కొత్తగా 20,000 ఉద్యోగాలు.. | PwC India wants to create 20000 new jobs by 2030 | Sakshi
Sakshi News home page

కొత్తగా 20,000 ఉద్యోగాలు..

Aug 13 2025 7:12 PM | Updated on Aug 13 2025 8:07 PM

PwC India wants to create 20000 new jobs by 2030

పీడబ్ల్యూసీ ఇండియా ప్రణాళికలు

కన్సల్టెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ ఇండియా వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 20,000 ఉద్యోగాలు కల్పించనుంది. దీనితో సంస్థలో మొత్తం సిబ్బంది సంఖ్య 50,000కు చేరనుంది. విజన్‌ 2030ని ప్రకటించిన సందర్భంగా పీడబ్ల్యూసీ ఇండియా చైర్‌పర్సన్‌ సంజీవ్‌ కృషన్‌ ఈ విషయం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వార్షికాదాయాల్లో 5% టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర అంశాలపై ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు.

దాంతోపాటు డిజిటల్‌ పరివర్తన, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీలాంటి వ్యాపార విభాగాల పై దృష్టి పెట్టనున్నట్లు సంజీవ్‌ చెప్పారు. సిబ్బంది, భాగస్వాములకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఆదాయాల్లో 1 శాతం భాగాన్ని వెచ్చిస్తున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరిస్తూ, హైరింగ్‌ చేపడుతున్నామని సంజీవ్‌ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, ఆటో, టెక్నాలజీ, మీడియా వంటి ఆరు విభాగాలపై ఫోకస్‌ పెడుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement