ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్‌.. | Air India Investment Tata Sons Singapore Airlines Invest Rs 9558 Crores | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్‌..

Jun 26 2025 7:26 AM | Updated on Jun 26 2025 7:30 AM

Air India Investment Tata Sons Singapore Airlines Invest Rs 9558 Crores

న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్‌ సంస్థలు టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్‌ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్‌ఫార్మేషన్‌) ప్రణాళికలను అమలు చేస్తోంది.

2024 నవంబర్‌లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్‌ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్‌ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్‌ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్‌ రూ. 3,225 కోట్లు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్‌ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్‌  రూ. 3,225 కోట్లు, సింగపూర్‌ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. కాగా.. 2024 డిసెంబర్‌31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్‌ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్‌ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement