breaking news
Air India
-
మళ్లీ డ్రాగన్తో విమాన బంధం!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించను న్నాయి. నాలుగేళ్లుగా ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను త్వరలో పునరు ద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టియాజిన్ సిటీలో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరు ద్ధరణ బాటలో పయనిస్తుండటం విశేషం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపె డా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించనున్నాయని, అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాలుగు సరిహద్దు రాకపోకల మార్గాల గుండా సరకు రవాణాకు ఇరుదేశాలూ మొగ్గు చూపుతు న్నవేళ నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.నూతన ఎయిర్సర్వీసుల ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇది ఒకవేళ ఖరారుకాక పోయినాసరే పాత విధానంలో విమాన సర్వీసులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి దేశీయ పౌర విమానయా సంస్థలు ఇకపై నేరుగా చైనాకు విమాన సర్వీసులను మొదలెట్టాలని మోదీ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది. గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్..
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులను కలవరపెట్టింది. విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, అదృష్టం కొద్దీ బతికిపోయామని ఆయన సోమవారం తెలిపారు. ‘ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2455లో బయల్దేరాం. నాతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులున్నారు. విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్ను చెన్నై ఎయిర్పోర్టుకు మళ్లిస్తున్నట్లు కెపె్టన్ ప్రకటించారు. అందరిలోనూ భయం నెలకొంది. అక్కడా ల్యాండింగ్కు వెంటనే అనుమతి లభించకపోవడందో విమానం రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండైంది. అందరం ఊపిరి పీల్చుకున్నాం’అని కేసీ వేణుగోపాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కెపె్టన్ ముందు చూపువల్ల తాము బతికి బయటపడ్డామని, అదృష్టవంతులమని చ్పెఆరు. అయితే.. విమానంలో భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీసీఏ, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే వేణుగోపాల్ ప్రకటనపై ఎయిరిండియా స్పందించింది. ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే.. రన్వేపై మరో విమానం ఉండటం వల్ల విమానంగాల్లో చక్కర్లు కొట్టలేదని, చెన్నై ఏటీసీ సూచన మేరకే అలా చేయాల్సి వచి్చందని తెలిపింది. ‘ప్రియమైన వేణుగోపాల్గారు అనుమానిత సాంకేతిక సమస్య, అననుకూల వాతావరణం వల్ల చెన్నైకి మళ్లింపు జరిగింది. అయితే ల్యాండింగ్ ప్రయత్నంలో ఏటీసీ ఒక రౌండ్–అరౌండ్ సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా నిర్వహించేందుకు మా పైలట్లు బాగా శిక్షణ పొందారు. వారు ప్రామాణిక విధానాలను అనుసరించారు. అలాంటి అనుభవం కలవరపెడుతుందని మాకు అర్థమైంది. మళ్లింపు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’అని పేర్కొంది. కాగా, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 8:17 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. 10:35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1:40 గంటలకు బయలుదేరి 3:58 గంటలకు ఢిల్లీ చేరుకుంది. -
రతన్ టాటా ఏంటో అమెరికాకు తెలుసు! ఇవాళ ఆయన ఉండి ఉంటేనా..
భారత దేశ చరిత్రలో అహ్మదాబాద్ ఎయిరిండియా AI171 విమాన ప్రమాదంపై అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై అమెరికా న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ మధ్యాహ్నా సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కొద్దిసెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది.. కింద ఉన్న మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యంపై అమెరికాకు చెందిన న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా కంపెనీ మాజీ చైర్మన్, దివంగత రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారాయన. రతన్ గనుక ఉండి ఉంటే.. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవి కావని అన్నారాయన. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాకు రతన్ టాటా అంటే ఏంటో తెలుసు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల ఆయన కనబరిచే శ్రద్ధ, వాళ్ల బాగోగుల గురించి ఆయన చేసే ఆలోచనలు.. వీటి గురించి అమెరికా ప్రజలకు కూడా కొంత తెలుసు. ఒకవేళ ఆయన గనుక ఇవాళ ఉండి ఉంటే.. ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బాధితుల పట్ల దయగుణం కచ్చితంగా ప్రదర్శించేవారు’’ అని అన్నారాయన. ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం ఆండ్రూస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక బాధిత కుటుంబం దీనావస్థను ప్రస్తావిస్తూ.. వయసుపైబడి మంచాన ఉన్న ఓ తల్లి ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీదే ఆధారపడి బతుకుతోంది. అలాంటి కొడుకు ఎయిరిండియా ప్రమాదంలో మరణించాడు. ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదు. మరి ఇప్పుడు ఆమె వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారు? ఆమె పరిస్థితి ఏంటి? అని ఆండ్రూస్ అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ఓ ట్రస్ట్ నెలకొల్పి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిరిండియా ప్రతిజ్ఞ చేసింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను తిరిగి నిర్మిస్తామని పేర్కొంది. జులైలో.. తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలను ఎయిరిండియా విడుదల చేసింది. ఆ సొమ్మును 147 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు, విమానం కూలడంతో నేల మీద మరణించి మరో 19 కుటుంబాలకు పరిహారంగా అందజేశారు. ఈ సొమ్మును తుది పరిహారంలో మినహాయిస్తామని కూడా ప్రకటించారు. అయితే పరిహారం అందడంలో జాప్యంతో.. బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాయి.2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు సమర్పించింది. అందులో.. • ఇంధన కంట్రోలర్ స్విచ్లు టేకాఫ్ తర్వాత సెకన్ పాటు ఆగిపోయాయి, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.• ఇంజిన్లు గాల్లోనే ఆగిపోవడం వల్ల విమానం కుప్పకూలింది.• 32 సెకన్లలోనే విమానం క్రాష్ల్యాండ్ అయింది.ఆ సమయంలో ఒక పైలట్ ఇంధనం ఎందుకు సిచ్ఛ్ ఆఫ్ చేశావని మరో పైలట్ను ప్రశ్నించాడు. నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడతను.మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా.. విమానం అప్పటికే కూలిపోయింది.విమాన ప్రమాదానికి FADEC (Full Authority Digital Engine Control) సిస్టమ్లో లోపం కారణమైతే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని లాయర్ మైక్ ఆండ్రూస్ తెలిపారు. అలాకాని పక్షంలో ఎయిరిండియాదే గనుక బాధ్యత అయితే.. మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రెండూ ఉన్నట్లు గనుక తేలితే.. అప్పుడు పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారయన. -
‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. త్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్’ పోస్టులో తెలియజేశారు. అదొక భయంకర ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు.వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికే బయలుదేరడానికి ఆలస్యం అయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురయ్యింది. దీంతో దానిని చెన్నైకి మళ్లించారు. ‘త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455లో నేను, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మేమంతా విషాదానికి దగ్గరగా వచ్చాం. ఆలస్యంగా బయలుదేరిన విమానం తరువాత భయంకరమైన ప్రయాణానికి దారి తీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేమంతా కుదుపులకు గురయ్యాం. దాదాపు గంట తర్వాత కెప్టెన్ విమానంలో సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి, దానిని చెన్నైకి దారి మళ్లించారు. అయితే విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశాం. మొదటి ప్రయత్నంలో అదే రన్వేపై ఒక విమానం ఉండటంతో మా విమానం ల్యాండ్ కావడం సాధ్యం కాలేదన్నారు. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ నైపుణ్యం, అదృష్టం కారణంగానే మేమంతా ప్రాణాలతో బయటపడ్డామని’ వేణుగోపాల్ పేర్కొన్నారు. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, అలాంటి లోపాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. రన్వేపై మరో విమానం ఉండటం వల్ల ఈ విమానం ల్యాండ్ కాలేదని, చెన్నై ఏటీసీ సూచనల మేరకు తరువాత ఆ విమానం ల్యాండ్ అయ్యిందని తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. గత జూన్ 12న అహ్మదాబాద్లో చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మరో 19 మంది ఇతరులు మృతి చెందారు. నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్జ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025 -
ఎయిర్ ఇండియా విమానంలో.. ‘దురదృష్టవశాత్తూ’ బొద్దింకలు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్లైన్ తెలిపింది.ఎయిర్ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు సౌకర్యవంతంగా కూర్చున్నారు.ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. -
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో నిలిపివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతికపరమైన లోపం కారణంగా టేకాఫ్ను నిలిపివేసింది. ఆటో-థ్రోటిల్ పనిచేయడంలో విఫలం కావడంతో, విమానం తిరిగి తనిఖీల కోసం నిలిచిపోయింది. సోమవారం ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంకేతికపరమైన లోపం తలెత్తింది.విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రన్వే 29ఆర్లో ప్రారంభమైన టేకాఫ్ రోల్ సమయంలో ఆటో-థ్రోటిల్ వ్యవస్థ ఆశించిన విధంగా పనిచేయలేదు. దీంతో కెప్టెన్ దాదాపు 60 నాట్ల వేగంతో టేకాఫ్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సంబంధిత ఇంజనీర్లతో సంప్రదించి, నిర్దిష్ట నిర్వహణ విధానం కింద తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డౌన్లోడ్ కోసం విమానాన్ని తిరిగి దాని స్థానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పరిశోధించేందుకు ప్రస్తుతం ఇంజనీరింగ్ తనిఖీలు జరుగుతున్నాయి. #Flight stopped at the time take off due to technical problems164 passengers are in flightNo information about alternative arrangementsJustice Battu Devanand, Judge of AP High Court is travelling in the flight. pic.twitter.com/po4wPHYzKe— endla janardhan (@endlajanardhana) August 4, 2025సాంకేతిక లోపం తో ఢిల్లీ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో.. ఈ ఘటన జరిగిన సమయంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. విమానంలో వృద్దులు, చిన్నారులు , మధుమేహ రోగులు ఉన్నారని, వీరికి తక్షణం ఆహారం అందించాలని విమాన సిబ్బందిని ఆయన కోరారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆహారం అందించారు. -
భద్రతా ఉల్లంఘనల్లో ఎయిరిండియా సెంచరీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిరిండియాలో దాదాపు 100 భద్రతా ఉల్లంఘనలు జరిగాయని భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఎయిర్లైన్ గురుగ్రామ్ స్థావరంపై డీజీసీఏ ఈ నెల 1 నుంచి నాలుగువరకు ఆడిట్ నిర్వహించింది. కార్యకలాపాలు, విమాన షెడ్యూలింగ్, రోస్టరింగ్ మరియు ఇతర కీలక విధులను పరిశీలించింది. ఈ సందర్భంగా అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. విమానయాన సంస్థ సిబ్బంది శిక్షణ, విధులు, విశ్రాంతి కాల నిబంధనలు, సిబ్బంది సామర్థ్యం, ఎయిర్ఫీల్డ్ అర్హత వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. వీటిలో ఏడు ఉల్లంఘనలను లెవల్–1గా వర్గీకరించారు. ఇవి తక్షణ దిద్దుబాటు చర్య అవసరమయ్యే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా తెలిపింది. అంతేకాదు.. మార్పులకు అఉగుణంగా బోయింగ్ 787, 777 పైలట్లకు ఎయిరిండియా శిక్షణ ఇవ్వలేదని గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే విషయంపై నివేదికను సమరి్పంచాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఆడిట్ నివేదిక అందింది: ఎయిరిండియా డీజీసీఏ ఆడిట్ నివేదిక తమకు అందిందని ఎయిరిండియా ధ్రువీకరించింది. నిర్ణీత గడువులోగా స్పందిస్తామని తెలిపింది. ‘‘అన్ని విమానయాన సంస్థలకు ఆడిట్లు జరుగుతాయి. అందులో భాగంగానే ఎయిరిండియా వార్షిక డీజేసీ ఆడిట్ జూలైలో జరిగింది. ఇందులో కనుగొన్న విషయాలను మేం అంగీకరిస్తున్నాం. నిరీ్ణత సమయ వ్యవధిలోపు మా ప్రతిస్పందనను, తీసుకున్న దిద్దుబాటు చర్యలను డీజీసీఏకు సమరి్పస్తాం. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు మా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది’’అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ ప్రమాదం తరువాత.. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ కూలిపోయిన తర్వాత ఎయిర్లైన్పై తీవ్ర పరిశీలన జరిగిన నేపథ్యంలో ఆడిట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ నెలలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా సెకన్ల వ్యవధిలో ఆగిపోయిందని తెలిపింది. రెండు ఇంధన స్విచ్లు కొన్ని సెకన్ల వ్యవధిలో ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మారాయని నివేదిక పేర్కొంది. ‘ఎందుకు ఆపేసావు?’అని ఒక పైలట్.. మరో పైలట్ను అడగ్గా, తాను అలా చేయలేదని మరో పైలట్ బదులివ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయ్యింది. -
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. గతనెల 12న అహమ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు. విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు. ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు. (చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..) -
Air India: టేకాఫ్ అయిన పావుగంటకే..
అహ్మదాబాద్ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్ ఎయిర్పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు.. కేరళ కాలికట్(కోజికోడ్) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్ ఎయిర్పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. -
ప్రాణాలు తీస్తున్న డ్రీమ్ లైనర్.. బోయింగ్ విమానాల తయారీలో తక్కువ క్వాలిటీ
-
ఎయిరిండియా ఘటన.. ఆ మృతదేహాలు మా వాళ్లవి కావు
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది. ‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.అసలు మృతదేహాలు ఎక్కడా?కానీ డీఎన్ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదుమృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.260 మంది ప్రయాణికులు దుర్మరణంఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియాడీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు. -
ఎయిరిండియా విమానంలో మంటలు.. భద్రతపై ఆందోళన
-
టేకాఫ్ రద్దు.. తప్పిన విమాన ప్రమాదం
న్యూఢిల్లీ: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి కోల్కతాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రన్వేపై వేగంగా వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని సకాలంలో గుర్తించడంతో టేకాఫ్ను రద్దు చేశారు. ఆ సమయంలో గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేందుకు పైలట్లు బ్రేకులు వేసి, ప్రమాదం జరగకుండా చూశారు.సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కోల్కతాకు బయలుదేరాల్సిన ఏఐ2403 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు తమ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించి టేకాఫ్ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన దరిమిలా ప్రయాణీకులంతా దిగిపోయారని, ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఈ ఘటనకు ముందు ముంబైలో కొచ్చికి వెళుతున్న విమానం వర్షంలో తడిసిన రన్వేను తప్పించుకుని, విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం తలెత్తింది. ఒక ఇంజిన్తో పాటు రన్వే కూడా దెబ్బతింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.ఇదిలావుండగా గత ఆరు నెలల్లో ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలియజేసింది. గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతిచెందారు. 11ఏ సీటులో ఉన్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. -
ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
-
రంగంలోకి ఆర్ఎస్ సంధు!
ఎయిరిండియా విమాన దుర్ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో పైలట్లకు భాగస్వామ్యం కల్పించాలని, సాంకేతిక నిపుణులను కూడా తీసుకోవాలని భారత ఎయిర్లైన్ పైలట్ల సంఘం(ఆల్పా ఇండియా) తీవ్రంగా పట్టుపడుతోంది. పైలట్ల సంఘం ఈమేరకు తమ డిమాండ్లను పలుమార్లు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ముందుంచింది. దీంతో ఏఏఐబీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎయిరిండియాలో గతంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పనిచేసిన మాజీ పైలట్ కెప్టెన్ ఆర్ఎస్ సంధును ఏఏఐబీ రంగంలోకి దించుతోంది. గత నెల 12న అహ్మదాబాద్ వద్ద ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం కూలిపోయి 260 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విమాన దుర్ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్న బృందంలో ‘డొమైన్ ఎక్స్పర్ట్’గా చేరాలని ఆర్ఎస్ సంధును ఏఏఐబీ కోరిందని, అందుకు ఆయన అంగీకరించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. వైమానిక రంగంలో విశేషానుభవం గడించిన, విషయ పరిజ్ఞానం గల నిపుణుడిగా (డొమైన్ ఎక్స్పర్ట్)గా ఆర్ఎస్ సంధుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎయిరిండియాలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆర్ఎస్ సంధుకు విమానయాన పరిశ్రమలో దాదాపు 39 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంది. ఎయిరిండియాలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో సేవలందించారు. 2013లో ప్రత్యేకించి బోయింగ్ 787-8 విమానాల శ్రేణికి పరిశీలకుడిగా (డెజిగ్నేటెడ్ ఎగ్జామినర్)గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ‘ఏవియాజియోన్’ పేరుతో ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోయింగ్ 787 విమానాల విషయంలో ఆర్ఎస్ సంధుకు సుదీర్ఘానుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నందున ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ఆయన మరింత లోతుకెళ్లడంతోపాటు దర్యాప్తుకు విశ్వసనీయత కల్పిస్తారని భావిస్తున్నారు. మరోవైపు- దర్యాప్తులో సహకారం అందిస్తున్న ఇతర ‘డొమైన్ ఎక్స్పర్ట్స్’ పేర్లను ఏఏఐబీ వెల్లడించలేదు. సంజీవ్ కుమార్ సింగ్ (56) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు చేస్తోంది. - జమ్ముల శ్రీకాంత్AAIB Engages Captain RS Sandhu as AI Expert for Ahmedabad Plane Crash InvestigationAAIB Engages Captain RS Sandhu as AI Expert for Ahmedabad Plane Crash Investigation -
రన్వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025 -
టేకాఫ్ అయిన ఎనిమిది నిమిషాలకు..
శంషాబాద్ (హైదరాబాద్): టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఫుకెట్ విమానం వెనక్కి తిరిగి వచి్చంది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్–110 విమానం (బోయింగ్ 737) శనివారం ఉదయం 6.41 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి థాయిలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరేందుకు టేకాఫ్ తీసుకుంది. విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు.ఉదయం 6.49 గంటల సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. ఏటీసీ అనుమతి మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 6.57 గంటలకు సురక్షితంగా దించారు. సాంకేతిక సమస్యల సర్దుబాటు అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి ఫుకెట్ విమానం బయల్దేరినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు. ‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఫ్యూయల్ స్విచ్లను తనిఖీ చేయించండి: డీజీసీఏ ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. -
‘నో కామెంట్’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్లైన్కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్పిట్ వాయిస్లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో, హస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025 -
కేంద్రం చేతికి ఎయిరిండియా ఘటన ప్రాథమిక నివేదిక
భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం✈️ ప్రాథమిక నివేదిక కేంద్రానికి చేరింది. త్వరలో ఇందులోని వివరాలను ప్రజల కోసం బహిర్గతం చేసే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం సెకన్ల వ్యవధిలోనే నేలకూలి పేలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు 270 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికార వర్గాలకు అందజేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఇప్పటిదాకా సేకరించిన విషయాలను, దర్యాప్తు తాలుకా వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాథమిక నివేదికలో ఏం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విమాన ప్రమాదానికి కారణాలు అందులో ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం చివర్లో ఈ నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. 📌 ప్రమాదం వివరాలు:తేదీ: జూన్ 12, 2025 మధ్యాహ్న సమయంవిమాన నంబర్: AI-171 (బోయింగ్ 787 డ్రీమ్లైనర్)స్థలం: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన వెంటనే, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందిమృతులు: 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు సహా మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు🧾 ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు?..బ్లాక్బాక్స్ డేటా విజయవంతంగా డౌన్లోడ్ చేసి విశ్లేషణ ప్రారంభించారుకాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారుపైలట్ మేడే కాల్లో “నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్” అని చెప్పిన ఆడియో రికార్డు దొరికింది✈️ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు జూలై 8న అందజేసింది.🔍 తదుపరి దర్యాప్తు:AAIB నివేదికను ఆధారంగా తీసుకుని పూర్తి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాల్సిందిగా కేంద్రం ఆదేశించిందిమరోవైపు ఎన్ఐఏ కూడా కుట్ర కోణంపై విచారణ ప్రారంభించింది -
Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. -
Air India Plane: ఒక్కసారిగా 900 అడుగుల కిందకు.. విచారణకు ఆదేశం!
ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది. ఇది జూన్ 12వ తేదీన జరిగిన ఘటన. అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.అసలు విషయంలోకి వెళ్లే.. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్ సిగ్నల్ వెళ్లింది పైలట్లకు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్కతా ఎయిర్పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. -
విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్
న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై అన్ని కోణాలలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ ప్రమాదం దరిమిలా ఎయిర్ ఇండియా విమానం ఏI 171లోని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని అన్నారు.విమాన ప్రమాదం దురదృష్టకర సంఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో ఏదైనా విద్రోహ చర్య ఉందా? అనే అంశంతో పాటు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లను సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని, పలు సంస్థలు విచారణలో భాగస్వామ్యం వహిస్తున్నాయని మోహోల్ తెలిపారు. జూన్ 12న లండన్కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 ఫ్లీట్కు చెందిన ఏI 171 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ ప్రమాదాన్ని మంతి మురళీధర్ మోహోల్ అరుదైన కేసుగా అభివర్ణించారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదంటూ, అనుభవజ్ఞులైన పైలట్లు, నిపుణుల వాదనలను ఆయన గుర్తుచేశారు. విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ ఘటనపై నివేదిక మూడు నెలల్లో వస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్ను పరిశీలన కోసం విదేశాలకు పంపుతారనే వాదనలను మోహోల్ తోసిపుచ్చారు. -
విమానం రెక్కలో ఇరుక్కున్న గడ్డి
ముంబై: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్కు క్లియరెన్స్ ఇచ్చామంది. అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది. -
బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్..
న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్ సంస్థలు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్ఫార్మేషన్) ప్రణాళికలను అమలు చేస్తోంది.2024 నవంబర్లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ ఎయిర్లైన్స్ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా.. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్ మీదుగా వెళ్లే విమానాలు రద్దు
గల్ఫ్ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది.మరోవైపు, ఖతార్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్ తెలిపింది. కాగా, ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది.కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. -
ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది
సాక్షి, హైదరాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు.. -
DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. -
ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?
బాలీవుడ్ నటుడు, కమెడియన్ విర్ దాస్ (Vir Das) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్ వేశాడు.పీఆర్ స్టంట్?నేను లండన్ నుంచి ఇంటికి ఎయిరిండియా (Air India) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్ స్టంట్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మా తాత..దాంతో విర్ దాస్.. తనది పీఆర్ స్టంట్ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్ను డిలీట్ చేశాడు.అప్పుడు కూడా ఇంతే!జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్ దాస్ ఎయిరిండియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్ చేశాడు. I flew Air India home from London. It was all great. The crew, happy to report, still the kindest in the sky. @airindia— Vir Das (@thevirdas) June 20, 2025 చదవండి: కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా? -
Air India Flight: విమానంలో వైద్యురాలు హల్చల్
కర్ణాటక: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో వాగ్వాదం జరిపి నిందించిన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన కెంపేగౌడ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కెంపేగౌడ ఎయిర్పోర్టు నుంచి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఐఎక్స్ 2749 విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది. యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్ భాయ్ తనకు కేటాయించిన సీట్ నంబర్– 20లో కూర్చోడానికి ముందు ముందు వరుసలో ఉన్న సీట్లో తన బ్యాగులను ఉంచింది. దీన్ని ప్రశ్నించిన సిబ్బందితో ఆమె తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. అందరినీ నిందిస్తూ బాంబు పెట్టి విమానాన్ని పేల్చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయింది. పైలట్, విమాన సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆమె తగ్గలేదు. తోటి ప్రయాణికులతో కూడా గొడవ పడింది. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. #ViralVideo… pic.twitter.com/aQMeuyUyfj— PulseNewsBreaking (@pulsenewsbreak) June 19, 2025 -
ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్లైన్స్గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి. -
ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు
ఢిల్లీ: భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.రద్దయిన విమానాలు:AI906 (దుబాయ్–చెన్నై)AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)AI2204 (దుబాయ్–హైదరాబాద్)రద్దయిన డొమెస్టిక్ విమానాలుAI874 (పుణె–ఢిల్లీ)AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)AI2872 (హైదరాబాద్–ముంబై)AI571 (చెన్నై–ముంబై)కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్సర్-బర్మింగ్హామ్, ఢిల్లీ-బర్మింగ్హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. -
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్
-
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025 -
ఎయిరిండియా రద్దుల పర్వం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్కు వెళ్లాల్సిన డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. -
ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు!
న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్ 17) వరుసపెట్టి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు శాన్ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు. -
టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్ల్సాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-పారిస్ విమానంలో సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కాగా, తాజాగా ఢిల్లీ-పారిస్ విమానాన్ని రద్దు చేశారు. మంగళవారం(జూన్ 17) నాడే మూడు ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఆ తర్వాత అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం, ఇప్పుడు ఢిల్లీ-పారిస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేయాల్సి వస్తుంది. ఇటీవల జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం బీజే మెడికల్ హాస్టల్పై కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. అందుకు తగ్గట్టే ఆ సర్వీసుల్లోనే వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో మరింత భయం పుట్టిస్తోంది ప్రయాణికుల్లో. గత 48 గంటల్లో వరుసగా 9 విమానాల్లో సాంకేతిక లోపాల్ని గుర్తించారు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
-
హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం
కోల్కతా: అహ్మదాబాద్ విషాద ఘటన మరవకముందే.. ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత శనివారం.. గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికులు కలవరపాటుకు గురైన సంగతి తెలిసిందే. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు.తాజాగా, మరో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న ఎయిరిండియా విమానం (AI 180).. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్కతా ఎయిర్పోర్ట్కు చేసుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తగా.. సిబ్బంది వెంటనే గుర్తించి అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.#AirIndia #Kolkata #Mumbai #SanFrancisco #Ahmedabad pic.twitter.com/Sbj0JjHMlG— Diksha singh (@DikshaSingh7522) June 17, 2025కాగా, నిన్న(సోమవారం) కూడా.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టేకాఫ్ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం హాంకాంగ్లో క్షేమంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ315 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.16 గంటలకు హాకాంగ్ నుంచి బయలుదేరింది.8.50కి టేకాఫ్ కావాల్సిన విమానం.. అప్పటికే మూడున్నర గంలు ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరువాత విమానం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు విమానాన్ని హాంకాంగ్లో ల్యాండ్చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ సమస్య ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా ప్రమాదం తర్వాత బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్తో సంబంధం ఉన్న జెట్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇది రెండోసారి. ఆదివారం.. చెన్నైకి వస్తున్న బ్రిటన్ ఎయిర్వేస్ డ్రీమ్లైనర్ కూడా సాంకేతిక సమస్య కారణంగా లండన్కు తిరిగి వెళ్లింది. -
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. -
సాంకేతిక లోపంతో రన్వేపై ఆగింది!
గువాహటి: అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరవకముందే గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికుల్ని హడలెత్తించింది. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు. శనివారం రాత్రి 9.20 గంటలకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో రన్వేపై ఆపేశారు. ప్రయాణికులు రెండుసార్లు విమానం దిగాల్సి వచ్చింది.దీనిపై దుమ్మెత్తిపోసతఊ వారు పోస్ట్ చేసిన వీడియోలు వైరలయ్యాయి. ‘‘అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో మమ్మల్ని కిందికి దిగమన్నారు. చౌక హోటల్లో వసతి కల్పించారు. కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. ఆదివారం ఉదయం 9.30కు విమానం ఎక్కించి, కాసేపటికే మళ్లీ దించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.34కు మరో విమానంలో కోల్కతా బయలుదేరాం’’ అని ఓ ప్రయాణికుడు తెలిపారు. వారి ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. ‘‘నగరంలోని బెస్ట్ హోటల్లో వసతి కల్పించాం. మా సిబ్బందీ అందులోనే ఉన్నారు’’ అని చెప్పింది. సమస్యలేమిటో మాత్రం వెల్లడించలేదు. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
లక్నో: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (జూన్15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా (IX 1511) విమానం కోల్కతాకు బయల్దేరాల్సి ఉంది.అయితే,ఎయిర్పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. తిరిగి విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. -
‘171’ నంబర్కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ‘ఏఐ171’అనే నంబర్ కలిగిన బోయింగ్ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగించాయి.ఇక, అహ్మదాబాద్–లండన్ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్తో పిలువనున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్171’నంబర్ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్ ఇండియా పైలట్ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది: విమానయాన మంత్రిత్వ శాఖ
-
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
ఈమె పేరు రోశ్నీ రాజేంద్ర సొంఘారే! ఎయిర్ ఇండియాలో ఫ్లయిట్ అంటెండెంట్! ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా! మబ్బుల్లోంచి దూసుకెళ్లే విమానంలో ప్రపంచమంతా చుట్టేయాలని చిన్నప్పటి నుంచీ కలలు కంది!ఆమె చిన్నప్పడు అమ్మ గోరుముద్దలు పెడుతూ చెప్పే కథల్లో అంశాలేవైనా విమానాన్నే ఊహించుకునేది! చేయి పట్టుకుని నాన్న బజారుకు తీసుకెళ్తే.. విమానం బొమ్మ కనిపించిన షాప్ దగ్గరల్లా ఆగేది!అందుకే జ్ఞానం వచ్చాక ఆమె ఎయిర్ హోస్టెస్ అవుతాననే నిర్ణయాన్ని వినిపించినప్పుడు అమ్మానాన్నలు ఆశ్చర్యపోలేదు! సంతోషంగా దీవించారు! వాళ్లది ఆర్థికంగా ఉన్న కుటుంబమేమీ కాదు. సర్దుబాటు చేసుకోగల పరిస్థితులూ లేవు. అయినా కూతురి ఆశను తుంచేయలేదు. తమ రెక్కలు ముక్కలు చేసుకునైనా కూతురి కోరికకు రెక్కలు తొడగాలనుకున్నారు. అయితే.. వాళ్లను కష్టపడనివ్వలేదు రోశ్నీ! ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకుంది. పైసా పైసా కూడబెట్టుకుంది. చిన్న చిన్న సరదాలు, సంతోషాలనూ దూరం పెట్టింది. తన కల కోసం అమ్మానాన్నల మీద భారం మోపద్దనేదే ఆమె తాపత్రయం. మొత్తానికి కూడబెట్టుకున్న డబ్బుతో ఫ్లయిట్ అటెండెంట్ ట్రైనింగ్ పూర్తి చేసింది. స్కై లవ్స్ హర్ నిన్న మొన్నటి (2025, జూన్ 12) దాకా ఎయిర్ ఇండియాలోనే ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. ఆమె కోరుకున్నట్టుగానే కొత్త ప్రదేశాలెన్నిటినో చుట్టొచ్చింది. చూసొచ్చిన ప్రతి ప్రాంతం దగ్గర ఓ ఫొటో తీసుకుని, ఆ ఫొటో సహా ఆ ప్రాంతపు ముచ్చట్లను ‘స్కై లవ్స్ హర్’అనే పేరుతో ఉన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసేది. రోశ్నీ పోస్ట్లు చూస్తే తెలిసిపోతుంది.. ప్రయాణాలంటే ఆమెకెంత ఇష్టమో! చాలా చురుకైన అమ్మాయి. ముంబైలో వాళ్లుండే డోంబివ్లీ ఈస్ట్లోని నవ్ ఉమియా క్రుపా సొసైటీలో ఏ చిన్న వేడుకైనా ఉత్సాహంగా పాల్గొనే రోశ్నీని తలచుకుని బాధపడనివాళ్లు లేరు. View this post on Instagram A post shared by Roshni Songhare 🌹 (@sky_loves_her) -
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డీఆర్లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
గాల్లో ప్రాణాలు
దేశంలో విమానయాన నియంత్రణ సంస్థ అయిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) పాత్రపైనే ఇపుడు అనివార్యంగా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రయా ణికుల భద్రత పట్ల ఉపేక్ష, జాగ్రత్త, ఆదుర్దా కనబరచక పోవడం డీజీసీఏ స్వభావంగా మారిపోయింది. విమాన భద్రతా ఉల్లంఘనలు 2008 నుంచి వేలాదిగా చోటుచేసు కుంటున్నా అది వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు పయనించగలిగిన బోయింగ్ 777–200, 777–300–ఇ.ఆర్. విమానాలను ఎయిర్ ఇండియా రంగంలోకి దించింది. భారత్ నుంచి అమెరికా వెళ్ళే విమానాలకు 16 గంటల వరకు సమయం పడుతుంది. దాంతో ఎయిర్ ఇండియాకు చెందిన సుదూర శ్రేణి విమానాలకు అప్పటి డీజీసీఏ నసీమ్ జైదీ కఠిన నిబంధనలను నిర్దేశించారు. కానీ, ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానాలతో భారత్ నుంచి ఆస్ట్రేలియాకి సర్వీసులు మొదలు పెట్టిన పుడు ఎగువ నిబంధనలను అప్పటి డీజీసీఏ మార్చే సింది. అది ఆకాశయాన భద్రతా ప్రమాణా లను గాలికొదిలేసింది. ఇది అటు ప్రయాణికు లతో పాటు ఇటు విమాన సిబ్బంది ప్రాణాలకు కూడా చేటు తేవడమే అవుతుంది. డ్రీమ్ లైనర్ను ఆ విధంగా ఉపయోగించడం వల్ల ప్రమాదానికి లోనయ్యే అవకాశం అనుమతించిన సాధారణ పరిమితులకు మించి 25 రెట్లు పెరిగిందని ఎయిర్ ఇండియాకూ తెలుసు. కానీ, ఆ నివేదికను ఎయిర్ ఇండియా, డీజీసీఏ రెండూ మరుగు పరిచేశాయి. ఆ రూటులో సుర క్షిత పయన నిబంధనలు ఉల్లంఘనలకు గుర వుతున్న సంగతి ప్రయాణికులకు తెలియలేదు. డిజైన్ దశలోనే లోపాలుఅలాగే, 787 డ్రీమ్లైనర్లు ఇంకా డిజైన్ దశలో ఉన్నప్పుడే,ఇంకా వాటి గగన సామర్థ్యాలను పరీక్షించకముందే ఎయిర్ ఇండియా వాటి కొనుగోలుకు ఆర్డరు పెట్టేసింది. ఎయిర్ ఇండియా సమకూర్చుకున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ల ప్రారంభపు ఆకాశయానాల్లోనే వాటి భద్రత, ఇంజినీరింగ్కు సంబంధించి అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. విమాన సిబ్బందికి విమాన భద్రతా నిబంధనలను రూపొందించడంలో డీజీసీఏకున్న అధికారాలను సవాల్ చేస్తూ, నేను బొంబాయి హైకోర్టులో 2013–14 రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశాను. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నేను వేసిన రిట్ పిటి షన్లకు అటు డీజీíసీఏ గానీ, ఇటు ఎయిర్ ఇండియా గానీ 2019 వరకు జవాబులు దాఖలు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరో దిగ్భ్రాంతికరమైన సంగతి ఏమిటంటే, విమాన సిబ్బందికి విమాన సురక్షిత నిబంధనలను జారీ చేసే, లేదా రూపొందించే అధికారం డీజీసీఏకు 2016 సెప్టెంబర్లో మాత్రమే లభించింది. అదీ 1937 నాటి విమాన నిబంధనలోని 42–ఎ సెక్షనుకు సవరణ తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన సురక్షిత నిబంధనలను తుంగలో తొక్కుతున్నా డీజీసీఏ వాటిని కప్పిపుచ్చుతూ వచ్చిందని దీనిద్వారా స్పష్టమవుతోంది. డీజీíసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ నేను చాలా క్రిమినల్ కేసులు పెట్టాను. విమాన సురక్షిత ప్రమాణాలు ఉల్లంఘనలకు లోనవుతున్న సంగతిని ట్రయల్ కోర్టు అయినా పట్టించుకుంటుందని ఆశతో ఆ పని చేశాను. ఎందుకంటే, ఆ లోపాలు ప్రయాణికులు, విమాన సిబ్బంది... ఇద్దరి ప్రాణాలకూ ముప్పు తెచ్చేవిగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం తర్వాతనైనా, కోర్టు మేల్కొని, విమాన సురక్షిత నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించిన సంబంధిత డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై కఠిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ఎయిర్ ఇండియా మాజీ సీనియర్ అధికారి, కె.వి.జె. రావు- (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)కారణాలు ఏమిటి?అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఏఐ 171 కూలిపోయి కొన్ని గంటలే అవుతోంది. దాదాపు 260 మందికి పైగా బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఊహాగానాలు అప్పుడే జోరందుకున్నాయి. కొన్ని సమాచార సాధనాలు దీన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తు న్నాయి. ఈ విషాదకర ఘటనపై నా అభిప్రాయాలు తెలుపవలసిందని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ కోరింది. నేను అందుకు అంగీకరించి, ‘‘దీనిపై ఊహాగానాలకు పాల్పడటం తొందరపాటు అవుతుంది’’ అని మాత్రమే చెబుతానన్నాను. ఫలితంగా, వారు నాతో ఆ ఇంటర్వ్యూను జరపనే లేదు. ఊహాగానాలు చేసేందుకు నేను విముఖంగా ఉండటమే బహుశా అందుకు కారణం కావచ్చు.ఈ ఘోర విపత్తుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అందరిలాగా నాకూ కుతూ హలం ఉంది. కానీ ఇంత త్వరగా బాహాటంగా ఊహాగానాలు చేయడం–అందులోనూ ఆధారాలు స్వల్పంగా ఉన్న సమయంలో–ఎవరికీ ప్రయోజనకారి కాదనిపించింది. అది హానికరం కూడా! పురాతన తవ్వకాల మాదిరిగా... మొదట అగ్ని జ్వాలలను ఆర్పి, బతికున్న వారికోసం అన్వేషణ పూర్తయిన పిదపనే వైమానిక ప్రమాద దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అలాంటి దుర్ఘటనలు జరిగినపుడు ప్రాణాలతో ఉన్నవారు, క్షతగాత్రుల గురించి మొదట పట్టించు కోవాలి. తర్వాత, ప్రమాద స్థలికి వెళితే సురక్షితమేనని, ఇబ్బందేమీ ఉండదని ప్రకటించాలి. అనంతరం, చనిపోయిన వారిని గుర్తించడం ఆరంభమవుతుంది. ప్రమాదంపై దర్యాప్తునకు సమాంతరంగా, బాధితులను గుర్తించే పనిని వేరే సంస్థ చూసుకుంటుంది. దర్యాప్తులో పాలుపంచుకునేది కేవలం ప్రభుత్వ అధికారులే కాదు, సదరు విమానాన్ని తయారు చేసిన సంస్థ (ప్రస్తుత సందర్భంలో బోయింగ్) దర్యాప్తునకు సహాయపడేందుకు తన ప్రతినిధులను పంపుతుంది. ప్రయాణికులు ఏయే దేశాలకు చెందినవారో ఆ యా దేశాలు కూడా కొందరిని పంపవచ్చు. ప్రమాదం సంభవించిన దేశంలోని పరిశో ధకులు, వైమానిక దుర్ఘటనలపై దర్యాప్తు చేయడంలో మరింత అనుభవం ఉన్న ఇతర దేశాలకు చెందినవారి సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇన్వెస్టిగేటర్లు శిథిలాల నుంచి బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డాటా రికార్డర్లు, కాక్పిట్ వాయిస్ రికార్డర్)లను వెతికి పట్టుకోవడాన్ని ప్రాథమిక బాధ్యతగా భావిస్తారు (అహ్మదాబాద్లో వైద్య కళాశాల హాస్టల్ మెస్ పైకప్పు మీద బ్లాక్బాక్స్ను గుర్తించారు). విమానం గురించిన డేటా కూడా వీటిల్లోఉంటుంది. విమానం ఎలా పని చేస్తోందో, పైలెట్లు ఏం చెబుతున్నారో తెలుస్తుంది. బ్లాక్ బాక్స్లను వెలికి తీసినంత మాత్రాన విమానం కూలిన ఘట నలో దర్యాప్తు పూర్తయినట్లు కాదు. విమాన ప్రమాద దర్యాప్తు పురావస్తు తవ్వకాల లాంటిదే! ఒక పద్ధతి ప్రకారం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సిన పని అది. ఆధారాలను సేకరించి తదుపరి విశ్లేషణకు వాటిని భద్రపరచకపోతే, విలు వైన ఆధారాలను ఎప్పటికీ కోల్పోయినట్లే లెక్క. దర్యాప్తు అధికారులు సాక్షుల వాఙ్మూలాలను, ఆ ఘటనకు సంబంధించి వారు ఏవైనా వీడి యోలు తీసి ఉంటే వాటిని సేకరిస్తారు. వారి విశ్లేష ణను కంపెనీ డాక్యుమెంటేషన్, శిక్షణ, నియంత్రణ సంస్థ పేర్కొన్న నియమ నిబంధనలను పాటించడం గురించిన సమాచారంతో పోల్చి చూసుకుంటారు. విమాన ప్రమాదాలలో దాదాపు 80 శాతానికి ‘మానవ అంశాలే’ కారణం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంటున్న మానవఅంశాలు: మానవుల సామర్థ్యాలు, గుణగణాలు, పరిమితులు, వారు ఉపయోగించే విధివిధానాలు, పరికరాలు, ఎలాంటి వాతావరణంలో పనిచేస్తు న్నారు లాంటివి! ఈ దుర్ఘటనపై పూర్తి ఫోరెన్సిక్ దర్యాప్తు సమగ్ర రూపంలో చేతికందడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో 2023లో సీ వరల్డ్ హెలికాప్టర్ కూలిన ఘటనపై తుది నివేదిక ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైంది. ఊహాగానాలు–నిందలువిమాన ప్రమాదానికి కారణం కాగల అంశాలపై హానికరమైన ప్రజా ఊహాగానాలకు సంబంధించి సుదీర్ఘ చరిత్రేఉంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్–370 విమానం 2014 మార్చి 8న గగనతలం నుంచి అదృశ్యమైంది. ఆ ఘటనకు దాని చీఫ్ పైలట్ జహారీ అహ్మద్ షాయే బాధ్యుడంటూ ప్రచారం జరిగింది. షాతోపాటు ఆ ఘటనలో 238 మంది చనిపోయారు. ఆ ప్రచారం తనను చాలా బాధకు గురిచేస్తోందని షా సోదరి సకీనబ్ షా 2016లో సి.ఎన్.ఎన్.కు ఇచ్చినఇంటర్వ్యూలో వాపోయారు. ఆ ప్రమాదానికి తన సోదరుడిని ‘బలిపశువును’ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇదమిత్థంగా కారణాలు తెలియకుండానే, ప్రమాదాలకు అలా ఎవరెవరినో బాధ్యులుగా భావించిన దృష్టాంతాలను చాలా చూపవచ్చు. ఒక రకం విమానాలను నడిపేవారికి అదే రకానికి చెందిన కొత్త మోడల్ విమానాలను ఇచ్చి (ఈ కొత్త విమానాలను నడపడంలో పైలట్లకు సిములేటర్లో తగినంత శిక్షణ ఇవ్వకుండానే) నడిపేయమనడం కూడా విమానయాన సంస్థలకు కొత్తేమీ కాదు. ఫలితంగా జరగరానిది ఏదైనా జరిగితే వచ్చే అపనిందల వల్ల పైలట్లు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రతిష్ఠ దెబ్బతింటుంది. వారి కుటుంబ సభ్యులు పడే వేదన వర్ణనాతీతం.బహిరంగంగా ఊహాగానాలు చేయడం దర్యాప్తు ప్రక్రియకు ఏ విధంగానూ దోహదపడదు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సునిశితమైన అంశాలను కనుగొనడానికి వీలుగా బాహ్య ఒత్తిడులు ఏమీ లేకుండా ఇన్వెస్టిగేటర్లను వారి పనిని వారిని చేసుకోనివ్వాలి. ఈ ప్రక్రియను గౌరవించడం, నిజాయతీతో వ్యవహరించనివ్వడం ముఖ్యం. మాటలకందని విషాదాన్ని అనుభవిస్తున్న అనేక మందికి మనం అండగా నిలవాలి. -వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్ ల్యాండ్ బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్కు ప్రోగ్రామ్ డైరెక్టర్, నటాషా హీప్(‘ది కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
బోయింగ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఇంజనీరు
-
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్బాక్స్లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్బాక్స్ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్బాక్స్ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
మట్టి నిండిన భోజనం!
అహ్మదాబాద్: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్ టేబుల్స్పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్ టేబుల్స్.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్ భవనంలో రెసిడెంట్ వైద్యులు నివాసం ఉంటారు. నేరుగా భవనంపైనే కూలిన విమానం.. సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. విమాన ఫ్యూజ్లేజ్లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
ఢిల్లీ,సాక్షి: ఎయిరిండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. అదనంగా, ఎయిరిండియా విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్ను పుననిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ను విడుదల చేశారు. Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/jBPxfmo4at— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025 -
మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్: రమేశ్ విశ్వాస్ కుమార్ బుచార్వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్ బ్రిటీష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జి.ఎస్.మాలిక్ తెలిపారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)ప్రయాణం వాయిదాతో బతికాడుఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్ బుక్ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025 -
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025 -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔— Allu Arjun (@alluarjun) June 12, 2025 Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.— Jr NTR (@tarak9999) June 12, 2025 Extremely shocked and in disbelief to hear the crash of Air India flight from Ahmedabad to London, with 232 passengers on board, just after take off. Prayers for the safety of the passengers and the crew. #GodBeWithThem #planecrash— KhushbuSundar (@khushsundar) June 12, 2025 Heartbreaking to hear about the tragic plane crash in Ahmedabad.My thoughts and prayers are with all those affected.Hoping for survivors and strength for the rescue teams.May the departed rest in peace, and may their families find the strength to endure this immense loss. 🙏— Randeep Hooda (@RandeepHooda) June 12, 2025 Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
👉అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా పర్యటనవిమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతివిమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదుబాధిత కుటుంబాలకు అండగా ఉంటాండీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాంగుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశానుమృతదేహాల వెలికితీత పూర్తైంది👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025 -
ఇండియా-యూఎస్ వయా యూరప్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.ఆపరేషనల్ మార్పులుముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.కార్గో సామర్థ్యం పెంపుయూరప్గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?పెరుగుతున్న మామిడి ఎగుమతులుదేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది."ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలలో డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం" అని ఎయిరిండియా ఒక పోస్ట్లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్ను షేర్ చేసింది. -
క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.క్షిపణి దాడియెమెన్కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సైఎయిరిండియా స్పందనమే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. -
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా. -
సీటుకు రూ. 50వేలు తగలేశాం, ఎయిరిండియాపై కమెడియన్ ఫైర్
విమానయాన సంస్థల సేవాలోపాలకు సంబంధించి అనేక కథనాలు,ఫిర్యాదులు గతంలో అనేకం చూశాం. కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్లైన్ ఎయిరిండియా మరో వివాదం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది. హాస్యనటుడు వీర్ దాస్ ఎయిరిండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు రూ.50 వేలు పోసి ఒక్కో టికెట్ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎక్స్లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్ గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్చైర్ రాలేదని దాస్ ఆరోపించారు. Dear @airindia Please reclaim your wheelchair. I’m a lifetime loyalist. I believe you’ve got the nicest cabin crew in the sky, this post pains me to write. My wife and I book Pranaam and a wheelchair because she’s got a foot fracture that’s still healing. We’re flying to delhi.…— Vir Das (@thevirdas) April 14, 2025 "ప్రియమైన ఎయిరిండియా,ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్చైర్ను మీరు తీసుకొండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని." అన్నారు. ఇదే పోస్ట్లో ఇంకా "విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు దుర్భరమైన ప్రయాణమని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం రెండు గంటలు ఆలస్యం.. ముందుగానే వీల్చైర్ , ఎన్కామ్ (విమానాశ్రయాలలో మీట్-అండ్-గ్రీట్ సేవలు) ముందుగానే బుక్ చేసుకున్నాం అయినా ఫలితం లేదు. దాని గురించి అడగడానికి అసలక్కడ ఎవరూ లేరు" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాలుగు బ్యాగులు మోస్తూ, సాయం చేయమని సిబ్బందిని అడిగితే, క్యాబిన్ సిబ్బందిగానీ, గ్రౌండ్ సిబ్బందిగానీ అస్సలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి.. కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవలసి వచ్చింది.అలా భార్యను లగేజ్ క్లెయిమ్కు తీసుకెళ్లి, అక్కడినుంచి పార్కింగ్కు వెళ్లామని వివరించాడు. అలాగేఎయిర్పోర్ట్లో సెకండ్ఫ్లోర్లో మీ వీల్ చైర్ ఉంది తెచ్చుకోండి అంటూ ఎయిరిండియాకు సూచించారు. దాస్ పోస్ట్పై ఎయిరిండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధింత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. -
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఢిల్లీ నుంచి బ్యాంకాక్కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది. An Air India spokesperson says, “Air India confirms that an incident of unruly passenger behaviour was reported to the cabin crew operating flight AI2336, from Delhi to Bangkok, on 9 April 2025. The crew followed all laid down procedures, and the matter has been reported to the… pic.twitter.com/QwMB1pWr2E— ANI (@ANI) April 9, 2025 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్లైన్స్లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. -
ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షో
ఈ ఏడాది(2025) చివరి నాటికి ఎయిరిండియా మాజీ అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వీలుగా మే నెలలో రోడ్ షోలు చేపట్టాలని యోచిస్తోంది. భారత్సహా సింగపూర్, యూరప్లో వీటిని నిర్వహించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్లోగా ఆయా కంపెనీలపట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశాయి.కేంద్రం విక్రయించాలని నిర్ణయించిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్ట్రాన్స్పోర్ట్ సర్వీసస్ (ఏఐఏటీఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏఎస్ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్సీఐ), ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్(ఏఏఎస్) ఉన్నాయి. వెరసి డిసెంబర్లోగా వాటాల విక్రయాన్ని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 2021వరకూ ప్రభుత్వ అజమాయిషిలోని ఎయిరిండియాకు అనుబంధ సంస్థలుగా వ్యవహరించాయి. కాగా.. 2022 జనవరిలో ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.స్పైస్జెట్లో 1% వాటా అమ్మకం1.15 కోట్ల షేర్లు విక్రయించిన ప్రమోటర్బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్లో ప్రమోటర్ అజయ్ సింగ్ 0.9 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.45.34 సగటు ధరలో 1.15 కోట్ల షేర్లు అమ్మివేశారు. వెరసి రూ.52.3 కోట్లు అందుకున్నారు. ఈ లావాదేవీ తదుపరి స్పైస్జెట్లో అజయ్ సింగ్ వాటా 22 శాతానికి పరిమితమైంది. మొత్తం ప్రమోటర్ గ్రూప్ వాటా 29.13 శాతం నుంచి 28.23 శాతానికి తగ్గింది. వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.ఇదీ చదవండి: జనరల్ ఇన్సూరెన్స్లోకి పతంజలి -
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!
న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్బైజాన్ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.#AirIndia pic.twitter.com/kZ7cEau7sI— NDTV (@ndtv) March 10, 2025ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే.. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
చిరిగిన సీటు ఇస్తారా..?ఎయిర్ఇండియాపై మంత్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టిన చౌహాన్ తర్వాత దానిని డిలీట్ చేయడం హాట్టాపిక్గా మారింది.ఎయిర్ఇండియా ప్రయాణికులను మోసం చేస్తోంది.ఇటీవల తాను భోపాల్ నుంచి ఢిల్లీ రావడం కోసం ఎయిర్ఇండియా విమానం ఏఐ436లో ఒక సీటు బుక్ చేసుకున్నాను.తీరా విమానం ఎక్కి చూస్తే ఆ సీటు చినిగిపోయి కిందకు నొక్కుకొనిపోయి ఉంది. ఈ విషయమై విమానం సిబ్బందిని అడిగితే ఈ సమస్య ఇప్పటికే మేనేజ్మెంట్ దృష్టిలో ఉందని, ఆ సీటు ఎవరికీ విక్రయించొద్దని సమాచారమిచ్చినట్లు చెప్పారు’అని శివరాజ్సింగ్ చౌహాన్ వెల్లడించారు.ఈ వ్యవహారంపై ఎయిర్ఇండియా సంస్థ వెంటనే స్పందించింది. మంత్రి చౌహాన్కు క్షమాపణలు చెప్పింది.కాగా ఎయిర్ఇండియా విమానయాన సంస్థ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థను టాటా గ్రూపు టేక్ఓవర్ చేసి ప్రస్తుతం నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడిచే మరో విమానయాన సంస్థ ఎయిర్ విస్తారాను కూడా టాటాలు ఇటీవలే ఎయిర్ఇండియాలో విలీనం చేశారు. -
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్ఫోన్ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్బస్ ఏ321నియో ఎయిర్క్రాఫ్ట్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
చేతులు మారిన కంపెనీలు.. ఈ ఏడాది బిగ్ డీల్స్ ఇవే..
ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్ను సొంతం చేసుకున్న మ్యాన్కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..భారీ మీడియా సంస్థగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ 2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్లో ఏఐఎక్స్ కనెక్ట్తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్ప్రెస్ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఫార్మా చేతికి వ్యాక్సిన్లు హెల్త్కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.సిమెంటింగ్ డీల్ డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. విస్తరణలో భాగంగా దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది. -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్కల్ పినాంగ్కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్వే నుంచి జారి..నేపాన్లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు. ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్ఇండియా అధికారులు తెలపడం గమనార్హం. -
శంషాబాద్లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
మరో 100 విమానాలకు ఎయిరిండియా ఆర్డరు
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్క్రాఫ్ట్లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.అలాగే ఎ350 ఎయిర్క్రాఫ్ట్ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది."భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్బస్కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్బస్కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్బస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్బస్తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
విశాఖ, గన్నవరంలో పొగ మంచు.. గాల్లోనే విమానాల చక్కర్లు!
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. ల్యాండింగ్కు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్కు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.మరోవైపు.. విశాఖ ఎయిర్పోర్టులో కూడా పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. బెంగళూరు నుంచి విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్కు డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం భువనేశ్వర్కు దారి మళ్లించారు.దారి మళ్లించిన విమానాల వివరాలు..- 6E 581/881 VOMM - VTZ - VOMM (Chennai - Vizag - Chennai) ETA 0615 (1145 IST)- 6E 7064/7063 VOTP -VTZ - VOTP (Tirupati - Vizag - Tirupati) ETA 0840 (1410 IST)- 6E 917/6089 VOMM - VTZ- VOMM (Chennai - Vizag - Chennai) ETA1140 (1710 IST) are cancelled for the day -
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
ఎయిరిండియా సేవలపై ఆర్కే రోజా అసహనం
సాక్షి, తిరుపతి: ఎయిర్ ఇండియా సేవలపై ఎక్స్లో మాజీ మంత్రి ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్ 2న ఖాట్మండు నుంచి నా ఫ్లైట్ A1 2162 రెండు గంటలు ఆలస్యం అయ్యింది. దీనివల్ల చెన్నై AI 2835 ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారు.’’ అంటూ రోజా ట్వీట్ చేశారు.డిస్ ప్లే డెస్క్ వద్ద ఉన్న దీపిక, నిధి అహంకారంగా ప్రవర్తించారు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. జవాబుదారీతనం లేదు. ఫ్లైట్ అలస్యానికి కనీసం సంజాయిషీ లేదు. క్షమాపణ కూడా చెప్పలేదు. నాకు న్యాయం జరగాలి. టాటా సంస్థ పరివర్తన అంటే ఇదేనా...?’’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.Deeply disappointed with #AirIndian 's service on 2nd Dec 2024. Privatization was sold as the magic wand for efficiency, but @airindia 's ground staff at Delhi has proven otherwise.On Dec 2nd my Flight AI216 from Kathmandu was delayed by 2hrs, causing me to miss AI2835 to…— Roja Selvamani (@RojaSelvamaniRK) December 3, 2024 -
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్లో భారీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్లో భారీ డిస్కౌంట్స్ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్తో హైదరాబాద్కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్పోర్ట్లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
గుడ్బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్లో విమాన సిబ్బంది ‘గుడ్బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్లైన్స్లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్క్రాఫ్ట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్తో పాటు ఎయిర్లైన్ ఎక్స్ప్రెస్ లైట్ ఆఫర్ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్గఢ్లో ఇటీవల అరెస్టు చేశారు. -
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎయిరిండియా విమానంలో బాంబు?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్పోర్ట్లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు. -
లేవద్దు.. ఇది నీ సింహాసనం!
ఈ ఫొటోలో కూర్చుని ఉన్న అమ్మాయి జోయా అగర్వాల్. ఎయిర్ ఇండియా కెప్టెన్. ఆమె పక్కనే నిలబడి ఉన్నది రతన్ టాటా. న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న బోయింగ్ 777 విమానాన్ని అప్పుడు ఆమె నడుపుతున్నారు. అదే ఫ్లయిట్ లో రతన్ టాటా ఉన్నారు. ఫ్లయిట్ ఢిల్లీ లో దిగగానే ఆయనతో ఒక ఫొటో కావాలని అడిగారు జోయా. ఆయన అంగీకరించారు. ఫొటో కోసం ఆమె లేవబోతుంటే ఆయన వారించారు. ‘ఇది నీ సింహాసనం కెప్టెన్. నువ్వు సంపాదించుకున్నది‘ అని అన్నారు. అలా ఆమె కూర్చొని ఉండగా, ఆమె పక్కన ఆయన నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ అపురూపమైన జ్ఞాపకాన్ని జోయా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఆ సంఘటన తనను ఎలా ఇన్స్పైర్ చేసిందో రాశారు. -
Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టు ఎయిరిండియా విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6— ANI (@ANI) October 11, 2024 There is no need to panic. Air India Express flight IX 613 is safely defueling by circling the airport, and once the fuel reaches the required level, a safe landing will be made. This is a standard safety procedure. #airindiaexpress #airindia #trichy #trichyairport pic.twitter.com/P8PDzhSfXJ— IOTA INFO (@iota_info) October 11, 2024అంతకు ముందు.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు. మిగతా విమానాలన్నీ ఇతర ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బందని ఏర్పాటు చేశారు.విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుచ్చి గగనతలంపై తిరుగుతున్న విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ వైఫల్యం గురించి పైలట్ తిరుచ్చి ఎయిర్ స్టేషన్ను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు.#WATCH | Tamil Nadu: Air India flight from Trichy to Sharjah faced a technical problem (Hydraulic failure) and is rounding in air space to decrease the fuel before landing at Trichy airport. More than 20 Ambulances and fire tenders are placed at the airport to make sure no big… pic.twitter.com/rEiF6mSZz2— ANI (@ANI) October 11, 2024 -
ఎయిరిండియా సిబ్బందికి షేరింగ్ రూమ్
ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దుఅధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
కస్టమర్లకు సకల సౌకర్యాలు!
ఎయిరిండియా తన ఎయిర్క్రాఫ్ట్లను అప్గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. యూఎస్, యూరప్లు వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్-క్లాస్ క్యాబిన్లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈమేరకు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్డోగ్రా వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి మిడిల్ ఈస్ట్ కంపెనీలు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు బదులుగా ఎయిరిండియా సర్వీసులవైపు మొగ్గు చూపేలా ప్రీమియం కస్టమర్లకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. రానున్న రోజుల్లో సంస్థ తన ఎయిర్క్రాఫ్ట్లను అప్గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ముందుగా యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అప్గ్రేడ్ చేయబోతున్నాం. కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్ క్లాస్ సర్వీసులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ320 నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్లో క్యాబిన్ను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబయి, దుబాయ్, లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు ప్రయాణించే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వెహికిల్పై కేసుల వివరాలు క్షణాల్లో.. -
Flight Offers: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 932కే టిక్కెట్..
-
రూ.932కే విమాన టికెట్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకునే కస్టమర్లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: రుణాలు పీక్... డిపాజిట్లు వీక్చెక్-ఇన్ బ్యాగేజీ ధరలను దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1300గా నిర్ణయించారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులకు సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తుంది. ఇదిలాఉండగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు గతంలో పేర్కొంది. ప్రతి నెలా దాదాపు నాలుగు కొత్త విమానాలను ప్రారంభిస్తామని తెలిపింది. ఏయిర్ ఏషియాతో విలీన ప్రక్రియ ప్రారంభించిన అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 30కి పైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్లను ప్రవేశపెట్టింది. -
టాటా.. గుడ్బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్సైట్కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
ప్రాంతీయ భాషలో కస్టమర్ సర్వీస్: ఎయిర్ ఇండియా
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు కొత్త భాషలను దాని ఐవీఆర్ సిస్టమ్కు జోడించడం ద్వారా కస్టమర్ సపోర్ట్ సేవలను మెరుగుపరిచినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.కొత్త ప్రవేశపెట్టిన ఏడు భాషలలో తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం ఉన్నాయి. ఈ సర్వీస్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఎయిర్ ఇండియా కొత్తగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. -
ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా: కారణం ఇదే
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) రూ. 90 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్కు రూ. 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్లను హెచ్చరించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.జూలై 9న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి రియాద్కు విమానాన్ని నడపాల్సి సమయంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రైనింగ్ కెప్టెన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, విమానాన్ని ట్రైనీ పైలట్ నడిపారు.ట్రైనీ పైలట్ శిక్షణ కెప్టెన్తో ముంబై-రియాద్ విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, శిక్షణ కెప్టెన్ అనారోగ్యం పాలయ్యాడు మరియు అతని స్థానంలో శిక్షణ లేని కెప్టెన్ని నియమించారు. నిర్వహణ వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ సంఘటన జరిగింది. జూలై 10న ఎయిర్లైన్ సమర్పించిన నివేదిక ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
-
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని తెలిపారు. వెంటనే విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్కి బాంబు బెదిరింపు సమాచారం అందింనట్లు అధికారలు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం కోసం దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.#news #India #kerela #AirIndia #ndtv Thiruvananthapuram: A full emergency was declared at the Thiruvananthapuram International Airport today following a bomb threat on an Air India flight from Mumbai, airport sources said.The flight landed at the airport around 8 am. pic.twitter.com/BeSgwkJsRT— Manuj jha (@manuj_jha) August 22, 2024 -
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
ముంబై: ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో (ఏఐ129) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాన్ని తిరిగి ముంబైకు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అనంతరం విమానానికి ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.‘ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా వెల్లడించింది.విమానయాన సంస్థ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేగాక విమాన టికెట్ రద్దుపై ప్రయాణీకులకు విమాన ఛార్జీల పూర్తి వాపసును కూడా అందించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్పోర్టులో టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
బంగ్లాదేశ్ ఉద్రిక్తతలతో అలర్ట్ అయిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్కు నడిపించే విమాన సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. “బంగ్లాదేశ్లో తాజా పరిస్థితుల దృష్ట్యా, ఢాకాకు నడిచే మా విమానాలను తక్షణమే రద్దు చేశాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కన్ఫర్మ్ బుకింగ్ ఉన్న ప్రయాణికులకు రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై వన్-టైమ్ మినహాయింపు ఇస్తున్నాం'' అని పేర్కొంది.IMPORTANT UPDATEIn view of the emerging situation in Bangladesh, we have cancelled the scheduled operation of our flights to and from Dhaka with immediate effect. We are continuously monitoring the situation and are extending support to our passengers with confirmed bookings…— Air India (@airindia) August 5, 2024 మరోవైపు.. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్.. తాజా పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలు ఉండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
వీఆర్ఎస్, వీఎస్ఎస్ ప్రకటించిన ఎయిరిండియా
ఎయిరిండియా స్వచ్ఛంద విభజన పథకం(వాలెంటరీ సెపరేషన్ స్కీమ్)తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) రూపొందించింది. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి వీఎస్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాలను నాన్ ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్ కోసం తయారుచేసినట్లు చెప్పింది. అయితే వీటికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. విస్తారా ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి పథకాలు రావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రెండు ఎయిర్లైన్స్లోని దాదాపు 600 మంది ఉద్యోగులపై ఈ విలీనం ప్రభావం చూపుతుందని కొన్ని సంస్థలు నివేదికలు తెలిపాయి. ఎయిరిండియా, విస్తారాలో కలిపి సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇదీ చదవండి: కంపెనీలు వెళ్లిపోతాయ్..!విలీన ప్రక్రియలో భాగంగా ఫిట్మెంట్ విధానాలు, ఉద్యోగ స్థానాల కేటాయింపు పూర్తయిన తర్వాత విస్తారా కూడా ఇలాంటి స్కీమ్లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తారా సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్గా ఉంది. రెండు సంస్థల విలీనం పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా దక్కుతుంది. -
20వేల జీతం.. జాబ్ కోసం పోటెత్తిన 25వేల మంది నిరుద్యోగులు.. తొక్కిసలాట
ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం. దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జీతం రూ.25వేలుఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్పోర్ట్ లోడర్ జాబ్కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఎయిర్లైన్స్ విలీనం.. 700 మంది తొలగింపు!!
ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే రిటైర్మెంట్కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్లో చేయాల్సి ఉంటుంది.“అంతర్గత ఫిట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది" ఒక అధికారి తెలిపారు.అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. "నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని మూడో అధికారి చెప్పారు. -
జగజ్జేతల ఆగమనం
ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి. ముంబై: టి20 ప్రపంచకప్ను జయించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్ ఫ్లయిట్లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాలతో పాటు భారత్కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.ఫ్లయిట్ షెడ్యూల్ టైమ్ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్ మీడియా ద్వారా, ఫోన్లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్ టాప్ బస్లో క్రికెటర్ల రోడ్షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్ షోను నిర్వహించలేదు. న్యూయార్క్ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్ గత నెల 29న రోహిత్ శర్మ బృందం టి20 వరల్డ్కప్ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్కు రావాలి. కానీ కరీబియన్లో భీకరమైన హరికేన్ తుఫాన్ వల్ల బార్బడోస్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్లో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్తో వచ్చేస్తున్నారు. ఎయిరిండియా చొరవ, న్యూయార్క్లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్ మీదుగా దారి మళ్లించారు. ఈ విమానం కోసం టికెట్లు బుక్ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్ కాకుండా మరో రూట్ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది. -
‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్ ఇండియా విమానం ఎక్కను’’
బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్ పే చేసి టైమ్కి వచ్చే విమానాల్లో వెళ్తాను. Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last nightNever and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నా అనుభవం మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది. -
లండన్ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..
తిరువనంతపురం: లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానానికి మంగళవారం బాంబు బెదిరింపులు అందాయి. కేరళలోని కొచ్చిన్ విమానశ్రాయం నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చి అంతర్జాతీయ విమనాశ్రయంలోని ఎఎయిరిండియా సిబ్బందికి చేరవేశారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్లైన్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్గా తేల్చారు.కొచ్చిన్ ఎయిర్పోర్ట్లోని చెక్-ఇన్ సమయంలో సుహైబ్, అతని భార్య, కుమార్తెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ ఏదీ
ఏటా 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నా, శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. దీంతో ప్రయాణికులు అమెరికాలో ఎక్కడికి వెళ్లాలన్నా రెండు, మూడు విమాన సర్వీసులు మారాల్సి వస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల్లో 60శాతం మంది అమెరికాకు వెళ్లేవారే ఉంటారు. గతంలో ఎయిర్ఇండియా చికాగో వరకు వారానికి రెండు సర్వీసుల చొప్పున నడిపింది. 350 సీట్లు ఉండే ఆ ఫ్లైట్కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. 90శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కోవిడ్కాలం నుంచి ఆ సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తామని, ఎయిర్ పోర్టువర్గాలు చెప్పినా, ఇప్పటివరకు షికాగో ఫ్లైట్లు తిరిగి ప్రారంభం కాలేదు.3వ స్థానంలో హైదరాబాద్శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 55,000 మంది డొమెస్టిక్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, మరో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికు లు వివిధ దేశాలకు ప్రయాణం చేస్తున్నారు. దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్రిటన్, దోహా, జెడ్డా, మాలే, థాయ్లాండ్, జర్మనీ తదితర దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కానీ అమెరికాకు మాత్రం అలాంటి సదుపాయం లేదు.అమెరికా ప్రయా ణికుల్లో ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్ మూడోస్థానంలో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ఏటా సుమారు 10లక్షల మంది హైదరాబాద్ నుంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి లక్షలాది మంది విద్యార్థులతోపాటు ఉద్యోగులు, వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రయాణాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి మాత్రమే అమెరికాకు డైరెక్ట్గా విమాన సర్వీసులు ఉన్నాయి.ఏటేటా పెరుగుతున్న ప్రయాణికులు..హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళుతున్న ప్రయాణికుల్లో ఎక్కువశాతం న్యూయార్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో నగరాలకు వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. కోవిడ్ అనంతరం రాకపోకలు మరింత ఎక్కువయ్యాయి. ఐఏటీఏ లెక్కల ప్రకారం కోవిడ్కు ముందు 2019లో 8.5 లక్షల మంది ప్రయాణం చేయగా, కోవిడ్ కాలంలో రాకపోకలు నిలిచిపోయేనాటికి 2020లో 3 లక్షల మంది ప్రయాణం చేశారు.ఆ మరుసటి సంవత్సరం పూర్తిగా నిలిచిపోయాయి.ఆంక్షలు తొలగించి అంతర్జాతీయ రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. యూఎస్ నుంచి కొత్తగా వీసాలు లభించకపోయినా, అప్పటికే వీసాలు కలిగిఉన్న ప్రయాణికులంతా కోవిడ్ అనంతరం ఇరువైపులా పెద్దసంఖ్యలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరినట్టు అంచనా. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నడిచిన ఎయిర్ఇండియా సర్వీసులు పునరుద్ధరించినా ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. శంషాబాద్లో ఫ్లైట్ ఎక్కేసి నేరుగా షికాగోలో దిగిపోవచ్చు. -
ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్
ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్ను పరిచయం చేస్తోంది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లతోపాటు స్వల్ప దూర అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం దేశీయంగా విస్తారా మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా ఏ320 నియో ఎయిర్క్రాఫ్ట్లో బిజినెస్ క్లాస్లో 8 సీట్లు, ప్రీమియం ఎకానమీ 24, ఎకానమీ విభాగంలో 132 సీట్లను కేటాయించింది.తొలుత ఢిల్లీ–బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చండీఘఢ్–ఢిల్లీ రూట్లలో ప్రీమియం ఎకానమీ క్లాస్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాదిలో ఎయిర్ ఇండియా తన పూర్తి స్థాయి నారో-బాడీ ఫ్లీట్ కు త్రీ-క్లాస్ కాన్ఫిగరేషన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.. -
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్ బ్లేడ్ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్బెడ్(పడుకునేందుకు వీలుగా)మోడ్కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు.