
ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 విమానాలపై అత్యధికుల ఆందోళన
సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిలిపివేయాలని 56 శాతం మంది సూచన
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.

ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు..