ముంబై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఎయిర్ఇండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. ఇండిగో ఫ్లైట్ లాండ్ అయి రన్వేపై వస్తుండగా ఈ ఘటన జరుగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలోని ప్రయణికులకు ఏటువంటి ప్రమాదం తలెత్తలేదు. ఈ ప్రమాదంపై డీజీసీఏ తక్షణమే స్పందించింది. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.


