bangalore
-
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్లో కన్నడ బుల్డోజర్స్ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
ఐపీఎల్కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్తో ఫ్యాన్స్ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్ను ఢీకొంటుంది. హైదరాబాద్లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
బెంగళూరుకు చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్ నుంచి వైఎస్ జగన్ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసానికి వెళ్లారు. విదేశీ పర్యటన ముగించుకుని జగన్ వస్తున్నట్లు తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జగన్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
స్పేస్–ఎక్స్ ఉపగ్రహాల తయారీలో తెలుగుతేజం
సోలాపూర్: భారతదేశంలో తొలిసారిగా బెంగళూరుకు చెందిన ఫిక్సెల్ కంపెనీ ఇటీవలే అంతరిక్షంలోకి మూడు ఉపగ్రహాలను పంపింది. ఈ ఉపగ్రహాల తయారీ బృందంలో తెలుగబ్బాయి నీరజ్ గాడి కూడా ఉండటం తమకు గర్వకారణమని స్థానిక తెలుగుప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘మన్కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రస్తావించి అభినందనలు తెలియజేశారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జనవరి 15న విజయవంతంగా... భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ సంస్థ’ ఇస్రో’ మాత్రమే అంతరిక్షంలోకి పంపింది. అయితే తొలిసారిగా బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఫిక్సెల్ ఆధ్యర్యంలో జనవరి 15న అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ప్రఖ్యాత స్పేస్–ఎక్స్ కంపెనీకి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రాజెక్టులో పట్టణానికి చెందిన నీరజ్ గాడి ప్రొడక్షన్ మేనేజర్గా వ్యవహరించారు. ఘన వారసత్వానికి ధీటుగా విజయం.. రాజస్థాన్ లోని బిట్స్పిలానీలో బి. ఇ.(మెకానికల్), ఫ్రాన్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన నీరజ్ గాడి 2022లో ఫిక్సెల్ కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీర్ గా చేరారు. నీరజ్ గాడి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన షాప్ యాక్ట్ కన్సల్టెంట్, అశ్విని సహకార రుగ్నాలయ మాజీ డైరెక్టర్ రామచంద్ర గాడి మనవడు. నీరజ్ తండ్రి ముంబైలోని యూ నియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాల్ గాడి నీరజ్కు బాబాయి అవుతారు. జనార్ధన్ గాడి తనయుడు అలాగే పట్టణంలో సీనియర్ పాత్రికేయుడైన వేణుగోపాల్ గాడి సోద రుని కుమారుడు. ఉపగ్రహాలతో సూక్ష్మ శాస్త్రీయ సమాచారం ఫిక్సెల్ కంపెనీ‘ హైపర్ స్పెక్ట్రల్ పిక్చర్‘కు సంబంధించిన అంశాలపై పనిచేస్తుంది. కాగా ఈ కంపెనీ పంపిన ఉపగ్రహాలు భూమిపై ఉన్న వివిధ వస్తువుల ఫోటోలను తీస్తాయి. సుమారు 200 రకాల రంగుల్లో చిత్రాలను వీటి ద్వారా సంగ్రహించవచ్చు. దీని ద్వారా చెట్లు, పంటలు, నేల, గాలి, నీరు మొదలైన అంశాలపై గురించి సూక్ష్మశాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. -
స్టార్ హీరోను కలిసిన సీఎం..
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.తాజాగా శివరాజ్ కుమార్ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శివరాజ్ కుమార్ను కలిసిన సీఎం..శివరాజ్ కుమార్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. -
‘మాజీ ఎమ్మెల్యేతో నాకు డీల్స్’
మండ్య: బెంగళూరుతో సహా పలుచోట్ల నగలు, నగదు మోసగించిన కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ సంచలన వ్యాఖ్యలు చేసింది. జిల్లాలోని మళవళ్ళి మాజీ ఎమ్మెల్యే డాక్టర్.కే. అన్నదాని, నా మధ్య ఒక వ్యవహారం జరిగింది. ఇప్పుడాయన నేనెవరో కూడా మరిచిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి డిప్రెషన్లో నన్ను మరిచిపోయారేమో అని హేళన చేశారు. మండ్యలో సైబర్ క్రైం పోలీసు స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు. నాకు– అన్నదానికి కొన్ని వ్యవవహారాలు జరిగాయి. అన్నదాని మంచివారు అని ఆయన అనుచరులు చెప్పుకోనివ్వండి. క్రిమినల్స్, మోసగాళ్లు తప్పుడు మాటలు చెబుతారు. నేను ఎవరు అనేది ఆయన మరిచిపోయారు. అన్నదాని నాకు ఒంటరిగా దొరకాలి, అప్పుడు నేను ఎవరు, ఎలా పరిచయం అయ్యాను, ఆయనకు– నాకు మధ్య జరిగిన డీల్స్ ఏమిటి అని గుర్తు చేస్తాను అని మండిపడింది. దీనిపై కేసు పెట్టినా భయపడను, ఆయనకు ధైర్యం నా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి అని సవాల్ చేసిం -
తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్! (ఫోటోలు)
-
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు. -
శ్రీరాములును పైకి తెచ్చింది నేనే
సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో, అందులోను ఉమ్మడి బళ్లారి కాషాయ దళంలో చీలికలు ప్రస్ఫుటమయ్యయి. ఒకనాటి ఆప్త మిత్రులు నేడు కత్తులు నూరడం గమనార్హం. మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మధ్య విమర్శలు తీవ్ర తరమయ్యాయి. శ్రీరాములు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, ఆయన రాజకీయంగా ఎదిగేలా చేసింది నేనే. బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లని, కానీ నాపై ఆరోపణలు ఎందుకు చేయాలి? ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారన్నది ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కర్మ ఎవరిని వదలదని, తనను కూడా వదలదని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని వేదాంతధోరణిలో అన్నారు. శ్రీరాములుకు బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకోనీ, నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఢిల్లీ నాయకుల సహకారంతోనే తాను మళ్లీ బీజేపీలోకి వచ్చానన్నారు. 40 ఏళ్ల కిందట పరిస్థితి ఏమిటి? 40 సంవత్సరాల క్రితం శ్రీరాములు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆయన ఎదగడానికి తాను ఎంతో శ్రమించానని గత పరిణామాలను జనార్దనరెడ్డి ఏకరువు పెట్టారు. అప్పట్లో శ్రీరాములుపై ఓ మర్డర్ కేసు ఉండేదని, ఆయన్ను సన్మార్గంలోకి తీసుకుని వచ్చాను. ఎమ్మెల్యే, మంత్రి కావడానికి పాటుపడ్డాను. మొళకాల్మూరులో నిలబడినప్పుడు ఒక్క రోజు అయినా అక్కడ ప్రచారం చేశారా? మరి నేను అక్కడే మకాం వేసి గెలిపించలేదా అని అన్నారు. శ్రీరాములు కాంగ్రెస్లో చేరే యత్నాల్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోందని జనార్దనరెడ్డి చెప్పడం విశేషం. తాను నోరు విప్పితే విచారణ సంస్థలు వచ్చి తనిఖీ చేయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. శ్రీరాములుకు ఢిల్లీ పెద్దల పిలుపు సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి శ్రీరాములు పనిచేయకపోవడమే కారణమని పార్టీ ఇన్చార్జి రాధామోహన్దాస్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం, దీంతో శ్రీరాములు.. గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ అధిష్టానం మేలుకుంది. గురువారం బళ్లారిలో ఉన్న శ్రీరాములుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. మాటల యుద్ధం ఆపాలని, ఢిల్లీకి వచ్చి అంతా మాట్లాడాలని సూచించారు. వచ్చే వారంలో తాను ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తానని శ్రీరాములు బదులిచ్చినట్లు సమాచారం. అలాగే పలువురు రాష్ట్ర సీనియర్లతోనూ ఫోన్ చర్చలు జరిగాయి. -
సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: హోం మంత్రి జీ. పరమేశ్వర రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న డిమాండ్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం హోదాలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?సిలికాన్ సిటీ బెంగళూరు దారుణాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. గతవారం ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. నిన్న(సోమవారం) సాయంత్రం తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళపై ఇద్దరు అగంతకులు హత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ పేరుతో మహిళను తమ వాహనంపై ఎక్కించుకున్నారు. అనంతరం, నిర్మానుష్య ప్రదేశంలో బాధితురాలి వద్ద ఉన్న డబ్బు, నగల్ని దోచుకున్నారు. ఆపై దారుణానికి ఒడిగట్టారు. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని చేస్తున్న ప్రతిపక్షాల డిమాండ్పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? కేసులు నమోదు కాలేదా? మహిళలకు రక్షణ కల్పించాలి. కానీ సమాజంలో జరిగే చెడు పట్ల మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు. సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్బెంగళూరు సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు గణేష్, శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు బాధిత మహిళ నుంచి డబ్బులు దోచుకునేందుకు యత్నించారు. కానీ బాధితురాలి వద్ద డబ్బులు లేకపోవడంతో బదులుగా లైంగిక చర్యల్లో పాల్గొనేందుకు మహిళ అంగీకరించినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు దోపిడీ, లైంగిక వేధింపులకు సంబంధించినది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం’ అని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద అన్నారు. -
విషాద మలుపుల ప్రేమ
కృష్ణరాజపురం: బెంగళూరులో ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల పెళ్లయిన యువతి, అవివాహిత యువకుడు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ప్రేయసిని ఓ ప్రియుడు చంపిన ఘటన కుందలహళ్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు.. ఉజ్మాఖాన్, ఇమ్దాద్ బాషా, ఇద్దరూ టెక్కీలుగా పనిచేసేవారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమను వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ విడాకులు తీసుకుని మళ్లీ తమ పాత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గత నెల 30న కుందలహళ్లిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏదో విషయానికి వాగ్వాదం జరగడంతో ప్రియుడు ఇమ్దాద్ బాషా ఆమెను గొంతు పిసికి చంపేశాడు. చాలా గంటలపాటు అక్కడే ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తామిద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేశాడు.పోస్టుమార్టంలో ఇలాబంధువులు చేరుకుని చూడగా ఉజ్మాఖాన్ మరణించి ఉంది, అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఇమ్దాద్ బాషా మెసేజ్ చేయడానికి 10 గంటల ముందే ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇమ్దాద్ బాషాను అదుపులోకి తీసుకున్న హెచ్ఏఎల్ పోలీసుల విచారణలో మరొక టెక్కీ యువకునితో ఉజ్మాఖాన్ చనువుగా ఉంటోందని, అతనిని పెళ్లి చేసు కుంటానని చెప్పడం వల్లనే తాను ఆమెను చంపేసినట్లు ఒప్పకున్నాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ప్రారంభం
శివాజీనగర: బెంగళూరులో శుక్రవారం ప్రారంభమైన అమెరికా కాన్సులేట్ కార్యాలయం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. స్థానిక జేడబ్ల్యూ మారియెట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల సమక్షంలో భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కాన్సులేట్ ప్రారంభాన్ని ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తనకు కర్ణాటకతో విడదీయరాని అనుబంధముందని చెప్పారు. అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడారు. ‘ఎస్ఎం కృష్ణ సీఎం, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి గత 24 ఏళ్లుగా కాన్సులేట్ కార్యాలయం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయనతోపాటు నేను కూడా ఉన్నాను’అని అన్నారు. దీనిపై కరా్టటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందిస్తూ.. గతంలో ఎందరు ప్రయత్నించినప్పటికీ ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాతే కాన్సులేట్కు మార్గం సుగమమైందంటూ ఎదురుదాడికి దిగారు. తాను కూడా అప్పటి అమెరికా రాయబారితో మాట్లాడినట్లు మాజీ సీఎం కుమారస్వామి సోషల్మీడియాలో అప్పటి ఫొటోలను పోస్ట్ చేశారు. -
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్స్ట్రాగామ్లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లాది రూపాయల అక్రమాల ఆరోపణలపై ఈడీ అధికారులు రెండవ రోజు బుధవారం కూడా తనిఖీలు కొనసాగించారు. పాలికె చీఫ్ ఇంజినీర్ బీఎన్.ప్రహ్లాద్రావ్ ఆఫీసులో సోదాలు చేశారు. బీబీఎంపీ చీఫ్ అకౌంటెంట్ బీనా ను విచారించారు. పాలికె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 8 వలయాల చీఫ్ ఇంజినీర్లను పాలికె ఆఫీసుకు పిలిపించి కూలంకుషంగా సమాచారం రాబట్టారు. బొమ్మనహళ్లి, ఆర్ఆర్.నగర, మహదేవపుర, యలహంక, దాసరహళ్లి నియోజకవర్గాల్లోని 68 వార్డుల్లో 9,558 బోర్వెల్స్ తవ్వారు. దీంతో పాటు 976 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు లెక్కలు చూపారు. కానీ వెయ్యి బోర్లను తవ్వకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లాదిరూపాయల్ని కైంకర్యం చేశారని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.400 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. -
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
China HMPV Virus: భారత్లో తొలి కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు: భారత్లో చైనాకు చెందిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు వైద్యులు గుర్తించారు. చైనా (China)లో హెచ్ఎంపీవీ (HMPV)వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.🚨 India reports first case of HMPV virus; an 8-month-old baby tests positive in Bengaluru. pic.twitter.com/M5y9QJsYwP— Mohit khemariya 🗿 (@Mohitkhemariya_) January 6, 2025ఏమిటీ హెచ్ఎంపీవీ?హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.వ్యాప్తి ఇలా..దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.నివారణ ఇలా..తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.వైరస్ సోకినవారు బయట తిరగకూడదు. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు రిలీఫ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత బెయిల్పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.మా సస్పెన్షన్ ఎత్తివేత..బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్కు జతగా విలాసవంతమైన హ్యాండ్బ్యాగ్తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్తో తన స్టయిల్కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్ఫిట్కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ధరించిన పింక్ హ్యాండ్బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
భార్య కేసు పెట్టిందని.. 40పేజీల డెత్నోట్ రాసి
బనశంకరి: భార్య తనపై కేసు పెట్టిందనే ఆవేదనతో భర్త 40 పేజీల డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్ (35) మారతహళ్లి మంజునాథ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తాడని సమాచారం. ఇతని భార్య గొడవపడి యూపీలో పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.కుమార్తెకు కానుక కొనుగోలుఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్నోట్ రాసి, పలు రకాల డాక్యుమెంట్లను జత చేసి ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. తన ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఏయే పనులు జరిగాయి, పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందులో రాశాడు. చివరి క్షణంలో తన నాలుగేళ్ల కుమార్తె జ్ఞాపకం రావడంతో ఒక కానుకను కొనుగోలు చేసి ఉంచాడు. దానిని ఆమెకు ఇవ్వాలని రాశాడు. ఈ డెత్నోట్ను సుప్రీంకోర్టుకు పంపాలని కోరాడు.3 రోజుల నుంచి సన్నాహాలుగత మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. డే1, డే 2, డే3 ఏమేం చేయాలి అనేది ఇంట్లో బోర్డు మీద కాగితాల్లో రాసి అతికించాడు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలి అని గుర్తు చేసుకున్నాడు. ఇక న్యాయం జరగడమే మిగిలి ఉంది అని ఆంగ్లంలో రాశాడు. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్నోట్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యూపీలోని భార్య, కుటుంబానికి సమాచారం అందించారు. అతడు సున్నిత మన స్కుడని, కుటుంబ గొడవల వల్ల తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యాడని, అందువల్లే ఇలా చేశాడని పలువురు నెటిజన్లు సానుభూతి తెలిపారు. -
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)