breaking news
business news
-
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి. -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్లైన్ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.దీనికోసం భాగస్వామి షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్కి 30 శాతం, షాన్డాంగ్కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. -
వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే
-
లక్షకు 2లక్షలు.. ఇన్వెస్టర్లకు MEESHO కాసుల వర్షం
-
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇకపై OTP అవసరం లేదు..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (UAE) బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై మరింత సురక్షితం కానున్నాయి. SMS ద్వారా వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, బ్యాంక్ మొబైల్ యాప్లోనే నేరుగా అనుమతి ఇచ్చే స్మార్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో OTP బదులు బ్యాంక్ యాప్లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది.వినియోగదారులు యాప్లో లాగిన్ చేసి బయోమెట్రిక్ లేదా స్మార్ట్ పాస్ పిన్ ద్వారా లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. యాప్లోనే వెరిఫికేషన్ జరుగుతుండటంతో ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాలు నివారించబడతాయి. ఎమిరేట్స్ NBD సహా ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పు ప్రారంభించాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే..?కార్డ్ వివరాలు ఇచ్చిన వెంటనే యాప్లో లాగిన్ చేయమని సందేశం వస్తుంది. యాక్టివిటీస్ విభాగంలో లావాదేవీ వివరాలు చూసి, రెండు నిమిషాల్లో అనుమతి ఇవ్వాలి. స్మార్ట్ పాస్ పిన్ నమోదు చేసిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది. దశలవారీగా అమలు ప్రస్తుతం కొన్ని లావాదేవీలకు మాత్రమే ఈ సిస్టమ్ అమల్లో ఉంది. 2026 మార్చి నాటికి SMS, ఈమెయిల్ OTP విధానాలు పూర్తిగా రద్దవుతాయి. అప్పటి వరకు పాత విధానం మరియు కొత్త విధానం రెండూ కలిపి కొనసాగుతాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్తో యుఏఈలో డిజిటల్ బ్యాంకింగ్ మరింత వేగవంతం, సురక్షితం కానుంది. -
2026 లో తులం రూ.2 లక్షలకు చేరుతుందా..?
-
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం మరో వైపు వెండికి రెక్కలు
-
నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్
-
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!
-
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025 -
రెపో రేటును తగ్గించిన RBI
-
7 ట్రిలియన్ డాలర్లకు గ్రీన్ ఎకానమీ
అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు) విలువ 2030 నాటికి వార్షికంగా 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. ఇప్పటికే ఇది 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించినట్టు తెలిపింది. భారత్ పునరుత్పాదక విద్యుత్ పరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో కలసి రూపొందించిన నివేదికను విడుదల చేసింది.పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థతో ఎన్నో రంగాల్లోని వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరిస్తున్న కంపెనీలు లబ్ది పొందుతున్నట్టు వివరించింది. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల్లోనూ గ్రీన్ టెక్నాలజీలపై పెట్టుబడులు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. సంప్రదాయ వ్యాపార మార్గాల కంటే పర్యావరణ అనుకూల వ్యాపార ఆదాయాలు కలిగిన కంపెనీలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వివరించింది.సంప్రదాయ కంపెనీల కంటే పర్యావరణ అనుకూల వ్యాపారాల ఆదాయాలు రెండు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, అలాగే నిధుల వ్యయాలు కూడా పర్యావరణ అనుకూల వ్యాపార కంపెనీలకు తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. దీంతో ఈ కంపెనీలు 12–15 శాతం అధిక ప్రీమియాన్ని క్యాపిటల్ మార్కెట్లలో పొందుతున్నట్టు తెలిపింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీల లాభాలు బలంగా కొనసాగుతాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉండడమే దీనికి కారణమని వివరించింది.పునరుత్పాదక విద్యుత్లో భారత్ టాప్ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9 శాతం పెరుగుతుంటే, 13 శాతం వృద్ధితో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. చైనాలో వృద్ధి 12 శాతంగా ఉన్నట్టు తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఏటా 10 శాతం వృద్ధి నమోదవుతుందంటూ.. 16 శాతం వృద్ధితో భారత్ ముందుంటుందని అంచనా వేసింది. 15 శాతం వృద్ధితో చైనా తర్వాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత్, చైనాలో పర్యావరణ అనుకూల ఇంధనాలపై ఏటా 12 శాతం చొ3ప్పున పెట్టుబడులు పెరిగినట్టు వెల్లడించింది. భారత్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో ‘రెన్యూ’ కంపెనీని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 28 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉన్నట్టు తెలిపింది. -
మళ్లీ పడిపోయిన రూపాయి
భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో భారత రూపాయి మారక విలువ మళ్లీ పడిపోయింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న నిరంతర ఈక్విటీ అవుట్ ఫ్లోలు, అనిశ్చితి కారణంగా డిసెంబర్ 4న రూపాయి 22 పైసలు పడిపోయింది.కీలకమైన రూ.90 మార్కును అధిగమించి మునుపటి సెషన్ ను ముగించిన తర్వాత డాలర్తో రూపాయి విలువ గురువారం రూ.90.41 వద్ద ప్రారంభమైంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిమిత జోక్యం కూడా కరెన్సీని ఒత్తిడిలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి తగ్గితే ఏమౌతుంది? -
రూపాయి ఢమాల్.. అయినా డోంట్ వర్రీ.. ఎందుకంటే?
-
ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గిస్తుందా?
ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతోపాటు, జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతుండడం రేట్ల కోతకు అనుకూలించొచ్చని పేర్కొంది. ఈ నెల 5న ఆర్బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుండడం తెలిసిందే. ద్రవ్యోల్బణం దశా బ్ద కనిష్ట స్థాయి అయిన 0.3 శాతానికి అక్టోబర్లో తగ్గినట్టు కేర్ ఎడ్జ్ గుర్తు చేసింది.ఆర్బీఐ లక్ష్యం అయిన 4 శాతానికి ఇది ఎంతో దిగువన ఉందని, దీంతో పాలసీ రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ‘‘బ్రెంట్ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉండడం రబీ సాగుకు అనుకూలం. చైనాలో తయా రీ అధికంగా ఉండడంతో ధరలు పెరిగే ఒత్తిళ్లు లేవు. ద్రవ్యోల్బణం ఇక్కడి నుంచి గణనీయంగా పెరగకుండా ఇవి సాయపడతాయి’’అని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ద్వితీయార్ధంలో వృద్ధి నెమ్మదించొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి విస్తరించగా.. ద్వితీయ ఆరు నెలల్లో (క్యూ3, క్యూ4) వృద్ధి రేటు 7 శాతానికి నెమ్మదించొచ్చని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. అమెరికా టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందుగా చేసిన అధిక ఎగుమతులు, పండుగల అనంతరం వినియోగం తగ్గడం వంటివి వృద్ధి రేటును నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.కాకపోతే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే 12 నెలల్లో 3.7 శాతంలోపు ఉండొచ్చని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చలు దీర్ఘకాలం పాటు కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. విదేశీ మారకం నిల్వలు బలంగానే కొనసాగుతున్నట్టు, నవంబర్ మధ్య నాటికి 27 బిలియన్ డాలర్లు పెరిగి 693 బిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. -
ఆగ్రో కెమికల్స్కు డిమాండ్
ఆగ్రో కెమికల్స్కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. లాక్డౌన్ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్Šస్పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
-
ఇండిగో సంస్థకు భారీ జరిమానా
విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్ క్రెడిట్ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!
తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్ చేరాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. ఈ నెలలోనే ఆఫర్ ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్ 49 శాతం వాటా కలిగి ఉంది.ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) ఆఫర్ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్ కార్పొరేషన్(ప్రమోటర్)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్ ఏఎంసీలు.. హెచ్డీఎఫ్సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, శ్రీరామ్, నిప్పన్ లైఫ్ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చేరనుంది.పవర్ సొల్యూషన్స్.. పవర్ సొల్యూషన్స్ సమకూర్చే పవరికా లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.వృథా నీటి సొల్యూషన్లు వ్యర్థ జలాల ట్రీట్మెంట్ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ కార్తకేయ కన్స్ట్రక్షన్స్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్ఫ్రా కన్స్ట్రక్ట్(ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్గా అవతరించింది. మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.వేక్ఫిట్ @ రూ. 185–195 హోమ్, ఫర్నిషింగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్లీజ్ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్ఫిట్ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, మల్టీబ్రాండ్ ఔట్లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్(తమిళనాడు), సోనిపట్(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. -
Gold Prices: శాంతించిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతుందుంటే..!
-
ఐదేళ్లలో 10 కోట్ల కస్టమర్లు.. అపోలో ఫార్మసీ లక్ష్యం
వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్ల స్థాయికి చేరుకోవాలని అపోలో ఫార్మసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు రెండు కొత్త స్టోర్స్ ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మొత్తం 7,000 స్టోర్స్ మైలురాయిని చేరిన సందర్భంగా సంస్థ సీఈవో పి. జయకుమార్ ఈ విషయాలు వెల్లడించారు.‘ప్రతి రోజూ రెండు కొత్త స్టోర్స్ని ప్రారంభించడాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చేరువవుతాం. తద్వారా అత్యంత నాణ్యమైన ఔషధాలను అందరికి అందుబాటులోకి తెస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. అపోలో ఫార్మసీని అపోలో హెల్త్కో నిర్వహిస్తోంది. తమ పెయిడ్ హెల్త్కేర్ లాయల్టీ ప్రోగ్రాం అయిన అపోలో సర్కిల్ సభ్యుల సంఖ్య 1 కోటి దాటిందని కంపెనీ వెల్లడించింది.మరోవైపు, 7 వేల స్టోర్స్ మైలురాయిని చేరడమనేది అసంఖ్యాక కుటుంబాలకు తమపై గల నమ్మకానికి నిదర్శనమని అపోలో హెల్త్కో ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని తెలిపారు. అపోలో ఫార్మసీ ప్రస్తుతం 19,000పైగా పిన్కోడ్స్వ్యాప్తంగా రోజుకు పది లక్షల ఆర్డర్లు ప్రాసెస్ చేస్తోందని వివరించారు. -
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు. -
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర
-
భారీగా పెరిగిన బంగారం ధర
-
షేక్ చేస్తున్న కోకాపేట.. ఎకరం 151 కోట్లు
-
మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్
-
త్వరలో పసిడి రుణాల్లోకి పిరమల్ ఫైనాన్స్
2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.5 లక్షల కోట్ల ఏయూఎంని (నిర్వహణలోని అసెట్స్) లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పిరమల్ ఫైనాన్స్ రిటైల్ లెండింగ్ సీఈవో జగదీప్ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రిటైల్ ఏయూఎం రూ. 75,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇది సుమారు రూ. 8,300 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.తమ వ్యాపారంలో సుమారు 11–12 శాతం వాటా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింత దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. ప్రధాన నగరాల్లో 59 శాఖలు ఉన్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50–75 శాఖలు ప్రారంభించనున్నామని, వీటిలో కొన్ని ఇక్కడ కూడా ఉంటాయని జగదీప్ పేర్కొన్నారు.ప్రస్తుత గృహ, ఎస్ఎంఈ, వ్యక్తిగత, వాహన రుణాలందిస్తున్న తమ సంస్థ త్వరలో పసిడి రుణాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్లో సెమీ అర్బన్ మార్కెట్లలో డిమాండ్ నెలకొనడంతో రిటైల్ రుణాల మంజూరు 45 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అసంఘటిత రంగ సంస్థల్లో (యూఎస్ఈ) ఉద్యోగాలు స్వల్పంగా పెరిగాయి. క్రితం క్వార్టర్లో 12,85,72,500గా ఉండగా సెప్టెంబర్ త్రైమాసికంలో 12,85,95,600కి చేరాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన సర్వే డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.తయారీ, వాణిజ్యం, ఇతర సర్వీసులు అనే మూడు వ్యవసాయేతర రంగాల గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం, ప్రత్యేకంగా చట్టబద్ధమైన సంస్థలుగా నమోదు చేసుకోని ఈ తరహా సంస్థల్లో ఉద్యోగాలు జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 13,13,38,000తో పోలిస్తే రెండో ఏప్రిల్–జూన్ క్వార్టర్లో తగ్గాయి.ఈ రంగంలో ఇంటర్నెట్ వినియోగం జూన్ క్వార్టర్లో నమోదైన 36 శాతంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతానికి పెరిగింది. సెపె్టంబర్ త్రైమాసికంలో తయారీలో ఉపాధి పెరిగింది. -
ఎస్బీఐ వెంచర్స్ టార్గెట్ రూ. 2,000 కోట్లు
బ్యాంకింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కు చెందిన ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ ఎస్బీఐ వెంచర్స్ మూడో పర్యావరణహిత ఫండ్ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధులను సంబంధిత స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది.దీంతో పర్యావరణ పరిరక్షిత వృద్ధికి మద్దతివ్వనున్నట్లు ఎస్బీఐ వెంచర్స్ ఎండీ, సీఈవో ప్రేమ్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఐవీసీఏ గ్రీన్ రిటర్న్స్ రెండో సదస్సు సందర్భంగా ఇది కొత్త ఫైనాన్షియల్ అవకాశమని తెలియజేశారు. దీనిలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వచ్చే ఏడాది మొదట్లో రోడ్షోలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.మార్చికల్లాకొత్త కేలండర్ ఏడాది(2026) తొలి త్రైమాసికం(జనవరి–మార్చి)లో క్లయిమేట్ ఫండ్ను ఆవిష్కరించడం ద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాకర్ వెల్లడించారు. నిధులను ప్రధానంగా తొలి దశ, వృద్ధిస్థాయిలో ఉన్న క్లయిమేట్ ఫోకస్డ్ స్టార్టప్లలో పెట్టుబడులకు వినియోగించనున్నట్లు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన సాంకేతికతలు, ఏఐ ఆధారిత క్లయిమేట్ ఆవిష్కరణలకు తెరతీసే స్టార్టప్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. -
హోమ్ లోన్ అంటే ప్రభుత్వ బ్యాంకే.. ఎందుకు?
గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో డిమాండ్ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 3 శాతానికి తగ్గాయి.ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలువడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటంప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.ప్రభుత్వంపై నమ్మకంఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.ప్రభుత్వ హౌసింగ్ స్కీములుప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.పెద్ద మొత్తాల రుణాలువినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.రిస్క్ తీసుకునే సామర్థ్యంప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.బ్రాంచ్ నెట్వర్క్ భారీగా ఉండటంగ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది. -
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్గ్రేడ్ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.‘ఏఐ 171 క్రాష్ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.ఎయిరిండియా గ్రూప్లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్ప్రెస్కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్ 777 విమానాలు 22, అలాగే బోయింగ్ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని విల్సన్ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్క్రాఫ్ట్లు అప్గ్రేడ్ అవుతాయని వివరించారు. -
న్యూ ఫండ్ ఆఫర్: కొత్త మ్యూచువల్ ఫండ్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్వోఎఫ్ స్వరూపం ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్వోఎఫ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్: షేరుకి రూ. 1800
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి తెరతీస్తోంది. ఈ నెల 26న ముగియనున్న బైబ్యాక్లో భాగంగా షేరుకి రూ. 1,800 ధర మించకుండా చెల్లించనుంది. ఇందుకు రూ. 18,000 కోట్లవరకూ వెచ్చించనుంది. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది.ఇది కంపెనీ ఈక్విటీలో 2.41 శాతం వాటాకు సమానంకాగా.. అర్హతగల వాటాదారులు నవంబర్ 20–26 మధ్య కాలంలో షేర్లను విక్రయించేందుకు(టెండర్) వీలుంటుంది. మధ్యకాలానికి కంపెనీ నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక మిగులు నిధులను వాటాదారులకు పంచే యోచనతో బైబ్యాక్కు ఉపక్రమించింది.రెండు విభాగాలుగా..కంపెనీ మూలధన కేటాయింపుల విధానం ప్రకారం బైబ్యాక్ను రెండు విభాగాలుగా చేపడుతున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. సాధారణ కేటగిరీతోపాటు.. చిన్న వాటాదారులకు రిజర్వ్డ్ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిజర్వేషన్ విభాగంలో వాటాదారుల ఈక్విటీ షేర్ల సంఖ్యలో 15 శాతం లేదా ఇందుకు అర్హమైన ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఏది ఎక్కువైతే దానిని పరిగణిస్తుంది.ఈ నెల 14కల్లా వాటాదారులుగా నమోదై రూ. 2 లక్షల విలువకు మించకుండా షేర్లు కలిగిన వాటాదారులకు ఇది వర్తించనుంది. చిన్న ఇన్వెస్టర్లకు 2:11, సాధారణ కేటగిరీలో 17:706 నిష్పత్తిని షేర్ల బైబ్యాక్కు నిర్ణయించింది. ఇన్ఫోసిస్లో 25,85,684 మంది చిన్న ఇన్వెస్టర్లున్నారు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద గల ప్రతీ 11 షేర్లలో 2 షేర్లకు బైబ్యాక్ను ఆఫర్ చేస్తుంది.గత బైబ్యాక్ల తీరిలా ఇన్ఫోసిస్ గతంలో తొలిసారి 2017లో రూ. 13,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. కంపెనీ ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు షేరుకి రూ. 1,150 ధరను నిర్ణయించింది. తదుపరి 2019లో రూ. 8,260 కోట్లు ఇందుకు వెచ్చించింది.ఈ బాటలో మూడోసారి రూ. 9,200 కోట్లు, 2022లో మరోసారి షేరుకి రూ. 1,850 చొప్పున రూ. 9,300 కోట్లు చొప్పున బైబ్యాక్కు కేటాయించింది. కాగా.. ప్రస్తుత బై బ్యాక్లో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ పాల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు. ప్రమోటర్లలో నందన్ నిలేకని, సుధా మూర్తిసహా ఇతర ప్రమోటర్ కుటుంబీకులు ఇందుకు నో చెప్పడం గమనార్హం! -
2.75 లక్షల యూజర్లు.. 1.3 లక్షల ఫిర్యాదులు
వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ–జాగృతి ప్లాట్ఫామ్కు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్పై తమ పేర్లను నమోదు (రిజిస్టర్డ్ యూజర్లు) చేసుకున్నారు. ఇందులో 1,388 మంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు.ఫిర్యాదుల కోసం ఓసీఎంఎస్, ఈ–దాఖిల్, ఎన్సీడీఆర్సీ సీఎంఎస్, కాన్ఫోనెంట్ పోర్టళ్లు అందుబాటులో ఉండగా, వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఇ–జాగృతి ప్లాట్ఫామ్ను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకురావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు.నవంబర్ 13 నాటికి 1,30,550 ఫిర్యాదులు దాఖలైనట్టు.. ఇందులో 1,27,058 ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్ఆర్ఐలు విదేశాల నుంచే తమ వినియోగ హక్కులను ఈ ప్లాట్పామ్ ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్తో భౌగోళిక పరమైన అవరోధాలు వారికి తొలగినట్టయిందని తెలిపింది. మీరూ ఫిర్యాదు చేస్తారా?మొదట ఇ-జాగృతి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండితొలిసారి యూజర్ అయితే, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, మీరు వినియోగదారా లేక ఇతరులా అన్న వివరాలు నమోదు చేయండి.ఇప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంచుకోండి. చిరునామా, గుర్తింపు రుజువు వివరాలు ఇచ్చి రిజిస్టర్ పూర్తి చేయండికొత్త కంప్లయింట్ ఇలా..లాగిన్ అయిన తరువాత, మీ డ్యాష్ బోర్డ్ మీద "ఫైల్ న్యూ కేస్" ఎంచుకోండి. తర్వాత కేసు టైప్ను ఎంచుకుని ‘కన్స్యూమర్ కంప్లయింట్’పై క్లిక్ చేయండి.ఇప్పుడు ఫిర్యాదు అవసరమైన డాక్యుమెంట్లు, రుసుము వివరాలు కనిపిస్తాయి.వస్తువులు లేదా సేవల కోసం మీరు చెల్లించిన మొత్తం, ఇప్పుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారు, తేదీ, మీ రాష్ట్రం, జిల్లా, కేటగిరీ, సబ్ కేటగిరి తదితర వివరాలు నమోదు చేయండి.కొనుగోలు రసీదులు, వారితో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.చివరగా మొత్తం వివరాలను ఒకసారి సరిచూసుకుని సంబంధిత రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి. -
ఆ ‘సర్దుబాటు’పైనే వొడాఫోన్ ఐడియా ఆశలన్నీ..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా(వీఐ).. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిల విషయంలో తగిన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని ఆశిస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వంతో చురుగ్గా సంప్రదింపులు జరుగుతున్నాయని కంపెనీ సీఈఓ అభిజిత్ కిశోర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.78,500 కోట్ల ఏజీఆర్ బకాయిలు పేరుకుపోగా, దీనికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.కాగా, క్యూ2 ఫలితాల అనంతరం అభిజిత్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. నిధుల సమీకరణ కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో సహా పలు మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఏజీఆర్ పరిష్కారంపైనే ఈ ప్రయత్నాలన్నీ ఆధారపడి ఉంటాయన్నారు. కాగా, 2025–26 సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్ధంలో వీఐ నికర నష్టం రూ.12,132 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.02 లక్షల కోట్లకు చేరింది. -
బజాజ్ ఫిన్సర్వ్ లాభం రూ. 2,244 కోట్లు
డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 2,244 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,704 కోట్ల నుంచి రూ. 37,403 కోట్లకు ఎగసింది.వడ్డీ ఆదాయం రూ. 16,572 కోట్ల నుంచి రూ. 19,599 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,741 కోట్ల నుంచి రూ. 30,581 కోట్లకు పెరిగాయి. అనుబంధ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 5 శాతం పుంజుకుని రూ. 517 కోట్లకు చేరగా.. అసెట్ మేనేజ్మెంట్ ఏయూఎం రూ. 28,814 కోట్లను తాకింది.జాగిల్ లాభం జూమ్ స్పెండ్ మేనేజ్మెంట్ కంపెనీ జాగిల్ (zaggle) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 79 శాతం జంప్చేసి రూ. 33 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 42 శాతంపైగా ఎగసి రూ. 431 కోట్లను తాకింది.నిర్వహణ లాభం(ఇబిటా) 48% వృద్ధితో రూ. 44 కోట్లకు చేరింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలసి రిటైల్ కార్డుల విభాగంలోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. జాగిల్ గ్లోబల్ప్లే ఫారెక్స్ కార్డ్తోపాటు జాగిల్ మాస్టర్ కార్డ్ ప్రిపెయిడ్ కార్డ్లను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది. -
అమెరికా కంపెనీలో వాటా కొన్న హైదరాబాద్ స్టార్టప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన లీ టోంగ్ గ్రూప్లో భాగమైన రీటెక్ ఎన్విరోటెక్లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు హైదరాబాద్కి చెందిన అంకుర సంస్థ బ్లాక్ గోల్డ్ రీసైక్లింగ్ వెల్లడించింది. పర్యావరణహితమైన విధంగా లిథియం అయాన్ బ్యాటరీలు, ప్లాస్టిక్స్, సోలార్ ప్యానెళ్లు మొదలైన వాటి రీసైక్లింగ్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రభు రామ్ తెలిపారు.ఈ డీల్లో భాగంగా రీటెక్ ఎన్రోవ టెక్ సీఈవో పంకజ్ తిర్మన్వార్.. బ్లాక్ గోల్డ్లో సహ వ్యవస్థాపకుడిగా, బోర్డు సభ్యుడిగా చేరతారని పేర్కొన్నారు. వ్యర్ధాలను విలువైన వనరులుగా మార్చే అధునాతన సాంకేతికతలపై తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు.ఏఐ హబ్ని విస్తరించిన మెల్ట్వాటర్మీడియా, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్వాటర్, హైదరాబాద్లోని తమ ఏఐ హబ్ని మరింతగా విస్తరించింది. ఈ కార్యాలయం వైశాల్యం దాదాపు 14,000 చ.అ.గా ఉంటుంది. ఇందులో 60 మంది ఇంజినీర్ల ఆర్అండ్డీ (పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు) బృందం, కొత్త తరం ఏఐ సొల్యూషన్స్ను రూపొందించడంపై పని చేస్తోందని సంస్థ తెలిపింది.హైదరాబాద్లోని ఐఐటీ, బిట్స్ పిలానీ, ట్రిపుల్ఐటీలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వీరిని రిక్రూట్ చేసుకున్నట్లు వివరించింది. 2026 నాటికి ఇంజినీర్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆదిత్య జామీ తెలిపారు. భారత్లో రిజర్వ్ బ్యాంక్, ఎయిరిండియా, టాటా గ్రూప్, అమెజాన్ ఇండియాలాంటి దిగ్గజాలకు సర్వీసులు అందిస్తున్నట్లు వివరించారు. -
వివిధ బ్యాంకుల అకౌంట్లలో మగ్గుతున్న ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు
-
జపాన్ మొబిలిటీ షో 2025: మైమరిపిస్తున్న కొత్త వాహనాలు (ఫోటోలు)
-
బంగారం ఇక పనికిరాదు.. బాబా వంగా సంచలనం
-
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ ఫోన్ డెలివరీ
-
Gold Price: భగ్గుమన్న బంగారం ధర
-
Stock Markets: దీపావళి సందర్భంగా మూరత్ ట్రేడింగ్
-
రెట్టింపైన ఐడీబీఐ బ్యాంకు లాభం
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్)లో వాటా విక్రయం ద్వారా వచి్చన లాభంతో కలుపుకొని, ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.3,627 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఎన్ఎస్డీఎల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.22 కోట్ల ఈక్విటీలు(11.11% వాటాకు సమానం) జారీ చేసి రూ.1,698.96 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్జించిన రూ.1,836 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 17% వృద్ధి చెంది రూ.3,006 కోట్ల నుంచి రూ.3,523 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,875 కోట్ల నుంచి రూ.3,285 కోట్లకు దిగివచ్చింది. స్థూల ఎన్పీఏ రేషియో 3.68% నుంచి 2.65 శాతానికి మెరుగుపడింది.నికర ఎన్పీఏ స్వల్పంగా 0.20% నుంచి 0.21 శాతానికి పెరిగింది. మొత్తం వ్యాపార వార్షిక వృద్ధి 12% పెరిగి రూ.5,33,730 కోట్లకు చేరింది. సెపె్టంబర్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ రూ.1,39,036 కోట్లుగా, కాసా రేషియో 45.81% నమోదైందని పేర్కొంది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
-
బంగారాన్ని దోచేస్తున్నారు.. జాగ్రత్త అక్కా!
-
బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం
-
తులం బంగారం రూ.2.5లక్షలు!
-
Gold Rates: వణికిస్తున్న బంగారం
-
తులం కొనాలంటే.. పొలం అమ్మాల్సిందే..
-
సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం
-
పసిడి రుణాలకు భారీ డిమాండ్
-
గోల్డ్ ఇలా పెట్టుబడి పెడితే మీరే కోటిశ్వరుడు
-
వెయ్యి కొత్త ఉద్యోగాలు.. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రకటన
గ్లోబల్ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ నగారో వచ్చే 12–18 నెలల్లో 1,000 మంది పైగా నిపుణులను నియమించుకునే యోచనలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా కీలక హబ్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం భారత్లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నగారో సీఈవో మానస్ హుమాన్ వివరించారు.స్టార్టప్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ పెరగడంతో మార్కెట్లో నిపుణుల కొరత నెలకొందని, అయితే అంతర్జాతీయ అనిశ్చితులపై ఆందోళన వల్ల ఉద్యోగాలు మారే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు మానస్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య, టారిఫ్లపరమైన అనిశ్చితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు. -
బంగారం పరుగులు
-
భగ్గుమన్న బంగారం.. ఆల్ టైమ్ హైకి ధర
-
భారత్లో కూడా ఇవాళ భారీగా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం
-
Food Hike: వర్షంలో ఫుడ్ ఆర్డర్ పెట్టారా.. మీ జేబు ఖాళీ
-
ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ సంచలనం..
-
ఆటోమొబైల్స్ లో GST జోష్.. ఎన్ని కార్లు అమ్ముడుబోయాయంటే..
-
5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో దుమ్మురేపిన బాబులాంటి SUV కారు
-
ధరలు పెరిగినా బంగారంపై తగ్గని ప్రేమ
-
బంగారంపై GST ప్రభావం ఎలా ఉంటుంది..
-
తారాస్థాయికి బంగారం ధర
-
ఎలన్ మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్
-
ఐఫోన్ 17 వచ్చేసింది.. ఫీచర్లు, ధరలు ఇలా..!
-
కొనుగోలుదారులకు చుక్కలు
-
ఢిల్లీలో అత్యంత ధనవంతులు వీళ్లే - ఫోటోలు
-
ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు
గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్ ఫామ్ ఓయో (OYO) కంపెనీ పేరు మారింది. ఐపీఓ ముంగిట ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. ఇది దాని అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుంది. తమ ప్లాట్ ఫామ్కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానుంది. అయితే ఒక బ్రాండ్గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు."ప్రిజం మన విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, మనం ఎవరో స్పష్టంగా తెలియజేయడానికి మనకు సహాయపడుతుంది. ఇది మన వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది" అని అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు.కొత్త పేరు ఇలా వచ్చింది..మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6,000 లకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసింది. అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను ఈ గ్రూప్ పోర్ట్ ఫోలియో విస్తరించింది.వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్ లు, సెలబ్రేషన్ స్పేస్ లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.ఇదీ చదవండి: ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు -
Gold Price: ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర
-
భారీగా తగ్గిన GST.. టీవీలు, కార్లు, రైతు సామగ్రిపై భారీ తగ్గింపు
-
కొండెక్కిన కనక మహాలక్ష్మి
-
జీఎస్టీలో మార్పులు.. వీటిపై ధరలు తగ్గుతాయ్..!
-
ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా?
హైదరాబాద్..! ప్రపంచ దేశాల్లో కేవలం ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు.. కాలాతీతంగా మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ ఆర్థిక, ఆధునిక, విజ్ఞాన, వ్యాపార అంశాల్లో ఎప్పటికప్పుడు తన ప్రశస్తిని చాటుతున్న గ్లోబల్ సిటీ. నగరంలోని పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఆయా సంస్థలు చెల్లిస్తున్న అద్దెలే ఇందుకు తార్కాణం.. పలు గ్లోబల్ సంస్థలు నగర కేంద్రంగా లక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కాదు.. ఆ స్థలాలకు ప్రతి నెలా కోట్ల రూపాయల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఆయా గ్లోబల్ సంస్థల వింతలు, విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరోమైక్రోసాఫ్ట్ (ఆర్ అండ్ డీ): ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఫీనిక్స్ సెంచురస్ భవనంలో 2.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూలై 2025 నుంచి కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల రూ. 5.4 కోట్ల అద్దె చెల్లిస్తోంది. ఐదేళ్ల లీజ్ ఒప్పందంలో భాగంగా ఈ ఆఫీస్ స్పేస్ కోసం నగరంలో అత్యధిక అద్దె చెల్లిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే.క్వాల్కమ్: ఈ సంస్థ కార్యాలయం హై‑టెక్ సిటీలోని ది స్కై వ్యూ భవనంలో 4.14 లక్షల చదరపు అడుగులకు దాదాపు 3.15 కోట్ల భారీ అద్దెను చెల్లిస్తుంది. ఇది అత్యంత అధిక అద్దె తీసుకునే లీజుల్లో ఒకటి. ఈ సంస్థ కుదుర్చుకున్న ఐదేళ్ల లీజ్లో మొదటి ఏడాది తరువాత ఈ అద్దె 7 శాతం పెరుగనుంది. అంతేకాకుండా మూడేళ్ల తరువాత మరో 15 శాతం పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.టీసీఎస్: శేరిలింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రాజ్పుష్ప భవనంలో అంతర్జాతీయ సేవలందిస్తున్న టీసీఎస్.. సుమారు 10.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.4.3 కోట్ల నెలవారి అద్దె కడుతోంది. 15 ఏళ్లకుగాను కుదుర్చుకున్న ఈ లీజ్ నగరంలో అత్యధిక అద్దె కడుతున్న సంస్థల్లో మరొక ప్రధాన సంస్థగా నిలిచింది.ఫేస్బుక్ (మెటా): ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫేస్బుక్ (మెటా) హైదరాబాద్ నగరంలో 3.7 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం దాదాపు 2.8 కోట్ల నెలవారీ అద్దెతో లీజును నవీకరించింది. రానున్న ఏడాది 2026 జనవరిలో ఈ అద్దె 15 శాతం పెరగనుంది.ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా: ఈ సంస్థ నగరంలో 2.41 లక్షల చదరపు అడుగులకు ప్రతి నెలా రూ.1.77 కోట్లు చెల్లిస్తోంది. 2024 నుంచి ఐదేళ్లకు కుదుర్చుకున్న ఈ లీజ్ రెండేళ్ల తరువాత 15 శాతం పెరుగనుంది.ఎల్టీఐ మైండ్ ట్రీ: హైటెక్ సిటీలోని స్కై వ్యూ 10లో ఎల్టీఐ మైండ్ ట్రీ సంస్థ సుమారు 1.09 లక్షల చదరపు అడుగులకు 89.18 లక్షలు అద్దెగా చెల్లిస్తూ.. ఐటీ దిగ్గజాల సరసన నిలిచింది.ఐబీఎం ఇండియా: గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఓరియన్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐబీఎం ఇండియా తమ లీజులో భాగంగా 1.06 లక్షల చదరపు అడుగుల స్థలానికి ప్రతి నెలా రూ.70.23 లక్షలు చెల్లిస్తోంది. 2024లో మొదలైన ఈ లీజ్ ప్రతి ఐదేళ్లకు 4 శాతం పెరగనుంది.50 శాతం టెక్ లీజింగ్..సిటీలో 2025లో నూతనంగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా గణనీయంగా తగ్గడంతో వేకెన్సీ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల అద్దె చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయని ఓ గ్లోబల్ సంస్థ ప్రతినిధి తెలిపారు. దీనికి తోడు ఇక్కడ లభించే సేవల సమగ్రత, దీనికి స్థానిక ప్రభుత్వ మద్దతు.. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అందిస్తున్న ప్రోత్సాహం.. అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇవన్నీ కలిపి హైదరాబాద్ను యూనివర్సల్ హబ్గా మార్చేసింది.మోడ్రన్ లైఫ్స్టైల్..ఈ అంశాలే కాకుండా విలాసవంతమైన అధునాతన జీవనవిధానం, ఈ గ్లోబల్ కంపెనీలకు అనువైన డిజైన్తో కూడిన భవనాలు, సురక్షిత పార్కింగ్, ఆధునిక భవన లీఫ్ట్ సౌకర్యాలు, రెగ్యులర్ పవర్ బ్యాకప్ వంటివి తోడ్పాటును అందిస్తున్నాయి. కేవలం ఆఫీసు అధికారిక కార్యకలాపాల్లో భాగంగా పనిచేయడమే కాకుండా సమీపంలోని మోడ్రన్ లైఫ్స్టైల్ అలవాట్లు, కాంటినెంటల్ ఫుడ్, ఫిట్నెస్ సేవలు ఆ కంపెనీల ఉద్యోగులకు గ్లోబల్ లెవెల్ లైఫ్స్టైల్ అందిస్తున్నాయి. ఫ్యామిలీ–ఫ్రెండ్లీ వాతావరణం, ఉద్యోగులకు కుటుంబంతో ఉండేందుకు సరైన నివాస, విద్య, వినోదం వంటివి స్థానికంగానే అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం.ఇన్నోవేటివ్ సెంటర్..నగరంలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు ఇంత భారీ స్థాయిలో అద్దెలు చెల్లించడానికి ప్రధాన కారణం.. భాగ్యనగరం భారతీయ ఐటీ, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) హబ్గా, ప్రతిష్టాత్మక ఇన్నోవేటివ్ కేంద్రంగా ఎదగడమేనని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ అధునాతన జీవన శైలికి అనుగుణమైన లైఫ్స్టైల్ పర్యావరణాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటుంది. ముఖ్యంగా హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు సమృద్ధిగా కెఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇంటర్నెట్, క్యాంపస్ మోడ్రన్ వాతావరణంతో అద్భుత జీవన విధానాన్ని అందజేస్తున్నాయి. -
నాన్ స్టాప్ గా పెరుగుతున్న గోల్డ్ రేట్స్
-
Gold Price in India: బంగారం ధరలకు రెక్కలు
-
ఇక మీ EPFO ATM నుంచే విత్ డ్రా చేసుకోవచ్చు..!
-
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
కర్ణాటకలో అత్యంత ధనవంతులు - టాప్ 10 జాబితా
-
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే..
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకూ ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్బీఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇతర సేవలకు సంబంధించి నేరుగా బ్యాంకు శాఖల్లో ముఖ్యమైన కార్యకలాపాలను ప్లాన్ చేసేవారి కోసం ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వారం ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఆ ఆజాబితాను తెలియజేస్తున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించవచ్చు.ఇదిగో సెలవుల జాబితా..ఆగస్టు 25 (సోమవారం) - శ్రీమంత శంకరదేవుని తిరుభవ్ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులకు సెలవుఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సెలవు.ఆగస్టు 28 (గురువారం) - గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై కారణంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకుల మూసివేతఆగస్టు 31 (ఆదివారం) - వారాంతపు సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బ్యాంకుల మూసివేతప్రాంతీయ, స్థానిక ఆచార సంప్రదాయాల కారణంగా దేశంలో సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.బ్యాంకు సెలవులు శాఖ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మీ లావాదేవీలు సజావుగా కొనసాగేలా చేస్తుంది.నగదు అత్యవసరాల కోసం ఏటీఎంలు యథావిధిగా విత్ డ్రా చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ చెల్లింపుల కోసం సంబంధిత బ్యాంక్ యాప్, పయూపీఐని కూడా ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే.. -
అనిల్ అంబానీ ‘డబుల్ ఫ్రాడ్’! మీద పడిన మరో బ్యాంక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని చిక్కులు వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను "ఫ్రాడ్"గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన కొన్ని రోజులకే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా ప్రమోటర్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది.రుణాలను దారి మళ్లించారని, మంజూరు నిబంధనలను ఉల్లంఘించారని, అంబానీతో పాటు కంపెనీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను తన నోటీసులో పేర్కొన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో బ్యాంక్ పేర్కొంది. కాగా 2025 ఆగస్టు 22న ప్రభుత్వ రంగ సంస్థ బీఓఐ నుంచి తమకు లేఖ అందిందని ఆర్కామ్ అదే రోజున తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజరి ఆషిక్ కక్కర్ ల రుణ ఖాతాలను రూ .724.78 కోట్లకు మోసంగా ట్యాగ్ చేసినట్లు బ్యాంక్ తన నోటీసులో పేర్కొంది.తమ అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ (ఆర్టీఎల్)కు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఫైలింగ్లో వెల్లడించింది. దీని ప్రకారం.. ఆర్టీఎల్, గ్రేస్ థామస్ (ఆర్టీఎల్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత కంపెనీ డైరెక్టర్), మరికొందరి రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలని బ్యాంక్ నిర్ణయించింది.బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఒక రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించిన తర్వాత, క్రిమినల్ చర్యల కోసం దానిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపాలి. రుణగ్రహీత వచ్చే ఐదేళ్ల వరకు బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థల నుండి కొత్త రుణాలు తీసుకోకుండా నిషేధం ఉంటుంది.ఇప్పటికే ఎస్బీఐ..రుణ నిబంధనలను ఉల్లంఘించి ఆర్ కామ్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ గత జూన్ లో స్టేట్ ఎస్బీఐ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కామ్కు సంబంధించిన కార్యాలయాలతో పాటు అనిల్ అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్బీఐ పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ తన ప్రతినిధి ద్వారా ఖండించారు.ఇదీ చదవండి: అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు! -
పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. 2015–16 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం.. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 వరకు దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్న కేసుల సంఖ్య 35,888కి చేరింది. మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్ చేశారు. 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు.2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేశారు.ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం.. కొత్త అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ముగిసేలోగా ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయాన్ని పూర్తి చేసే వీలున్నట్లు దీపమ్ కార్యదర్శి అర్నుష్ చావ్లా పేర్కొన్నారు. అర్హతగల బిడ్డర్లు సాధ్యాసాధ్యాల పరిశీలనను దాదాపు పూర్తిచేసిన నేపథ్యంలో తాజా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా చావ్లా విలేకరులతో ఈ అంశాలను ప్రస్తావించారు.ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్లు సమీకరించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 20,000 కోట్లు సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. అర్హతకలిగి ఆసక్తి ప్రదర్శించిన పార్టీలు ఇప్పటికే బ్యాంక్పై ఒక అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకూ జవాబులు సైతం లభించినట్లు తెలియజేశారు. బ్యాంక్కు సంబంధించిన అన్ని గణాంకాలు లేదా వివరాలను సమగ్రంగా అందించినట్లు తెలియజేశారు.ఐడీబీఐ బ్యాంక్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దీనిలో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ విక్రయించనుంది. ఇక ఎల్ఐసీలో కొంతమేర ప్రభుత్వ వాటా విక్రయ అంశంపై దీపమ్తోపాటు.. మర్చంట్ బ్యాంకర్లు, ఎల్ఐసీ ఉమ్మడిగా అంతర్మంత్రిత్వ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం
తమకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేరైతే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ప్రాంతం, ప్రాజెక్ట్, బడ్జెట్తో పాటు ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా, వారి వారి వెసులుబాటు బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. – సాక్షి, సిటీబ్యూరోసొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే.. మరికొందరు ఉద్యోగ విరమణ వయసు నాటికి గానీ కొనుక్కోలేరు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. కనీసం ఐదారేళ్ల ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక చేస్తేనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను పలువురు డెవలపర్లు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ముందు నుంచే పక్కా ఆర్థిక ప్రణాళికంగా వ్యహరించాలి.పొదుపు చేస్తేనే.. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతినెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. కనీసం నెలకు రూ.10 వేల నుంచి, ఆ తర్వాత ఎవరి ఆదాయాన్ని బట్టి ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్పేమెంట్కు అవసరమయ్యే 15–20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణాన్ని తీసుకోవచ్చు.బడ్జెట్ను బట్టే నిర్ణయం.. ప్రతినెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగస్తులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టీలు వేయడం, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేయడం వంటి మార్గాలను అన్వేషించాలి. అంతేకాకుండా బ్యాంక్లు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇంటి బడ్జెట్ ఎంతో ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు రెండు రోజులు బంద్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది. -
ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. -
ఈపీఎఫ్వో ‘కొత్త’ రికార్డ్..
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్వోకు జూన్లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్లో ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్స్కయిబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్లో ఈపీఎఫ్వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్వో కొత్త సబ్స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్ -
ఫ్యామిలీకంతా రూ.కోటి ఉన్నా చాలు.. హెచ్డీఎఫ్సీ కొత్త ఆప్షన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ప్రీమియం “ఇంపీరియా” ప్రోగ్రామ్కు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు రూ.1 కోటి “టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV)” ఆధారంగా కూడా ఈ ప్రోగ్రామ్కు అర్హత పొందవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతాలకే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ గ్రూప్లతో కలిపి ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో టీఆర్వీ ఆధారంగా అర్హత పొందాలంటే, రూ.1 కోటి విలువను వ్యక్తిగత ఖాతా స్థాయిలో నిర్వహించాల్సి ఉండేది. అంటే, ఒక కస్టమర్కి చెందిన సేవింగ్స్, ఎఫ్డీ, పెట్టుబడులు, లోన్లు, డీమాట్, ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైనవి కలిపి రూ.1 కోటి టీఆర్వీ ఉండాలి. తాజా మార్పు ప్రకారం.. గ్రూప్ స్థాయిలో రూ.1 కోటి టీఆర్వీ ఉంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ ఎంటిటీల ఖాతాలు కలిపి ఈ విలువ చేరవచ్చు.టీఆర్వీ కాకుండా ఇతర అర్హత మార్గాల ద్వారా హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో చేరాలంటే కరెంట్ ఖాతాలో రూ.15 లక్షల సగటు త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వహించాలి. అదే సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల సగటు నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫ్డీ, సేవింగ్స్, కరెంట్ ఖాతాలన్నీ కలిపి అయిఏత రూ.30 లక్షల సగటు బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ ఖాతాల్లో రూ.3 లక్షల పైగా నెలవారీ జీతం జమయ్యేవారికి కూడా ఇంపీరియా ప్రోగ్రామ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇంపీరియా ప్రోగ్రామ్.. దాని ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంపీరియా ప్రోగ్రాం అనేది హై-వ్యాల్యూ కస్టమర్ల కోసం రూపొందించిన ప్రీమియం బ్యాంకింగ్ సేవల ప్యాకేజీ. దీని ముఖ్యమైన ప్రయోజనాలు కస్టమర్కు ప్రత్యేకత, ప్రాధాన్యత, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి.ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్:వ్యక్తిగతంగా సేవలు అందించే రిలేషన్షిప్ మేనేజర్పెట్టుబడులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో గైడెన్స్వెల్త్ అడ్వయిజరీ సేవలు:ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా సలహాలుఉచిత, తగ్గింపు సేవలు:చెక్బుక్, స్టాప్ పేమెంట్, ఇంటర్-బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఉచితంమొదటి లాకర్ ఉచితం, రెండవది 50% తగ్గింపుప్రాధాన్యత ధరలు:ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు, లోన్లు, ఎఫ్డీలు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లుప్రత్యేక ఆఫర్లు, ప్రోమోషన్లు:హెచ్డీఎఫ్సీ భాగస్వామ్య బ్రాండ్స్ వద్ద క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్లు, రివార్డ్పాయింట్లు, లైఫ్స్టైల్ బెనిఫిట్లు -
ఆ ఫీచర్ బంద్: గూగుల్ పే, ఫోన్పే.. యాప్లలో కీలక మార్పు
యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లలో ఈ మార్పు అమలులోకి రానుంది.మోసాల వెనుక ఉన్న మెకానిజం‘పేమెంట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ, డబ్బు పంపుతున్నట్టు చూపించి, వినియోగదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో వాడుక వస్తువుల కొనుగోలు సందర్భాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు డబ్బు వస్తుందనుకుని, రిక్వెస్ట్ను అంగీకరించడం వల్ల వారి ఖాతాల్లోని డబ్బు మోసగాళ్లకు చేరుతోంది.యాప్లు అప్డేట్ చేసుకోవాలి..ఎన్పీసీఐ ఆదేశాల మేరకు, అక్టోబర్ 2 నుంచి ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా యూపీఐ యాప్లు తమ సిస్టమ్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచే దిశగా కీలక అడుగులుగా ఎన్పీసీఐ భావిస్తోంది.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
బోనస్ వస్తుందోచ్.. ఇన్ఫీ ఉద్యోగులకు శుభవార్త
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్ -
అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా? కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్ నుంచి కెమికల్స్ తయారు చేసే కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు, నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది. -
మహిళల కోసం టాటా ఏఐఏ కొత్త పాలసీ
జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రత్యేకంగా మహిళల కోసం శుభ్ శక్తి పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే, పురుషుల పాలసీలతో పోలిస్తే ప్లాన్ వ్యవధి ఆసాంతం ప్రీమియంపై 15% సుమారు డిస్కౌంటు, సింగిల్ మదర్స్కి దీనికి అదనంగా 1% మేర జీవితకాల డిస్కౌంటులాంటి ఫీచర్లు ఈ పాలసీలో ఉంటాయి.అలాగే సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ మొదలైన వాటికి టీకాలపరమైన మద్దతు, ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్ల వంటి ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.పాలసీ ముఖ్య లక్షణాలుప్రీమియం హాలిడే: బిడ్డ పుట్టిన తర్వాత 12 నెలల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పాలసీ వ్యవధిలో రెండుసార్లు వర్తిస్తుంది.తక్కువ ప్రీమియం: పురుషుల పాలసీలతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది పాలసీ కాలం మొత్తం వర్తిస్తుంది.ఒంటరి తల్లులకు ప్రత్యేక రాయితీ: జీవితకాల ప్రీమియంపై అదనంగా 1% తగ్గింపు.ఆరోగ్య ప్రయోజనాలు: సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ వంటి వ్యాధులకు టీకాల మద్దతుఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లుప్రీమియం వెయివర్: జీవిత భాగస్వామి ప్రమాదవశాత్తూ మరణిస్తే, తదుపరి ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం లేదు.అదనపు ప్రయోజనం: అదనపు ప్రీమియంతో పిల్లల విద్య కోసం నెలవారీ ఆదాయం పొందే అవకాశం (21 లేదా 25 ఏళ్ల వరకు) -
మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ -
పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. -
రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.కొత్త పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్ఎస్కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్, మెరుగైన నెట్వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్వేర్ అమలు చేయబోతున్నారు.ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్వన్ (RailOne) అనే కొత్త సూపర్ యాప్ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్వన్ యాప్లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్ రౌండప్ ట్రిప్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది. -
విన్ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది. -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్ఫారమ్. ఇది ఏఐ మోడల్స్కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..
హైదరాబాద్లో ‘రియల్’ దూకుడు పెరిగింది. నగరానికి నాలుగు వైపులా భారీ లేఅవుట్లు, కొత్త వెంచర్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల విక్రయాల్లో సైతం జోరు పెరిగింది. దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న ‘రియల్’ స్తబ్దత క్రమంగా పటాపంచలవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోమహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. మరోవైపు ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన బిడ్డింగ్కు సైతం అనూహ్య స్పందన లభించింది. ఫ్యూచర్ సిటీ నుంచి షాద్నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులను ఇచ్చారు. మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపయ్యే అవకాశం ఉంది.గత మూడేళ్లలో హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులుగతేడాది కంటే ఎక్కువే.. గత సంవత్సరం 2024లో మొత్తం 878 అనుమతులు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులు ఇవ్వడం విశేషం. గత సంవత్సరం అన్ని అనుమతులపై హెచ్ఎండీఏకు రూ.395.13 కోట్ల ఆదాయం లభించగా ఈ సంవత్సరం జూన్ వరకు రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మరోవైపు 2023 సంవత్సరంలో 1,361 అనుమతులు ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది.నిర్మాణ రంగంలో కొంతకాలం స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా బిల్డ్నౌను ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది. క్షణాల్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేసే సదుపాయం లభించింది. మరోవైపు దరఖాస్తుదారులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ‘కీ’లు లభిస్తున్నాయి. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు.వేలానికి సిద్ధంగా హెచ్ఎండీఏ స్థలాలు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది. గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది.అలాగే తుర్కయంజాల్, తొర్రూరు, బాచుపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోనూ విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బహదూర్పల్లి, లేమూరు, ఇన్ముల్ నెర్వా తదితర ప్రాంతాల్లో త్వరలో వేలం నిర్వహించే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న హెచ్ఎండీఏ లే అవుట్లు -
కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ
రుణాలను చౌకగా చేయడానికి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రయత్నిస్తుంటే మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం రుణ గ్రహీతకు వింత షాకిచ్చింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 5.5 శాతానికి తగ్గించినప్పటికీ, ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాంక్లో కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెరగనుంది.ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. లోయర్ ఎండ్ 7.50 శాతం వద్ద కొనసాగుతుండగా, ఎగువ బ్యాండ్ 8.45 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు సాధారణంగా అధిక వడ్డీ రేటు పరిధిలోకి వస్తారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో పయనించే అవకాశం ఉంది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ రెపో రేటును వరుసగా మూడుసార్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలతో సహా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పరోక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని ఇదే ఎస్బీఐ గతంలో ఒక నివేదికను విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ సేకరించిన డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలలో 60 శాతం ఉన్న ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)తో అనుసంధానించిన రుణాలలో ఈ మార్పు చాలా వెంటనే కనిపిస్తుంది.👉 ఇదీ చదవండి: ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు -
హైదరాబాద్లో ఈ-వాహనాలదే హవా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
32 ఏళ్లుగా అలాగే బతుకుతున్నాం: ఆకాశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా ఆయన కుటుంబంలోని ప్రతిఒక్కరూ అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న ఆకాశ్ అంబానీ.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా ఆ సంస్థను విజవంతంగా నడిపిస్తున్నారు.ప్రతిఒక్కరికీ తమ జీవితంలో ఎవరోఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తనకు ప్రేరణ ఎవరని అడిగితే ఆకాశ్ అంబానీ మొదట పేర్కొన్నది కార్పొరేట్ ఐకాన్లు లేదా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు.. తమ తల్లిదండ్రులేనని గర్వంగా చెబుతారు. ఆమధ్య ముంబై టెక్ వీక్ లో మాట్లాడిన సందర్భంగా గట్టి బంధం ఉన్న కుటుంబంలో పెరగడం తన పని నైతికతను, ఏకాగ్రతను ఎలా తీర్చిదిద్దిందో వివరించారు. నిస్సందేహంగా, మేము పెరిగిన కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు. 32 ఏళ్లుగా తామంతా ఒకే గొడుగు కింద జీవిస్తున్నామని, ముఖ్యంగా తన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు.ఇప్పటికీ తల్లిదండ్రుల నుంచి రోజువారీ క్రమశిక్షణ, వ్యక్తిగత నిబద్ధతను గమనిస్తుంటానంటారు ఆకాశ్. ముఖేష్ అంబానీ ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటల వరకు తనకు వచ్చే ప్రతి ఈమెయిల్ నూ చదివి క్లియర్ చేస్తారని, ఆ పని ఆయన నలబై ఏళ్లుగా చేస్తున్నారని, ఇక్కడి నుంచే తనకు స్ఫూర్తి వచ్చిందని ఆకాశ్ వివరించారు. ఇక తన తల్లి నీతా అంబానీ నుంచి ఏకాగ్రతతో కూడిన అంకితభావాన్ని ప్రేరణ పొందతానన్నారు. -
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్లను కుదించి రెండు ప్రధాన స్లాబ్లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్లో ఉన్న టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. -
ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యంలోని అగ్నివర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్లు ఎటువంటి పూచీకత్తు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ .4 లక్షల వరకు రుణాలు పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ పథకం కాలపరిమితి అంటే సైనికులు సర్వీసులో ఉండే కాలానికి అనుగుణంగా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో సేవలు అందించి తిరిగి సాధారణ పౌర జీవితంలో వచ్చే సైనికులకు ఆర్థికంగా సహకారం అందించే లక్ష్యంతో ఎస్బీఐ ఈ ప్రత్యేక లోన్ స్కీమ్ను ప్రకటించింది. అలాగే 2025 సెప్టెంబర్ 30 వరకు రక్షణ సిబ్బంది తీసుకునే రుణాలకు 10.50 శాతం ఫ్లాట్ వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది.‘మన స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వాళ్లకు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మా అచంచలమైన మద్దతు అవసరమని మేము నమ్ముతున్నాం. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సాహస వీరులకు సాధికారత కల్పించే పరిష్కారాలను సృష్టించడం కొనసాగిస్తాం’ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఇదే కాకుండా తమ బ్యాంక్లో శాలరీ అకౌంట్లు ఉన్న భారత సాయుధ దళాల సిబ్బందికి అనేక ప్రయోజనాలను ఎస్బీఐ కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల మాఫీ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటితోపాటు రూ.50 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.50 లక్షల వరకు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది. -
ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం.. ఈ డీల్ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యం ఏర్పడింది.బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు. -
‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం!
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలకు బంగారమంటే మక్కువ తగ్గకుండా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.భారతదేశం స్వాతంత్య్రం పొందిన 1947లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.88 మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి అది రూ.1,04,000 దాటింది. అంటే దాదాపు 1,100 రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోయినా, ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది దేశీయ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారక రేటు, భారతీయుల సంప్రదాయాల మిశ్రమ ప్రభావం. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ రావడంతో దీన్ని "సురక్షిత పెట్టుబడి"గా భావించే ధోరణి పెరుగుతోంది.వందల నుంచి లక్షలకు..1950లలో తులం బంగారం ధర రూ.100కు చేరగా, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400గా నమోదైంది. 2010 నాటికి ఇది రూ.18,500కు పెరిగింది. 2020 నాటికి రూ.50,151గా ఉండగా, 2025 నాటికి రూ.1,04,320కి చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ప్రతి దశలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల మానసిక ధోరణి కూడా దీనిపై ప్రభావం చూపాయి.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.అంతర్జాతీయ సంక్షోభాలు: యుద్ధాలు, మహమ్మారులు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.రూపాయి-డాలర్ మారక రేటు: రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.భారతీయ డిమాండ్: పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాల వల్ల బంగారం డిమాండ్ ఎప్పటికీ అధికంగా ఉంటోంది.కేంద్ర బ్యాంకుల విధానాలు: బంగారం నిల్వల కొనుగోలు, అమ్మకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. "బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు భద్రతను కలిగించే సాధనం," అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచడం ద్వారా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ వంటి సంస్థలు బంగారం కొనుగోలు చేయడం, నిల్వలు పెంచడం వంటి చర్యలు మార్కెట్లో దీని విలువను స్థిరంగా ఉంచుతున్నాయి. -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. 18 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రూల్స్.. ఛార్జీలు పెంపు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్లలో ఫిజికల్గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపుముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.కొత్త ఛార్జీలుఅలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఫండ్ ట్రాన్స్ఫర్లకూ..ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్,ఏసీహెచ్ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్కు రూ.450 (సీనియర్ సిటిజన్కు రూ.400), రెండవ రిటర్న్కు రూ.500 (సీనియర్కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.ఉదాహరణకు, నెఫ్ట్ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. -
ఏఐ దెబ్బకి ఈ ఉద్యోగాలు పోతాయ్!
-
అనిల్ అంబానీకి భారీ విజయం
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్ ఇన్ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్ఇన్ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్ఇన్ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది. -
జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.పెరిగిన నికర లాభంనాస్డాక్లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇతర కంపెనీల్లో ఇలా..టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్ -
జియో హాట్స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్స్టార్. జియో హాట్ స్టార్కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్సిరీస్లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్స్టార్ యాప్లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్స్టార్ కంటెంట్ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్స్టార్లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్స్టార్ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్స్టార్లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్ను ఉచితంగా అందించనున్నారు. -
వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిపై వెనక్కి తగ్గింది. కొత్త పొదుపు ఖాతాలకు పెంచిన కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్ను రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో ఇటీవలె మార్పులు తీసుకొచ్చింది. బ్యాంక్ ఇదివరకు సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఏబీని అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు. దీనిపై ఆర్బీఐ కూడా స్పందించింది. ఎంఏబీని నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. -
ఆ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిందే!
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోకే వచ్చేసింది. తమ బ్యాంకులో పొదుపు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో లేదా పట్టణ శాఖలో కొత్త పొదుపు ఖాతాను తెరిచే ఎవరైనా రూ .25,000 కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మునుపటి అవసరం రూ .10,000 కంటే రెట్టింపు.ఈ మార్పు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎంఏబీ నిబంధన కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇప్పటికే పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. ఏదేమైనా ఆగస్టు నుంచి ఖాతాలు తెరిచే వారు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్ను నిర్వహించకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.కొత్త నిబంధనలుఅప్డేట్ చేసిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు స్థిరంగా రూ .25,000 బ్యాలెన్స్ నిర్వహించాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే బ్యాంకు జరిమానా విధిస్తుంది. పట్టణ, మెట్రో శాఖలకు లోటులో 6 శాతం లేదా రూ.600లో ఏది తక్కువైతే అది జరిమానాగా లెక్కిస్తారు. ఈ సవరణకు ముందు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఏబీ అవసరాలు పట్టణ శాఖలకు రూ.10 వేలు, సెమీ అర్బన్ బ్రాంచ్ లకు రూ.5,000 (నెలవారీ సగటు ), గ్రామీణ శాఖలకు రూ.2,500 (త్రైమాసిక సగటు)గా ఉండేది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ పరిమితులు మారలేదు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్ మరీ భారీగా..ఓ వైపు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను రద్దు చేస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరింత దూకుడుగా మెట్రో, పట్టణ శాఖలలో కొత్త పొదుపు ఖాతాలకు ఎంఏబీని ఏకంగా రూ .50,000 కు పెంచేసింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఐసీఐ బ్యాంక్ దిగివచ్చింది. కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) అవసరాన్ని రూ.15 వేలకు తగ్గించింది. మరి హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా అదే బాటలో తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
కొత్తగా 20,000 ఉద్యోగాలు..
కన్సల్టెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ ఇండియా వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 20,000 ఉద్యోగాలు కల్పించనుంది. దీనితో సంస్థలో మొత్తం సిబ్బంది సంఖ్య 50,000కు చేరనుంది. విజన్ 2030ని ప్రకటించిన సందర్భంగా పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్ సంజీవ్ కృషన్ ఈ విషయం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వార్షికాదాయాల్లో 5% టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.దాంతోపాటు డిజిటల్ పరివర్తన, క్లౌడ్, సైబర్సెక్యూరిటీలాంటి వ్యాపార విభాగాల పై దృష్టి పెట్టనున్నట్లు సంజీవ్ చెప్పారు. సిబ్బంది, భాగస్వాములకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఆదాయాల్లో 1 శాతం భాగాన్ని వెచ్చిస్తున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరిస్తూ, హైరింగ్ చేపడుతున్నామని సంజీవ్ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, హెల్త్కేర్, ఆటో, టెక్నాలజీ, మీడియా వంటి ఆరు విభాగాలపై ఫోకస్ పెడుతున్నట్లు వివరించారు. -
‘బంగారం’ పెట్టుబడులు భారీగా తగ్గాయ్..
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి జులైలో రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పెట్టుబడులు రూ.2,081 కోట్లతో పోల్చి చూస్తే ఏకంగా 40 శాతం తగ్గాయి. ఈ ఏడాది మే నెలలోనూ బంగారం ఈటీఎఫ్లు రూ.292 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.పసిడి ధరలు ఆల్టైమ్ గరిష్టాల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.అంతకుముందు వరుసగా రెండు నెలల్లో.. ఏప్రిల్లో రూ.6 కోట్లు, మార్చిలో 77 కోట్ల చొప్పున గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,277 కోట్లుగా ఉన్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలోకి పసిడికి సైతం చోటు కల్పిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు రూ.67,634 కోట్లకు పెరిగాయి. జూన్ చివరికి ఉన్న రూ.64,777 కోట్లతో పోల్చి చూస్తే 4.4 శాతం వృద్ధి చెందాయి.78.69 లక్షల ఫోలియోలు గోల్డ్ ఈటీఎఫ్లలో మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతా) జూలై చివరికి 78.69 లక్షలకు చేరాయి. 2.15 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ‘బంగారం గత రెండేళ్లలో బలమైన పనితీరు చూపించినప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు కష్టమే. చాలా మంది ఇన్వెస్టర్లు హెడ్జింగ్ దృష్ట్యా బంగారానికి కొంత పెట్టుబడులు కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉన్న దృష్ట్యా అప్రమత్తత అవసరం’ అని జెర్మైట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ సూచించారు.స్థూల ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లలో అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్ఫోలియో వైవిధ్యం దృష్ట్యా బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.ఏటా నిర్వహించే ఈ సేల్లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది. -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
ట్రంప్ గ్రేట్ అంటున్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ కియోసాకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ అంటున్నారు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి. క్రిప్టోకరెన్సీలో పెన్షన్ పొదుపు చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రశంసించారు. అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ ఇటీవల సంతకం చేశారు.నేడు ఈ పొదుపు మొత్తం 12,5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.కాబట్టి వర్చువల్ కరెన్సీ మార్కెట్లోకి బిలియన్ డాలర్లు ప్రవహించవచ్చు. అయితే, డిజిటల్ ఆస్తుల యజమానులు ఇప్పుడే సంతోషించడం తొందరపాటు అవుతుంది. రిస్క్ లను తగ్గించడానికి, యూఎస్ నివాసితుల ప్రయోజనాలను రక్షించడానికి పెన్షన్ పొదుపును ఖర్చు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించిన తరువాత మాత్రమే ఈ చట్టం ఆచరణలోకి వస్తుంది.క్రిప్టోకరెన్సీల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ ఆస్తుల్లో కూడా పొదుపు చేసే హక్కును రెగ్యులేటరీ చట్టం కల్పించడం గమనార్హం. అందువల్ల వర్చువల్ కరెన్సీల్లో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు.డోనాల్డ్ ట్రంప్కు తన ఆమోదాన్ని తెలియజేస్తూ రాబర్ట్ కియోసాకి ‘ఎక్స్’(ట్విటర్)లో ఇలా పోస్ట్ చేశారు.. ‘బిట్ కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్ కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అంటూ రాసుకొచ్చారు. TRUMP allowing retirement accounts to save Bitcoin is big news. Great President…great leader.Are you saving Bitcoin?— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025 -
ఈ బ్యాటరీ వచ్చిందంటే టెస్లాకు చావే!
చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే, ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్, ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.టెస్లాకు ముప్పు ఎందుకంటే..టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి. -
ఐటీ సిటీలో ఇళ్లు అమ్మేస్తున్న టెకీలు..
దేశ ఐటీ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, అధ్వానంగా మారుతున్న ట్రాఫిక్, క్షీణిస్తున్న గాలి నాణ్యత కారణంగా ఐటీ ఉద్యోగులు, టెక్ నిపుణులు మైసూరుకు మకాం మారుస్తున్నారు. ఇక్కడ ఇళ్లు అమ్మేసి.. అక్కడ కొంటున్నారు. ఒకప్పుడు రిటైర్మెంట్ స్వర్గధామంగా పేరొందిన మైసూరు ఇప్పుడు నిశ్శబ్ద జీవనశైలిని కోరుకునే హైబ్రిడ్, రిమోట్ వర్కర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోంది.బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే, ప్రతిపాదిత రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) ద్వారా మెరుగైన కనెక్టివిటీ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. ఈ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లు బెంగళూరు టెక్ వ్యవస్థతో సంబంధాలను కొనసాగిస్తూనే మైసూరులో స్థిరపడటానికి ఐటీ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు బెంగళూరులోని తమ ప్రాపర్టీలను అమ్మేసి మైసూరులో కొంటున్నారు.ఈ ప్రాంతాలకు డిమాండ్మైసూరులోని సరస్వతీపురం, జయలక్ష్మీపురం, హెబ్బాళ్ వంటి ప్రాంతాల్లో నివాస డిమాండ్ పెరుగుతోంది. 2బీహెచ్కే ఫ్లాట్ల ప్రాపర్టీ ధరలు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. నెలవారీ అద్దెలు రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఉన్నాయి. ఉత్తర మైసూరు ముఖ్యంగా హెబ్బాళ్ పారిశ్రామిక కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ఐటీ, నివాస కేంద్రంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.రింగ్ రోడ్డు, పెరిఫెరల్ జోన్లలో రూ.50-70 లక్షల మధ్య ధర కలిగిన ముడా ఆమోదం పొందిన ప్లాట్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కొన్ని ప్రాంతాలలో వార్షిక పెరుగుదల 15–20% గా నివేదికలు చెబుతున్నాయి. విజయనగర్ స్టేజ్ 2, 3లోని లేఅవుట్లు ప్లాట్ల ఇళ్లకు ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి.ఈ ట్రెండ్కు అనుగుణంగా డెవలపర్లు స్పందిస్తున్నారు. మైసూరులో 10 ఎకరాలను అభివృద్ధి చేయడానికి బ్రిగేడ్ గ్రూప్ రూ .225 కోట్ల జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్పై సంతకం చేయగా, సెంచురీ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది చివర్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మైసూరు సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో సమతుల్యం చేస్తుండటంతో ఇది బెంగళూరు పట్టణ విస్తరణకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.👉 చదవండి: ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు -
ఎస్బీఐ నుంచి స్టాక్ మార్కెట్కు 2 సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండు అనుబంధ సంస్థల పబ్లిక్ ఇష్యూపై కసరత్తు చేస్తోందని ఎస్బీఐ గ్రూప్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి తెలిపారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వీటిలో ఉన్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు సంబంధించి నిర్దిష్ట గడువేదీ నిర్దేశించుకోలేదని పేర్కొన్నారు.గ్రూప్లో ప్రస్తుతం 18 అనుబంధ సంస్థలు ఉన్నాయని, వీటిపై సుమారు రూ.6,500 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, వాటి విలువ ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల పైచిలుకు ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనకాపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించిన 30 హెల్త్ ఇన్సూరెన్స్ శాఖలను శనివారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఇవి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సర్వీసులను అందించేందుకే ఉద్దేశించినవని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2,100 పైగా ఆస్పత్రుల నెట్వర్క్తో సేవలు అందిస్తున్నట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ నవీన్ చంద్ర ఝా చెప్పారు. టారిఫ్ల అనిశ్చితి తొలగిపోతే మంచిది.. భారత్పై అమెరికా టారిఫ్ల వల్ల ప్రత్యక్షంగా పడే ప్రభావం తక్కువే అయినప్పటికీ, వాటి వల్ల తలెత్తిన అనిశ్చితి సాధ్యమైనంత త్వరగా తొలగిపోతే మంచిదని శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే రసాయనాలు, టెక్స్టైల్స్, ఆభరణాలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వా తదితర రంగాలకు టారిఫ్ల వల్ల సవాళ్లు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, టారిఫ్ల ప్రభావిత రంగాలకు రుణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున తమ బ్యాంకుపై ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. -
ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు
ఆర్థిక ఇబ్బందులతోనో లేక ఇతర కారణాల వల్లో చాలా మంది తమ ఇల్లు అమ్ముతుంటారు. ఇలా ఇంటిని అమ్మగా వచ్చిన ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే కొంత మంది చేస్తున్న పొరపాట్ల వల్ల అనవసరంగా అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది.చాలా మంది తమ ఇళ్లను విక్రయించేటప్పుడు చేసే కొన్ని ఖరీదైన తప్పులను ట్యాక్స్బడ్డీ డాట్ కామ్ (TaxBuddy.com) వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ ఎత్తి చూపారు. అవి గణనీయంగా అధిక పన్ను చెల్లింపులకు దారితీస్తాయి. ఇలాగే ఒక క్లయింట్ పన్ను మినహాయింపులను విస్మరించడంతో దాదాపు రూ .1.87 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చేదన్న విషయాన్ని ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్లో బంగర్ పంచుకున్నారు.‘మా క్లయింట్ (రామ్) తన ఇంటి అమ్మకంపై రూ .1,87,500 అదనంగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. మేము చట్టబద్ధంగా అనుమతించిన అన్ని ఖర్చులను జోడించాం. అతని పన్ను భారాన్ని విజయవంతంగా తగ్గించాం’ అని బంగర్ పేర్కొన్నారు.మూలధన లాభాలను లెక్కించేటప్పుడు, పన్ను చెల్లింపుదారులు తరచుగా కొనుగోలు లేదా మెరుగుదల వ్యయంలో భాగంగా అర్హతను తక్కువగా అంచనా వేస్తారని ఆయన చెప్పారు. చాలా మంది దీనిని కేవలం కొనుగోలు ధరకు పరిమితం చేస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 55 కింద అనుమతించిన చట్టబద్ధమైన మినహాయింపులను కోల్పోతారు.చట్టబద్ధంగా ఏ ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు?🔸స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు🔸బ్రోకరేజీ లేదా కమిషన్🔸మూలధన మెరుగుదల ఖర్చులు🔸లీగల్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు🔸సొసైటీ బదిలీ ఫీజులు🔸గృహ రుణ వడ్డీ (సెక్షన్ 24(బి) కింద ఇప్పటికే క్లెయిమ్ చేయనట్లయితే)🔸వీటన్నింటికీ సరైన డాక్యుమెంటేషన్ ఉండాలిఆ క్లయింట్ చేసిన తప్పు ఇదే..బంగర్ పేర్కొన్న క్లయింట్ చేసిన పొరపాటు ఏంటంటే.. ఇల్లు మొత్తం అమ్మకం ధర రూ .1.2 కోట్లు కాగా వాస్తవ కొనుగోలు ధర రూ .80 లక్షలను మాత్రమే నివేదించాడు. అతను విస్మరించిన ఖర్చులు ఇవే..🔸బ్రోకరేజీలో రూ.80,000🔸రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలో రూ.4,70,000🔸ప్రధాన రిపేర్ ఖర్చులు రూ.6,00,000🔸లీగల్ ఛార్జీలు రూ.50 వేలు🔸హోమ్ లోన్ వడ్డీ రూ.3,00,000"సరైన డాక్యుమెంటేషన్ ఈ ఖర్చులను గుర్తించడానికి, అతని పన్ను పరిధిలోకి వచ్చే లాభాలను గణనీయంగా తగ్గించడానికి మాకు సహాయపడింది" అని బంగర్ పేర్కొన్నారు.👉 చదవండి: ‘ఇదే మా ఇల్లు’.. ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్ -
ఈ కంపెనీలు ఐపీవోకి వస్తున్నాయ్..
ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సంస్థ సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు విక్రయించనున్నారు.2023–2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 95 శాతం వృద్ధి చెందింది. పంపులు, మోటర్ల ఉత్పత్తికి సంబంధించి 24,00,000 యూనిట్లు, 72,00,000 ఫ్యాన్ల స్థాపిత సామర్థ్యంతో సంస్థకు గుజరాత్లోని రాజ్కోట్లో ప్లాంటు ఉంది. ఐపీఓకు టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సన్నద్ధమవుతోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 95.05 లక్షల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. ప్రమోటర్ కంపెనీ కార్తికేయ్ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 23.76 లక్షల షేర్లను విక్రయించనుంది.సమీకరించే రూ.138 కోట్ల నిధులను మూలధన వ్యయ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని కంపెనీ ముసాయిదా పత్రాల్లో తెలిపింది. ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఖంబట్టా సెక్యూరిటీస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్లు సంస్థలు వ్యవహరించనున్నాయి. టెక్నోక్రాఫ్ట్ 2025 జూన్ 30 నాటికి రూ.685.83 కోట్ల విలువైన ఆర్డర్లు కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో రూ.28.20 కోట్ల నికర లాభం, రూ.279.56 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
ప్రభుత్వ స్కీమ్లు.. ఒకటి పొడిగింపు.. మరొకటి పునఃప్రారంభం
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ స్కీమును కొన్ని వాహన విభాగాలకు రెండేళ్ల పాటు 2028 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ–అంబులెన్స్లు, ఈ–ట్రక్కులు వీటిలో ఉన్నాయి. వాస్తవానికి ఈ స్కీము గడువు 2026 మార్చితో ముగియాల్సి ఉంది.ఈ స్కీము పరిమాణం రూ. 10,900 కోట్లకు మాత్రమే పరిమితమవుతుందని, ఒకవేళ గడువు లోగా నిధులు పూర్తిగా వినియోగించేసిన పక్షంలో.. సంబంధిత సెగ్మెంట్లు లేదా స్కీము కూడా ముగిసిపోతుందని కేంద్రం వివరించింది. మరోవైపు, రిజిస్టర్డ్ ఈ–టూవీలర్లు, ఈ–రిక్షాలు, ఈ–కార్టులు, ఈ–త్రీ వీలర్లకు ఆఖరు తేదీ యథాప్రకారంగా 2026 మార్చి 31గా ఉంటుందని పేర్కొంది. టెక్స్టైల్స్ పీఎల్ఐ స్కీము పోర్టల్ పునఃప్రారంభం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము పోర్టల్ను మళ్లీ తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలే కొత్త దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. ఆసక్తి గల కంపెనీలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టెక్స్టైల్స్ శాఖ సూచించింది. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది. -
భయంతోనే బంగారం కొంటున్నారా?
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..బంగారం ధర పెరగడానికి భయమే కారణంపెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం. -
ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్
ఉమాంగ్ యాప్లో (UMANG App) యూఏఎన్ (UAN) యాక్టివేషన్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూఏఎన్ పొందడానికి, యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, వివరాలను అప్డేట్ చేసేందుకు, ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు, ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యూఏఎన్ అవసరం. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను పొందలేరు.ఉమాంగ్ యాప్ గురించి..యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) అనేది ఒక ప్రభుత్వ యాప్. ఇది ఒకే ప్లాట్ఫామ్పై అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యూఏఎన్ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ఫోన్ల నుండి నేరుగా వారి ఈ-యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు 1 నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను ఈపీఎఫ్వో తప్పనిసరి చేసింది. -
భారతీ ఎయిర్టెల్ బల్క్ డీల్.. రూ. 11,227 కోట్ల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్(ఐసీఐఎల్) తాజాగా 0.98 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం రెండు దశలలో 6 కోట్ల షేర్లు అమ్మివేసింది. ఒక్కో షేరుకి రూ. 1,870–1,872 ధరల శ్రేణిలో రూ. 11,227 కోట్లకు వాటా విక్రయించింది.అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. తాజా లావాదేవీ తదుపరి ఎయిర్టెల్లో ఐసీఐఎల్ వాటా 2.47 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గింది. వెరసి మొత్తం ప్రమోటర్ల వాటా 51.25 శాతం నుంచి 50.27 శాతానికి దిగివచ్చింది. ప్రమోటర్లలో భారతీ టెలికం అత్యధికంగా 40.47 శాతం వాటా కలిగి ఉంది. వాటా విక్రయం నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 1,860 వద్ద ముగిసింది. -
Pharma: భారత్ ఎగుమతులకు ఆటంకంగా అమెరికా సుంకాలు
-
Magazine Story: దూసుకుపోతున్న బంగారం ధరలు..
-
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
మరణించినవారి బ్యాంకు ఖాతాలు, సేఫ్ లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాలు డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు నిర్వహించే అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. ముసాయిదా సర్క్యులర్ పై ఆగస్టు 27లోగా అభిప్రాయాలు తెలపాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది. వీలునామా, కోర్టు ఉత్తర్వులు లేదా వివాదం లేకపోతే వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా ప్రొబేట్ వంటి చట్టపరమైన పత్రాలపై పట్టుబట్టకుండా నామినీలు లేదా జీవించి ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు నిధులను విడుదల చేయాలని సర్క్యులర్లో పేర్కొంది. క్లెయిమ్దారులు నామినీ క్లెయిమ్ ఫారం, మరణ ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తే చాలు.ఆలస్యమైతే పరిహారంఏదైనా డిపాజిట్ సంబంధిత క్లెయిమ్ గడువులోగా పరిష్కరించబడకపోతే, అటువంటి ఆలస్యానికి గల కారణాలను బ్యాంకు హక్కుదారులకు తెలియజేయాలి. “… ఆలస్యమైతే, ఆ ఆలస్య కాలానికి సెటిల్మెంట్ మొత్తంపై ప్రస్తుత బ్యాంకు రేటు సంవత్సరానికి 4% కంటే తక్కువ కాకుండా వడ్డీ రూపంలో క్లెయిమ్దారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది" అని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఇక సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీలో ఉన్న వస్తువులకు సంబంధించి క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరిగితే, ఆలస్యం జరిగిన ప్రతి రోజుకు బ్యాంకు రూ .5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.నాన్-నామినీ, జాయింట్ అకౌంట్ క్లెయిమ్ల సెటిల్మెంట్మరణించిన డిపాజిటర్ నామినీని పేర్కొనకపోయి ఉన్నప్పుడు లేదా జాయింట్ అకౌంట్ల విషయంలో నామినీ లేదా సర్వైవర్ క్లాజ్ లేని సందర్భాల్లో క్లెయిమ్ల పరిష్కారానికి బ్యాంకులు సరళీకృత విధానాన్ని అవలంబించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇటువంటి క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఒక బ్యాంకు దాని రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థల ఆధారంగా రూ .15 లక్షల పరిమితిని నిర్ణయించాలి.బ్యాంకులు పూర్తి డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోగా క్లెయిమ్లను సెటిల్ చేయాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్ లాకర్/వస్తువులు సేఫ్ కస్టడీలో ఉన్నట్లయితే, అవసరమైన అన్ని పత్రాలను అందుకున్న 15 రోజుల్లోగా, బ్యాంకు క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. -
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్..
లక్షలాది లోన్ కస్టమర్లకు ఊరట కల్పిస్తూ.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలను తగ్గిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి మినహా మిగతా అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఇక ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గింది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవే..కాలపరిమితికొత్త ఎంసీఎల్ఆర్పాత ఎంసీఎల్ఆర్ఓవర్నైట్8.55%8.60%1 నెల8.55%8.60%3 నెలలు8.60%8.65%6 నెలలు8.70%8.75%1 సంవత్సరం8.70%8.75%2 సంవత్సరాలు8.75%8.75%3 సంవత్సరాలు8.75%8.80%(మూలం: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్)ఈఎంఐలు ఎలా ప్రభావితం అవుతాయంటే..ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితమవుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే. ఇది ఈఎంఐలు తగ్గడానికి దారితీస్తుంది. తాజా మార్పుతో, ప్రస్తుత రుణగ్రహీతలు వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప క్షీణతను చూడవచ్చు.👉 చదవండి: చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం -
పెరిగిన ఎల్ఐసీ లాభం.. ఎంతంటే..
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.10,987 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.10,461 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ.2,10,910 కోట్ల నుంచి రూ.2,22,864 కోట్లకు జంప్చేసింది. ఈ కాలంలో తొలి ఏడాది ప్రీమియం రూ.7,470 కోట్ల నుంచి రూ. 7,525 కో ట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ.56,429 కోట్ల నుంచి రూ.59,885 కోట్లకు ఎగసింది. పెట్టుబడుల నుంచి నికర ఆదాయం రూ.96,183 కోట్ల నుంచి రూ. 1,02,930 కోట్లకు బలపడింది.మొత్తం ప్రీమియం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1,19,200 కోట్లకు చేరింది. వ్యక్తిగత విభాగంలో 15 శాతం తక్కువగా 30,39,709 పాలసీలను విక్రయించింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 6 శాతం మెరుగుపడి రూ. 57,05,341 కోట్లుగా నమోదైంది. -
జాక్పాట్.. కుర్రాడు రూ.కోట్లు గెలిచాడు
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేం. 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు దక్కని అదృష్టం వారి కొడుక్కి దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి వేన్ నాష్ డిసౌజా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.7 కోట్లు గెలుచుకున్నాడు.ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించడానికి యూఎస్ వెళ్తున్న వేన్.. వెళ్తూ వెళ్తూ జూలై 26న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో ఆ టికెట్కే (సిరీస్ 510, నంబర్ 4463) జాక్పాట్ తగిలింది.వేన్ నాష్ డిసౌజా దుబాయ్లోనే పుట్టి పెరినప్పటికీ అతని తల్లిదండ్రులు ముంబైకి చెందినవారు. వేన్కు టీనేజర్ కావడంతో సొంతంగా అకౌంట్ లేదు. 18 ఏళ్లు నిండినా ఇప్పుడిప్పుడే కావడంతో అకౌంట్ సెట్ చేసుకోలేదు. దీంతో తన తండ్రి అకౌంట్ను ఉపయోగించి వేన్ డ్రాలోకి ప్రవేశించాడు. అతని కుటుంబం 30 సంవత్సరాలకు పైగా రాఫెల్ డ్రాలో పాల్గొంటోంది. అయినా వారికి దక్కని జాక్పాట్ వేన్కు దక్కింది.వేన్ ఒక రోజు యూనివర్సల్ స్టూడియోలో నిద్రిస్తుండగా కాల్ వచ్చింది. తాను లాటరీ గెలిచినట్లు వారు తెలియజేశారు. దీంతో అతనికి ఇంక నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని వేన్ మొదట నమ్మలేదు. అంతా కల అనుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని తన విద్యకు, తన సోదరి చదువుల కోసం, దుబాయ్ లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు వేన్ తెలిపాడు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ అందుకున్న 255వ భారతీయుడిగా వేన్ నిలిచాడు. -
‘జీవితం’పై జాగ్రత్త మనవాళ్లకే ఎక్కువండోయ్..
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత అధికమవుతోంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతం ఎంతో ముందుంది. జీవిత బీమా యాజమాన్యం, ఆర్థిక రక్షణలో దక్షిణ భారతదేశం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని ఇటీవలి ఇండియా ప్రొటెక్షన్ కోషియెంట్ (ఐపీక్యూ) 7.0 నివేదిక వెల్లడించింది. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంతాలలో జీవిత బీమా 84 శాతం చొచ్చుకుపోయినట్లు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం.ఫైనాన్షియల్ ప్రొటెక్షన్లో రీజనల్ లీడర్ షిప్చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కీలక సూచీల్లో జాతీయ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. యాజమాన్యంలో చెన్నై అగ్రస్థానంలో, ఆర్థిక భద్రతలో హైదరాబాద్ అగ్రస్థానంలో, అవగాహనలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమౌతుందో.. అన్న ఆందోళనతో ఆర్థిక ప్రణాళికకు చాలామంది సిద్ధమవుతున్నారు.ఈ నివేదిక టర్మ్ ఇన్సూరెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో 77% మంది కుటుంబ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రదాయ పొదుపు-ఆధారిత పాలసీల నుండి స్వచ్ఛమైన రిస్క్ కవరేజీకి మారడాన్ని ఇది సూచిస్తుంది.మహిళలకు మరీ ఎక్కువజీవిత బీమా, ఆర్థిక రక్షణపై జాగ్రత్త మహిళల్లోనే మరీ ఎక్కువ కనిపిస్తోంది. గుర్తించదగిన ధోరణిలో 86% మంది దక్షిణ భారత మహిళలు జీవిత బీమాను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఇది పురుషల సగటు (83%), జాతీయ మహిళా సగటు (75%) రెండింటినీ అధిగమించింది. ఆర్థిక పరిజ్ఞానం, భద్రతలో కూడా మహిళలు ఎక్కువ మార్కులు సాధించారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో లింగ అంతరాన్ని తగ్గించారు.యువతలోనూ..టర్మ్ ప్లాన్లు, యులిప్లు, పొదుపు ఆధారిత పాలసీలతో సహా వివిధ బీమా ఉత్పత్తులను అవలంబించడంలో యువత ముందంజలో ఉంది. దీంతోపాటు పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి మైలురాళ్ల కోసం చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.సవాళ్లూ ఉన్నాయ్..అధిక మొత్తంలో బీమా యాజమాన్యం ఉన్నప్పటికీ సవాళ్లూ ఉన్నాయి. ప్రతి ముగ్గురు పట్టణ ప్రాంత దక్షిణ భారతీయులలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్ను ఎప్పుడూ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇందుకు ఆర్థిక స్థోమత, అత్యవసరత లేకపోవడం వంటివి అవరోధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత, తక్కువ-ఆదాయ సమూహాలలో ఇది ఎక్కువగా ఉంది. -
‘అదే రిలయన్స్కు మంచిది’.. వాటాదారులకు అంబానీ లేఖ
రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు లేఖలో తెలియజేశారు. ‘భారతదేశానికి ఏది మంచిదో అదే రిలయన్స్ కు మంచిది’ అనే శీర్షికతో రాసిన ఈ లేఖ కంపెనీ వృద్ధి దేశ పురోగతితో విడదీయరానిదిగా ఉంటుందన్న ముఖేష్ అంబానీ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.దేశానికి అమృత కాలం.. రిలయన్స్కు పునరుజ్జీవండిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్గా అవతరించిందని అంబానీ కొనియాడారు. ‘భారతదేశం కేవలం గ్లోబల్ ట్రెండ్లను అనుసరించడమే కాదు.. వాటిని సెట్ చేస్తోంది’ అని రాసుకొచ్చారు. 145 కోట్ల భారతీయుల సాధికారతకు కట్టుబడి ఉన్న "జాతీయ సంస్థ"గా రిలయన్స్ అభివృద్ధి చెందుతోందన్నారు.డీప్-టెక్ పరివర్తనరిలయన్స్ ఒక కొత్త తరం డీప్-టెక్ ఎంటర్ప్రైజ్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలపై 1,000 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఎనర్జీ, రిటైల్ నుంచి టెలికాం, ఎంటర్టైన్మెంట్ వరకు రిలయన్స్ విభిన్న వ్యాపారాల్లో ఈ టెక్నాలజీలను అనుసంధానించనున్నట్లు అంబానీ ఉద్ఘాటించారు.వ్యాపార పనితీరు ముఖ్యాంశాలురిటైల్: రూ.3.3 లక్షల కోట్ల టర్నోవర్, దేశవ్యాప్తంగా 19,340 స్టోర్లు.జియో: 5జీలో 191 మిలియన్లతో సహా 488 మిలియన్ల యూజర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్వర్క్.మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్: డిస్నీతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్షిప్.ఆయిల్ అండ్ గ్యాస్: అత్యధిక ఇబిటా, బలమైన దేశీయ ప్లేస్మెంట్.O2C (ఆయిల్ టు కెమికల్స్): క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహణ ద్వారా స్థిరమైన పనితీరు.సుస్థిరతసుస్థిరత, సర్క్యులర్ ఎకానమీ సూత్రాలు, సమ్మిళిత వృద్ధికి రిలయన్స్ నిబద్ధతను అంబానీ పునరుద్ఘాటించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతుగా కంపెనీ తన ఉత్పాదక మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.👉 చదివారా? మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా? -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్బస్ ప్రెసిడెంట్గా జూర్గెన్ వెస్టర్మీయర్
ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్బస్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతానికి ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా జూర్గెన్ వెస్టర్మీయర్ను నియమితులయ్యారు. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఎయిర్బస్లో ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా ఉన్న జూర్గెన్, రెమీ మైలార్డ్ స్థానంలో ఈ పదవిని చేపడతారు.రెమీ మైలార్డ్ ఎయిర్బస్లో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్గా నియమితులవుతారు. తన కొత్త పాత్రలో, జూర్గెన్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతంలో ఎయిర్బస్ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఇందులో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, డిఫెన్స్ అండ్ స్పేస్, హెలికాప్టర్లు ఉన్నాయి. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అమ్మకాలకు బాధ్యత వహించనున్న జూర్గెన్ సర్వీసెస్, ఇంజనీరింగ్, డిజిటల్, ఇన్నోవేషన్, శిక్షణ రంగాలలో సంస్థ విస్తరణకు కృషి చేయనున్నారు.జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ కార్ల్స్రూహే నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన జూర్గెన్.. తన కెరియర్ను 1998లో బీఎమ్డబ్ల్యూలో ప్రారంభించారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మోటార్సైకిల్స్ ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ సప్లయర్ నెట్వర్క్, కాస్ట్ ఇంజనీరింగ్ రంగాలలో వ్యూహాత్మక స్థానాలలో పనిచేశారు. జూర్గెన్ 2020లో ఎయిర్బస్లో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా చేరారు.అక్కడ ఆయన ఎయిర్బస్ విభాగాల్లో ప్రొక్యూర్మెంట్ బాధ్యతలు చూశారు -
బ్లాక్ థీమ్లో నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్..
నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ .8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిస్సాన్ డీలర్షిప్లు, నిస్సాన్ ఇండియా వెబ్సైట్లో దీని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు.మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రెసిన్ బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వాహనం ఎడమ ఫెండర్ పై మాగ్నైట్ బ్రాండింగ్ కింద 'కురో' బ్యాడ్జ్ ను ఇచ్చారు.ఈ మోడల్ లో బ్లాక్ డ్యాష్ బోర్డ్, పియానో బ్లాక్ గేర్ షిఫ్ట్ గార్నిష్, పియానో బ్లాక్ స్టీరింగ్ ఇన్సర్ట్, బ్లాక్ సన్ వైజర్స్, బ్లాక్ డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. లైట్సాబర్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సాబుల్ బ్లాక్ వైర్లెస్ ఛార్జర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ డిస్ప్లే ఉన్నాయి. డాష్ క్యామ్ ను యాక్ససరీగా అందిస్తున్నారు.నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ పవర్ట్రెయిన్లు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్లో లభిస్తాయి. 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (72 పీఎస్, 96 ఎన్ఎమ్) 5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీతో జత చేయవచ్చు. అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 పీఎస్, 160 ఎన్ఎమ్)కు 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి. -
చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం
మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.రూ .67,000 కోట్లకుపైగా అన్క్లెయిమ్ డిపాజిట్లుబ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్బీఐ రూ.19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్క్లయిమ్ డిపాజిట్లు ఉన్నాయి.ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకు కొలువుల జాతర.. ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2025-26 కాలానికి 5,583 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సర్వీస్ & సపోర్ట్) ఖాళీలను భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున నియామక డ్రైవ్ను ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తు విండో ఆగస్టు 6 నుండి ఆగస్టు 26 వరకు తెరిచి ఉంటుంది.ఎస్బీఐ ఇటీవలే 505 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ విస్తృత శాఖలు, కార్యాలయాల నెట్వర్క్లో సేవా సరఫరా, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్యాంకు తాజాగా నియామకాలు చేపట్టింది. ఈ నియామక డ్రైవ్, ప్రస్తుతం 2.36 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఎస్బీఐ మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న కస్టమర్, సాంకేతిక అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న కొత్త ప్రతిభను నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది.“కొత్త ప్రతిభను నియమించడం మా మానవ వనరుల సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంలో కీలక అంశం. నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, బ్యాంకింగ్ రంగాన్ని పునర్నిర్మించే క్రియాత్మక, సాంకేతిక పురోగతులతో మా ఉద్యోగులను సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ నియామకం వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తూ పేర్కొన్నారు. -
ఎస్బీఐ క్రెడిట్కార్డులకు ఆ ఉచిత సదుపాయం బంద్!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఈ కార్డుదారులకు ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆగస్టు 11 నుండి కార్డు జారీ సంస్థ నిలిపివేయబోతోంది. ఈ మార్పు విమాన ప్రయాణంలో భద్రత కోసం ఈ సదుపాయంపై ఆధారపడిన వారిని నేరుగా ప్రభావితం చేస్తుంది.ఇప్పటివరకు ఎస్బీఐ ప్రీమియం, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై రూ.కోటి లేదా రూ.50 లక్షల వరకు కాంప్లిమెంటరీ (ఉచిత) విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉండేది. ఆగస్టు 11 తర్వాత ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ఈ సదుపాయం ముగిసే కార్డులలో ఈ కిందివి ఉన్నాయి..రూ.1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ఎస్బీఐ కార్డ్ ఎలైట్కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డురూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ప్రైమ్ఎస్బీఐ కార్డ్ పల్స్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ పీఎంకేవీబీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కేవీబీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుకర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్యూబీఐ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుఓబీసీ ఎస్బీఐ వీసా ప్లాటినం కార్డుఫెడరల్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుమీరు ఎస్బీఐ క్రెడిట్కార్డు యూజర్లు అయితే ఇప్పుడు విమాన ప్రయాణ సమయంలో మీకు ఈ అదనపు రక్షణ లభించదు. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా ప్రయాణిస్తూ ఉచిత బీమాపై ఆధారపడి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక ప్రయాణ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవలసి ఉంటుంది. ఈ బెనిఫిట్ మీకు ముఖ్యమైతే కచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత ట్రావెల్ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.చదవండి: ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు! ఆర్బీఐ ఆర్డరు నిజమేనా? -
ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు?
ఏటీఎంలలో రూ.500 నోట్లు కనుమరుగు కానున్నట్లు ఓ సందేశం వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 30లోగా ఏటీఎంల ద్వారా రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించిదనేది ఆ సందేశం సారాంశం. అయితే ఆ వాట్సాప్ సందేశం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది.రానున్న సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలనేది ఆర్బీఐ లక్ష్యం అంటూ కూడా ఫేక్ మెసేజ్లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కాబట్టి ఎవరి దగ్గరైనా రూ.500 నోట్లు ఉంటే వెంటనే మార్చేసుకోవాలని కూడా అందులో సూచించారు.వాట్సాప్లో విస్తృతంగా షేర్ అయిన ఈ తప్పుడు సందేశంపై స్పందించిన ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆర్బీఐ అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని, రూ.500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, వాటిని షేర్ చేసే ముందు అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.Has RBI really asked banks to stop disbursing ₹500 notes from ATMs by September 2025? 🤔A message falsely claiming exactly this is spreading on #WhatsApp #PIBFactCheck ✅ No such instruction has been issued by the @RBI✅ ₹500 notes will continue to be legal tender.… pic.twitter.com/9ia2t8Nf0K— PIB Fact Check (@PIBFactCheck) August 3, 2025 -
ఇంత జీఎస్టీ ఎగ్గొట్టారా?
గడిచిన ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) సుమారు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కూడా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పార్లమెంటుకు తెలిపింది.లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. గత ఐదేళ్లలో గుర్తించిన మొత్తం 91,370 కేసుల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.7.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఐటీసీ మోసం జరిగింది. 2022, 2021 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ ఎగవేతలు వరుసగా రూ.73,238 కోట్లు, రూ.49,384 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఐటీసీ మోసాలు వరుసగా రూ.28,022 కోట్లు, రూ.31,233 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు.2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించామని, ఇందులో రూ.24,140 కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిమ్లు ఉన్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసులలో సగానికి పైగా లేదా 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించినవి. వీటి ద్వారా రూ .58,772 కోట్ల ఎగవేత జరిగింది. -
టాప్ 10 బెస్ట్ 7 సీటర్ కార్లు.. ధర ఎంతంటే..
-
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!


