నాగ్‌పుర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి | Nagpur Blast, SBL Explosives Factory Explosion Kills 15 And Many Injured In Maharashtra | Sakshi
Sakshi News home page

నాగ్‌పుర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

Mar 1 2026 11:07 AM | Updated on Mar 1 2026 11:52 AM

Nagpur Explosion: Deadly Blast At Explosives Unit Claims

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారీ పేలుడు సంభవించింది. కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్‌బీఎల్‌ (SBL) కంపెనీలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు.

ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement