breaking news
business news
-
జీఎస్టీ వసూళ్లు: ఒక్క నెలలో రూ.1.94 లక్షల కోట్లు
దేశ జీఎస్టీ వసూళ్లు గడిచిన జూన్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ ఆదాయం 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.నికరంగా (రిఫండ్లు మినహాయించిన తరువాత) జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1,62,377 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నెలలో రీఫండ్లు గణనీయంగా పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.1 శాతం అధికం.కేంద్ర జీఎస్టీ (CGST) వసూళ్లు 8 శాతం పెరిగి రూ.37,376 కోట్లకు చేరగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) 4 శాతం వృద్ధితో రూ.45,116 కోట్లుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఐజీఎస్టీ రూ.52,282 కోట్లుగా ఉండగా, దిగుమతులపై వసూళ్లు 34.6 శాతం భారీ వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరాయి.దేశీయ స్థూల ఆదాయాలు మొత్తం 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. ఇది దేశీయ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ను సూచిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 9 శాతం వృద్ధితో రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 19 శాతం వృద్ధితో రూ.9,165 కోట్లు సాధించింది. గుజరాత్ రూ.11,743 కోట్లు (12% వృద్ధి), కర్ణాటక రూ.12,937 కోట్లు (10% వృద్ధి), హర్యానా రూ.10,065 కోట్లు (9% వృద్ధి) నమోదు చేశాయి. అయితే తమిళనాడు మాత్రం స్వల్పంగా 2 శాతం తగ్గుదలతో రూ.9,776 కోట్లకు పరిమితమైంది. -
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. ఈరోజు తాజా రేట్లు ఇవే!
-
పేరుకే పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్లకు మాత్రం భారీ నష్టాలు!
-
బంగారం ధరలు పెరిగినా ఎందుకు అమ్ముతున్నారు?
-
ఒకేసారి భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?
-
కోట్ల బ్లాక్ డీల్.. వేదాంత షేర్లు భారీ పతనం
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు లీగల్ క్లీన్ చిట్..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు బాహ్య న్యాయ సంస్థలు తేల్చాయి.అమెరికాకు చెందిన ‘విల్సన్ సోన్సిని గుడ్రిచ్ & రొసాటి’ (సంక్షిప్తంగా విల్సన్ సోన్సిని)తో పాటు భారతీయ న్యాయ సంస్థ ‘వాడియా ఘండి & కో’ నిర్వహించిన మూడు నెలల సమీక్షలో బోర్డు సమావేశాల మినిట్స్, కమిటీ రికార్డులు, అధికారిక కమ్యూనికేషన్లు, సంబంధిత పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినప్పటికీ చక్రవర్తి చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమకాలీన ఆధారాలు కనిపించలేదని బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. సమీక్షలో భాగంగా స్వతంత్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ఎండీ-సీఈవో శశిధర్ జగదీశన్తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వేలాది పత్రాలు, బోర్డు ఎజెండాలు, సమావేశ మినిట్స్ను పరిశీలించారు. అతాను చక్రవర్తిని కూడా పలుమార్లు విచారణలో పాల్గొనాలని కోరినా, చివరకు ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని బ్యాంకు వెల్లడించింది.మార్చిలో తన రాజీనామా లేఖలో బ్యాంకులో గత రెండేళ్లుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక రికార్డుల్లో ఆయన అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేదా బోర్డు నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయ సమీక్ష స్పష్టం చేసింది.బోర్డు స్థాయిలో చర్చించిన అన్ని అంశాలు నిర్దేశిత పాలనా విధానాలకు అనుగుణంగానే నిర్వహించబడ్డాయని, ఎలాంటి కీలక లోపాలు గుర్తించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదికను ఆడిట్ కమిటీ, అనంతరం బోర్డు పరిశీలించనుంది.జగదీశన్ పదవీకాలం పొడిగింపునకు మార్గం సుగమంఈ న్యాయ సమీక్షతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాల పొడిగింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్లో ముగియనుండగా, మరోసారి నియామకానికి తనను అందుబాటులో ఉంచినట్లు గతంలో వెల్లడించారు. బోర్డు ఆమోదం అనంతరం సంబంధిత ప్రతిపాదనను ఆర్బీఐకి పంపనున్నారు.చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని, బ్యాంకు మార్కెట్ విలువలో సుమారు రూ.1 లక్ష కోట్లకుపైగా క్షీణత నమోదైంది. అనంతరం ఆర్బీఐ బ్యాంకు పాలనపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇప్పుడు స్వతంత్ర న్యాయ సమీక్ష కూడా ఎలాంటి పాలనా లోపాలు లేవని తేల్చడంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నాకు ముగ్గురితో ఎఫైర్లున్నాయి, వాళ్లు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
-
మళ్లీ కొండెక్కిన బంగారం తులంపై ఎంత పెరిగిందంటే
-
పాతాళానికి పసిడి ధరలు ఒక్క రోజులో ఎన్ని వేలు తగ్గిందంటే..
-
ఛాయ్ పైసలతో SIP..? యాక్సిస్ బ్యాంక్ సరికొత్త స్కీమ్
-
త్వరలో 50 వేలకే తులం బంగారం?
-
ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ టార్గెట్ రూ.3 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ సీఈవో చంద్రశేఖర్ ముద్రగణం వెల్లడించారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ ఇందుకు దోహదపడనున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధి చెంది రూ. 1,002 కోట్లుగా నమోదైంది.ఒరిస్సాలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై మూడు దశల్లో 350 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత యాక్సెస్జినీ ప్లాట్ఫాం, బ్లూహెల్త్, బ్లూబయో మొదలైన వాటిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. క్యాన్సర్ సంబంధ పరిశోధనలకు తోడ్పడేలా దాదాపు రూ. 400 కోట్లతో గుంటూరులో బయోబ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.ఆఫ్రికాలోని వర్ధమాన దేశాల్లో విస్తరణపై ఫోకస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ ఉత్పత్తుల కోసం నాలుగు దేశాలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్యను 2,000కు పెంచుకోనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. అప్పటికల్లా బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్
-
గోల్డ్ మార్కెట్లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?
-
గంట గంటకు మారుతున్న బంగారం ధరలు
-
మృగశిర కార్తె స్పెషల్.. కిక్కిరిసిన చేపల మార్కెట్లు
-
భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్
-
లక్షకు 2. 50 లక్షల లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల కురిపిస్తున్న స్టాక్
-
రూ.6,000 కోట్ల డీల్: ఐనాక్స్ క్లీన్ చేతికి వేనా ఎనర్జీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాజాగా వేనా ఎనర్జీ ఇండియా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వా రా 6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను సొంతం చేసుకోనుంది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లుకాగా.. వేనా ప్రస్తుతం 1.2 గిగావాట్ల నిర్వహణలోని ఇంధన ఆస్తులతోపాటు.. త్వరలో ప్రారంభంకానున్న చివరి దశ అభివృద్ధిలోని 1.8 గిగావాట్ల ప్రాజెక్టులను కలిగి ఉంది.వీటికి జతగా మరో 3 గిగావాట్ల అభివృద్ధి దశ ప్రాజెక్టులు సైతం ఉన్నట్లు ఐనాక్స్ క్లీన్ వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుకి సోలార్ ఎస్ఈసీఐ, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ తదితర వా ణిజ్య, పారిశ్రామిక క్లయింట్లుసహా.. ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది. -
15 లక్షల కోట్ల స్కాం.. స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు -సెబీ సంచలన రిపోర్ట్
-
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo
-
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో వాటా విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల ఆపరేటర్ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీక్యూజీ పార్ట్నర్స్ 1.8 శాతం వాటాను ఫిడిలిటీ ఇంటర్నేషనల్కి ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. వీటి విలువ రూ. 1,906 కోట్లు.ఎన్ఎస్ఈలో బ్లాక్ డీల్ డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ సగటున ఒక్కో షేరుకి రూ. 97.75 రేటు చొప్పున 19.50 కోట్ల షేర్లను విక్రయించింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫిడిలిటీ ఇంటర్నేషనల్ స్మాల్ క్యాప్ ఫండ్ వీటిని కొనుగోలు చేసింది. జీఎంఆర్ గత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి మళ్లిన సంగతి తెలిసిందే. -
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
అదానీ గ్రూప్ ఇబిటా రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్ గ్రూప్గా నిలిచింది.దీంతో గ్రూప్ పోర్ట్ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ బిజినెస్ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది. -
పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్..
-
భారీగా తగ్గిన బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఢమాల్
-
హైదరాబాద్లో డిజిలాజిక్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్టింగ్, సిమ్యులేషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్ గత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో రూ. 78.27 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ. 10.43 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 72.19 కోట్లు కాగా, లాభం సుమారు 7.79 కోట్లుగా నమోదైంది.జనవరిలో బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్టయిన డిజిలాజిక్.. సుమారు రూ. 70 కోట్లు సమీకరించింది. హైదరాబాద్లోని టీజీఐఐసీ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2లో ఈఎంఎస్ తయారీ, ఈఎస్ఎస్ స్క్రీనింగ్ మొదలైన వాటికి సంబంధించి రూ. 52 కోట్లతో ప్రాజెక్ట్ ఉడాన్ పేరిట ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇది 2027 మే నాటికి అందుబాటులోకి రానుంది.అలాగే, డిఫెన్స్, ఏరోస్పేస్ సంబంధ కార్యకలాపాల విస్తరణ కోసం అభేద్య సిస్టమ్స్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ. 31 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఉండగా, రూ. 110 కోట్ల టెండర్లకు కోట్ చేసినట్లు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. -
అధిక వృద్ధి బాటలో రిలయన్స్ కన్జూమర్
న్యూఢిల్లీ: సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితుల దన్నుతో 2030 నాటికి ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) ఆదాయం అనేక రెట్లు పెరగనున్నట్లు మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వార్షిక నివేదికలో తెలిపింది. 2025–26లో కంపెనీ ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లు దాటినట్లు వివరించింది. నిత్యావసరాలు, పానీయాల విక్రయాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది.అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండెడ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్య సాకారం దిశగా ఆర్సీపీఎల్ ఇకపైనా ఇతర సంస్థలు, బ్రాండ్స్ కొనుగోళ్లను కొనసాగిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది. 2025 డిసెంబర్ 1న రిలయన్స్ రిటైల్ నుంచి విడగొట్టిన ఆర్సీపీఎల్ ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
బంగారం రుణాలకు డిమాండ్ పైపైకి..
ముంబై: రుణదాతలకు పసిడి రుణాలు ఇక ముందూ కీలక ప్రాధాన్యంగా కొనసాగుతాయని ఎక్స్పీరియన్ నివేదిక తెలిపింది. భారత రిటైల్ రుణ మార్కెట్లో సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. పసిడి రుణాల సోర్సింగ్ విలువ (కొత్త రుణాలు) 2025–26 క్యూ4లో రెట్టింపునకు పైగా పెరిగి రూ.7.6 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది. నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 47 శాతం పెరిగి రూ.11.9 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.సగటు రుణ పరిమాణం రూ.1.4 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు చేరినట్టు వెల్లడించింది. ఇదే ధోరణి కొనసాగితే ఇక మీదటా తనఖా రుణాలు రిటైల్ రుణాల వృద్ధిలో కీలకంగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. 2025–26లో కొత్త రుణాల్లో 68 శాతం సెక్యూర్డ్ రూపంలోనే ఉన్నాని, మొత్తం అన్సెక్యూర్డ్ రుణాల్లో 22 శాతం వృద్ధితో పోల్చితే ఎంతో ఎక్కువని వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) పసిడి రుణాల డిమాండ్ నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది.2025–26 క్యూ4లో కొత్త రుణాల్లో 40 శాతం ఎన్బీఎఫ్సీల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 28 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా మోస్తరు స్థాయిలోనే కొనసాగినట్టు వివరించింది. బంగారం రుణాల ఆస్తుల నాణ్యత సైతం మెరుగ్గా ఉందంటూ.. 90 రోజులకు పైన చెల్లింపుల్లేని రుణాల వాటా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గినట్టు ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే
-
నందన్ నీలేకని వీసీ పెట్టుబడులు..రూ.3,000 కోట్లతో రెడీ
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఈసీవో, సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తెరతీశారు. వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థ ఫండమెంటమ్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రత్యేకించిన ఫ్రంటియర్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఇందుకు ప్రాథమికంగా రూ. 3,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నారు.దేశీయంగా ఏఐ, డీప్టెక్ కంపెనీల దన్నుతో ఫండమెంటమ్ ఫ్రంటియర్ అడ్వయిజర్స్(ఎఫ్2ఏ)ను ఏర్పాటు చేశారు. సెబీ అనుమతించిన తొలి ఫండ్.. ఫండమెంటమ్ 3– ఏఐ, డీప్టెక్ రూ. 2,000 కోట్లు సమకూర్చనున్నాయి. వీటికి అదనంగా ఎఫ్2ఏ మరో రూ. 1,000 కోట్ల సహపెట్టుబడులను సమీకరించనుంది. ఎఫ్2ఏ టెక్నాలజీ ఆధారిత బిజినెస్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా కన్జూమర్, ఎంటర్ప్రైజ్, ఫిజికల్ ఏఐను లక్ష్యంగా చేసుకోనుంది. -
భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు
-
మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం.. లక్షకు 21 కోట్లొచ్చాయ్..!
-
పెట్రో బాదుడుకు రాష్ట్ర సర్కారే కారణం!
-
ఐదేళ్లలో లక్షకు 30లక్షల లాభం.. ఇప్పుడు 100కు 500 షేర్లు ఫ్రీ..
-
మోదీ చెప్పినా వినట్లేదు.. బంగారం కొనేందుకు ఎగబడుతున్న జనం..
-
కేంద్రం మరో కీలక నిర్ణయం పైపైకి బంగారం ధరలు..!
-
వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
కోటి పెట్టి ఫ్లాట్ కొనడం మేలా..? SIP చేయడం మేలా..?
-
బంగారం కొనాలనుకునేవారికి ఛాన్స్.. ఒక్కసారిగా పడిపోయిన ధరలు
-
మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్ ఈ కారుపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
-
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ స్థానంలో రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్ జైన్ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. రవి శంకర్కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్ బ్యాంకింగ్ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్.సి. ముర్ము, పూనమ్ గుప్తా, స్వామినాథన్ జే తదితరులు ఉన్నారు. -
మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్
-
జస్ట్ 5 డేస్..7 కంపెనీలు.. నిండాముంచేసిన TCS, RELIANCE..
-
టాటా చరిత్రలోనే తొలిసారి డబుల్ బొనాంజా.. డబ్బులే డబ్బులు
-
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె సబ్ స్క్రిప్షన్ సంగతి తెలిస్తే..
-
రూ.3 వేలు తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే
-
బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్.. ఇవాళ తులం ఎంతంటే..!
-
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. -
కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్
-
కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..
-
అమెజాన్లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. -
గోల్డ్ మార్కెట్ లో ఊహించని ప్రళయం.. మళ్లీ లక్ష రూపాయలకు బంగారం ధర?
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్
-
పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆర్బీఐ కీలక నిర్ణయం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.పేటీఎం పేమెంట్ బ్యాంక్లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 22(4) కింద రద్దు చేసింది.ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది. -
భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
ఆరేళ్లలో లక్షకు 70 లక్షలొచ్చాయ్..! లాభాల పంట పండించిన మల్టీబ్యాగర్
-
భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
-
నీటితో నడిచే గ్యాస్ స్టవ్ తయారీ.. 100ML నీళ్లతో 6 గంటల వంట..
-
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?
-
యాపిల్కి కొత్త కెప్టెన్ ఇతనే !
-
ఇన్వెస్టర్లకు కాసుల పంట.. లక్షకు 13 లక్షలు సంపాదించిపెట్టిన స్టాక్..
-
ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. -
ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!
-
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్!
-
జర్మనీలో జాబ్ కోసం ఇలా అప్లై చేసుకోండి
-
అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
-
లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
-
కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు
-
వరుసగా మూడో రోజు పెరిగిన గోల్డ్ రేటు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్
-
ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
-
Oracle ఉద్యోగాల ఊచకోత వెనుక అసలు కథ
-
పెట్రోల్, డీజిల్ ధరల పెంచేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్..!
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
-
చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?
-
ఇలా కొత్త పన్ను విధానంలో రూ. 15.85 లక్షల వరకు ఆదాయంపైనా జీరో టాక్స్..!
-
మ్యూచువల్ ఫండ్స్ లో ఈ 'స్కీమ్స్' కోసం ఎగబడిన జనం
-
అదరగొట్టిన HDFC స్కీమ్.. రూ.5 లక్షలు పెడితే రూ.18 లక్షలు!
-
ఒక్క సంవత్సరంలోనే లక్షకు 19 లక్షలొచ్చాయ్.. లాభాల వరద పారించిన స్టాక్..!
-
300 మంది టాప్ బాస్ లు ఔట్..TCS లో ఏం జరుగుతోంది..?
-
ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!
-
ఇక గ్యాస్ సిలెండర్ ధర 4000 రూపాయల పైమాటే
-
ట్రంప్ డెడ్ లైన్ ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
-
బెంగళూరు ఐటీలో అలజడి.. 80 శాతం ఉద్యోగాలకు AI ఎసరు..
-
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
PAN CARD కొత్త రూల్స్ , ఆధార్ ఒక్కటే ఉంటే సరిపోదు అవన్నీ కావాల్సిందే!
-
SBI డీల్ ఎఫెక్ట్.. టాప్ గేర్ లో సాట్రిక్స్ షేర్..
-
మళ్ళీ షాక్ ఇస్తోన్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..!
-
కేంద్రం కీలక నిర్ణయం... SIM Binding తప్పనిసరి...
-
లక్ష పెడితే 69లక్షలొచ్చాయ్.. కాసుల వర్షం కురిపించిన స్టాక్..!
-
ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!
-
బంగారం ఒక్కరోజులో మళ్లీ భగ్గుమంది! వెండి మాత్రం..!
-
నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం పెన్షన్
-
లోన్స్ నుండి సిబిల్ వరకు core ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్..
-
SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!
-
భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ కనిష్టానికి రూపాయి విలువ
-
ఏకంగా 7 లక్షల కోట్లు..! లాభాల్ని నింపుకునేందుకు రెడీగా ఉండండి..!
-
ఫిక్స్డ్ డిపాజిట్లను మించి లాభం ఏడాదిలో హైరిటర్న్స్ ఇచ్చిన 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే
-
ఒక్కసారిగా షాకిచ్చిన గోల్డ్..! రాత్రికి రాత్రే భారీ మార్పు..
-
ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు.. ఈ వివరాలు ఇవ్వాల్సిందే..!
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
శ్రీరామనవమికి షాక్ ఇచ్చిన బంగారం.. తులం ఎంతంటే..?
-
ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ
-
ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
-
4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..
-
HDFC చైర్మన్ రాజీనామా.. భారీగా పడిపోయిన షేర్లు అసలేం జరిగిందంటే..!
-
ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
-
బంగారం కొన్నవారికి నిద్రలేని రాత్రులు.. పాతాళానికి గోల్డ్ రేట్స్..
-
పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!
-
మాంసం ప్రియులకు షాక్! ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు
-
రూ. 1 లక్ష పెట్టినోళ్లకు 15 ఏళ్లలోనే 16 లక్షలొచ్చాయ్..!
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు.. భవిష్యత్లో బంగారం లక్షకు పడిపోనుందా..?
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
పడిపోతున్న పసిడి ధరలు... కొనాలా? వెయిట్ చేయాలా?
-
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు. -
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
కోచి: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) అనుపమ్ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు. -
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. -
లక్ష పెడితే ₹58 లక్షలు.. మ్యాన్ బ్రో ఇండస్ట్రీస్ షేర్ సంచలనం
-
నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!
-
మార్కెట్లు పడిపోతున్నా ఈ 5 స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి..?
-
1 షేరు కొంటే 4 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.1.84 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్
-
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!
-
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి నష్టం తప్పదు
-
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
-
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
-
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
-
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
రంగంలోకి రిలయన్స్! ఇక జోరుగా గ్యాస్ ఉత్పత్తి
ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.“భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటెన్స్ వంటి సి3, సి4 స్ట్రీమ్లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
-
10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
-
దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాష్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..
-
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఇవే..!
-
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
పశ్చిమాసియాలో యుద్ధంతో (#IranIsraelUSWar) హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వారానికి పైగా నిల్చిపోతే దేశీయంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇంధన మార్కెట్ల నుంచి ఎరువుల సరఫరా, పరిశ్రమలకు ముడిపదార్థాలు, నిర్మాణ రంగ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా ఎగుమతి రంగాలకు కూడా సవాళ్లు తప్పవని పేర్కొంది.‘‘దీనితో తక్షణం పెట్రోలియంపై ప్రభావం పడుతుంది. 2025లో పశ్చిమాసియా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద 30 రోజులకు సరిపడేంత ఇంధన నిల్వలే ఉన్నాయి. ఒకవేళ షిప్మెంట్స్లో ప్రతిష్టంభన మరింత దీర్ఘకాలం కొనసాగితే ఇంధనాల ధరలు వేగంగా పెరిగిపోతాయి. దీంతో రవాణా వ్యయాలతో పాటు మిగతా అన్నింటి ధరలూ పెరుగుతాయి. డీజిల్ రేట్ల వల్ల రైతులకు ఇరిగేషన్ పంపులు, ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాల భారం పెరుగుతుంది’’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. -
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
-
Gold: వరుసగా నాలుగో రోజు పతనమైన బంగారం ధర
-
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
పాన్ కార్డు ఉంటే రూ.5 లక్షలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?


