ఎయిరిండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్ డోర్‌ తెరిచేందుకు యత్నించి.. | Mid Air Scare On Air India Express Flight Flier Tries To Open Cockpit Door | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్ డోర్‌ తెరిచేందుకు యత్నించి..

Sep 22 2025 3:37 PM | Updated on Sep 22 2025 4:29 PM

Mid Air Scare On Air India Express Flight Flier Tries To Open Cockpit Door

బెంగళూరు: ఎయిరిండియా(Air India) విమానంలో కలకలం రేగింది. కాక్‌పిట్ డోర్(Cockpit Door)  తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్‌ అవుతుందన్న భయంతో పైలట్‌ డోర్‌ తెరవలేదు. పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఎయిరిండియా(IX-1086) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. భద్రత పరంగా కాక్‌పిట్ డోర్‌ను తెరవాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, కెప్టెన్ అనుమతిస్తేనే ప్రవేశం సాధ్యమవుతుంది. ఆ ప్రయాణికుడు డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

అయితే, ఆ ప్రయాణికులు ఎందుకు కాక్‌పిట్‌ను తెరవడానికి ప్రయత్నించాడో ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. వారిని విమానం వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్(Central Industrial Security Force) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిరిండియా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇదీ చదవండి: యిరిండియా ఘటన: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement