హైదరాబాద్: మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో శుక్రవారం నాడు సాయంత్రం జరిగిన ధన్య ప్రసాద్ కూచిపూడి రంగప్రవేశం ఆద్యంతం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భారత మాజీ ఉప రాష్ట్రప్రతి ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంట్ సభ్యురాలు (లోక్సభ) దగ్గుబాటి పురందేశ్వరి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.
అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన అనంతరం, తన భారతీయ మూలాలు, తెలుగు సంస్కృతితో అనుబంధాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ధన్య ఐదేళ్ల వయసులో నాట్య తరంగిణిలో గురువు యామిని రెడ్డి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాభ్యాసాన్ని ప్రారంభించారు.


