 తుది దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశమంతటా అభివృద్ధి జాడలు వికసిత్ భారత్కు గతి(వేగం), ప్రగతి(అభివృద్ధి) అత్యంత కీలకమని ప్రధాఉద్ఘాటించారు. గత 11 ఏళ్లుగా మన దేశం వికసిత్ని భారత్ దిశగా ప్రయాణం సాగిస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టామని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. జాతీయ రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించామని, నగరాలను అనుసంధానించామని వివరించారు. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 2014లో 74 ఎయిర్పోర్టులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ‘ఉడాన్’ పథకంతో గత పదేళ్లలో లక్షలాది మంది తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని, కలలు నెరవేర్చుకున్నారని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ మనదేనని స్పష్టం చేశారు. మరికొన్నేళ్లలో మనదేశం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్(ఎంఆర్ఓ) హబ్గా మారబోతోందని తేల్చిచెప్పారు. ముంబైలో చారిత్రక భవనాలు దెబ్బతినకుండా 33.5 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో మార్గం నిర్మించిన ఇంజనీర్లు, కార్మికులను ప్రధాని అభినందించారు. -
ముషీర్ ఖాన్తో గొడవ.. వెంటనే గర్ల్ ఫ్రెండ్తో చిల్ అయిన పృథ్వీ షా
వివాదాలు, క్రమశిక్షణ లేమి కారణంగా బ్రహాండమైన కెరీర్ను నాశనం చేసుకున్న మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (అక్టోబర్ 7) ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ (181) చేసిన అనంతరం షా తన మాజీ సహచరుడు ముషీర్ ఖాన్తో (Musheer Khan) గొడవ పడ్డాడు.వాస్తవానికి ముషీర్ ఖానే మొదట షాను గెలికాడు. షాను ఔట్ చేసిన ఆనందంలో ముషీర్ వ్యంగ్యంగా థ్యాంక్యూ అని అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన షా.. ఒక్కసారిగా ముషీర్పైకి దూసుకొచ్చి, కాలర్ పట్టుకొని బ్యాట్ ఎత్తాడు. అంపైర్లు, సహచరులు వారించడంతో షా తగ్గి పెవిలియన్ వైపు వెళ్లబోయాడు.పోయే క్రమంలో మరో ముంబై ఆటగాడు షమ్స్ ములానీ కూడా షాను ఏదో అన్నాడు. దీనికి కూడా షా ఘాటుగానే స్పందించాడు. ఈ గొడవల కారణంగా షా చేసిన సూపర్ సెంచరీ మరుగున పడింది. మిస్ బిహేవియర్ కారణంగా అందరూ షానే తప్పుబడుతున్నారు. ఈ వివాదాల కారణంగానే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇంకా దేశవాలీ క్రికెట్లోనే మిగిలిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇంత వివాదం జరిగిన తర్వాత షా తన సోషల్మీడియా పోస్ట్ కారణంగా మరోసారి వార్తల్లోకెక్కడం విశేషం. మ్యాచ్ ముగిసిన అనంతరం షా తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్తో (Akriti Agarwal) కలిసి రిలాక్స్ అవుతున్న ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు.గత కొంతకాలంగా షా-అకృతి మధ్య ప్రేయాణం నడుస్తుందన్న టాక్ నడుస్తుంది. వీరిద్దరూ ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకల్లో కలిసి కనిపించారు. షా కొంతకాలం క్రితం మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకృతితో డేటింగ్లో ఉన్నట్లు సోషల్మీడియా టాక్.ఎవరీ అకృతి..?అకృతి అగర్వాల్ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముంబైలోని నిర్మలా కాలేజీ నుంచి BMS పూర్తి చేసిన అకృతి.. కోవిడ్ సమయంలో డాన్స్, లైఫ్స్టైల్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.షా సెకెండ్ ఇన్నింగ్స్18 ఏళ్ల వయసులో వెస్టిండీస్పై టెస్ట్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న షా.. ఆతర్వాత ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి, వివాదాల కారణంగా కెరీర్ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.ఇటీవలే క్రికెటర్గా జన్మనిచ్చిన ముంబై టీమ్ కూడా షాను వదిలేసింది. దీంతో అతను మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ జట్టు తరఫున కూడా వరుస సెంచరీలతో అదరగొడుతున్న షా.. టీమిండియాలో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. షా తన ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ను పక్కన పెడితే క్రికెటర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. షా కంటే జూనియర్ అయిన శుభ్మన్ గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ అయిపోయాడు. కానీ, షా మాత్రం టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు. చదవండి: సంచలన వార్త.. దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..? -
Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా
మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) అద్బుత శతకంతో మెరిశాడు. 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ముంబైతో వార్మప్ మ్యాచ్ (రెడ్బాల్) సందర్భంగా పృథ్వీ ఈ మేరకు రాణించాడు.కాగా ముంబై తరఫున దేశీ క్రికెట్లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో సారథిగా భారత్కు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఫిట్నెస్లేమి, క్రమశిక్షణారాహిత్యం, ఫామ్లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.ముంబైని వీడి మహారాష్ట్రకుఇక గతేడాది ముంబై రంజీ జట్టు (Ranji Team)లోనూ పృథ్వీకి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో 2025-26 సీజన్లో మహారాష్ట్రకు ఆడేందుకు.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ముంబై (Mumbai Cricket Team) జట్టును వీడాడు. ఇక త్వరలోనే రంజీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో మహారాష్ట్ర- ముంబై జట్లు అక్టోబరు 7-9 మధ్య ఎంసీఏ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాయి.భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షాఈ క్రమంలో మంగళవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా పృథ్వీ షా సెంచరీ సాధించాడు. ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో సింగిల్ తీసి వంద పరుగులు పూర్తి చేసుకున్న పృథ్వీ.. మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. అర్షిన్ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. షామ్స్ ములానీ బౌలింగ్లో పృథ్వీ షా నిష్క్రమించాడు.కాగా 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 58 మ్యాచ్లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379. ఇదిలా ఉంటే.. అక్టోబరు 15న కేరళతో మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్ర జట్టు తాజా రంజీ ఎడిషన్లో తమ ప్రయాణం ఆరంభించనుంది. తదుపరి సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్ జట్లతో మహారాష్ట్ర టీమ్ తలపడనుంది.మహారాష్ట్ర రంజీ జట్టుపృథ్వీ షా, అర్షిన్ కులకర్ణి, సిద్ధేష్ వీర్, రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బవానే (కెప్టెన్), సౌరభ్ నవలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ ధాడే, హితేష్ వాలుంజ్, మందార్ భండారి (వికెట్ కీపర్), హర్షల్ కేట్, సిద్ధార్థ్ మాత్రే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, రజ్నీశ్ గుర్బానీ.ముంబై రంజీ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, సువేద్ పార్కర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాష్ ఆనంద్, హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, హిమాన్షు సింగ్, తుషార్ దేశ్పాండే, ఇర్ఫాన్ ఉమైర్, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
200 మంది ప్రయాణికులు, 75 వాహనాలతో సముద్రంలోనే నిలిచిపోయిన ఫెర్రీ
పాల్ఘార్: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సఫాలె–విరార్ల మధ్య రాకపోకలు సాగించే రో–రో ఫెర్రీ ఆదివారం సాయంత్రం సముద్రం మధ్యలోనే మొరాయించింది. ఆ సమయంలో ఫెర్రీలో 200 మంది ప్రయాణికుల, 75 వరకు వాహనాలున్నాయి. సామర్థ్యానికి మించి లోడు వేయడంతో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ ర్యాంప్ నిలిచిపోవడంతో ఎంహరంబల్పడ వద్ద సముద్రంలో కదలకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తక్కువ ఎత్తులో అలలు కూడా మరో కారణమని వివరించారు. దీంతో, కొన్ని గంటలపాటు ప్రయాణికులు ఫెర్రీపైనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు, మెరైన్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను సరిచేశారు. -
స్ఫూర్తిదాయక సురేఖ!
ముంబై: ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా, 36 ఏళ్లకు పైగా తన వృత్తి జీవితంలో దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన సురేఖ యాదవ్ (Surekha Yadav) మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారని సెంట్రల్ రైల్వే కొనియాడింది. ఈ ’మార్గదర్శి అద్భుత ప్రయాణం’రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. పురుషాధిక్య ప్రపంచంలో మెరిసి.. యాదవ్ 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పురుషాధిక్యం ఉన్న రైల్వే రంగంలో అడ్డంకులను ఛేదించారు. ఆమె 1990లో అసిస్టెంట్ డ్రైవర్గా మారారు, తద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్గా (woman loco pilot) గుర్తింపు పొందారు. క్లిష్టమైన మార్గాల్లో రైళ్లు నడిపి ముంబై సబర్బన్ లోకల్ రైళ్లతో పాటు, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కొండ మార్గాల గుండా సురేఖ యాదవ్ గూడ్స్ రైళ్లను నడిపారు. వందేభారత్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు.. దేశంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ఆమె నడపడం విశేషం. రైతు కుటుంబంలో పుట్టి.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో సెపె్టంబర్ 2, 1965న జన్మించిన యాదవ్, రైల్వే ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆమె క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 1996లో మొదటి గూడ్స్ రైలును నడిపారు, ఆపై 2000 సంవత్సరంలో మోటార్ ఉమన్గా పదోన్నతి పొందారు. 2010లో, ఆమె ఘాట్ డ్రైవర్గా అర్హత సాధించారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో సుదూర మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు సారథ్యం వహించారు. వందేభారత్కు సారథ్యం ఆమె వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2023 మార్చి 13వ తేదీ నిలిచిపోతుంది. సోలాపూర్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తొలిసారిగా నడిపిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఆమె సారథ్యం వహించారు. ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు, చివరి బాధ్యతగా, ఇగత్పురి సీఎస్ఎంటీ మధ్య హజ్రత్ నిజాముద్దీన్–సీఎస్ఎంటీ మార్గంలో ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్ప్రెస్ను నడిపే అవకాశం ఆమెకు లభించింది. యాదవ్ తన చివరి రోజు ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం, ఆమె సహోద్యోగులు కొద్ది రోజుల క్రితం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గదర్శికి వీడ్కోలు ఒక మార్గదర్శికి వీడ్కోలు. ఆసియా తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. 36 ఏళ్ల అద్భుతమైన సేవల తర్వాత నేడు సెలవు తీసుకుంటున్నారు. ఆమె అద్భుత ప్రయాణం.. రాబోయే తరాల రైల్వే మహిళలు, పురుషులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. – ‘ఎక్స్’లో సెంట్రల్ రైల్వే పోస్టు -
ఈమె తల్లేనా?: చికెన్ అడిగిన పిల్లలపై రొట్టెల కర్రతో దాడి.. కుమారుడు మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్లో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించి, కొడుకు ప్రాణాలు పోయేందుకు కారకురాలయ్యింది. తమకు చికెన్ డిష్ తినాలని అనిపిస్తున్నదని ఇద్దరు అన్నాచెల్లెళ్లు తల్లిని చెప్పారు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ, రొట్టెల కర్రతో వారిని చితకబాదింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు మృతిచెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.పాల్ఘర్లో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతిచెందిన బాలుడిని చిన్మయ్ ధుమ్డేగా పోలీసులు గుర్తించారు. తొలుత చిన్మయ్ తన తల్లి పల్లవి ధుమ్డే (40)ను చికెన్ డిష్ అడిగాడు. దీంతో ఆమె ఇప్పుడు కుదరదని చెబుతూ, రొట్టెల కర్రతో కుమారునిపై దాడి చేసింది. తర్వాత తన తన పదేళ్ల కుమార్తెను కూడా అదే రొట్టెల కర్రతో కొట్టింది. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి తన కుటుంబంతో కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో ఉంటోంది. ఆమె కొట్టిన దెబ్బలకు కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) మృతిచెందాడు. 10 ఏళ్ల కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాల్ఘర్ పోలీసులు ఆ తల్లిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్ చేసిన చిన్నారి త్రిష...
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో, స్వచ్ఛమైన, కల్తీ లేని భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది,ఆరేళ్ల మరాఠీ బాల కళాకారిణి త్రిషా తోసర్ జాతీయ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం ‘‘నాల్ 2’’లో చిమి (రేవతి)గా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు థోసర్ను జాతీయ పురస్కారం వరించింది. మళయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎందరో అతిరధ మహారధులు సాక్షిగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకుంటూంటే హర్షధ్వానాలు మారుమోగాయి. ఈ చిన్నారి విజువల్స్ కూడా వేగంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి, ఆమెను టాక్ ఆఫ్ ద సినీ సర్కిల్¯గా మార్చి చర్చనీయాంశంగా చేశాయిు.ఈ సందర్భంగా ఆమె స్పందన కూడా అందర్నీ ఆకట్టుకుంది. ‘ ఇంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి వేదికపైకి వెళ్ళినప్పుడు, ఆడిటోరియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. నా తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మనస్ఫూర్తిగా గట్టిగా ఏడ్చారు. చప్పట్లు కొట్టారు, ఏమి సాధించానో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఒక్కటి తెలుసు – ఈ అవార్డు ద్వారా, నా మహారాష్ట్ర. నా మొత్తం కుటుంబం పేరు ఉన్నత స్థాయికి చేరుకుందని. నా తల్లి చెప్పినట్లుగా, గత 70 సంవత్సరాల జాతీయ అవార్డులలో, ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలినని. నా ఈ విజయానికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, నా చిత్ర బృందానికి, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన నా దర్శకుడు సుధాకర్ యక్కంటికి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సీనియర్ జ్యూరీ సభ్యులందరికీ, ముఖ్యంగా, నా ప్రియమైన ప్రేక్షకులకు, ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మద్దతు వల్లనే నేను ఇంత చిన్న వయస్సులో ఈ స్థానానికి చేరుకోగలిగాను. మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యత నిజాయితీతో పని చేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అంటూ స్పందించింది. ఈ స్పందన కూడా బాగా వైరల్ అవడంతో పాటు ఆమెను కాబోయే స్టార్ గా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ సందర్భఃగా అభినయ లోకనాయకుడు కమల్ హాసన్ ఆ చిన్నారిని మనసారా కొనియాడారు. తాను ఒకప్పుడు సాధించిన మైలురాయిని అధిగమించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు . కళతూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డ్ సాధించిన కమల్ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బాల నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్ను ఇప్పుడు త్రిష తిరగరాసింది. ఈ సందర్భంగా కమల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన త్రిషా తోషర్, నా హర్షధ్వానాలు నీకు దక్కుతాయి. నా మొదటి అవార్డు వచ్చినప్పుడు నాకు అప్పటికే ఆరేళ్ల వయసు...నువ్వు నా రికార్డును అధిగమించావు. ఇలాగే కొనసాగండి మేడమ్. మీ అద్భుతమైన ప్రతిభతో పని చేస్తూనే ఉండండి. ఇంట్లోని మీ పెద్దలకు నా ప్రశంసలు.‘ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఆ చిన్నారి బాల నటికి అభినయ శిఖరం లాంటి కమల్ నుంచి అందుకున్న ఈ పొగడ్త మరో అత్యున్నత పురస్కారంతో సమానం అనడంలో సందేహం లేదు. -
చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో వారికి వారే సాటి. కృషి, పట్టుదలే వారికి పెట్టుబడి. అలా గత దాదాపు రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన వందన ప్రభాకర్ పాటిల్ (Vandana Prabhakar Patil) మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) పనిచేస్తూ తనదైన వ్యాపారానికి నాంది పలికారు. తన ఆలోచనకు పదునుపెట్టి నెలకు మూడు లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.వందన పాటిల్ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె చదివింది. 12వ తరగతి మాత్రమే ఉంది. ఆమె వ్యవసాయంలో కూరగాయల నుండి ఆదాయం పొందేది, కానీ కూరగాయల ఉత్పత్తి వచ్చినప్పుడు, మార్కెట్లో కూరగాయల ధరలు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. దీంతో 2021లో ఆమె జల్గావ్లోని మామురాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) సందర్శించి, కూరగాయలు, పండ్లను పొడి లేదా ఒరుగులుగా మార్చే ప్రక్రియ డీహైడ్రేషన్ (Dried Vegetables and Fruits) గురించి తెలుసుకుంది. అంతే ఆమె మెదడులో ఆలోచన రూపుదిద్దుకుంది. అందరికలా కాకుండా తాను భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. తనలాంటి అనేక మంది రైతుల సమస్యలను కూరగాయలను సౌరశక్తితో ఎండబెట్టడం ద్వారా పరిష్కరించవచ్చని, కూరగాయల డీహైడ్రేషన్ పరిష్కరిస్తుందని గ్రహించింది.వందన తన పాలస్ఖేడ గ్రామంలో కూరగాయలను డీహైడ్రేట్ చేసి వాటి నుండి పొడిని తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించింది. ఆమె తన గ్రామంలోని కొంతమంది మహిళల సహకారంతో గాయత్రి ఫుడ్స్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. దీనికి సౌరశక్తితో ఎండబెట్టిన ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. తన యూనిట్ను ప్రారంభించడానికి,2021లో కూరగాయల డీహైడ్రేషన్లో శిక్షణ తీసుకుంది. వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. ఆ తర్వాత ఆమె రూ. 10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద, సూక్ష్మ సంస్థలు అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం సబ్సిడీని పొందే అవకాశాన్ని వినియోగించుకుంది. తన వ్యాపారంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 నుండి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. .సోలార్ డ్రైయింగ్ యూనిట్న్నెల్ ఆకారంలో పాలికార్బోనేట్తో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు, పల్వరైజర్, కటింగ్ మెషిన్ కొనుగోలు మరియు ప్యాకేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది సౌర వికిరణాన్ని బంధించి లోపల గాలిని వేడి చేస్తుంది, గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కూరగాయలను సోలార్ ఎండబెట్టడానికి ముందు కడిగి, శుభ్రం చేసి, ముక్కలుగా కోస్తారు. వేడిచేసిన గాలి సొరంగం ద్వారా లోనికి వెళ్లి, తేమను తొలగించడం ద్వారా ట్రేలు లేదా రాక్లపై ఉంచిన ఉత్పత్తులను ఎండేలా చేస్తుంది. చివరల్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తేమ గాలిని బయటకు వెళ్లేలా చేస్తాయి.ప్రధానంగా ఉల్లిపాయ, టమోటా, దుంప, సెవ్గా, మెంతులు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం లాంటివి కూరగాయలు ఉన్నాయి.కూరగాయల పొడిని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది. కూరగాయలను కడిగి శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కటింగ్ మెషిన్ ద్వారా ఎండబెట్టి, ఆపై వాటి పొడిని తయారు చేస్తారు. సౌరశక్తి ద్వారా సహజంగా ఎండబెట్టడం వల్ల, వాటి రంగు , నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుందని వందన పాటిల్ చెప్పారు. అవి పూర్తిగా సహజమైనవి కాబట్టి, కూరగాయల పొడి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, ఆమ్లత్వం, మధుమేహం, చర్మం, జుట్టు మొదలైన అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా ఉంటుంది. .వందన పాటిల్ వ్యాపారం తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది. కంపెనీలో ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని వందన పాటిల్ చెప్పారు. తమ డీహైడ్రేటెడ్ కూరగాయలు పునఃవిక్రేతలు, టోకు వ్యాపారుల ద్వారా US, మాల్దీవులు మరియు కెనడాకు కూడా చేరుతాయని వందన చెప్పారు.యూనిట్ను విస్తరించాలని మరియు ఎగుమతి ఆర్డర్లను అందించే సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.వందన కుటుంబం తన గ్రామంలో ఐదు ఎకరాలకు పైగా నిమ్మకాయతో మునగ పంటను అంతర పంటగా పండిస్తుంది. రెండింటినీ డీహైడ్రేట్ చేస్తూ, స్థానిక రైతుల నుండి ఇతర కూరగాయలను కొనుగోలు చేస్తుంది. ఏదైనా కూరగాయల కొరత ఉంటే, వ్యవసాయ-ఎండబెట్టడం కోసం ఆమె వాటిని హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తుంది. 22 కిలోల తాజా టమోటాలు 1 కిలోల డీహైడ్రేట్ టమోటాలు వస్తాయి. కనుక ఒక కిలో డీహైడ్రేట్ టమోటా ధర దాదాపు రూ.700. అలాగే బీట్రూట్ ధర 100 గ్రాములకు రూ. 100 ,హోల్సేల్లో కిలోకు రూ. 700గా ఉంటుంది. ఉల్లిపాయలు కిలోకు రూ. 500 నుండి రూ. 600 వరకు ఉంటుంది. తాజా ఉత్పత్తుల మార్కెట్ ధరలను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. తద్వారా వీరి సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3 లక్షలు. ఒక్కోసారి రెండు,మూడు రోజుల్లోనే రూ. 8-10 లక్షల టర్నోవర్ వస్తుంది అంటారు ఆ యూనిట్లో పనిచేసే ఇతర మహిళలు. వందనా సందేశంఈ ప్రాజెక్ట్ రైతులకు సహాయం చేయడంతోపాటు, గ్రామంలోని మహిళలకు తాను ఉపాధి కల్పించడం గర్వంగా ఉంటుందనీ, ఏ స్త్రీ కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకోకూడదని, పట్టుదలతో ఉంటే, మహిళలు తమ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలరని వందనా పాటిల్ మహిళలకు సందేశం ఇస్తుంది.మార్కెట్: భారతదేశపు డీహైడ్రేషన్ పండ్లు, కూరగాయల మార్కెట్ 2023లో రూ. 17,200 కోట్లుగా ఉండగా 2035 నాటికి రెట్టింపు రూ. 37,200 కోట్లుగా ఉంటుందని అంచనా. డీహైడ్రేటెడ్ కూరగాయలు మరియు పండ్లకు డిమాండ్ పెరుగుతున్న సౌకర్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే అవి అవసరమైన పోషకాలను నిలుపుకుంటూ నిల్వ చేయడం , తయారు చేయడం సులభం. సౌర ఎండబెట్టడం వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మరియు పోషక విలువను ప్రభావితం చేయకుండా బరువును తగ్గిస్తుంది. -
నీట్లో 99.99 పర్సంటైల్.. డాక్టర్ కావాలనుకోలేదు
ఈ ఫొటోలోని కుర్రాడు పేరు అనురాగ్ అనిల్ బోర్కర్. నీట్ యూజీ 2025 పరీక్షలో 99.99 పర్సంటైల్తో OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ కుర్రాడు డాక్టర్ కావాలనుకోలేదు. అందుకే మెడిసిన్లో చేరడానికి ముందే ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు 19 ఏళ్ల అనురాగ్ ఇష్టం లేని చదువు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు.సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ ప్రాంతంలో అనురాగ్ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ మెడికల్ కాలేజీలో అతడికి సీటు వచ్చింది. MBBS కోర్సులో చేరడానికి గోరఖ్పూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో అనురాగ్ అనూహ్యంగా తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.ఘటనా స్థలం నుంచి పోలీసులు అనురాగ్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు చూపించలేదు. డాక్టర్ కావడం ఇష్టం లేకనే అతడు ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవర్గావ్ పోలీసులు (Navargaon Police) దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనురాగ్ మరణంతో అతడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అనురాగ్ తెలివైన విద్యార్థి అని పొరుగువారు తెలిపారు. అతడి చెల్లి గత సంవత్సరం 12వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్గా నిలిచిందని వెల్లడించారు.ఒత్తిడి నుంచి బయటపడండిచదువుల విషయంలో చాలా మంది టీనేజర్లు ఒత్తిడికి గురవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తల్లిదండ్రుల ఇష్టాలను కాదనలేక, తమకు ఇష్టంలేని చదువు చదవలేక నలిగిపోతున్నారు. చదువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఒక భాగం మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఒత్తిడికి గురైతే తమ సమస్య గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గాలు వెతకాలి. మీకు దగ్గరలోని మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే హెల్ప్లైన్ నంబర్లలోనూ సంప్రదించి సహాయం పొందవచ్చు.మహారాష్ట్రలో హెల్ప్లైన్లువాండ్రేవాలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ 9999666555 లేదా help@vandrevalafoundation.comTISS iCall 022-25521111 (సోమవారం- శనివారం: ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు)BMC మానసిక ఆరోగ్య హెల్ప్లైన్: 022-24131212 (24x7) -
‘మహా’ రాజకీయం.. ఉద్దవ్, రాజ్ థాక్రే మధ్య కీలక అంగీకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో తమకు గట్టి పట్టున్న సీట్లను సమానంగా పంచుకోవాలని శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్ణయించాయి. మిగతా మున్సిపాలిటీల్లో 60:40 సూత్రాన్ని అనుసరించాలని తీర్మానించాయి. సీట్ల పంపకంపై దీపావళి వరకు స్పష్టత వచ్చే అవకాశముంది.బీఎంసీ పరిధిలోని ప్రాబల్యం కలిగిన స్థానాలను ముందుగా గుర్తించాలని కూడా అంగీకారానికి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ), ఎంఎన్ఎస్ సారథి రాజ్ ఠాక్రే వరుసకు సోదరులవుతారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు ప్రకటన కేవలం లాంఛనప్రాయమేనని ఇరుపార్టీల నేతలు అంటున్నారు. ముంబైతోపాటు థానె, నాసిక్, కల్యాణ్–డొంబివిలి ప్రాంతాల్లో రెండు పార్టీలకు గట్టి పట్టుంది. 2026 జనవరి 31వ తేదీలోగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గట్టి ఆదేశాలివ్వడం తెల్సిందే. 2025–26లో వార్షిక బడ్జెట్ రూ.74 వేల కోట్లు కలిగిన బీఎంసీ దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్. బీఎంసీలో 227 వార్డులున్నాయి.ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉద్దవ్, రాజ్ థాక్రే ఒకే వేదికపై మళ్లీ కలిశారు. 2005లో రాజ్ థాక్రే శివసేన పార్టీని వీడారు. పార్టీ వీడడానికి ఉద్ధవ్ కారణమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఇద్దరు సోదరులు మళ్లీ కలిసిపోయారు. -
Maharashtra: డిప్యూటీ సీఎం ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. పాక్, టర్కీ జెండాలు ప్రత్యక్ష్యం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు.. షిండే ప్రొఫైల్కు యాక్సెస్ అయ్యి, పాకిస్తాన్, టర్కీ జాతీయ జెండాల ఫొటోలను షేర్ చేశారు. ఈ కార్యకలాపాలు అటు షిండే అనుచరులు, పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఈ అనధికార పోస్ట్లను తొలగించే ముందు కొద్ది కాలం పాటు ఫొటోలను లైవ్లో ఉంచిన షిండే కార్యాలయ అధికారులు.. సైబర్ ఎటాక్ను త్వరగా గుర్తించామని, ఖాతాను సురక్షితంగా ఉంచేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు.ఆసియా కప్లో భారత్- పాక్లు తమ రెండవ మ్యాచ్ ఆడబోతున్న(ఆదివారం) రోజున హ్యాకర్లు రెండు ఇస్లామిక్ దేశాల ఫొటోలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘మేము సైబర్ క్రైమ్ పోలీసులను వెంటనే అప్రమత్తం చేశాం. సమస్య పరిష్కారం అయ్యింది’ అని ఒక అధికారి తెలిపారు. ఈ ఖాతాను క్రమబద్ధీకరించేందుకు 30 నుండి 45 నిమిషాల సమయం పట్టిందని ఆ అధికారి తెలిపారు. సాంకేతిక బృందం ఆ ఖాతాని తిరిగి స్వాధీనం చేసుకున్నదన్నారు. ఖాతా ఇప్పుడు సాధారణంగానే పనిచేస్తోందని, ఈ ఘటనలో ఎటువంటి సున్నితమైన సమాచారం తరలిపోలేదన్నారు. -
ఫస్ట్ క్లాస్ జర్నీ
కాస్త సరదాగా చెప్పుకోవాలంటే... ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అనే ఆరుద్ర మాట సురేఖ యాదవ్కు వర్తించదు. నిజానికి రైలే ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఆసియా ఫస్ట్ ఉమెన్ ట్రైన్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సురేఖ రిటైర్ అయింది. ఆమె ఒక రైలుబడి. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. భావితరాలకు మార్గదర్శకాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతారలో పుట్టి పెరిగింది సురేఖ. అయిదుగురు పిల్లల్లో పెద్దది. తండ్రి రామచంద్ర భోంస్లే రైతు. సతారాలోని సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకున్న సురేఖ వృత్తివిద్యా కోర్సులో చేరింది. ఆ తరువాత.. కరాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్), బీయీడీ చేసింది.టీచర్ కాదు రైలు డ్రైవర్బీయీడీ చేసిన సురేఖ టీచర్ కావాలనుకునేది. అయితే ఆమెకు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసుకొని సెంట్రల్ రైల్వేస్లో ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్గా చేరింది. 1985లో కల్యాణ్ ట్రైనింగ్ స్కూల్లో ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్ డ్రైవర్గా ఆమె వృత్తి ప్రయాణం మొదలైంది. వాడి బందర్, కల్యాణ్ల మధ్య నడిచే గూడ్స్ ట్రైన్లో ఇంజిన్ రన్నింగ్ కండీషన్, సిగ్నల్స్... మొదలైన వాటిని పర్యవేక్షించేది. కొన్ని సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో గూడ్స్ డ్రైవర్గా బాధ్యతలు స్వీకరించింది. ఆ తరువాత వెస్ట్రన్ ఘాట్ రైల్వేస్లో డ్రైవర్గా పనిచేసింది.→ దక్కన్ క్వీన్ డ్రైవ్ చేసిన క్వీన్దక్కన్ క్వీన్(డైలీ పాసింజర్ ట్రైన్) డ్రైవర్గా పాసింజర్ ట్రైన్ను నడిపిన ఆసియాలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. ఘాట్ లైన్ కోసం రెండు–ఇంజిన్ల ప్యాసింజర్ ట్రైన్ నడపడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. గతంలో మహిళలు ఎవరూ ఘాట్ లైన్లో ట్రైయిన్ నడపక పోవడం వల్ల పై అధికారులకు సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంది సురేఖ. ‘దక్కన్ క్వీన్ ట్రైన్ నడపాలనేది నా కలగా ఉండేది. ఎందుకంటే మహిళ పేరుతో నడిచే రైలు అది. ఆ పేరులో రాజసం ధ్వనిస్తుంది. ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. భారతీయ రైల్వే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. మహిళలకు ప్రత్యేకించిన ట్రైన్స్ను నడపడం కూడా సంతోషంగా ఉంది’ అంటుంది సురేఖ.→ గురువుగా...ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్గా 2011లో ప్రమోట్ అయిన సురేఖ ఆ తరువాత కల్యాణ్లో డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్ (డిటీసి)లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా పాఠాలు బోధించింది. మన దేశంలో ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. 2011లో 50 మంది మహిళలు సబర్బన్, గూడ్స్ ట్రైన్ డ్రైవర్లుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి...సురేఖ.→ ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై...‘ఆడవాళ్లు ట్రైన్ డ్రైవర్ ఏమిటి! అని ఆశ్చర్యపోయే రోజుల్లో కూడా నా కుటుంబం, మిత్రులు, బం«ధువుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై నన్ను ముందుకు నడిపించింది. వృత్తిజీవితంలో నాకు ఎలాంటి వివక్షా ఎదురుకాలేదు. ట్రైన్ ఎక్కిన తొలి క్షణం నుంచి మరే విషయాలు మదిలో రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది సురేఖ. నిజానికి ఆమె రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఉద్యోగమే ఆమెను చరిత్రలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.ఘనమైన వీడ్కోలుసురేఖ యాదవ్ ఫేర్వెల్ సెలబ్రేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సురేఖ ఆత్మీయలు, స్నేహితులు, బంధువులు, రైల్వే ఉద్యోగులు ఆమె మెడలో పూలమాలలు వేశారు. డోళ్లు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘సురేఖ రిటైర్ అయినప్పటికీ... ఆమెలోని శక్తి సామర్థ్యాలు రిటైర్ కావు. అవి ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అన్నారు వక్తలు.కష్టం లేదు... ఎప్పుడూ ఇష్టమే!‘ట్రైయిన్ నడపడం అంటే మాటలా!’లాంటి మాటలు వినిపించినప్పటికీ నేను ఎప్పుడూ భయపడలేదు. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా శిక్షణ తీసుకున్నాను. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. కుటుంబ, వృత్తి బాధ్యతలను జాగ్రత్తగా సమన్వయం చేసుకునేదాన్ని.– సురేఖ యాదవ్ -
మహారాష్ట్రలో అత్యంత ధనవంతులు.. అంబానీ తరువాత ఎవరంటే?
భారతదేశంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నరాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఒకటి. అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులకు ఈ రాష్ట్రం నిలయం. 2025లో సంపద విషయంలో మహారాష్ట్ర ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మొత్తం మీద ఇండియాలోని బిలియనీర్లు ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది 2019తో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువ. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రానికి చెందినవారే. ఈ కథనంలో మహారాష్ట్రలోని కుబేరులు ఎవరో తెలుసుకుందాం.➤ముఖేష్ అంబానీ: 119.5 బిలియన్ డాలర్లు➤దిలీప్ సంఘ్వీ & ఫ్యామిలీ: 32.4 బిలియన్ డాలర్లు➤రాధాకిషన్ దమాని & ఫ్యామిలీ: 31.5 బిలియన్ డాలర్లు➤కుమార్ మంగళం బిర్లా: 24.8 బిలియన్ డాలర్లు➤సైరస్ పూనవాలా: 24.5 బిలియన్ డాలర్లు➤బజాజ్ ఫ్యామిలీ: 23.4 బిలియన్ డాలర్లు➤షాపూర్ మిస్త్రీ & ఫ్యామిలీ: 20.4 మిలియన్ డాలర్లు -
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. -
కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐభారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
రిలయన్స్ భారీ ఫుడ్ పార్క్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్(కాటోల్)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సమీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్ కన్జూమర్ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు. -
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. 30 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో తయారు చేస్తున్న డ్రగ్స్ను దేశ, విదేశాలను సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.32 వేల లీటర్ల రా మెటీరియల్ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు విదేశీయుడు పట్టుబడ్డాడు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. -
మహిళా IPSతో వాగ్వాదం వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
-
నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్తో డిప్యూటీ సీఎం వాగ్వాదం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. సోలాపూర్లో కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో, ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే.. సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్సీపీ నాయకుడు ఒకరు.. ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, అజిత్ పవార్ వాయిస్ను ఆమె గుర్తించలేదు. దీంతో, ఆగ్రహానికి లోనైన అజిత్.. ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను.. నన్ను గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?. నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. అనంతరం, తనకు వాట్సాప్లో వీడియో కాల్ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్ చేయడంతో అజిత్ను చూసి మాట్లాడారు.करमाळ्याच्या पोलिस उपअधिक्षक अंजली कृष्णा यांना उपमुख्यमंत्री अजित पवारांना फोनवरुन ओळखता आले नाही. त्यानंतर रागावलेल्या अजित पवारांनी अंजली कृष्णा यांना खडेबोल सुनावत थेट व्हिडीओ काॅलच केला.#ajitpawar #AnjaliKrishna pic.twitter.com/ag2DNuf3do— Ankita Shantinath Khane (@KhaneAnkita) September 2, 2025అయితే, ఆమె సమాధానం పవార్ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఈ సందర్బంగా అజిత్..‘నేను మీపై చర్య తీసుకుంటాను. నేనే మీతో మాట్లాడుతున్నాను అంటే మీకు సరదాగా ఉందా?. మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.మరోవైపు.. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రభుత్వం, అజిత్ పవార్పై విమర్శలు వచ్చాయి. దీంతో, రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తత్కరే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా సునీల్ తత్కరే స్పందిస్తూ..‘అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా సదరు అధికారిని మందలించి ఉండవచ్చు. ఆమె చర్యను పూర్తిగా ఆపాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. పవార్ ఎప్పుడూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు అని చెప్పుకొచ్చారు. -
‘అదంతా ఫేక్’.. షీనా బోరా కేసులో కీలక మలుపు
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూతురు విద్ది ముఖర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. సీబీఐ ఛార్జ్షీట్లో తన పేరుతో ఉన్న స్టేట్మెంట్లు తనవి కాదని.. అవి నకిలీవని పేర్కొన్నారు. దీంతో ప్రాసిక్యూషన్కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూతురే విద్ధి ముఖర్జీ. మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి జేపీ దరేకర్ ఎదుట సాక్ష్యాన్ని నమోదు చేసే క్రమంలో ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ఏ దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలం నమోదు చేయలేదని, తన పేరిట నమోదైన ప్రకటనలు నకిలీవని అన్నారామె. ఇంద్రాణీ అరెస్టు తర్వాత.. పీటర్ ముఖర్జీ, ఆయన కుటుంబ సభ్యులు ఆమె ఆస్తులపై గొడవపడినట్టు విద్ది తెలిపారు. పీటర్ కొడుకులు రాహుల్, రబిన్లు ఇంద్రాణికి చెందిన కోట్ల విలువైన ఆభరణాలను, రూ.7 కోట్ల నగదు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఇంద్రాణి వాడిన పర్ఫ్యూమ్లు, బ్యాగులు, చీరల కోసం కూడా కొట్టుకున్నారని తెలిపారు. దీంతో తన తల్లి దగ్గర చిల్లిగవ్వ లేకుండా అయ్యిందని వాపోయారామె. అంతేకాదు.. ఆస్తులను ఎక్కడ అప్పగించాల్సి వస్తుందోనని ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఇంద్రాణి ముఖర్జీని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారామె. తన తల్లి అరెస్ట్ అయిన సమయంలో తాను మైనర్గా ఉన్నానని, ఆ సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని విద్ధి ప్రత్యేక న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసు విచారణలో ముంబై పోలీసులు తొలుత తనను సంప్రదించారని, ఆ తర్వాత సీబీఐ తనను ప్రశ్నించాలనుకుందని తెలిపారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని విద్ధి తెలిపారు. అయితే.. పోలీసులుగానీ, సీబీఐగానీ తన స్టేట్మెంట్ను ఎక్కడా అధికారికంగా నమోదు చేయలేదని అన్నారామె. అలాగే..సీబీఐ కార్యాలయంలో తనను ఖాళీ పత్రాలపై, కొన్ని ఈమెయిల్ ప్రతులపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని, ఛార్జ్షీట్లో ఉన్న ప్రకటనలు తనవిగా చూపించడంలో దురుద్దేశం కనిపిస్తోందని అన్నారామె. తన తల్లిదండ్రుల్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. బోరాను తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ సోదరిగానే ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకానొక టైంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎప్పుడైతే పీటర్ ముఖర్జీ పెద్ద కొడుకు రాహుల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. అతను తరచూ సెంట్రల్ ముంబై వోర్లీలో ఉన్న బోరా ప్లాట్కు వెళ్లడం ప్రారంభించాడో.. అప్పటి నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. రాహుల్, షీనాకు సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు.. డ్రగ్స్ అలవాటు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. చివరిసారిగా.. బోరాను 2011లో గోవాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చూశాను. కానీ, 2013 దాకా ఆమె ఈమెయిల్స్తో టచ్లో ఉండేది అని విద్ధీ కోర్టుకు తెలిపింది. 2015 ఆగస్టులో తన తల్లి అరెస్ట్ అయ్యేదాకా అంతా బాగానే ఉండేది. ఆ టైంలో పీటర్ కొడుకులు రాహుల్ ఏ పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. రాహుల్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే డబ్బు కోసం వాళ్లిద్దరూ తెగించారు. పీటర్ ముఖర్జీ అరెస్ట్ కంటే ముందే వాళ్లిద్దరూ ఇంద్రాణికి చెందిన నగలు దొంగిలించారు. వాటిని కొత్తగా ఓ బ్యాంక్ లాకర్ తెరిచి దాచారని అన్నారామె. తద్వారా వాళ్లిద్దరూ ఇంద్రాణిని కావానే ఇరికించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. తల్లి కావాలా? ముఖర్జీ వారసత్వం కావాలా? ఎంచుకోవాలని రబిన్ తనను బెదిరించాడని, ఒకవేళ తల్లి వైపు నిలవడితే ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుందని బెదిరించాడని కోర్టుకు తెలిపింది. బుధవారం కూడా విద్ధి సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయాల్సి ఉంది. షీనా బోరా.. ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మొదటి భర్త సిద్దార్థ్ దాస్లకు పుట్టిన సంతానం. 2012లో షీనా బోరా అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. అయితే ఆమె అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిందని ఇంద్రాణీ అందరికీ చెబుతూ వచ్చింది. 2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ఓ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించే క్రమంలో.. షీనా బోరా హత్య కేసు బయటకు వచ్చింది. ఈ కేసులో ఇంద్రాణీ, ఆమె మాజీ భర్తలు, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీలను పోలీసులు అరెస్ట్ చేసింది. ఇంద్రాణీ, సంజీవ్, డ్రైవర్ శ్యామ్వర్లు షీనాను కారులో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. హత్య అనంతరం ఆమె శరీరాన్ని రాయగడ్ అడవిలో తగలబెట్టి పారేసినట్టు ఆరోపణ ఉంది. అంతేకాదు.. షీనా మరణించాక కూడా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె పేరిట అందరికీ మెయిల్స్ పంపిందని అంటోంది. ఈ కేసులో పీటర్, సంజీవ్లకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఆరున్నరేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. 2022 మే 18న ముంబై బైకులా మహిళా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. -
వినాయక నిమజ్జనమే జరగని ఊరు.. ఎక్కడుందంటే?
సాక్షి ముంబై: సాధారణంగా వినాయక చవితి తరువాత ఒకటిన్నర, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులకు వినాయక నిమజ్జనం చేస్తారు. కానీ మహారాష్ట్ర నాందేడ్ జిల్లా భోకర్ తాలూకాలోని పాలజ్ గ్రామంలో గత 77 ఏళ్లుగా నిమజ్జనమనే మాటే లేకుండా గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కలపతో తయారు చేసిన ఈ గణపతి విగ్రహానికి ఎంతో చరిత్ర, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని గురించి ఆ గ్రామ గణపతి మండలి సభ్యులు వెంకటేష్, నాగభూషణ్, సాయినాథ్ తదితరులు ‘సాక్షి’కి వివరించారు.కలలో వినాయకుడి ఆదేశం.. తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో 90 శాతం మంది తెలుగు వారే నివసిస్తున్నారు. ఓ రోజు పాలజ్ గ్రామ పంచాయితీ ప్రముఖుడు సంటి భోజన్నకు కలలో వినాయకుడు దర్శనమిచ్చి గణేశోత్సవాలు జరపమని కానీ నిమజ్జనం చేయవద్దని చెప్పారట. ఈమేరకు సంటి భోజన్న, సకెలవార్ చిన్నన్న, గంగాధర్ చటపలవార్, నరసింగ్రావ్ దేశ్ముఖ్, నరసిమల్లు చాటలవార్, మల్లయ్య బాందేలవార్ తదితరులు వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కొయ్యబొమ్మలకు ఎంతో ప్రసిద్ది చెందిన తెలంగాణలోని నిర్మల్కు చెందిన శిల్పి గుండాజి పాంచల్కు విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒకే చెట్టు కలపతో ఈ ప్రతిమను తయారు చేశారు. భారీ సంఖ్యలో భక్తుల రాక... అలా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయమని, కలరా, ప్లేగు లాంటి మహామ్మారి వ్యాధుల బారి నుంచి కాపాడమని వేడుకుంటూ 1948లో ఈ వినాయకుడిని ప్రతిష్టించారు. ఇలా ఈ వినాయకున్ని 1948లో గ్రామంలో స్థాపించారు. అనంతరం వారాసించినట్లుగానే స్వతంత్రం వచ్చింది. కలరా, ప్లేగు వ్యాధులు కూడా నశించాయి. అప్పటి నుంచి ప్రతి ఏడాది 11 రోజులపాటు పెద్ద ఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ నిమజ్జనం చేయడం లేదని గణపతి మండలి సభ్యులు వివరించారు. నిమజ్జన శోభాయాత్ర నిర్వహించి కొన్ని నీళ్లు విగ్రహంపై చల్లి మళ్లీ యథావిధిగా భద్రపరచడం ఆనవాయితీ కొనసాగుతోందని చెప్పారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఇక్కడికి మహరాష్ట్రతోపాటు తెలంగాణకు చెందిన భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారని, ముడుపులు కట్టి కోరికలు తీరిన తరువాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లతోపాటు 11 రోజులపాటు ప్రతి రోజు అన్నదానం, భజనలు, కీర్తనలు ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండలి సభ్యులు తెలిపారు. రద్దీ కారణంగా అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసు భద్రత (Police Security) కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
అక్కడి వరకు పొడిగిస్తే బాగుంటుంది..
దాదర్: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించినప్పటికీ గురువారం నుంచి ప్రత్యక్షంగా సర్వీసులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా మరో కొత్త రైలు అందుబాటులోకి రావడంతో మరఠ్వాడ రీజియన్ ముఖ్యంగా పర్బణీ, పూర్ణ, నాందేడ్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ముంబై– నాందేడ్ మధ్య నడిచే అనేక రైళ్లున్నాయి. అలాగే నాందేడ్ మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నాందేడ్కు బదులుగా నిజామాబాద్ వరకు పొడిగిస్తే తమకు లాభదాయకంగా ఉండేదని ముంబైలోని నివసిస్తున్న తెలంగాణ ప్రజలు (Telangana Public) అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆరునెలల క్రింద ప్రారంభం.. దాదాపు ఆరు నెలల కిందట ముంబై–జాల్నాల మధ్య ప్రారంభించిన 20705/20706 రైలుకు ప్రయాణికుల నుంచి ఆశించినంత మేర స్పందన రాలేదు. దీంతో నాందేడ్ (Nanded) వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ashwini vaishnaw) రెండు నెలల కిందట మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ముంబై–నాందేడ్ మధ్య ఉన్న 610 కిలోమీటర్ల దూరాన్ని వందేభారత్ రైలు కేవలం 9 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.18 చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లు ఇలా మొత్తం 20 బోగీలున్న ఈ రైలులో 1,440 మంది ప్రయాణించేందుకు వీలుంది. 20705 నంబరు రైలు ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు నాందేడ్ స్టేషన్ నుంచి బయలుదేరి పూర్ణ, పర్బణీ, జాల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్, కల్యాణ్, థానే, దాదర్ స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుంటుంది. అలాగే 20706 నంబరు రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు సీఎస్ఎంటీ నుంచి బయలుదేరి రాత్రి 10.50 నాందేడ్కు చేరుకుంటుంది. ఈ రైలువల్ల రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఇప్పటికైనా స్పందించండి... ఇదిలాఉండగా తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ (Karimnagar) ప్రాంత వాసులకు ముంబై నుంచి నేరుగా నడిచే సీఎస్ఎంటీ– లింగంపల్లి దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే ఆధారం. అజంతా ఎక్స్ప్రెస్ రైలు కూడా ఉన్నప్పటికీ ఇది మన్మాడ్ నుంచి బయలు దేరుతున్న కారణంగా వీరికి అంత సౌకర్యవంతంగా ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క దేవగిరి ఎక్స్ప్రెస్ సీజన్, అన్సీజన్ తేడా లేకుండా ఎప్పుడూ కిటకిటలాడుతుంటూంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబై (Mumbai) పర్యటనకు వచ్చిన అనేక మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ముంబై– నిజామాబాద్ ఒక ప్రత్యేక రైలు కావాలని వేడుకుంటూ అనేక వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆ లేఖలన్నీ చెత్త బుట్టల పాలయ్యాయి. ఇంతవరకు ఈ విజ్ఞప్తిని పట్టించుకున్నవారే లేరు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాతైనా తమ కల నెరవేతుందని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు భావించారు. కానీ అది నెరవేరలేదు.చదవండి: సాధారణ చార్జీలతో ఎక్స్ప్రెస్ ప్రయాణం!ఈ నేపథ్యంలో తాజాగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకూ పొడిగించినా బాగుండేదని, దీని వల్ల రైల్వేకు ఆదాయం కూడా భారీగా సమకూరేదని స్థానిక తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ వందేభారత్ రైలును నిజామాబాద్ వరకూ పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు. నాందేడ్ వరకు విస్తరించారు. దీన్ని నిజామాబాద్ (Nizambad) వరకు పొడగిస్తే తెలంగాణ వాసులకు ఎంతో మేలు జరిగేది. రైల్వేకు కూడా భారీగా ఆదాయం వచ్చేది. కనీసం ఈ వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకు పొడిగించే ప్రయత్నం చేయాలని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.రాత్రి 12 దాకా మెట్రో సర్వీసులు దాదర్: గణేశోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెమ్మార్డీయే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మెట్రో రైళ్లు ప్రతీరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. కానీ గణేశోత్సవాల సందర్భంగా ఎదురయ్యే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు అంటే సెప్టెంబరు ఆరో తేదీ వరకు 11 రోజులపాటు కొనసాగుతాయని మెట్రో–2ఏ, మెట్రో–7 మార్గాలలో అర్థరాత్రి 12 గంటలవరకూ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా ట్రిప్పుల సంఖ్య కూడా పెంచినట్లు వెల్లడించారు. -
మహారాష్ట్ర గడ్డ...షెల్ కంపెనీల అడ్డా..!
సాక్షి, అమరావతి: అక్రమ వ్యాపారాలు/తాత్కాలిక వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసే షెల్ కంపెనీలకు మహారాష్ట్ర అడ్డాగా మారింది. దేశంలోనే అత్యధిక షెల్ కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా రెండేళ్లు ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకపోయినా, దరఖాస్తులు సమర్పించకపోయినా అటువంటి కంపెనీలను కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ షెల్ కంపెనీలుగా గుర్తించి రద్దు చేస్తుంది. గడిచిన 27నెలల్లో దేశవ్యాప్తంగా 40,944 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభలో వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై15 నాటికి దేశవ్యాప్తంగా 40,944 కంపెనీల గుర్తింపును రద్దు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే 8,329 కంపెనీలుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో 5,873 కంపెనీలతో ఢిల్లీ నిలిచింది.4వస్థానంలో తెలంగాణదొంగ కంపెనీల ఏర్పాటులో కర్ణాటక మూడోస్థానంలో నిలవగా తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచింది. కర్ణాటకలో గడిచిన 27 నెలల్లో 4,803, తెలంగాణలో 3,086 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండువేలకుపైనే షెల్ కంపెనీలున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 760 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోను మరికొన్ని కంపెనీలను రద్దుచేసినట్టు కేంద్రం వివరించింది. -
మహారాష్ట్రలో కుప్పకూలిన ‘అక్రమ భవనం’.. 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12.05 గంటల సమయంలో విజయ్ నగర్లోని రమాబాయి అపార్ట్మెంట్లో వెనక భాగం కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే కూలిన భవనం అక్రమ కట్టడమని విచారణలో తేలింది. దీంతో.. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు భవన నిర్మాణదారుడు నిటల్ గోపినాథ్ను అరెస్టు చేశారు. ల్యాండ్ ఓనర్ మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం. ఏడాది పుట్టినరోజు వేడుక చేసుకున్న నాడే.. ఘటనలో ఆరోహి జోయెల్(24), ఆమె ఏడాది చిన్నారి కన్నుమూశారు. భర్త ఓంకార్ జోయల్ జాడ ఇంకా తెలియరాలేదు. చిన్నారి ఏడాది పుట్టినరోజు కేక్ కట్టింగ్ వేడుక జరిపిన కొన్నిగంటలకే.. అదీ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన ఐదు నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఆ తల్లీకూతుళ్లు విగతజీవులయ్యారు. -
విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. వీడియో
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. హిమాచల్ ప్రదేశ్తో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్లో 144 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రుతురాజ్ బాదిన నాలుగు సిక్సర్లు వరుస బంతుల్లో బాదినవి కావడం విశేషం. అమన్ జైన్వాల్ అనే బౌలర్ వేసిన ఓ ఓవర్లో రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. రుతురాజ్ వరుస సిక్సర్లు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.6,6,6,6 BY RUTURAJ GAIKWAD IN A SINGLE OVER IN BUCHI BABU...!!!! 😍🔥 pic.twitter.com/LhoA6JKKiQ— Johns. (@CricCrazyJohns) August 26, 2025ఈ వీడియో చూసి సీఎస్కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సీఎస్కే ఫ్యాన్స్కు ఆ సీజన్లో రుతురాజ్ మెరుపులు మిస్ అయ్యారు. తమ కెప్టెన్ టచ్లోకి రావడంతో వారి ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.హిమాచల్తో మ్యాచ్లో రుతురాజ్ క్లాసికల్ సెంచరీ బాది తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మరో సెంచరీ వీరుడు అర్షిన్ కులకర్ణితో (146) కలిసి 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్.. ఆతర్వాత ఎదుర్కొన్న 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు.రుతురాజ్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత-ఏ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశాలు రాలేదు. అనంతరం రుతు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడేందుకు యార్క్షైర్తో ఒప్పందం చేసుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. బుచ్చిబాబు టోర్నీలో రుతురాజ్ తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. ఛత్తీస్ఘడ్పై 1, 11 పరుగులు మాత్రమే చేశాడు.రుతురాజ్ త్వరలో దులీప్ ట్రోఫీలో కనిపించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి చాలా మంది టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్కు ఆడనున్నాడు. -
సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాలీ సీజన్ను ఘనంగా ప్రారంభించాడు. బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్ 26) హిమాచల్ ప్రదేశ్తో ప్రారంభమైన మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కాడు. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రుతురాజ్ ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేశాడు. తనలోని క్లాస్ను మరోసారి అభిమానులకు రుచి చూపించాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్లో రుతురాజ్తో పాటు అర్షిన్ కులకర్ణి కూడా సెంచరీతో మెరిశాడు. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు వలస పృథ్వీ షా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి స్కోర్ వివరాలు తెలియరాలేదు.కాగా, బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలోని వివిధ వేదికల్లో జరుగుతుంది. ఈ టోర్నీ మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి పోటీపడుతున్నాయి. ప్రతి గ్రూపులో టాప్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్, పంజాబ్ తరఫున రమన్దీప్ సింగ్, మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా సెంచరీలతో మెరిశారు.ఇదిలా ఉంటే, ఈ సీజన్ బుచ్చిబాబు టోర్నీ దులీప్ ట్రోఫీ షెడ్యూల్తో క్లాష్ అవుతుంది. ఈ టోర్నీ ఆఖరి రోజు దులీప్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. దులీప్ ట్రోఫీ ఆడుతున్న ఆటగాళ్లు బుచ్చిబాబు టోర్నీ చివరి రౌండ్ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్లో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ తలపడనున్నాయి. అదే రోజు సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ కూడా పోటీపడనున్నాయి. సౌత్ జోన్, వెస్ట్ జోన్ నేరుగా సెమీస్కు అర్హత సాధించాయి.నార్త్ జోన్కు అంకిత్ కుమార్ సారథ్యం వహించనుండగా.. సౌత్ జోన్కు తిలక్ వర్మ, సెంట్రల్ జోన్కు ధృవ్ జురెల్, వెస్ట్ జోన్కు శార్దూల్ ఠాకూర్, ఈస్ట్ జోన్కు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నీలో రియాన్ పరాగ్, మొహమ్మద్ షమీ, ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
దేశ ఆర్థిక రాజధాని ముంచెత్తిన వర్షాలు
-
టీమిండియా వైపు మరోసారి దూసుకొస్తున్న పృథ్వీ షా.. వరుసగా రెండో మ్యాచ్లో..!
తొలి టెస్ట్లోనే సెంచరీ చేసి భావి భారత తారగా కీర్తించబడిన పృథ్వీ షా.. కొద్ది కాలానికే ఫామ్ కోల్పోయి, ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని, వివాదాల్లో తలదూర్చి భారత క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు.ఈ క్రమంలోనే తనకు గుర్తింపునిచ్చిన ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై తరఫున అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే మకాంను మహారాష్ట్రకు మార్చిన షా.. కొత్త జట్టు తరఫున పూర్వ వైభవాన్ని సాధించే పని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్రం మ్యాచ్లోనే (బుచ్చిబాబు టోర్నీలో ఛత్తీస్ఘడ్పై) సెంచరీ (140 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111) చేసిన షా.. వరుసగా రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరుగుతున్న మ్యాచ్లో 96 బంతుల్లో 9 సొగసైన బౌండరీల సాయంతో 66 పరుగులు చేశాడు. జట్టు మారాక ఆటతీరును కూడా మార్చుకున్న షా.. అద్బుత ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటూ మరోసారి టీమిండియా వైపు అడుగులు వేస్తున్నాడు. చత్తీస్ఘడ్పై సెంచరీ తర్వాతే షాకు సీఎస్కే నుంచి పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. షా ఈ టోర్నీలో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. సీఎస్కే కాకపోతే మరే ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా దక్కించుకోవచ్చు. షాకు ఐపీఎల్ ద్వారా టీమిండియా ఎంట్రీ ఈజీ అవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకే ఆలౌటైంది. పృథ్వీ షా రాణించడంతో మహారాష్ట్ర ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 160 పరుగుల ఆధిక్యంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా.. చిరుత పులినే తరిమికొట్టిన వీధి కుక్క
వీధి కుక్క.. చిరుత పులి.. ఒళ్లు గగుర్పొడిచే పోరాటం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాడోపేడో తేల్చుకుందామన్నట్టుగా.. చిరుత పులితోనే వీధి కుక్క పోరాటానికి దిగింది. ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఈ దృశ్యం చూసిన అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.నిఫాడ్లో రాత్రి సమయంలో గ్రామంలోకి చేరుకున్న ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసింది. దీంతో తిరగబడిన ఆ శునకం.. పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత మెడని గట్టిగా పట్టుకుని.. తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి దూకుడుగా చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. కుక్క పులి దాడి నుంచి బయటపడింది. అయితే, చిరుత గాయపడిందా? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై స్పష్టత రాలేదు.A stray dog and a leopard had a face off in Nashik’s Niphad, with the dog astonishingly overpowering the big cat and dragging it nearly 300 metres before it fled. The video of the encounter has gone #viral .#leopard #StrayDogs #viralvideo #Maharashtra #nashik #MaharashtraNews pic.twitter.com/wMswGJKTQv— Salar News (@EnglishSalar) August 22, 2025 -
ఠాక్రే కజిన్స్కు ఫస్ట్ షాక్! ఆ మర్నాడే..
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత.. ఠాక్రే సోదరులు ఒక్కటి కావడం తెలిసిందే. ఈ కలయికతో మహా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ, రెండు నెలలు తిరగకుండానే ఈ కజిన్స్కు తొలి షాక్ తగిలింది.ఉద్దవ్ శివసేన(Shivsena UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కూటమి తొలి పరీక్షలోనే ఫెయిల్ అయ్యింది. ముంబై బెస్ట్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే ముంబై కీలక మున్సిపల్ ఎన్నికలకు వార్మప్ మ్యాచ్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దీంతో ‘‘ఠాక్రే బ్రాండ్ ఫ్లాప్’’ అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ‘‘ఇది కేవలం సహకార ఎన్నిక మాత్రమే కాదు, ఒక్కసారి విడిపోయిన ఠాక్రే సోదరులు మళ్లీ కలిసిన తర్వాత వారి రాజకీయ పునరాగమనానికి ఇది ఒక పరీక్ష. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. ఈ మొదటి అడ్డంకినే ఠాక్రేలు దాటలేకపోయారు’’ అక్కడి మీడియాలో విశ్లేషణ జరుగుతోంది. అయితే..ఈ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను అధికార నివాసం వర్ష బంగ్లాకు వెళ్లి కలిశారు. సుమారు గంటన్నరపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. దీంతో ఉద్దవ్కు రాజ్ హ్యాండిస్తారా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే.. కాసేపటికే ఊహాగానాలకు రాజ్ ఠాక్రే తెర దించారు. ఇది రాజకీయ భేటీ ఎంతమాత్రం కాదని, నగర అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సీఎంతో చర్చించినట్లు మీడియాకు తెలిపారు.గ్రేటర్ ముంబైను వర్షాలు ముంచెత్తడం, అదే సమయంలో నగరంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుండడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు తెలిపారు. ‘‘పావురాలు, ఏనుగులు అంటూ అవసరం లేని విషయాలపై ముంబైని అధికార యంత్రాంగం ఎటో తీసుకుని పోతోంది. ఇరుకు రోడ్లలో వర్షాల వల్ల పడుతున్న కష్టాల గురించి సీఎంకు వివరించా. రోడ్ల విస్తరణ తద్వారా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే అంశాల గురించి చర్చించా.. అంతే’’ అని రాజ్ ఠాక్రే తెలిపారు. ఈ భేటీలో నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెడుతున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీకి దూరం జరిగి.. సోదరుడు ఉద్దవ్ ఠాక్రేకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి జులై 5వ తేదీన ముంబైలో ఆవాజ్ మరాఠీచి అనే కార్యక్రమం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ ప్రభుత్వం హిందీ భాష అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగా.. అయినాకూడా ఆ అపూర్వ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫడ్నవిస్ వల్లే తాము ఒక్కటయ్యామని, మరాఠీ గౌరవం పేరిట తాము ఇకపై కలిసే పోరాడతామంటూ ప్రకటించారు కూడా. -
Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలం
బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ 2025లో సంచలనం నమోదైంది. పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ లాంటి స్టార్లు ఉన్న మహారాష్ట్రను చిన్న జట్టు ఛత్తీస్ఘడ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ సంజీత్ దేశాయ్ (93) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. శుభమ్ అగర్వాల్, అవ్నీశ్ సింగ్ ధలీవాల్ ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ తలో 3 వికెట్లు తీశారు.అరంగేట్రంలోనే మెరుపు సెంచరీ చేసిన పృథ్వీ షాఅనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా మెరుపు సెంచరీతో (111) ఆదుకోవడంతో 217 పరుగులు చేయగలిగింది. షా రాణించినా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్ఘడ్కు 35 పరుగులు కీలక ఆధిక్యం లభించింది. దేశవాలీ క్రికెట్లో ముంబై తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో షా మహారాష్ట్రకు మారిన విషయం తెలిసిందే.చెలరేగిన మహా బౌలర్లు35 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్ఘడ్.. మహారాష్ట్ర బౌలర్లు విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ (థలో 5 వికెట్లు తీశారు) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది.ఘోరంగా విఫలమైన షా, రుతురాజ్అనంతరం 185 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర అనూహ్యంగా 149 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన పృథ్వీ షా రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బావ్నే ఒంటరిపోరాటం వృధాకెప్టెన్ అంకిత్ బావ్నే ఒంటరిపోరాటం (66) చేసినా మహారాష్ట్రను గెలిపించలేకపోయాడు. 36 పరుగుల తేడాతో ఛత్తీస్ఘడ్ మహారాష్ట్రను ఓడించింది. శుభమ్ అగ్రవాల్ మహారాష్ట్రను దెబ్బేశాడు. -
శతక్కొట్టిన పృథ్వీ షా.. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదంటూ..
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కాంపిటేటివ్ క్రికెట్ పునరాగమనంలో అదరగొట్టాడు. చెన్నై వేదికగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ అరంగేట్ర పోరులో సెంచరీ (141 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. ఈ సందర్భంగా పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కాగా 2021లో టీమిండియా తరఫున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.వేటు వేసిన ముంబై సెలక్టర్లుక్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి, అధిక బరువు తదితర కారణాల వల్ల దేశవాళీ క్రికెట్కూ పృథ్వీ దూరమయ్యాడు. ముంబై సెలక్టర్లు కీలక మ్యాచ్ల నుంచి అతడిని తప్పించడంతో పృథ్వీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో కూడా అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్కు సరైన వారసుడిగా కీర్తించబడిన పృథ్వీ కెరీర్.. అంతే వేగంగా పతనమైంది.ఆదరించిన మహారాష్ట్ర ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్ర (Maharashtra) జట్టుకు మారిన పృథ్వీ షా.. కొత్త ప్రయాణంలో శుభారంభం అందుకున్నాడు. బుచ్చిబాబు రెడ్ బాల్ ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా... ఛత్తీస్గఢ్తో మ్యాచ్లో ‘శత’క్కొట్టాడు. ఛత్తీస్గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం మహారాష్ట్ర జట్టు 73 ఓవర్లలో 217 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ సౌరభ్ (50 నాటౌట్; 5 ఫోర్లు) అండతో పృథ్వీ షా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చత్తీస్గఢ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదుఇక సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ షా తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. ‘‘నేను బాగున్నాను. నిజంగానే బాగున్నా. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరేం పర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది.ఎవరూ లేకపోయినా.. నా కుటుంబం నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినపుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం తమ తమ పనులతో బిజీ అయిపోయారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా!.. ఎవరి పని వాళ్లది.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువనాకు సాయంగా రాలేదని వారిని నేను తప్పుబట్టను. ఏం చేసినా ఒంటరిగానే చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. నిజానికి నాకు అదే మంచిది కూడా!జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఒకసారి ఉన్నత శిఖరాలు.. మరోసారి అధఃపాతాళం. అయినా నేను తిరిగి పుంజుకున్నాను. కాబట్టి అసాధ్యమనేది ఏదీ ఉండదని నమ్ముతాను.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. పనిపట్ల అంకిత భావం ఉంది. ఈ సీజన్లో నేను, నా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అంటూ పృథ్వీ షా తన విమర్శకులకు కౌంటర్ ఇస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్ -
ఈదురు గాలిలో భారీ వాన.. విమానం సురక్షిత ల్యాండింగ్.. ప్రయాణికుల ఆనందం
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.#MumbaiRain #AirIndia Landing at Mumbai airport midst of heavy rain ,Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
monorail: క్రేన్ సాయంతో ప్రయాణికులు బయటకు..
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది ప్రధానంగా మంగళవారం కురిసిన వర్షానికి అక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే ముంబైలోని చెంబూర్-భక్తిపార్క్ మధ్య నడిచే మోనో రైలు ఒకటి సాంకేతిక లోపంతో ట్రాక్పై నిలిచిపోయింది. మెట్రో కంటే తక్కువ పరిమాణంతో పాటు ఎలివేటెడ్ ట్రాక్పై నడిచే మోనో రైల్లో చిన్నపాటి విద్యుత్ అంతరాయ ఏర్పడటంతో మంగళవారం సాయంత్రం సమయంలో ట్రాక్పైనే ఉన్నపళంగా ఆగిపోయింది.సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయిన మోనో రైలు ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అక్కడకు చేరుకుని ప్రయాణికుల్ని క్రేన్ల సాయంతో కిందకు దించింది. అయితే పవర్ సప్లైలో చిన్నపాటి అంతరాయం కారణంగానే ఆ ట్రైన్ నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ ట్రైన్ మరమ్మత్తు చర్యలను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు. అయితే ట్రైన్ ఉన్నపళంగా ట్రాక్పైనే నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అదే సమయంలో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు ఎవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు.#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg— ANI (@ANI) August 19, 2025 -
పృథ్వీ షా 2.0.. సెంచరీతో కొత్త జర్నీ ప్రారంభం
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా కొత్త జర్నీని సెంచరీతో ప్రారంభించాడు. దేశవాలీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. అరంగేట్రం మ్యాచ్లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో షా ఛత్తీస్ఘడ్పై 122 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ ఇన్నింగ్స్లో షా యధేచ్చగా షాట్లు ఆడి కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించాడు. తొలి వికెట్కు సచిన్ దాస్తో కలిసి 71 పరుగులు జోడించిన అనంతరం మహారాష్ట్ర 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షా ఎంతో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు.25 ఏళ్ల షా గత కొంతకాలంగా ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్యలోనే అతన్ని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా..మకాంను మహారాష్ట్రకు మార్చాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి భావి సచిన్గా కీర్తించబడిన షా.. కొద్దికాలంలోనే వివాదాల్లో తలదూర్చి, ఫామ్ కోల్పోయి, క్రమశిక్షణ లేకుండా విపరీతంగా బరువు పెరిగి చేజేతులారా కెరీర్ను నాశనం చేసుకున్నాడు. 2021 జులైలో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడిన షా.. ప్రస్తుతం భారత సెలెక్టర్ల పరిధిలోనే లేడు. మహారాష్ట్రతో ప్రయాణం అతన్ని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తుందేమో చూడాలి. -
యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.ఎస్బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది. -
ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి!
ఆమె విధినిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోడ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయిందామె. అయితే ఆ డ్రైవర్ ఆగకుండా ఆమెనూ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సతారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా.. ఓ ఆటో దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకుని కిందపడిపోయింది. అది గమనించి.. ఆ ఆటోడ్రైవర్ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోగా.. రోడ్డు మీదే కాస్త దూరం లాక్కెళ్లాడు. ఈలోపు.. స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి.. ఆ ఆటోడ్రైవర్ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకు దొరికితే ఛలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ ్రైవర్ దేవ్రాజ్ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. Video: Drunk autorickshaw driver drags woman cop trying to stop him in Maharashtra#Maharashtra #Satara #KhandobaMaal #VIDEO #ViralVideos pic.twitter.com/t7pZivZi35— Princy Sharma (@PrincyShar14541) August 19, 2025 -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్ను తయారు చేయొచ్చు.లెమన్గ్రాస్ ఆయిల్ను రిటైల్ , బల్క్లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం
తన పరిస్థితిపై..మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..తెలంగాణ ఉద్యమంపై..భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగవిుస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది.వికసించిన రాజేశ్వరీ కవిత్వంరాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది.వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజబూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్టాప్ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం.మహారాష్ట్రలో పాఠ్యాంశంరాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం. -
‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.చదవండి: మాంసం దుకాణాలు మూసివేయాలి.. మాకేం సంబంధం? -
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆటగాడు, ముంబై మాజీ ఓపెనర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్గా అంకిత్ బావ్నేను సెలక్టర్లు నియమించారు. మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను కాదని బావ్నేకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. గత రంజీ సీజన్లో త్రిపురతో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ గైర్హజరీలో బావ్నేనే జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అయితే సెలక్టర్లు గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడం వెనక ఓ కారణముంది. ఈ భారత ఓపెనర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెలక్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండడు. అందుకే బావ్నే కెప్టెన్గా నియమించారు.ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర జట్టు తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో ఛత్తీస్గఢ్తో తలపడనుంది.మహారాష్ట్ర జట్టుఅంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్ -
మాంసం దుకాణాలు క్లోజ్.. 'మాకేం సంబంధం'
'ఎవరు ఏం తింటారో తెలుసుకోవాలన్న ఆసక్తి మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయ'ని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంద్రాగస్టు నాడు మాంసం దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలపై విమర్శలు రావడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఫుడ్ చాయిస్పై ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించగా, ముందుగా మొదలు పెట్టింది మీరేనని బీజేపీ కౌంటరిచ్చింది.అసలేం జరిగింది?స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పశువధ శాలలు, మాంసం దుకాణాలు మూసివేయాలని మహారాష్ట్రలోని పలు నగర పాలక సంస్థలు అధికారికంగా ఆదేశాలిచ్చాయి. డోంబివ్లి, కొల్హాపూర్, నాసిక్, ఇచల్కరంజి, జల్గావ్ సహా పలు నగరాల్లో ఇలాంటి ఆదేశాలు వెలుపడ్డాయి. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కూడా ఆంక్షలు ఏమిటంటూ జనంతో పాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. దీంతో సీఎం ఫడ్నవీస్ స్పందించారు.'ఎవరేం తినాలో చెప్పాలన్న ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మా ముందు చాలా సమస్యలు ఉన్నాయ'ని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక దినాల్లో పశువధ శాలలు మూసివేయాలని 1988లో ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీన్ని ఆనవాయితీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశాలు అమలు చేశార'ని వెల్లడించారు. కాగా, పంద్రాగస్టు నాడు కబేళాల మూసివేత ఆదేశాలను శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడే మొట్ట మొదటిసారిగా అమలు చేశారని బీజేపీ పేర్కొంది.కరెక్ట్కాదు: పవార్పంద్రాగస్టు నాడు మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. 'ఇలాంటి నిషేధం సరికాదు. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు పెద్ద నగరాల్లో నివసిస్తుంటారు. మహావీర్ జయంతి, మహాశివరాత్రి పర్వదినాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించినా ప్రజలు ఆమోదిస్తారు. కానీ స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రజలు కోరుకుంటార'ని చెప్పారు.నాన్-వెజ్ తింటా: జితేంద్రచికెన్, మటన్ సహా అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి నాన్-వెజ్ తింటామని ఎన్సీపీ- శరద్పవార్ వర్గం నేత జితేంద్ర అహ్వాద్ ప్రకటించారు. మరోవైపు తమ ఆదేశాలను వెనక్కు తీసుకోబోమని కేడీఎంసీ (KDMC) స్పష్టం చేసింది.హర్షవర్ధన్ ఆశ్చర్యంపంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలను నిషేధిస్తూ వివిధ నగర పాలక సంస్థలు ఉత్తర్వులు జారీ చేయడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తప్పుబడుతూ, ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఏం తినాలో నిర్దేశించి హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన. చదవండి: పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!హైదరాబాద్లోనూ..పంద్రాగస్టు, జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో పశువధ శాలలు మూసివేయాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే చికెన్, చేపల విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు లేవని.. బీఫ్ విక్రయశాలలపై మాత్రమే నిషేధం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిషేధం పంద్రాగస్టును మినహాయించాలని కొంతమంది కోరారు. కాగా, బీఫ్ దుకాణాలు, కబేళాలు సంవత్సరంలో ఏడు రోజులు మూసివేయడం అనేది రెండు దశాబ్దాలకు పైనుంచి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే కొన్ని ప్రత్యేక దినాల్లో బీఫ్ అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని వివరించారు. గాంధీ జయంతి, వర్ధంతి నాడు మటన్ విక్రయించరని చెప్పారు.అమానుషం: అసదుద్దీన్ఆగస్టు 15న కబేళాలను మూసివేయడం అమానుషం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సంతోషకరమైన సందర్భమని, ఇలాంటి రోజున ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరుసగా రెండు రోజులు కబేళాలు మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో, తమ జీవనోపాధి దెబ్బ తింటుందని దుకాణాదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆదేశాలను లా స్టూడెంట్ ఒకరు కోర్టులో సవాల్ చేశారు. -
కబుతర్ జా జా జా!
హైదరాబాద్ చాలా పెద్ద నగరం. కానీ..అబిడ్స్, కింగ్ కోఠీ, అమీర్పేట్ సర్కిల్తోపాటు కొన్ని చోట్ల ఒక దృశ్యం మాత్రం కామన్!ఏమిటయ్యా అదీ అంటే.. టూవీలర్స్, కార్లలో వచ్చి మరీ కొందరు పావురాలకు గింజలు వేస్తూంటారు!నిన్న మొన్నటివరకూ ఇలాంటి దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కనిపించేవి కానీ.. ఇకపై కాదు!ఎందుకంటారా? చదివేయండి..పావురాలకు కాసిన్ని గింజలు వేయడం హైదరాబాద్, ముంబైల్లో మాత్రమే కాదులెండి.. దేశంలోని చాలా నగరాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. జీవకారుణ్యానికి ఇదో పెద్ద నిదర్శనంగా చాలామంది పోజులు కొడుతూంటారు. ఆ పావురాలతో కలిసి రీల్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే పది రోజుల క్రితం ముంబై హైకోర్టు ఈ తంతుకు ఫుల్స్టాప్ పెట్టమని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎవరైనా మాట వినకపోతే.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని కూడా చెప్పింది. పిచ్చుకపై బ్రాహ్మాస్త్రం అన్నట్టు పావురాలకు తిండిపెడితే క్రిమినల్ కేసులు ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పావురాలతో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాల్సిందే. పావురాల వ్యర్థాల దగ్గరే ఉన్నందుకు ఈ మధ్యే గుజరాత్లోని 42 ఏళ్ల మహిళ ఊపిరితిత్తి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో పదకొండేళ్ల బాలుడు పావురాల ఈకలను తట్టుకోలేక న్యుమోనిటిస్కు గురయ్యాడు. ముంబైలోనూ 2020లో ఇద్దరు మహిళలకు ఈ పావురాల కారణంగా ఊపిరితిత్తులు మార్చాల్సి వచ్చింది. అంత సమస్య ఉందన్నమాట ఈ పావురాలతో. ఏదో ముద్దుగా ఉంటాయి. కువకువలాడుతూంటే ముచ్చటేస్తుందని అనుకుంటాం కానీ... వాటితోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం విస్మరిస్తూంటాం. కావాల్సినంత తిండి ఫ్రీగా దొరుకుతూంటే అవి కూడా ఎప్పటికప్పుడు తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నాయి. మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. భవనాల పిట్టగోడలపై, చిన్న చిన్న కంతల్లోకి చేరే పావురాలు అక్కడ వ్యర్థాలను వదులుతూంటాయి. ఎండకు ఎండిన ఈ వ్యర్థాల్లోంచి పుట్టుకొచ్చే ఫంగస్ గాల్లోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చిన వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. మీరు తరచూ జలుబులాంటి సమస్యలు ఎదుర్కొంటూంటే... లేదా ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, తరచూ ఫుడ్పాయిజనింగ్కు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నా... మీ చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉన్నయేమో ఒక్కసారి చూసుకోండి మరి! ఇందుకే ముంబై హైకోర్టు పావురాలకు తిండిపెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశించింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్..ముంబై హైకోర్టు ఆదేశాలకు అక్కడి జైన సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. నోరులేని మూగ జీవాలకు ఆహారం వేయడం తమ మత ధర్మం అంటూ వారు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము పావురాలకు గింజలు వేసి తీరతామని ఎంత జరిమానా వేసిన భరిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ముంబై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ కేసును సోమవారం విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయిల బెంచ్... హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో ఏదైనా సవరణలు కావాలనుకంటే అక్కడికే వెళ్లాలని స్పష్టం చేసింది. చూడాలి ఏమవుతుందో.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
‘నా భార్యను బ్రతికించుకోలేకపోయాను’
నగరం అంటే ట్రాఫిక్ నరకం. ఇది కాదనలేని సత్యం. ఉండటానికి ఫ్లై ఓవర్స్ ఉంటాయి. నేషనల్ హైవేలు సైతం అనుసంధానంగా కూడా ఉంటాయి. కానీ ట్రాపిక్ సుఖం మాత్రం ఉండటం లేదు. ఇక్కడ ఏదో ఒక నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ నగరం చూసినా ఇంచుముంచు ఇదే పరిస్థితి. ఇక వర్షం పడితే ఆ నరకం వర్ణనాతీతం. సాధారణ ప్రజలైతే ఆ నరకాన్ని దాటుకుంటూ ఏదో రకంగా తమ గమ్యాలకు చేరతారు. కానీ ఏదైనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ట్రాఫిక్లో చిక్కుకుంటే మాత్రం ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు మహారాష్ట్రలోని పాల్గర్ ప్రాంతానికి చెందిన దంపతులు. భర్త కళ్ల ముందు భార్య విపరీతమైన నరకయాతన అనుభవిస్తున్న చేసేది లేక అంబులెన్స్లో అలా ఉండిపోయాడు. భార్య పడిన నరకాన్ని కళ్లరా చూసి.. బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. దీనికి కారణం ట్రాఫిక్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను తీసుకుని నేషనల్ హైవే మీద చిక్కుకుపోయిన ఘటన హృదయవిదారకంగా ఉంది.పల్ఘార్కు చెందిన చయ్యా పూరవ్ అనే 49 ఏళ్ల మహిళకు తీవ్రంగా గాయపడింది. చయ్యా పూరవ్ ఇంటి వద్ద ఉన్న ఒక చెట్టు కొమ్ము ఆమెపై విరిగిపడింది. దాంతో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళితే, ముంబైలోని హిందుజా ఆస్పత్రి రిఫర్ చేశారు. దాంతో ఆమెను తీసుకుని అంబులెన్స్లో బయల్దేరాడు భర్త. అయితే నేషనల్ హైవే-48;పై వెళితే అక్కడకు చేరడానికి పెద్ద సమయం పట్టదు. పల్ఘార్ నుంచి ముంబై వెళ్లడానికి అది అనువైన రహదారి కూడా.100 కి.మీ దూరం ఉన్న ముంబైని చేరుకోవడానికి ఎంత లెక్కన వేసుకున్నా రెండు గంటలన్నర కంటే ఎక్కువ పట్టదు. అయితే నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సగం దూరం చేరడానికే మూడు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పటికే ఆమె పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోతోంది. కానీ భర్త ఏం చేసే పరిస్థితి లేదు. ఆ ట్రాఫిక్ను ఛేదిస్తే గానీ భార్య పడే నరకానికి ఫుల్స్టాప్ పెట్టలేడు. ఈ క్రమంలోనే 70 కి.మీ దూరం వెళ్లేసరికి ఆమె సృహలోకి లేకుండా మారిపోయింది. దాంతో అక్కడ ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకు వెళితే ఆమె చనిపోయిందని డాక్టర్టు నిర్దారించారు. ఎంత ప్రేమేగా చూసుకునే భార్య కళ్ల ముందే విలవిల్లాడిపోతుంటే చేసేది లేకుండా పోయిందని భర్త అంటున్నారు. తన భార్య నాలుగు గంటల పాటు తీవ్ర నరకయాతన అనుభవించిందని, అది తన కళ్లతో చూశానని బోరు మంటున్నారు. ట్రాఫిక్ కారణంగానే తన భార్యను కాపాడులేకపోయానని భర్త పూరవ్ కన్నీటి పర్యంతమయ్యారు. అరగంట ముందుగా ముంబై ఆస్పత్రికి వెళ్లినా తన భార్యను కాపాడుకునే వాడినని పూరవ్ బాధాతప్త హృదయంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మాలెగావ్ తీర్పే కాదు, విచారణా విచిత్రమే!
మహారాష్ట్రలోని మాలెగావ్లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పదిహేడేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు నింది తులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే లాహోటీ ఈ ఏడాది జూలై 31న తీర్పు ప్రకటించారు. ఆరుగురి మరణానికీ, వంద మంది దాకా గాయపడటానికీ కారణమైన ఆ నేరం ఎవరు చేశారో ఇప్పటికీ బయటపడలేదు! ఈ కేసు గురించీ, విచారణ క్రమం గురించీ, తీర్పు గురించీ ఆలోచించవలసిన అంశాలెన్నో! ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మాలెగావ్లో ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబులు పేలి, ఆరుగురు మరణించిన ఆ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటి ఎస్)కు అప్పగించింది. అప్పటి ఏటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలో ఆ దర్యాప్తు జరిగి అక్టోబర్–నవంబర్లలో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాజీ నాయ కురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మతాచార్యులు దయా నంద పాండే అలియాస్ స్వామి అమృతానంద, రిటైర్డ్ సైనికాధికారి మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అప్పటికి సైన్యంలో పని చేస్తున్న అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఉన్నారు. వారిలో అత్యధికులు ‘అభినవ భారత్’ అనే సంస్థ సభ్యులనీ, ఆ సంస్థ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో విధ్వంసాలకు పూనుకుంటున్నదనీ ఏటిఎస్ అధి కారి హేమంత్ కర్కరే చెప్పారు. ఈ సంస్థకు, అనుబంధ సంస్థలకు దేశంలో 19 చోట్ల జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని తేలిందని కూడా కర్కరే అన్నారు. అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతా పార్టీ, శివసేనలు ఇదంతా కాంగ్రెస్ పన్నాగమనీ, కేసు దర్యాప్తు ఇలా సాగించిన హేమంత్ కర్కరే ‘దేశద్రోహి’ అనీ ప్రకటించారు. అప్పటి గుజరాత్ సీఎం మోదీ ఏటిఎస్ దర్యాప్తు మన సైనిక బలగాల నైతిక ధృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు. ఈ దర్యాప్తు వివరాలు బయటపెట్టి, నిందితులను అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత ముంబా యిపై తీవ్రవాద దాడిలో హేమంత్ కర్కరేను గురిచూసి కాల్చి చంపారు. ఆయన తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయా రనే అభిప్రాయం ఎంత ఉందో, ఆయన హత్య వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం అంత ఉంది. ఆయన చనిపోగానే తన ‘శాపం వల్లనే చనిపోయాడ’ని సాధ్వి అన్న మాటలు ఆ అనుమానాలకు ఆజ్యం పోశాయి. మరొకవైపు, ఏటిఎస్ 2009 జనవరి 20న పదకొండు మంది నిందితుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పింది. 2011 ఏప్రిల్లో ఈ కేసును ఎన్ఐఏ తన పరిధిలోకి తీసుకుని, 2012లో మరొక ఇద్దరిని అరెస్టు చేసి నిందితుల సంఖ్యను 14కు చేర్చింది. 2016 మేలో ఎన్ఐఏ కొత్త ఛార్జిషీట్ తయారు చేసింది. ‘ఉపా’ చట్టం కింద ఆరోపణలున్నప్పటికీ, 2017లో నిందితులందరూ బెయిల్మీద బయటికి వచ్చారు. 2018లో విచారణ ప్రారంభమయింది. 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత, ప్రాసిక్యూషన్ నేర నిర్ధారణకు తగినంత విశ్వసనీయంగా సాక్ష్యాధారాలను సమర్పించలేదని తీర్పు వెలువడింది.ఆ తీర్పులోనే న్యాయమూర్తి కొందరు కీలకమైన సాక్షులను ఎన్ఐఏ ఉపసంహరించుకోవడం ప్రాసిక్యూషన్ ఉద్దేశాల గురించి ప్రతికూల నిర్ధారణలకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ సాక్షులను ప్రవేశపెట్టి ఉంటే, ఆరోపణలను రుజువు చేయడంలో చాలా ఖాళీలు పూరింపబడేవని అన్నారు. కేసు విచారణకు, నేర నిరూపణకు ఉపయోగపడే సాక్షులను ప్రాసిక్యూషన్ తనంతట తానే ఎలా పక్కన పెట్టిందో తీర్పులో వివరంగా రాశారు. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర నమోదు చేసిన పద ముగ్గురు సాక్షుల వాంఙ్మూలాలు మాయమై పోయాయని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. ఆ పత్రాలు మాయమైనప్పుడు, అవి ఏ మేజిస్ట్రేట్ ముందర నమోదయ్యాయో ఆ మేజి స్ట్రేట్ను విచారించవలసి ఉంటుంది. కాని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే ఇలా ప్రాసిక్యూషన్ తప్పులన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేసిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించినా అవసరమైన సాక్షులను పిలవడానికి తన కున్న హక్కును మాత్రం వాడుకోలేదు! విచారణలో మరొకమలుపు కూడా ఉంది. కేసు మొద లయిన నాటి నుంచీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండిన రోహిణి సాలియాన్ ఈ కేసు విచారణలో వేగంగా సాగవద్దని ఎన్ఐఏ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని 2015లో బయట పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఎన్ఐఏ ప్రాసిక్యూటర్ల జాబితా నుంచి తొలగించారు. ఏటిఎస్ నేతృత్వంలో తాము చాలా బలమైన సాక్ష్యాధారాలు తయారు చేశామని, ప్రస్తుత కేసు ఓటమి సాక్ష్యాధారాల లేమి వల్ల జరగలేదనీ, సంస్థా గత, రాజకీయ నిజాయతీ కుప్పకూలడం వల్ల జరిగిందనీ ఆమె అన్నారు. ‘చట్టాన్ని అమలు చేయ వలసినవారే అధికా రంలో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసం దురుద్దేశాలతో పని చేస్తే న్యాయం పట్టాలు తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అన్నారామె. ఇదీ మన దర్యాప్తు వ్యవస్థల పని తీరు!! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
మరో వందేభారత్కు ప్రధాని మోదీ పచ్చజెండా.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారతదేశపు అత్యంత దూరం ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైలు మొత్తం 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలుకు మొత్తం 10 స్టాప్లు ఉంటాయి. సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.నాగ్పూర్లోని అజ్ని- పూణే మధ్య దీర్ఘ దూరం నడిచే వందే భారత్ రైలు మహారాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్రంలోని 12వ వందే భారత్ రైలుగా నిలవనుంది. ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నంబర్లు 26101/26102. ఆగస్టు 11 నుండి పూణే స్టేషన్ నుండి, ఆగస్టు 12 నుండి అజ్ని స్టేషన్ నుండి తన సాధారణ సేవలను ప్రారంభించనుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.మహారాష్ట్రలోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,సాధారణ ప్రయాణాలు సాగించేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ , దౌండ్ కార్డ్ స్టేషన్లలో ఆగనుంది. ఎనిమిది కోచ్లతో.. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు, మొత్తం 590 మంది ప్రయాణీకులకు కూర్చునేందుకు ఈ రైలు అవకాశం కల్పిస్తుంది. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్ముఖ్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
కళ్ల ఎదుటే ఉన్న అన్నకు చెల్లెలెలాగూ రాఖీ కడుతుంది. ‘అండగా ఉండన్నా’ అంటూ అన్నదమ్ముల్ని అడుగుతుంది. కానీ... కొందరు అన్నలు అక్కడెక్కడో సుదూర మంచు పర్వత సానువుల్లోనో, ఎగిరిపడే రేణువుల ఎర్రటెడారి ఇసుకల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉంటూ అనునిత్యం మన సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్లకు ఏ చెల్లెమ్మలూ కనబడరు. ఏ అక్కలకూ వాళ్లందుబాటులో ఉండరు. అయితే... సొంత అన్నదమ్ములైనా అవసరమైనప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారో రారోగానీ ఆ సోదరులు మాత్రం ఎవరు రాఖీ కట్టినా కట్టకున్నా... శత్రువుల నుంచి నిర్భీతిగా నిత్యరక్షణకవచంలా నిరంతరమూ మనకడ్డుగా నిలబడిపోతుంటారు. వాళ్లే మన సరిహద్దులను అనుక్షణం రక్షిస్తుండే మన ఆర్మీ జవాన్లు! ఆ ఆర్మీ అన్నలకు చెల్లెళ్ల ప్రేమానురాగాలు తప్పక దక్కాలనే సంకల్పంతో కొందరు చెల్లెళ్లు గత 28 ఏళ్లుగా ప్రయాసపడుతునే ఉన్నారు. వాళ్లు పడే ఈ ప్రయాస ప్రాధాన్యమేమింటే... వాళ్లకు అత్యంత ఆనందాన్నిచ్చే ఓ అందమైన శ్రమ. ఆ చెల్లెళ్లు మరెవరో కాదు... మహారాష్ట్ర జలగావ్లోని ‘ఇందిరాగాంధీ సెకండరీ స్కూల్’కు చెందిన విద్యార్థినులు.ఒకటీ రెండేళ్లుగా కాదు... అసిధారావ్రతంలా అచ్చంగా గత ఇరవయ్యెనిమిదేళ్లుగా సైనిక సోదరులకిలా రాఖీలు పంపుతున్నారు. వాటిని ఆ విద్యార్థినులు ఇంకెవరినుంచో తీసుకోరు. మరెక్కణ్నుంచో కొనరు. స్వయంగా తమ చేతులతో ప్రేమగా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన ముడిసరుకులనూ తమ పాకెట్ మనీతోనే కొంటారు. ఇలా ప్రతి ఏడాదీ వాళ్లు కనీసం 28,000 లకు తగ్గకుండా రాఖీలు తయారు చేసి పంపుతూ రక్షాబంధన్ పండుగ వేడుకలకు నిజమైన సంప్రదాయాన్నీ, స్ఫూర్తినీ అద్దుతున్నారు.వంద నుంచి వేలాది రూపాయల వరకు... ఓ చెల్లి తన అన్నకు రాఖీ కట్టాక ఉద్వేగాలను అదుపులో ఉంచుతూ ఆ అన్న తనకున్నంతలో తన చెల్లెలికిచ్చే బహుమతులు వంద రూపాయల నుంచి వేలలో ఉంటాయి. ఉదాహరణకు వంద రూపాయలలోపు వచ్చే రిబ్బన్ర్యాప్లో కట్టిన చాక్లెట్ బాక్స్నో, రెండొందల్లో వచ్చే ఆమె పేరులోని మొదటక్షరమో, ఆమె రాశీచక్రపు గుర్తుతో దొరికే కీచైనో, వెయ్యి రూపాయల విలువైన వన్ గ్రామ్ గోల్డ్ గొలుసో, రెండువేల విలువైన డ్రస్సూ– దుపట్టానో, పదివేల విలువ చేసే పెండెంటో లేదా లక్షల విలువ చేసే నిజం బంగారమో ఏదో ఒకటి రిటన్ గిఫ్టుగా ఇచ్చేందుకు ఇప్పుడు మార్కెట్లో రెడీలీ అవైలబుల్ గిఫ్ట్లు ఎన్నో ఉన్నాయి.మరి ఆ ఆర్మీ అన్నయ్యలేమిస్తారో... ఎర్రటెండల్లో వాచీతో పాటు రాఖీని చూసినపుడు తగిలే చల్లగాలి తెమ్మెరలాంటి హర్షోల్లాసపు ఆహ్లాదభావన ఆ చెల్లెలు అందించే గిఫ్ట్ అయితే... గస్తీ పనిలో భాగంగా పర్వతసానువులపైన పైపైకిపాకేవేళల... మణికట్టుపై కట్టి ఉన్న ఆ రాఖీని చూసినప్పుడు... ఆ తెలిమంచు తెరలపై తన చెల్లెలి ముఖం కనిపిస్తే కంటికి అడ్డుపడే ఆ కన్నీటితెరతోపాటు సంతోషాలు ఉబికి వస్తుండటమే ఆ అన్నయ్యిచ్చే అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్. దేశరక్షణతో పాటు మనకు అది అదనం. – యాసీన్ -
బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన గురువారం గోవా యూనివర్సిటీ సమీపంలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలు కోరుకున్న కులగణన ప్రక్రియను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోందన్నారు.వచ్చే ఏడాదిలో జరిగే జనగణనలో కులగణనను జోడించిందని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు మేలు చేసే ఉద్దేశంతో కేబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం కలి్పంచారన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మహాసభల ద్వారా బీసీల ఐక్యత పెరుగుతుందని.. డిమాండ్లు సాధించుకొనే అవకాశం లభిస్తుందన్నారు. తన మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్రావు ఠాకూర్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తేల్చి జనాభా ఆధారంగా బీసీలకు వాటా అందించాలన్నారు. సదస్సుకు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారం అహిర్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి: జాజుల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేంద్రం చేసిన కులగణన ప్రక టన 100% బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది. -
నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
నాగపూర్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్స్క్వాడ్.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్పుర్ తులసి బాగ్ రోడ్లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence. On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ— ANI (@ANI) August 3, 2025 -
మోదీ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు
ముంబై: 2008 నాటి మాలెగావ్ పేలుడు ఘటన కేసు నుంచి బయటపడిన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులకు పేలుళ్లతో సంబంధం ఉందని చెప్పాలంటూ అధికారులు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతోపాటు చిత్రహింసలు పెట్టారన్నారు. ‘నాపై ఒత్తిడి చేసి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని రాత పూర్వకంగా తీసుకున్నారు. మేం చెప్పినట్లుగా ఆయా పేర్లను చెబితే కొట్టబోమని నాకు మాటలు చెప్పారని’ ఆరోపించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీయే ఆ కుట్ర పన్నిందని, కాషాయాన్ని, సాయుధ బలగాలను అప్రతిష్ట పాలు చేయాలన్న భారీ కుట్ర దీని వెనుక దాగుందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్లు నిర్దోషులు -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
రమ్మీ ఎఫెక్ట్.. మాణిక్కు క్రీడా మంత్రిత్వ శాఖ
సీరియస్గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్గా ఫోన్ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్రావ్ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్ పోలియోలు అప్పగించింది. మాణిక్రావ్ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్సీపీ(పవార్ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు. -
డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025 -
గూగుల్ను అనుసరిస్తూ నేరుగా మురుగుకాలువలోకి
ముంబై: సాఫీగా రోడ్డు ప్రయాణం సాగేలా దారిచూపాల్సిన గూగుల్స్ మ్యాప్స్ యాప్ ఒక్కోసారి ప్రయాణికులను కాలువల్లోకి, చిట్టడవుల చెంతకు చేరుస్తోంది. అలాంటి మరో ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ ఒక మహిళ కారులో వంతెన మీదుగా ప్రయాణించాల్సిందిపోయి పక్కనే ఉన్న మురుగుకాలువలోకి నేరుగా పడిపోయింది. నవీ ముంబైలోని బేలాపూర్లో ఒక ఆడీ కారు కాలువలో పడిన ఈ ఉదంతం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒంటి గంటకు జరిగింది. శుక్రవారం రాత్రి మహిళ ఒంటరిగా ఆడీ కారు లో నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతానికి బయల్దేరారు. బేలాపూర్ వద్ద ఎదురుగా వంతెనను దాటా ల్సి ఉండగా గూగుల్ మ్యాప్స్ మాత్రం పక్కకు వెళ్లాలని తప్పుడు సూచన చేసింది. ఆమె మరో ఆలోచన చేయకుండా యాప్ చెప్పిన దారిలోనే కారును ముందుకు పోనిచ్చారు. హఠాత్తుగా దారి కాస్త మురుగుకాల్వగా మారింది. బేలాపూర్ పేద్ద కాల్వలో కారు పడిపోవడంతో ఆమె కాపాడండంటూ హాహాకారాలు మొదలెట్టారు. స్థానికుల సమాచారంతో మెరైన్సెక్యూరిటీ బృంద సభ్యులు రంగంలోకి దిగి పడవలో వెళ్లి ఆమెను కాపాడారు. -
వామ్మో.. ఎక్స్ప్రెస్వే పై ప్రమాదం.. 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ముంబై: దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్ప్రెస్ వేల్లో ఒకటైన ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 నుంచి 20 వాహనాల వరకూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వీటిలో కనీసం మూడు వాహనాల వరకూ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శనివారం(జూలై 26) మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అంతే కాకుండా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లోనావాలా ఖాందార్ ఘాట్ వద్ద.. ఓ కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వెహికల్ను ఢీకొట్టింది. ఇలా కార్లు చైన్ సిస్టమ్ మాదిరి ఒకదాని వెంటే మరొకటి ఢీకొట్టుకున్నాయి. కంటైనర్.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టిందిఈ ఎక్స్ప్రెస్ వే పై నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వాహనాల రద్దీ ఉంటుంది. అదే వీకెండ్లలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వీకెండ్ కావడంతో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర విభాగాలు హుటాహుటీ ఇక్కడకు చేరుకుని గాయపడ్డ వారికి సహాయక చర్యలు చేపట్టాయి. Monsoon: Wet Concrete + cluster driving without Safe Braking Distance Gap.Worse pileup crash, 15 vehicles…3 similar accident within 10 Days, Krishnagiri, Assam & now this one.@DriveSmart_IN @dabir Mumbai - Pune Expressway pic.twitter.com/3Kdd8pKSpV— Dave (Road Safety: City & Highways) (@motordave2) July 26, 2025 -
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi) -
‘దాడి చేస్తే మరాఠీలో మాట్లాడేస్తారా?’: తమిళ అనుభవాన్ని చెప్పిన గవర్నర్
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న భాషా వివాదంపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి, మరాఠీలో మాట్లాడమంటూ ఆ భాష రానివారిపై దాడి చేస్తే, వారు వెంటనే మరాఠీలో మాట్లాడగలుగుతానా?.. అలా చేస్తే అది మహారాష్ట్రకే హాని కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.తమిళనాడులో తాను ఉన్న సమయంలో ఇలాంటి భాషా వివాదాన్ని చూశానని తెలిపారు. ఒకరోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తాను కారులో ప్రయాణిస్తుండగా, రోడ్డు పక్కన ఒక వ్యక్తిపై పలువురు దాడి చేయడాన్ని తాను చూశానన్నారు. తరువాత తాను జోక్యం చేసుకుని, ఆరా తీయగా, బాధితుడు ఉత్తర భారతదేశానికి చెందిన లారీ డ్రైవర్ అని తెలిసిందన్నారు. అతను హిందీలో మాత్రమే మాట్లాడగలడని, అయితే దాడి చేసిన వారు అతనిని తమిళంలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని తెలుసుకున్నానన్నారు.భాషపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ప్రమాదకరమని గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలను విభజించడమే కాకుండా ఇతరులు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, భాష ఎప్పుడూ హింస లేదా వివక్షకు కారణం కాకూడదని గవర్నర్ పేర్కొన్నారు.మనం మాతృభాషను చూసి గర్వపడుతూనే ఇతర బాషలను కూడా నేర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలను సమర్ధించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ ‘మరాఠీ మన మాతృభాష. అది మనకు గర్వకారణం. అయితే ఎవరైనా మరాఠీలో మాట్లాడాలని బలవంతం చేయడం లేదా వారిపై దాడి చేయడం సరైనది కాదు. మనం కూడా మహారాష్ట్రను దాటి ఎప్పుడైనా బయటకు వెళతాం. అక్కడ ఎవరైనా తమిళం లేదా బెంగాలీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తే మనం ఏం చేయగలం? అని ప్రశ్నించారు. అన్ని భాషలను గౌరవించాలని గిరీష్ మహాజన్ అన్నారు. -
హైవేపై ఇరుక్కుపోవడమెందుకు? కారుతో రైలెక్కండి..
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కెడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో వాహనాల రాకపోకలతో రహదారులు కిక్కిరుస్తాయి. వందలకొద్దీ వాహనాలతో హైవేలు స్తంభిస్తాయి. ఇక కారు వేసుకుని వెళ్లి గంటలకొద్దీ ఆ హైవేలపై ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని సంక్రాంతి సమయంలో మన తెలుగురాష్ట్రాల మధ్య హైవేలపై చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సమయంలో తలెత్తే రద్దీకి కొంకణ్ రైల్వే వినూత్న పరిష్కారంతో ముందుకువచ్చింది. భారతదేశపు మొట్టమొదటి కార్ ఫెర్రీ రైలు సేవను కోలాడ్ (మహారాష్ట్ర), వెర్నా (గోవా) మధ్య ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేవ ద్వారా ప్రయాణికుల తమ ప్రైవేట్ కార్లను రైలు ద్వారా రవాణా చేయనుంది. అదే సమయంలో వాహనదారులు కూడా ఆ రైలుకు జతచేసిన ప్యాసింజర్ బోగీలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని కొంకణ్ రైల్వే పేర్కొంది.గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని ఉంటుంది. ఇంతటి ట్రాఫిక్లో కార్లను రోడ్డు మార్గం ద్వారా కోలాడ్, వెర్నా మధ్య తీసుకెళ్లాలంటే 20–22 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కార్ ఫెర్రీ రైలు సహాయపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 12 గంటలకు తగ్గిస్తుంది.కోలాడ్-వెర్నా కార్ ఫెర్రీ రైలు సర్వీస్ ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోలాడ్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వెర్నా చేరుకుంటుంది. అయితే మూడు గంటలు ముందే అంటే మధ్యాహ్నం 2 గంటలకే కోలాడ్ స్టేషన్ వద్దకు కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రైలులో 20 ప్రత్యేక వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున 40 కార్లు తీసుకెళ్తుంది. అయితే, కనీసం 16 కార్లు అయినా బుక్ అయితేనే ఈ రైలు నడుస్తుంది.ఒక్కో కారుకు సరుకు రవాణా ఛార్జీ రూ.7,875 (వన్ వే) ఉంటుంది. భద్రత కోసం వాహనాలను సురక్షితంగా బిగించి హ్యాండ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంలో కారులో కూర్చునేందుకు ఎవరినీ అనుమతించరు. వాహనదారులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. 3ఏసీ బోగీల్లో ఒక్కొక్కరికి రూ.935 చెల్లించి ఇద్దరు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా మరో వ్యక్తి ఉంటే రూ.190 చెల్లించి స్లీపర్ కోచ్ లో ప్రయాణించవచ్చు. దీని కోసం బుకింగ్స్ జూలై 21 నుంచి ఆగస్ట్ 13 వరకూ అందుబాటులో ఉంటాయి. -
రన్వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025 -
డాగ్ వాకర్గా.. నెలకు ఏకంగా రూ. 4లక్షలు పైనే..
ప్రస్తుత అవసరాలను క్యాష్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేసి లక్షలు ఆర్జించిన వాళ్లెందరో ఉన్నారు. ఇక్కడ కాస్త క్రియేటివిటీ..విభిన్నంగా ప్రత్యేకతను చాటుకోవడమే సక్సెస్ మంత్ర. అలాంటి సీక్రెట్ని ఫాలో అవుతూ ఇక్కడొక వ్యక్తి ఏకంగా సాప్ట్వేర్ ఉద్యోగులనే తలదన్నేలా లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేస్తున్నాడో వింటే తెల్లబోవడం ఖాయం. ఈ విధంగా కూడా ఇంతలా సంపాదించడం సాధ్యమేనా.. ? అనే సందేహం కలుగక మానదు.మహారాష్ట్రకు చెందని ఒక వ్యక్తి డాగ్ వాకర్గా పనిచేస్తూ..రూ. 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ఎంబిఏ డిగ్రీ ఉన్న తన సోదరడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడట. అతడి సోదరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు రూ. 70 వేలు సంపాదిస్తుంటే.. ఈ వ్యక్తి మాత్రం పెంపుడు కుక్కలను టేకర్గా తన సోదరుడి కంటే ఎక్కువ ఆర్జించడం విశేషం. అతడు మొత్తం 38 కుక్కల సంరక్షణను చూసుకుంటాడు. ఒక్కో కుక్కకు రూ. 15 వేళు ఛార్జ్ చేస్తాడట. అలా అతడు నెలకు రూ. నాలుగు లక్షల పైనే ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్గా మారింది. అది సాధ్యమేనా..భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ 2026 నాటికి ₹7,500 కోట్లు దాటుతుందని అంచనా. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్లు , పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పెంపుడు జంతవుల యజమానులు డాగ్ వాకర్, సంరక్షణ నిపుణుల సేవలను కోరుకోవడంతో .. ఇప్పుడు ఇదే ..అత్యంత ఆదాయ మార్గ వృత్తిగా మారింది. ముంబై లేదా పూణే వంటి నగరాల్లోని చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు ₹300 నుండి ₹500 వరకు వసులు చేస్తారట. రోజుకు పది నుంచి 15కు పైగా పెంపుడు జంతువుల బాధ్యత తీసుకుంటే ఇలా లక్షల్లో ఆర్జించడం సాధ్యమే అని అంటున్నారు నిపుణులు. ఆ కేర్ టేకర్లు పెంపుడు జంతువుల సంరక్షణ, డాగ్ వాకింగ్ వంటి ప్రీమియం సేవలకు అనుగుణంగా డబులు వసూలు చేయడం జరుగుతుందట. జంతు యజమానుల నమ్మకాన్ని పొందిన జంతుకేర్ టేకర్లు, కచ్చితమైన షెడ్యూలింగ్తో ఈ రేంజ్లో డబ్బులు సంపాదిస్తారని చెబుతున్నారు. అయితే అధి మొత్తంలో ఆర్జించడం అనేది సంరక్షణ నిపుణుడి తీరు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ ఉద్యోగాలదే డిమాండ్ కాబోలు..!. View this post on Instagram A post shared by The Bharat Briefing (@thebharatbriefing) (చదవండి: ప్రపంచంలోనే అతి సన్నని కారు..! ఎంతటి ఇరుకు సందుల్లో అయినా..) -
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్ లో రమ్మీ ఆడిన మంత్రి
-
నేరం చేశారంటే నమ్మలేం
ముంబై: ముంబైలో 19 ఏళ్ల క్రితం 180 మందికిపైగా ప్రాణాలను బలిగొన్న రైలు పేలుళ్ల కేసులో సోమవారం కీలక పరిణామం సంభవించింది. పోలీసులు నేర నిరూపణలో ఘోరంగా విఫలమయ్యారని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితులు ఈ నేరం చేశారంటే నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం మొత్తం 12 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ‘నిందితుల నేరాంగీకార ప్రకటనలు ఏమా త్రం ఆమోదయోగ్యంగా లేవు. అవన్నీ కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. నేరం అంగీకరించాలంటూ పోలీసులు తమను తీవ్రంగా హింసించారని పేర్కొనడం ద్వారా నిందితులు నేరాంగీకార విశ్వసనీయతను మరింత దెబ్బతీశారు’అని వ్యాఖ్యానించింది. నేరానికిగాను ఏ రకం బాంబులు వాడారనే విషయం కూడా పోలీసులు చెప్పలేకపోయారని, సేకరించిన ఆధారాలు నేరనిరూపణకు సరిపోయేవి కావంది. ‘బాంబులు, సర్క్యూట్ బాక్సుల వంటి స్వాధీనమైన వస్తువులకు సరిగ్గా సీళ్లు వేయలేదు. వాటిని జాగ్రత్తగా భద్రపర్చలేదు. కీలకమైన సాక్షులను ప్రశ్నించడంలోనూ విఫలమైంది’అంటూ ప్రాసి క్యూషన్ తీరుపై విరుచుకుపడింది. నిందితులకు న్యాయపరమైన సాయం అందించకుండానే నేరాంగీకార ప్రకటన రికార్డు చేయడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. నిందితుల నేరాంగీకార స్టేట్మెంట్లలో ఏమాత్రం స్పష్టత లేదంది. పేలుళ్ల కేసుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆప్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్(మోకా)ను వాడకపోవడాన్ని ఎత్తి చూపింది. ‘అసలైన నేరస్తుడిని శిక్షించడం నేర కార్యకలా పాలను అరికట్టడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించే దిశలో ఒక ముఖ్య మైన అడుగు’అని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ల ధర్మాసనం తన 671 పేజీల తీర్పులో పేర్కొంది. ‘అందుకు విరుద్ధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపేలా ప్రాసిక్యూషన్ వ్యవహరించింది. అసలైన ముప్పు ఇప్పటికీ తొలగలేదనే విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది’అని మండిపడింది. ‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టం. అందుకే వారిపై ఆరోపణలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. రైళ్లలో బాంబులు అమర్చడం తదితర నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ప్రకటించిన నలుగురితోపాటు జీవిత కాల జైలు శిక్షలు పడిన ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరిలో మరణ శిక్ష పడిన కమాల్ అన్సారీ 2021లో జైలులోనే చనిపోయాడు. మహానగరం ముంబైలోని స్థానిక రైళ్లు ఏడింటిలో 2006 జూలై 11న పేలుళ్లు సంభవించాయి. ఘటనల్లో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
ముంబై: మహారాష్ట్రలో అధికార ఎన్సీపీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావ్ కొకటే మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సెల్ఫోన్లో రమ్మీ ఆడుతూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో గందరగోళం మొదలైంది. బీజేపీని సంప్రదించకుండా ఎన్సీపీ పక్షం ఏపనీ చేయలేకపోతోంది.దీంతో, పనిలేక ఆ పార్టీ మంత్రులు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల సమస్యల పరిష్కారంపై అధికార పక్షానికి శ్రద్ధ లేదని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మండిపడ్డారు. విమర్శలపై కొకటే స్పందించారు. ‘అసెంబ్లీ సమావేశాల తీరును తెల్సుకునేందుకు నా సెల్ఫోన్ను తీశా. అయితే, అప్పటికే డౌన్లోడ్ చేసిన గేమ్ సడన్గా ఓపెనైంది. దాన్ని క్లోజ్ చేశాను.ఇదంతా కేవలం 5, 10 సెకన్లలోనే జరిగిపోయింది. అంతేతప్ప, గేమ్ను ఆడటానికి ఓపెన్ చేయలేదు’అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, కొకటే ఏప్రిల్లోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా అందిన డబ్బును వివాహాలకే ఖర్చు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. -
నోటీసు పీరియడ్లో ఉండగానే, పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్మెన్కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది. భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్కాల్స్కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు. కిందటి ఏడాది సెప్టెంబర్లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలుఅత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)అనియంత్రిత డెడ్లైన్లుపరిమిత మానసిక ఆరోగ్య మద్దతుముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించి సాయం పొందండి. తెలంగాణలో.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఆంధ్రప్రదేశ్లో.. 1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100జీజీహెచ్ కాకినాడ.. 98499-03870 -
ఆషాఢ జాతర రికార్డు ఆదాయం రూ. 10.84కోట్లు
సోలాపూర్, మహారాష్ట్ర: ఈ ఏడాది ఆషాఢ ఏకాదశి జాతర సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని విష్ణువు అవతారమైన విఠోబా లేదా శ్రీ విఠల రుక్మిణి ఆలయానికి (Shri Vitthal Rukmini Mandire) కానుకలు, విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డుస్థాయిలో రూ. 10.84 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ కమిటీ సహాయ అధ్యక్షుడు గహినీనాథ్ ఔసేకర్ మహారాజ్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా లభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆషాఢ ఏకాదశి జాతరకు అత్యధికంగా 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. లడ్డూ ప్రసాదం, భక్త నివాసాలు, హుండీ ఆదాయం కానుకల రూపేణా వచ్చిన మొత్తం 10.84 కోట్ల ఆదాయాన్ని భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని మేనేజర్ మనోజ్ శృత్రి తెలిపారు. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది! -
ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!
గడ్చిరోలి: మహారాష్ట్ర నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ ఉపవిభాగంలో నక్సల్స్ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: US Woman 16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి -
45 ఏళ్ల తర్వాత.. మళ్లీతెరపైకి సరిహద్దు వివాదం!
స్తబ్దుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆరు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం సైతం సమర్పించారు. ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జివితితోపాటు పలు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టతనివ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.అసలు వివాదం ఇదీ.. 1955–56లో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు. ఈ క్రమంలో భాషా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్–3 ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదీనంలో ఉంటాయని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపిన వివరాల ప్రకారం.. 1980 నుంచి ఆంధ్రప్రదేశ్లో కొనసాగబోమని, మహారాష్ట్రలో విలీనం చేయాలని ఉద్యమం ప్రారంభమైంది. దీంతో 1983లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఏపీకి చెందినవేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని 1990 జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాషా ప్రాతిపదికన విభజించాలని న్యాయవాది, రాజురా ఎమ్మెల్యే వామన్రావు చటప్ ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అసెంబ్లీలోనూ సమస్యను లేవనెత్తారు. వివాదాస్పద గ్రామాలు భాషాపరంగా తమకు చెందుతాయని ‘మహా’సర్కార్ 1993 ఆగస్టు 5న 1990 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై 1996 ఏప్రిల్ 3న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ను వేసింది. అక్కడి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 10338/96 దాఖలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు 1997 ఫిబ్రవరి 12న ఏపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ను ఆగస్టు 21న బేషరతుగా వెనక్కి తీసుకుంది. అయితే ఆ ఉత్తర్వులపై స్థానిక ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ పాలనను కొనసాగిస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేస్తున్నారు. 1965 నుంచి ఆయా గ్రామాలు మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్మోదా గ్రామ పంచాయతీలో ఉండగా, 1990లో మళ్లీ పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాలను విడదీసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కూడా పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.ఇరు రాష్ట్రాల పాలన ప్రస్తుతం 14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇరవై శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. డెబ్భైయ్ శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు.రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు చూపిస్తున్న మహిళలుపట్టాలిస్తేనే.. నలభయ్యేళ్లుగా సాగు చేస్తున్నా నేటికీ భూములకు పట్టాలు లేవు. ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతాం. :::కాంబ్డె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి‘మహా’సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మహారాష్ట్ర సర్కారు 14 గ్రామాలు తమవే అని ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే ఉంటా మని 1980 నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. :::రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడతెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచి్చంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా అందనున్నాయి. తాగునీరు, సాగునీరు తదితర సౌకర్యాలు కలి్పస్తోంది. మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం. :::హడ్సె బాజీరావు, ఇంద్రానగర్ :::కెరమెరి (ఆసిఫాబాద్), సాక్షి ప్రతినిధి -
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
ముంబై: మరాఠీవారిని అవమానిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో ముంబైలోని విక్రోలిలోగల ఒక మార్వాడీ దుకాణదారుడిపై దాడి చేసి, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.రాజ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు మరాఠీ భాష మాట్లాడనివారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో విరివిగా జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరాఠీ దుకాణదారుణ్ణి చుట్టుముట్టి, అతను చేసిన వాట్సాప్ పోస్ట్ గురించి అడగటాన్ని గమనించవచ్చు. తరువాత వారంతా అతనిపై దాడి చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడాన్ని చూడవచ్చు. तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts— MNS Videos (@mnsvideos) July 16, 2025మరాఠీ భాష, సంస్కృతిని అగౌరవపరచవద్దని ఎంఎస్ఎస్ కార్యకర్తలు ఇతరులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. మరాఠీ ప్రజలను అవమానించేవారి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. థానేలో ఫుడ్ స్టాల్ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. గతంలో మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఒక ఆటోరిక్షా డ్రైవర్పై కూడా దాడి జరిగింది. -
ఆ అయిదు రోజుల నిషేధంపై విజయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు. ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..ఒంటరి వేదన నుంచి విముక్తిమహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది. ఆంక్షల నుంచి అవగాహనవైపుగానెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.. -
బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. -
పోచమ్మ బోనాల పండుగ
సాక్షి ముంబై; దాదర్ నాయ్గావ్లోని పద్మశాలీ యువక సంఘం (పీవైఎస్) ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే సాధారణం కంటే భిన్నంగా జంతుబలికి తావు లేకుండా అందరూ శాఖాహార బోనాలే సమర్పించడం విశేషం. బోనాల పండుగ సందర్భంగా లక్ష్మీపతి శర్మ అర్చకత్వంలో ïమిరియాల రోజాగౌతమ్, మంగరి సలోని రాహుల్ దంపతుల చేతుల మీదుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకం, హోమం, దేవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. పండుగ సందర్భంగా మహిళా భక్తులు తలపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. తమ వెంట తెచి్చన పిండి వంటలు, ప్రసాదాలు, ఒడి బియ్యం అమ్మవారికి సమరి్పంచి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అందరిని చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని కోరినట్టు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు సంపిణీ చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో సంస్ధ చైర్మన్ అనబత్తుల ప్రమోద్, మేనేజింగ్ ట్రస్టీ పొన్న శ్రీనివాసులు, కోడి చంద్రమౌళి, తిరందాసు సత్యనారాయణ, అ«ధ్యక్షుడు గంజి సీతారాములు, ఉపాధ్యక్షుడు లక్షేట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సహాయకార్యదర్శులు పేర్ల గీతాంజలి, కోశాధికారి దోర్నాల బాలరాజు, అధ్యాత్మికక సమితి చైర్మన్ దోమల్ శంకర్, కన్వీనర్ పుట్ట గణేశ్, కార్యవర్గ సభ్యులు పగిడిమర్రి సత్యనారాయణ, ఇతర పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు. సాకినాకలో బోనాల సంబరాలు ముంబై సాకినాకాలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. స్థానిక తెలుగు ప్రజలు సంప్రదాయ వేషధారణతో తలపై బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ తల్లికి మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కోళ్లను బలి ఇచ్చారు. తెలుగు మాదిగ మహా సంఘం బోనాలు ముంబైలోని తెలుగు మాదిగ మహా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ కమాటిపురాలోని పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వ్రస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎరుల లక్ష్మణ్, తెడ్డు బాబు రాజన్న, జోగు రాజలింగం, కోశాధికారి గంగడొల్ల రాజరాం, మేకల బాబు, నల్లూరి బాబు, గుమ్మెర్ల ప్రభాకర్, గంగడోల్ల శంకర్, కొత్తూరి రామచంద్ర, మేకల ఆనంద్, గుమ్మెర్ల మధూకర్, జంగం మహేష్, రుల రోజారాణి, మేకల రాజమణి, మేకల శోభ, జోగు కాంతమ్మ, మేకల భారతి, మేకల సప్న, విమల గుండారం తదితరులు పాల్గొన్నారు. -
Tesla: భారత్లోకి ఈవీ దిగ్గజం టెస్లా అఫీషియల్ ఎంట్రీ
-
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్పై దాడి
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విరార్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్పై దాడి చేశారు. ఆ డ్రైవర్ గతంలో ఒక వీడియోలో తాను హిందీ, భోజ్పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇది కొన్నివర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.శనివారం సాయంత్రం విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు ఆ డ్రైవర్ను వెతికి పట్టుకుని, అతనిపై దాడి చేశారు. తరువాత మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను, మరాఠీ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తే, వారికి శివసేన తనదైన శైలిలో సమాధానం ఇస్తుందని జాదవ్ హెచ్చరించారు. #Auto driver assaulted in #Virar for not speaking #Marathi, #UddhavThackeray Sena workers force public apology | Video#ShivsenaUBT #Shivsena #MarathiNews https://t.co/PLsFHzDsN0— IndiaTV English (@indiatv) July 13, 2025కాగా పలువురు ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదికాదన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదు. మహారాష్ట్రలో భాషా రాజకీయాలపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న దరిమిలా.. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది. -
ముదురుతున్న భాషా యుద్ధం
-
నోట్ల కట్టల బ్యాగుతో శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన(షిండే) నేత, రాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సత్ డబ్బు నిండిన బ్యాగుతో కనిపిస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఈ వీడియోను ప్రతిపక్ష శివసేన(యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం పోస్ట్ చేశారు. సంజయ్ షిర్సత్ తన బెడ్రూంలో కూర్చుని సిగరెట్ తాగుతూండగా, పక్కనే నిండా నోట్ల కట్టలున్న బ్యాగు తెరిచి ఉంది. మరో సూట్ కేస్, ఆయన పెంపుడు కుక్క కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘ఆసక్తికరమైన ఈ వీడియోను గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం ఫడ్నవీస్ చూడాలి. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. మహారాష్ట్ర మంత్రి గురించిన చాలా విషయాలు ఈ వీడియోతో తెలుస్తాయి’అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలను సామాజిక న్యాయ శాఖ మంత్రి షిర్సత్ ఖండించారు. ఆ బ్యాగులో కనిపించేవి కరెన్సీ నోట్లు కావు..తన దుస్తులని చెప్పారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో ఆయన వెల్లడించిన ఆస్తుల విలువ రూ.3.3 కోట్లు కాగా, 2024 నాటికి రూ.35 కోట్లకు పెరిగాయంటూ షిర్సాత్ చూపడంపై ఐటీ వివరణ కోరింది. ఐటీ నోటీసుకు తగు విధంగా సమాధానమిస్తానని చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 -
పప్పు పంచాయితీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రోడ్డు పరిశీలనలో అపశృతి.. ప్రాణ భయంతో అధికారుల పరుగో పరుగు..
అధికారుల అవినీతికి అద్ధం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంజినీర్లు, అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ డొల్లతనం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల అవినీతకి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే..వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్వానీ తాలూకాలోని ఖడ్కి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో, ఈ మార్గంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి.. రోడ్డు వేయాలని స్థానికులు, విద్యార్థులు అధికారులను కోరారు. అంత వరకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇంతలో ఓ ఇంజినీరు మాత్రం అతికి పోయి.. అదే మార్గంలో పైపులు వేసి.. రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చిన్న బ్రిడ్జిలాగా పైపులైన్పై రోడ్డు నిర్మించారు. అనంతరం, రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఇంజినీర్, అధికారుల బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం, వారు నిర్మించిన రోడ్డుపై లారీ వస్తున్న సమయంలో.. రోడ్డు కుంగిపోయి.. ఆ లారో బోల్తా కొట్టింది.ఈ క్రమంలో భయంతో వణికిపోయిన అధికారుల బృందం.. పరుగులు తీశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే విధంగా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఓ అధికారి అయితే.. పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి బురద నీటిలో దాక్కునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అధికారుల అవినీతికా ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Engineer and his entire team had arrived in Beed, Maharashtra to inspect the road.During the inspection, a truck got stuck on the road and overturnedThis is the live demo testing of Corruption 🤡pic.twitter.com/InEpS94e3z— 🚨Indian Gems (@IndianGems_) July 10, 2025 -
భక్తిధామం షిర్డీలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలు..!
-
ఎమ్మెల్యే ‘పాచిపోయిన పప్పు’ వివాదం.. క్యాంటీన్ లైసెన్స్ సస్పెండ్
ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్డీఏ చర్యలు చేపట్టింది.ఎఫ్డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ ఉల్లంఘించించింది. హాస్టల్లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది. #WATCH | Mumbai: Food and Drug Administration (FDA) officials took food samples from the Akashvani MLA canteen. Shiv Sena MLA Sanjay Gaikwad thrashed a canteen employee here yesterday, alleging poor quality of food"Samples of paneer, Schezwan chutney, oil and toor dal have been… pic.twitter.com/SZw4hhBRuS— ANI (@ANI) July 9, 2025శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్లో ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. హోటల్పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు. అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు. అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్లు మిస్సవ్వడం, మాక్టెస్ట్ల్లో వెనకబడటం జరిగింది. ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్కి అర్హత సాధించలేకపోయాడు. అయితే హర్షకి ఎన్ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.నేర్చుకున్న జీవిత పాఠాలు..చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తాఅనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు. అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా. (చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!) -
కరెక్ట్ కాదు.. గైక్వాడ్ వీడియోపై ఫడ్నవిస్ స్పందన
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ ఆపరేటర్ను గైక్వాడ్ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్ స్పందించారు. ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్ మీడియాతో అన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ— YourDailyNews (@yourdailynews9) July 9, 2025మరోవైపు సంజయ్ గైక్వాడ్ దాడి వీడియోపై ఉద్దశ్ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్ గైక్వాడ్కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్ గెలుపొందారు.2024 సెప్టెంబర్లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.2024 ఏప్రిల్లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్నాథ్ షిండేకు ఫోన్ చేశారు. ఆపైన గైక్వాడ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్ గైక్వాడ్ మీద కేసు నమోదైంది.తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది.


