యశవంతపుర(బెంగళూరు): ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధంతో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయినట్లు జేడీఎస్ ఎమ్మెల్సీ భోజేగౌడ తెలిపారు. యుద్ధం నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో ఆయనతో పాటు బెంగళూరుకు రావాల్సిన అనేకమంది చిక్కుకున్నారు. అలాగే బెంగళూరు నుంచి దుబాయ్, అరబ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయినట్లు తెలిసింది. దీని వల్ల వందలాది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇరాన్, సౌదీ, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలకు మళ్లీ ఎప్పుడు విమానాలు వెళ్తాయో తెలియక బెంగళూరు ఎయిర్పోర్టులో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.


