మృత్యుంజయుడు రమేశ్‌  | Air India plane crash: One passenger survived the crash, police confirms | Sakshi
Sakshi News home page

Air India plane crash: మృత్యుంజయుడు రమేశ్‌ 

Jun 12 2025 7:18 PM | Updated on Jun 13 2025 11:51 AM

Air India plane crash: One passenger survived the crash, police confirms

అహ్మదాబాద్‌:  రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచార్‌వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్‌ బ్రిటీష్‌ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్‌కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్‌ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 

కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్‌ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్‌ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్‌ జి.ఎస్‌.మాలిక్‌ తెలిపారు. 
 

(రమేష్‌ విశ్వకుమార్‌ కుమార్‌ ఎయిరిండియా విమానం టికెట్‌)

ప్రయాణం వాయిదాతో  బతికాడు
ఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్‌జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్‌ బుక్‌ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement